Sunday, 14 February 2016

ఆగస్ట్‌లో పర్యాటక ప్రదేశాలు






ఆగస్ట్‌లో పర్యాటక ప్రదేశాలు

మున్నార్‌:
కేరళలోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్‌ హిల్‌ స్టేషన్‌ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. సైట్‌ సీయింగ్‌ ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఇక్కడ అనేక ట్రెక్కింగ్‌ ప్రదేశాలతో ఈ ప్రదేశం బైకర్లకు మరియు ట్రెక్కర్లకు స్వర్గంలా వుంటుంది. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి పూచే నీలక్కురింజి పూవులు పూస్తాయి. మున్నార్‌ పర్వత శ్రేణుల వాతావరణం ఆగస్టు నెలలో ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులను సందర్శించేలా చేస్తాయి.

చిరపుంజీ:
మేఘాలయ స్థానికులు చిరపుంజీ లేదా సోహ్ర అని పిలుస్తారు. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశాలలో ఒకటయిన చిరపుంజీ మంత్రముగ్దులను చేస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో అనేక మంత్రముగ్ధమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందమైన Nohkalikai Falls(నోహ్కలికై జలపాతం) ప్రత్యేకంగా దేశంలోనే ఎత్తైన జలపాతలలో ఒకటిగా ఉన్నది. చిరపుంజీ కేవలం దృశ్య వీక్షణం కొరకు మాత్రమే కాదు సాహసోపేతమైన పర్యటనలకు కూడా అనుగుణంగా ఉంటుంది. చిరపుంజిని ఆగస్టు మాసంలోనే సందర్శించాలి.

అగుంబే:
కర్నాటకలోని  మల్నాడు ప్రాంతం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో అగుంబే ఒక చిన్న గ్రామం. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశం నుండి చూసి ఆనందించవచ్చు. ఎన్నో సహజ అందాలు కల ప్రదేశం ఇది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, వివిధ రకాల మొక్కలు జంతువులు ఉంటాయి. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ కూడా కలదు. అగుంబే సందర్శించాల్సిన సమయం సమయం ఆగస్టు మాసం.

కొడైకెనాల్‌:
తమిళనాడు కొడైకెనాల్‌ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్‌ స్టేషన్‌. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. తమిళంలో కొడైకెనాల్‌ అంటే అర్ధం అడవుల బహుమతి. ఇది హనీమూన్‌ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి.

లాహౌల్‌:
ఇండియాకి, టిబెట్‌కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్‌ ప్రదేశ్‌లో లాహౌల్‌ వుంది. ఇక్కడ ఎక్కువ మంది బౌద్దాన్ని అనుసరిస్తూ ఆ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. విహారాలకు, కిబ్బర్‌ వన్యప్రాణి అభాయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్‌ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్‌ వాలీ నేషనల్‌ పార్‌‌క, కీ విహారం, కున్‌ జుమ్‌ పాస్‌ ఇక్కడి ఇతర ఆకర్షణలు. అడవి దున్నలు, డోజోల్లాంటి జంతువులు ఇక్కడ స్వేచ్చగా తిరుగాడుతూ కనిపిస్తాయి.

అండమాన్‌ నికోబార్‌ దీవులు:
గుంపులు లేని ఒంటరి విహార ప్రదేశాలు మీకు కావాలంటే, అండమాన్‌ మరియు నికోబార్‌ ద్వీపాలకు వెళ్ళి తీరాల్సిందే! ఈ సెలవుల విహార ప్రదేశం అనేక ప్రకృతి దృశ్యాలతో మీ రాకకై ఎదురు తెన్నులు చూస్తూ ఉంటుంది. మీరు స్కూబా డైవింగ్‌ లేదా నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా లేదా అక్కడ కల మొక్కలు, జంతువుల సంపదలను అన్వేషించాలన్నా ఈ దీవులు సందర్శించి అంతులేని ఆనందాలు, ఎన్నో ఆశ్చర్యాలు పొందాల్సిందే.

బికనేర్‌:
బికనేర్‌ రాజస్థాన్‌ రాష్ట్రంలో థార్‌ ఎడారి మధ్యలో గల ప్రధాన ఎడారి పట్టణం. ఈ పట్టణం గొప్ప రాజపుత్ర సంస్కృతికి, రుచికరమైన భుజియాలకు, రంగు రంగుల పండుగలకు, అద్భుతమైన భవనాలకు, అందమైన శిల్పాలకు, ఇసుకరాయితో నిర్మించిన కోట బురుజులకు ప్రసిద్ది చెందింది. ఇక్కడ ఒంటెల పండగ ప్రసిద్ధి చెందినది. బికనేర్‌ సందర్శించదలచుకొన్న పర్యాటకులు ప్రసిద్ధ ఇసుక రాయి కట్టడ లాల్ఘర్‌ను తప్పనిసరిగా చూడాలి. ఈ ప్రదేశాన్ని వేసవి కాలం కంటే ఆగస్టు మాసం సందర్శనకి అనువైనది.

ముస్సూరీ :
ఉత్తరాఖండ్‌ ముస్సూరీని సాధారణంగా 'క్వీన్‌ ఆఫ్‌ హిల్స్' అని పిలుస్తారు. ఈ హిల్‌ స్టేషన్‌ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ జిల్లాలో కలదు. ఈ ప్రదేశం ఇక్కడ కల శివాలిక్‌ పర్వత శ్రేణుల సుందర దృశ్యాలకు మరియు దూన్‌ వాలీకి ప్రసిద్ధి గాంచినది. అందమైన ప్రదేశాలతో కూడిన ఈ పట్టణంలో అనేక ప్రాచీన దేవాలయాలు, కొండలు, జలపాతాలు, లోయలు మరియు వైల్డ్ లైఫ్‌ శాంక్చురీలు కలవు. ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చే నేషనల్‌ అకాడమీ ఇక్కడనే ఉంది.

పాండిచేరి:
ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే ప్రయాణికునికి పాండిచేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. సూర్యోదయ నగరంగా కూడా పేరొందిన ఆరోవిల్లె నగరం చక్కని నిర్మాణ శైలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గాంధీ విగ్రహం, ఫ్రెంచి యుద్ధ స్మారకం, జోసెఫ్‌ ఫ్రాంకోయిస్‌ డుప్లెక్‌‌స విగ్రహం వంటి అనేక స్మారక చిహ్నాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫ్రెంచి, తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచేరి, భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది. ఈ నగరంలోని వీధులు, అంగళ్లు షాపింగ్‌ అంటే ఇష్టపడే వారికి స్వర్గంలా ఉంటాయి.

మండు:
మధ్యప్రదేశ్‌ మండు సందర్శనకు కొద్దిపాటి జల్లులు పడే వర్షాకాలం అనువైనది. మండు అంటే ఒక ఆనందాల భూమి. సాంప్రదాయక మాల్వా ఆహారాలు అయిన దాల్‌ బాత్‌ మరియు మాల్పువా మాల్వా ఉత్సవాలు వంటివి అన్నీ కలసి, పర్యాటకులకు ఒక చక్కని సెలవుల విహార యాత్రని అందిస్తోంది. ఇక్కడ చూడవలసిన వాటిలో బాజ్‌ బహదూర్‌ మహల్‌, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటులు , తాజ్‌ మహల్‌ వలే మార్బుల్‌తో నిండిన హోశాంగ్‌ టూంబ్స్ మొదలైనవి ఉన్నాయి.

కూర్గ్:
కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటకలోని ప్రసిద్ది చెందిన హిల్‌ స్టేషన్‌లలో ఒకటి. ఈ ప్రదేశం ప్రధానంగా పర్వతమయం కనుకనే కూర్గ్‌ను “ఇండియాలోని స్కాట్‌లాండ్‌” అని, “కర్నాటకలోని కాశ్మీర్‌” అని అభివర్ణిస్తారు. కూర్గ్‌లో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలలో అబ్బే ఫాల్స్, మల్లలి ఫాల్స్, మడికేరి కోట, టిబెట్‌ బంగారు దేవాలయం ప్రధానమైనవి. ట్రెక్కింగ్‌ చేసే వారికి పుష్ఫగిరి ఫాల్స్, కోటిబెట్ట, నిషాని మోటి ప్రదేశాలు అనుకూలం. కూర్గ్‌ను సందర్శించాలంటే, ఆగస్ట్ మాసం నుండి నుండి నవంబర్‌ మాసం వరకు అనుకూల సమయం.

మహాబలేశ్వర్‌:
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో కల అందమైన ప్రదేశాలతో కూడిన మహాబలేశ్వర్‌ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. నగర జీవనంలో ఒత్తిడి జీవితాలను అనుభవిస్తున్నవారికి ఈ ప్రాంత ప్రశాంతత ఎంతో హాయినిస్తుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో సూర్యోదయ ప్రదేశం విల్సన్‌ పాయింట్‌ అత్యంత ఎత్తుగల ప్రదేశం. ఎలిఫిన్‌ స్టోన్‌ పాయింట్‌, మర్జోరీ పాయింట్‌, ప్రతాప్‌ ఘడ్‌ కోట వంటివి కూడా మహాబలేశ్వర్‌లో దర్శించటం అసలు మరువకండి. మహాబలేశ్వర్‌ వెళ్ళేవారు అక్కడి స్ట్రా బెర్రీలు తప్పక తిని తీరాల్సిందే. ఇంతటి వినోదాలు, ప్రకృతి అందాలను పంచి ఇచ్చే మహాబలేశ్వర్‌ను కొద్ది పాటి తొలకరి జల్లులు పలకరించే ఆగస్టు మాసంలో తప్పక సందర్శించావల్సినదే!

వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్
వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని హేమకుండ్‌కు వెళ్ళే దారిలో ఉన్నది. ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడిన కొండలతో చుట్టుముట్టి ఉంటుంది. పర్యాటకులు ఇక్కడ తెలుపు మరియు పసుపు అనేమోన్‌‌స,, డైసీలు, హిమాలయ నీలిరంగు గసగసాల మరియు పాము లిల్లీ వంటి అనేక 300 జాతుల పుష్పాలను చూడవొచ్చు. ఈ పుష్పాలతో పాటు నలుపు హిమాలయ ఎలుగుబంట్లు, తహర్‌‌స, కస్తూరి జింక, మంచు చిరుతలు మరియు సేరోవ్‌‌స వంటి అరుదైన జంతుజాలాన్ని మరియు అరుదైన సీతాకోకచిలుకలను కూడా ఇక్కడ చూడవచ్చు.

ఉదయపూర్‌:
బ్రహ్మాండమైన కోటలకీ, గుళ్ళు, అందమైన సరస్సులు, రాజ ప్రాసాదాలు, మ్యూజియంలు, అభయారణ్యాలకు ప్రసిద్ది పొందిన రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ 'సరస్సుల నగరం' గా పిలువబడే అందమైన ప్రదేశం. మహారాణా ఉదయ సింగ్‌ నిర్మించిన, గోల్‌ మహల్‌ గా పిలువబడే రాజ్‌ ఆంగణ్‌ కూడా ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటి. జగ్‌ మందిర్‌, నెహ్రూ గార్డెన్‌, ఏక్‌ లింగ జీ దేవాలయం, రాజీవ్‌ గాంధీ పార్‌‌క, శ్రీనాథ్‌ జీ దేవాలయం ఇక్కడి ఇతర ఆకర్షణలు. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఆగస్ట్‌ నెల నుంచి డిసెంబర్‌ మధ్య కాలం బాగుంటుందని పర్యాటకులు భావిస్తుంటారు.

కన్యాకుమారి :
కన్యాకుమారి పట్టణం మనదేశానికి దక్షిణ భూభాగాన చివరలో ఉంది. ఈ ప్రదేశంలో అరేబియన్‌ సముద్రం మరియు బంగాళాఖాతం మరియు హిందూ మహాసముద్రం కలుస్తాయి. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు, ప్రత్యేకించి పౌర్ణమి రోజులలో ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. ఇవి యాత్రికులను, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. సిటీలో ప్రధాన ఆకర్షణలు అంటే అవి వివేకానంద రాక్‌ మెమోరియల్‌, తిరువల్లువార్‌ విగ్రహం. సీఫుడ్‌ లు కన్యాకుమారి ప్రసిద్ధి చెందినది. కన్యాకుమారి సందర్శనకు ఉత్తమ సమయం ఆగస్ట్‌ నుండి డిసెంబర్‌ వరకు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుంది.

Friday, 12 February 2016

వింత విచిత్ర వినాయక ఆలయాలు

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్‌ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్‌ అతిశయ వినాయగర్‌ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్‌) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంత కన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్‌ వినాయకర్‌ ఆలయం అని కూడా పిలుస్తారు.

చారిత్రక ప్రాశస్త్యం:
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్‌ అతిశయ వినాయగర్‌ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

చారిత్రక చరిత్ర:
ఆ రోజులలో కేరళ పురం రాజుగారు తీర్థయాత్రలకని రామేశ్వరం వెళ్లడం జరుగింది. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళ పురం రాజుకే ఇస్తూ, మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం మన అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమ శాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపు మూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.

పెన్నులతో పూజలందుకునే అయినవిల్లి వినాయకుడు

అమలాపురానికి 12 కి.మీ. దూరంలోఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారుండరు. ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. స్వయంభువు గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం కృతయుగం నుంచీ ఇక్కడే ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. 14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు సంస్కృతంలో రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకారం క్రీ.శ. 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినట్లు, వారి మాతామహులైన మల్లాది బాపన్నావధానులు అయినవిల్లి క్షేత్రంలో స్వర్ణగణపతి మహాయఙ్ఞం జరిపినట్టు తెలుస్తుంది.

ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధివినాయకుడే స్వర్ణకాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించారు. ఆ కాలంలో ముగ్గురు నాస్తికులు ఈ సిద్ధివినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా, ఆ ముగ్గురూ మరుజన్మలో గుడ్డి, మూగ, చెవిటివాళ్ళుగా పుట్టినట్టూ, వాళ్ళు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తూంటే..బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్టు ఈ గ్రంథం చెబుతుంది. దీన్నిబట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే, అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తోంది. దక్షప్రజాపతి తన యఙ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధివినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వం నుంచీ ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకం, గురి. సిద్ధివినాయకస్వామికి ప్రతి నిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్తపుష్పార్చన, పుస్తకపూజ, అన్నప్రాశన, అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతూంటాయి. ఉభయ చవితి తిథులలోను, దశమి, ఏకాదశి తిథులలోను, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేష పూజలు జరుగుతాయి.

సంకటహర చతుర్థినాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు. వీటితోపాటు సకల ఈతిబాధా నివారణార్థం శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం కూడా చేస్తారు. వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. వినాయకచవితి రోజున రకరకాల పండ్లరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశంలోని సప్త జీవనదుల(గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి) జలాలతో సప్తనదీ జలాభిషేకం చేస్తారు. ఇంతకన్న ముఖ్యమైనది ఏమిటంటే.. ప్రతియేటా విద్యార్థుల కోసం జరిగే వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి 2,3 వారాలలో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం. విశాల ప్రాంగణం గల ఈ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాకారంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీభూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి.

అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు. అయితే తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాలవల్ల తెలుస్తుంది. ఈ సిద్ధివినాయకుని ఘనత నలుదిశలు వ్యాపించడంతో ఈ స్వామివారిని దర్శించడానికి ఎందరో రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా రావడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ.

ఆంధ్రా ఊటీ హార్సిలీ హిల్స్

కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం, పక్షుల కిలకిలరావాలు, ఆకాశాన్ని తాకినట్లుగా వుండే పర్వతశ్రేణులతో చల్లగా వీచే గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణంతో రాష్ట్రంలో ఏకైక వేసవి విడిదిగా హార్సిలీహిల్స్ పేరుగాంచింది. గ్రీష్మతాపంతో తల్లడిల్లుతున్న ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరడానికి, మధురానుభూతులను మిగుల్చుకోవడానికి వచ్చే జనసందడితో నిత్యం హార్సిలీహిల్స్ కళకళలాడుతోంది.

ప్రభుత్వ ఏకైక వేసవి విడిదిగా, ఆంధ్రా ఊటీగా ఖ్యాతి పొందిన హార్సిలీహిల్స్ తన అందచందాలతో పర్యాటకులను పులకింపజేస్తోంది. పశ్చిమకనుమల్లోనే ఎత్తైన మూడో శిఖరంగా గుర్తింపుపొంది, సముద్రమట్టానికి 4312 అడుగుల ఎత్తులో, కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమలకొండ కంటే 1200 అడుగుల ఎత్తులో హార్సిలీహిల్స్ ఆకర్షిస్తోంది. ఆంధ్రరాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిన ఏకైక వేసవి విడిదిగా ప్రత్యేక గుర్తింపు పొంది, నిత్యం హరిత శోభితంగా ప్రఖ్యాతిగాంచింది. చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలో హార్సిలీహిల్స్ వుంది. ప్రకృతిలోని కొత్తకొత్త అందాలతో, మేఘాలతో సంతరించే అనుభూతితో, చల్లటివాతావరణం, పచ్చదనంతో నిండివుంటుంది. హార్సిలీహిల్స్ మదనపల్లె నుండి కదిరి వెళ్ళే ప్రధాన రహదారిలో కాండ్లమడుగు క్రాస్‌కు పది కిలోమీటర్ల దూరంలో వుంది. తిరుమల గిరుల కంటే 1200 అడుగుల ఎత్తున ఉన్నందున ఇక్కడి వాతావరణం అతి తక్కువ ఉష్ణోగ్రతతో వుంటుంది.

హార్సిలీహిల్స్‌ను గతంలో ఇక్కడి ప్రజలు ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. బ్రిటీష్ పాలనలో అప్పటి కడప కలెక్టర్‌గా వున్న సర్ రాబర్ట్ హార్సిలీ 1857 సంవత్సరంలో కడప నుండి మదనపల్లెకు వెళ్తూ మధ్యలో సరదాగా గుర్రంపై కొండపైకి చేరుకున్నారు. అప్పట్లో ఏనుగు మల్లమ్మ కొండగా వున్న దానిపై గల వాతావరణానికి సర్ రాబర్ట్ హార్సిలీ అమితంగా ఆకర్షితుడయ్యాడు. అప్పట్నుంచి ప్రతి వేసవికి ఏనుగు మల్లమ్మ కొండకు రావడం ప్రత్యేకంగా అలవర్చు కొన్నాడు. కొండపై బంగ్లా నిర్మించి బస చేసేవారు.

వేసవితాపం నుండి ఉపశమనానికి, ఆంధ్రప్రదేశ్‌తోపాటు, కర్నాటక, తమిళనాడు పర్యాటకులు ఇక్కడికి వచ్చి సేద తీరుతుంటారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు టూరిజంశాఖ కోట్లాది రూపాయల ఖర్చుతో ఆధునాతన సౌకర్యాలు కల్పించింది. అతిథి గృహాలు, భోజన ప్రియుల కోసం పున్నమి రెస్టారెంట్, మద్యం ప్రియుల కోసం బార్, పిల్లలుకోసం విశాలమైన ఆట స్థలం, స్విమ్మింగ్‌పూల్, ట్రెక్కింగ్ తదితర వసతులు ఇక్కడ వున్నాయి. దేశంలోని ఏ ప్రదేశం నుండైనా హిల్స్ లోని అతిథిగృహాలను బుకింగ్ చేసుకొనేందుకు ఆన్‌లైన్ సౌకర్యం వుంది. హిల్స్‌లోని చల్లటి ఆహ్లాదకరమైన వాతావరణం పక్షుల కిలకిలారావాలు, దట్టమైన అడవుల సోయగాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్‌పార్క్, స్విమ్మింగ్ సెంటర్, మసాజ్‌సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. అటవీశాఖ వారు ఇక్కడ జంతు ప్రదర్శనశాలలు, ప్రకృతి అధ్యయన కేంద్రాన్ని, మొసళ్ళ పార్కును ఏర్పాటుచేశారు. జంతు ప్రదర్శనశాలలో వివిధ రకాల కోతులు, ఆఫ్రికన్ పక్షులు, చిలుకలు, గిన్యాపందులు, గుడ్లగూబలు తదితర వింత పక్షులు వున్నాయి. ప్రకృతి అధ్యయన కేంద్రంలో అటవీ జంతువుల లైబ్రరీ, వివిధ జంతువుల బొమ్మలు, వాటిపైన డాక్యుమెంటరీలు వున్నాయి.

హార్సిలీహిల్స్‌లో గల గాలికొండ, మైక్రోవేవ్ రెసీవర్ స్థలాలు, వ్యూపాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వీటితోపాటు చారిత్రాత్మక ప్రాధాన్యంతో కూడిన ఏనుగుమల్లమ్మ గుడి ప్రశస్త్యమైంది. ఈ గుడిలో ప్రతి యేటా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. స్థానిక అటవీశాఖ అతిథిగృహం పక్కన వున్న 176 సంవత్సరాల వయస్సు గల సర్ రాబర్ట్ హార్సిలీ నాటిన నీలగిరి చెట్టు నేడు అతిపెద్ద చెట్టుగా ఎదిగి మహావృక్ష పురస్కారాన్ని పొందింది. అలాగే అటవీశాఖ అతిథిగృహం ప్రక్కన ఒక ఆశ్చర్యకరమైన వింత చోటు చేసుకొని వున్నది. అక్కడ వున్న రెండు ఎర్రపు రాయి చెట్ల కొమ్మలు పైకి ఎదిగి ఒకే కొమ్మగా రూపాంతరం చెందడం వింతగా చెప్పవచ్చు. చరిత్రలో రావి, మర్రి, జువ్వి చెట్ల కొమ్మలు కలసిన దాఖలాలు వున్నాయి. కానీ ఎర్రపురాయి చెట్లు కలవడం కేవలం ఇక్కడే మనం చూడవచ్చు అని అటవీశాఖ అధికారులు తెలిపారు. కాలినడకన వెళ్ళేదారిలో మానసగంగోత్రి వద్ద నీలిగిరి చెట్లు సైతం రెండు కొమ్మలుగా పైకి పోయి ఒకే కొమ్మ గా కలిశాయి. ఇవన్నీ వెరసి ప్రత్యేక ఆకర్షణగా పర్యాటకులను ఆర్షిస్తు న్నాయి.

పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్‌పార్క్, స్విమ్మింగ్ సెంటర్, మసాజ్‌సెంటర్‌లు నిర్వహిస్తున్నారు. అటవీశాఖ వారు ఇక్కడ జంతు ప్రదర్శనశాలలు, ప్రకృతి అధ్యయన కేంద్రాన్ని, మొసళ్ళ పార్కును ఏర్పాటుచేశారు. జంతు ప్రదర్శనశాలలో వివిధ రకాల కోతులు, ఆఫ్రికన్ పక్షులు, చిలుకలు, గిన్యాపందులు, గుడ్లగూబలు తదితర వింత పక్షులు వున్నాయి. ప్రకృతి అధ్యయన కేంద్రంలో అటవీ జంతువుల లైబ్రరీ, వివిధ జంతువుల బొమ్మలు, వాటి పైన డాక్యుమెంటరీలు వున్నాయి. హార్సిలీహిల్స్‌లో గల గాలికొండ, మైక్రోవేవ్ రెసీవర్ స్థలాలు, వ్యూపాయింట్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

వేసవికాలంలో గవర్నర్, రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు విశ్రాంతి తీసుకోవడానికి వస్తుంటారు. ఇటీవల హార్సిలీహిల్స్‌కు గవర్నర్ నరసింహన్ దంపతులు వచ్చి గవర్నర్ బంగ్లా ఆధునీకరణ పనులు ప్రారంభించి హిల్స్‌లో సేదతీరారు. అలాగే ప్రస్తుతం విపరీతమైన ఎండ వేడి, ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందడానికి ఆంధ్రప్రదేష్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాలనుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో హిల్స్‌కు వస్తున్నారు. హార్సిలీహిల్స్‌ను మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రాష్ట్ర అటవీశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండు కోట్ల రూపాయలతో మాస్టర్‌ప్లాన్ రూపొందించారు.

చరిత్ర ఇది..
హార్సిలీహిల్స్‌ను గతంలో ఇక్కడి ప్రజలు ఏనుగు మల్లమ్మ కొండగా పిలిచేవారు. బ్రిటీష్ పాలనలో అప్పటి కడప కలెక్టర్‌గా వున్న సర్ రాబర్ట్ హార్సిలీ 1857 సంవత్సరంలో కడప నుండి మదనపల్లెకు వెళ్తూ మధ్యలో సరదాగా గుర్రంపై కొండపైకి చేరుకున్నారు. అప్పట్లో ఏనుగు మల్లమ్మ కొండగా వున్న దానిపై గల వాతావరణానికి సర్ రాబర్ట్ హార్సిలీ అమితంగా ఆకర్షితుడయ్యాడు. అప్పట్నుంచి ప్రతి వేసవికి ఏనుగు మల్లమ్మ కొండకు రావడం ప్రత్యేకంగా అలవర్చుకొన్నాడు. కొండ పై బంగ్లా నిర్మించి బసచేసేవారు. అప్పటి నుండి ఆయన పేరు మీద ఏనుగు మల్లమ్మ కొండను హార్సిలీహిల్స్‌గా పిలవడం ఆరంభించారు. హిల్స్‌లో సర్ హార్సిలీకి ఒక కొడుకు జన్మించి అదే రోజు మృతి చెందడంతో అక్కడ జూనియర్ హార్సిలీ పేరిట సమాధిని నిర్మించారు. అలాగే తన పెంపుడు కుక్క కూడా మృతి చెందడంతో హార్సిలీ తన కుక్క జ్ఞాపకార్థం ఓ సమాధిని నిర్మించాడు. సముద్ర మట్టానికి 4312 అడుగుల ఎత్తులో వున్న హార్సిలీహిల్స్ ప్రకృతి ప్రసాదించిన అందాలకు మెరుగులు దిద్దుతూ తమిళనాడులోని ఊటిని మైమరిపించే విధంగా వుంటుంది. ఇలాంటి ప్రకృతి అందచందాలు కలిగిన హార్సిలీహిల్స్‌ పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వివిధ అభివృద్ది పనులను చేపట్టింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆధునిక సౌకర్యాలు అందుబాటులో వున్నాయి.

ప్రముఖుల విడిది...
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన వేసవి విడిది కావడంతో గతంలో రాష్ట్ర గవర్నర్ ప్రతి వేసవిలోనూ ఇక్కడ విడిది చేయడం ఆనవాయితీగా వుండేది. గవర్నర్‌లు కుముద్‌బెన్ జోషి, కృష్ణకాంత్ తదితరులు ఇక్కడ వేసవిలో విడిది చేశారు. మాజీ ప్రధాని ఐ.కె. గుజ్రాల్ సైతం వారం రోజుల పాటు హార్సిలీహిల్స్‌ పై వుండి ప్రకృతి అందాలను తిలకించారు. పలువురు సినీనిర్మాతలు, రచయితలు, నటులు ఇక్కడ విడిది చేశారు. సీతామాలక్ష్మి, ఎన్‌కౌంటర్, జైత్రయాత్ర, లక్ష్మీకళ్యాణం తదితర ఎన్నో సినిమాలు హార్సిలీహిల్స్, పరిసర ప్రాంతాలలో చిత్రీకరించడం వల్ల సినీ కళాకారులు, ప్రముఖులతో హిల్స్ అప్పుడప్పుడు కొత్త అందాలను సంతరించుకుంటుంది.

రవాణా వసతులు...
హార్సిలీహిల్స్ నుండి తిరుపతి 150 కిలోమీటర్లు, మదనపల్లెనుండి 28 కిలోమీటర్లు, అనంతపురం నుండి 130 కిలోమీటర్లు దూరంలోవుంది. ప్రతి శని, ఆదివారాల్లో బెంగళూరు నుండి టూరిజం కార్పొరేషన్ స్పెషల్ ప్యాకేజీ బస్సులను నడుపుతోంది. తిరుపతి నుండి ప్రతిరోజూ మధ్యాహ్నం 1:30 గంటలకు ఆర్టీసి సర్వీసులు, మదనపల్లె నుండి ప్రతి రోజూ ఉదయం 6:30 గంటలకు, 9:00 గంటలకు, మధ్యాహ్నం 2:00 గంటలకు సాయంత్రం 5:00 గంటలకు ఆర్టీసీ వారు బస్సు సౌకర్యం కల్పించారు.

హిల్స్ రూట్ మ్యాప్...
చెన్నై నుండి చిత్తూరు మీదుగా మదనపల్లెకు చేరి హార్సిలీహిల్స్ చేరుకోవచ్చు.
బెంగళూరు నుంచి మదనపల్లె మీదుగా హార్సిలీహిల్స్ చేరుకోవచ్చు.
హైదరాబాదు నుంచి కదిరి మీదుగా నేషనల్ హైవేలోని అమరనారాయణపురం క్రాస్‌కు వచ్చి అక్కడి నుండి పది కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణించి హిల్స్ చేరవచ్చు.

వసతులు...
అటవీశాఖ ఆధ్వర్యంలో మిల్క్‌హౌస్‌లతో పాటు హార్సిలీ, పింఛా, కౌండిన్యా, మాండవి, బాహుదా, కళ్యాణి తదితర అతిథి గృహాలు కలవు. అద్దె రోజుకు రూ.300 వసూలు చేస్తారు. ఒక్కొక్కరికి రూ.100లతో డార్మెటరీ వసతి, స్పెషల్‌ కాటేజీ రూ.600, డబుల్ కాటేజీ రూ.1000, ఎన్‌జిఓ బ్లాక్ రూ.840, ఎబ్లాక్ 1. రూ.2000, ఎ బ్లాక్2.రూ.1500, బి బ్లాక్2.రూ.1050, యాత్రినివాస్ రూ.1200, ఎడిసి బ్లాక్ రూ. 2200, గవర్నర్ సూటు రూ. 2000, గవర్నర్ బంగ్లా ్లరూ.2500 చొప్పున మొత్తం 48 గదులు, 40 డార్మెటరీలు అందుబాటులో వున్నాయి.

హాలిడే హోమ్‌లో 12 అతిథి గృహాలున్నాయి. అద్దె రోజుకు రూ.300 నుండి రూ.700వరకు పరిస్థితులను బట్టి వసూలు చేస్తారు. ఇదికాక పోలీసు, రైల్వే, రెవెన్యూ, కర్నాటక గెస్ట్ హౌస్, అభిరామ్ రిసార్ట్స్ తదితర అతిథి గృహాలు కలవు.

ప్రకృతి అందాల కొలమనం కుమర కోమ్


సముద్ర జలాలతో ఏర్పడిన సరస్సులు, నదులు, పిల్లకాలువలు కలగలసి... కేరళ రాష్ట్రానికి దేశంలోనే అందమైన ప్రాంతంగా గుర్తింపు తెచ్చాయి. పశ్చిమ కనుమలలోని కార్డమమ్‌ హిల్స్‌ నుండి కనీసం 40 నదులు కేరళ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంటాయి. కేరళలో సరస్సులున్న ప్రాంతాలను కుట్టునాడు అని అంటుంటారు. కుట్టునాడు అంటే.. పొట్టివాళ్ళు ఉండే ప్రదేశం అని అర్థం. ఇక్కడి రైతులు ఎప్పుడూ సాగు భూముల్లో మోకాలిలోతు కూరుకుపోయి పంట పనులు చేయటం వల్ల బహుశా ఆ ప్రాంతాలకు ఆ పేరు వచ్చి ఉంటుంది. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫలసాయాలు, కొబ్బరి ఉత్పత్తులు, ఇతర వస్తువుల రవాణాకు మళయాళీలు ఈ నదుల పైనే ఆధారపడ్డారు. అందుకేనేమో.. ఇప్పటికీ ఆయా లంకల్లోని మళయాళీలకు పడవలే రవాణా సౌకర్యాలు. పాఠశాలలకు పిల్లల్ని తీసుకెళ్లటం, తీసుకురావటం లాంటి వాటితో సహా ప్రజలు దైనందిన కార్యకలాపాలలో పడవ ప్రయాణాలు సర్వసాధారణం. ఈ తీర ప్రాంతాలలో విహారం ఓ అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంత అందమైన ప్రకృతి దృశ్యాలను చూడాలంటే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌కు వెళ్ళాల్సిందే మరి..!

కుట్టునాడ్‌ జీవనశైలికి ప్రతిబింబం..
కేరళలోని కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌.. కొచ్చి నుంచి 78 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దట్టమైన పామ్‌ చెట్ల మధ్యలో.. వెంబనాడ్‌ సరస్సు తూర్పుతీరంలో కవనార్‌ నదీ ముఖద్వారం వద్ద ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ వెలసింది. కుట్టునాడ్‌ ప్రజల జీవనశైలిని ప్రతిబింబిస్తూ, చక్కటి సరస్సులు, నదులు కలగలసి ఉన్న ఈ ప్రదేశంలోని కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌... పచ్చని చీరను చుట్టుకున్నట్లుగా ప్రకృతి తన అందాలతో అలరింపజేస్తుంది. కేరళ సంప్రదాయసిద్ధ మైన ధారవాడ నిర్మాణశైలిలో నిర్మించిన విడి కాటేజీలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ కాటేజీలన్నీ పురాతనమైన భవనాలు కావడంతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

ది గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌లోనూ...
ప్రపంచ ప్రఖ్యాత రచయిత అరుంధతీ రాయ్‌కి బుకర్‌ ఫ్రైజును తెచ్చిపెట్టిన గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌లో పేర్కొన్న కోకొనట్‌ లాగూన్‌ రెస్టారెంట్‌.. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోని ఒక పురాతన భవనం కావడం విశేషం. ఇది అద్భుతమైన కేరళ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ధారావాడ శైలిలో నిర్మించిన చక్కటి భవనంలో ఉన్న ఈ రెస్టారెంట్‌ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌లోకెల్లా అత్యంత పురాతన భవనం. ఓ మళయాళీ కుటుంబానికి చెందిన ఈ భవనాన్ని కొనుగోలు చేసి జాగ్రత్తగా ముక్కలు చేసి తెచ్చి, ఈ లాగూన్‌లో మళ్లీ నిర్మించటం మరో విశేషం. కోకొనట్‌ లాగూన్‌లోని రిసెప్షన్‌ భవనం ఒక్కటే కేరళలోని సంప్రదాయ సిద్ధమైన మరో నిర్మాణశైలి, నలుకెట్టు ఆకృతితో అందంగా ఆహ్వానిస్తూంటుంది. నిజానికి ఇది ఈ లాగూన్‌కు సమీపంలో ఉండే గ్రామమైన వైకోమ్‌లో 1860లో నిర్మితమై, ఒక బ్రాహ్మణ కుటుంబీకులు నివాసం ఉండిన పురాతన భవనం. దీనిని కొనుగోలు చేసి లాగూన్‌కు తెచ్చి పునర్నిర్మించారు.

ఇవీ వసతులు...
చిన్న చిన్న కాటేజీలు, కొన్ని ఏసీ సౌకర్యం ఉన్న గదులు పర్యాటకులకు అందుబాటులో ఉంటాయి. 14 హెరిటేజ్‌ మాన్షన్లు, 28 హెరిటేజ్‌ బంగ్లాలు, 8 ప్రైవేట్‌ పూల్‌ విల్లాలు పర్యాటకులకు చక్కని వసతులు అందించగలవు. హెరిటేజ్‌ మాన్షన్స్‌లో అయితే ఒక్కో కాటేజీకి రెండు అంతస్థులు ఉండి, పై అంతస్తు నుండి వెంబనాడ్‌ సరస్సు అందాలను చూసేందుకు వీలుగా ఉంటుంది.

సూర్యాస్తమయం అద్భుతం...
సూర్యాస్తమయ దర్శించేందుకు కోకోనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ను మించిన అనువైన ప్రదేశం మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ లాగూన్‌ చుట్టుపక్కల ప్రాంతాలను పడవల్లో ప్రశాంతంగా తిరుగుతూ చూడటం మరో అనిర్వచనీయమైన అనుభూతి. ఈ రిసార్ట్‌కు సమీపంలో, కవనార్‌ నదికి దక్షిణ ప్రాంతంలో నెలవైన రక్షిత పక్షుల కేంద్రం మరో ఆకర్షణీయమైన ప్రదేశం అని చెప్పవచ్చు.

సౌందర్య వీక్షణమే కాదు.. ఆరోగ్య సౌలభ్యం కూడా...
ఆయుర్వేదిక్‌ మసాజ్‌, యోగ, ధ్యానం, మారుమూల ప్రాంతాలకు పడవ ప్రయా ణాలు, రైస్‌ బోట్‌ ప్రయాణాలు, ఫిషింగ్‌, ఈత లాంటివి ఈ కోకొనట్‌ లాగూన్‌ రిసార్ట్‌ అదనపు ఆకర్షణలుగా చెప్పవచ్చు. స్థానిక, అంతర్జాతీయ (బఫె) భోజన సదుపాయాలు ఈ ప్రాంతాల్లో లభ్యం అవుతాయి. సాధారాణంగా ఇక్కడి వాతావరణం కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్‌, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. ఇక్కడి చేరుకోవాలంటే.. కొచ్చిలోని కాసినో హోటల్‌ నుండి నేరుగా అక్కడికి ప్రయాణికులను చేరవేసే పడవ సౌకర్యం ఉంటుంది. లేదా కొంతదూరం రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి కుమరకోమ్‌ నుండి గానీ.. పుతెన్గడి నుండిగానీ పడవ ప్రయాణం ద్వారా కోకొనట్‌ లాగూన్‌ హెరిటేజ్‌ రిసార్ట్‌కు చేరుకోవచ్చు.

మరో ప్రకృతి సౌందర్యం.. కుమరకోమ్‌...
కేరళ ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందిన కుట్టనాడ్‌ ప్రాంతంలో వెంబనాడ్‌ సరస్సు పరీవాహక ప్రాంతంలో ఈ కుమరకోమ్‌ కొలువై ఉంది. ఈ సరస్సు నుండి పిల్లకాలువలు విస్తరించి, మధ్య లంకలన్నీ గుబురైన కొబ్బరి చెట్లతో పచ్చగా, చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండి కుమర కోమ్‌కు వన్నె తెస్తాయి. కేవలం ఈ ప్రాంతంలోనే కాదు. కేరళలోని మరెన్నో ప్రాంతాలలో ప్రధాన రవాణా మార్గాలుగా పలు నదులు, కాలువలు నిలుస్తున్నాయి. పల్లెలను, పట్టణాలను కలిపే ఈ నదీమార్గాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కుట్టనాడ్‌లో నదీమార్గం ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఘనత సాధించింది. కేరళ గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పడవలలో ఈ నదీమార్గాల ద్వారా చేసే ప్రయాణం ఎన్నటికీ మరపురానిది.

అన్నీ పడవల ద్వారానే...
కుమారకోమ్‌.. కేరళలోని ప్రసిద్ధ విహార కేంద్రం. ఈ ప్రదేశంలో సింహభాగం నీటితో నిండి ఉంటుంది. ఎటుచూసినా.. సరస్సులు, సెలయేళ్లతో నిండివుంటుంది. ఇక్కడి చుట్టు పక్కల గ్రామాలకు.. పాలు మొదలకుకొని.. కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్లు, పప్పులు, నూనెలు ఇలా గృహా వసరాలకు కావలసిన ఏ వస్తువైనా లాంచీల్లో రావాల్సిందే. ఇక్కడ రోడ్లకంటే.. నదీ పాయలే ఎక్కువ. బైకులు, మోటార్‌సైకిళ్ల కంటే.. బోట్లే ఎక్కువ. చుట్టూ నీరుండడంతో.. ఇక్కడి ప్రజల్లో చాలా మంది చేపల వేటనే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు.

ఆగస్టు, సెప్టెంబర్‌లలో వెంబనాడ్‌ సంబరాలు... కేరళ పేరు చెప్పగానే గుర్తొచ్చే అంశాలలో పడవల పోటీ ఒకటి. వెంబనాడ్‌ సరస్సులో ప్రతి సంవత్సరం ఆగస్టు, సెప్టెంబరు నెలల మధ్యకాలంలో నిర్వహించే ఈ పోటీలు నీళ్లలో పోటీ జ్వాలలు రగులుస్తాయని అంటుంటారు. నాటి ప్రధాన మంత్రి పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ స్మారకంగా నెహ్రూ బోట్‌ రేస్‌ పేరిట నిర్వహించే పడవల పోటీ అత్యంత ఆసక్తికరంగా సాగుతుంది. ఆగస్టు నెల రెండవ శనివారంనాడు దీనిని నిర్వహిస్తారు. మళ్లీ ఓనమ్‌ సందర్భంగా అళప్పూజ ప్రాంతంలో అరణ్‌ముల పడవల పోటీ నిర్వహించడం ఆనవాయితీ. కొట్టాయం నుండి పది కిలోమీటర్ల దూరంలో..  కొచ్చిన్‌ నుండి 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే.. సగం దూరం రోడ్డు గుండా చేరుకుని తన్నీర్ముక్కమ్‌ జెట్టీ ద్వారా కుమరకోమ్‌ చేరుకోవచ్చు. సమీపంలోని రైల్వే స్టేషన్‌ కొట్టాయం. సమీపంలోని విమానాశ్రయం.. కొచ్చిన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం.

కుమరకోమ్‌ పక్షుల రక్షిత ప్రాంతం...
కుమరకోమ్‌ ప్రాంతం అంతా వెంబనాడ్‌ సరస్సు తీరంలోని చిన్నచిన్న లంకలతో కలిపి ఉంటుంది. ఇదంతా కుట్టనాడ్‌ ప్రాంతానికి చెందిందే. ఇక్కడ 14 ఎకరాలలో విస్తరించి ఉన్న పక్షుల రక్షిత ప్రదేశం పక్షుల వీక్షకులకు చక్కని అనుభూతిని కలుగజేస్తుంది. కోయిలలు, హంసలు, వలస పక్షులు, లొట్టిపిట్టలు, సైబీరియన్‌ స్టార్క్‌ వంటి అనేక జాతుల పక్షులకు ఇది ఆవాస ప్రదేశం. ఈ పక్షులను సందర్శించాలనుకుంటే ఇక్కడి లంకల్లో పడవల్లో ప్రయాణించడం ఒక్కటే ఉత్తమ మార్గం.

మరెన్నో ప్రత్యేకతలు...
కుమరకోమ్‌లో ఇంకా ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు పర్యాటకలను ఆకట్టుకుంటాయి. ఇక్కడి తాజ్‌ గార్డెన్‌ రిట్రీట్‌లో బోటింగ్‌, ఫిషింగ్‌ సౌకర్యాలు ఉన్నాయి. కేరళ పర్యాటక అభివృద్ధి సంస్థ కుమర కోమ్‌ టూరిస్ట్‌ గ్రామ సముదాయంలో భాగంగా కొబ్బరి, అరటి తోటల్లో కాటేజీలను ఏర్పాటు కూడా ఉంది. పడవ ఇళ్లలో హాలిడే ప్యాకేజీలు వర్ణతీతమైన అనుభవం.

సీతమ్మ తనువు చాలించిన స్థలం

సీతమ్మ తల్లి తన అవతారం చాలించినప్పుడు తన మాతృమూర్తి అయిన భూమాతతో ఐక్యమైందన్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రదేశం ఎక్కడ ఉందో చాలామందికి తెలియదు. ఆ పవిత్ర స్థలం అలాహాబాద్ వారణాసిలను కలిపే రెండవ జాతీయ రహదారికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో సీతమ్మ భూమాతతో ఐక్యమైన స్థలం ఉంది. రెండవ జాతీయ రహదారి పైన ఉన్న జంగీగంజ్ నుండి 14 కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవచ్చు.



ఆ ప్రదేశాన్ని 'సీతా సమాహిత్ స్థల్' అనీ... 'సీతా మారీ' అనీ పిలుస్తారు. తమసానది పరిసరాలలో ప్రశాంతమైన వాతావరణంలో 90వ దశకంలో నిర్మించిన అందమైన స్మారక కట్టడం ఇక్కడ ఉంది. ఈ స్మారక నిర్మాణం జరుగక ముందు, ఇక్కడ అమ్మవారి జుత్తుని తలపించేట్టుగా కేశవాటిక ఉండేదని అక్కడివారు చెబుతారు. అక్కడ మొలిచిన గడ్డిని పశువులు మేసేవి కావట. స్మారకం నిర్మించినపుడు, సితా కేశ వాటికను పాడు చేయకుండా అలానే ఉంచారు. ఆ ప్రదేశానికి సమీపంలోనే వాల్మీకి ఆశ్రమం ఉన్నది. పక్కనే, లవకుశులకు జన్మనిచ్చిన స్థలం అయిన సీతా వట వృక్షం కుడా ఉన్నది. ఇక స్మారకం విషయానికి వస్తే, అది రెండతస్తుల నిర్మాణం. పై అంతస్తులో అద్దాల మంటపంలో అమ్మవారి పాలరాతి విగ్రహం ఉన్నది. క్రింది భాగంలో, జీవకళ ఉట్టిపడే విధంగా భూమిలోకి చేరుకుంటున్నట్టుగా చూపిస్తున్న అమ్మవారి ప్రతిమ, ఎంతటివారికైనా కాస్తో కూస్తో బాధ కలిగించే విధంగా దర్శనమిస్తుంది.

వెనుక గోడ మీద ఆ సంఘటనను ప్రతిబింబిస్తున్న సన్నివేశపు శిళాచిత్రం కినిపిస్తుంది. ఇక ఈ కట్టడం గురించిన వివరాలలోకెళితే, దీన్ని స్వామీ జితేంద్రానంద తీర్థుల వారి నిర్దేశం మేరకు క/ట ్కఠn్జ ఔౌడఛీ సంస్థ ప్రమోటర్ అయిన శ్రీ సత్య నారాయణ్ ప్రకాష్ పన్జ్ ఈ పవిత్ర దేవాలయం నిర్మించారు. ఇక్కడ సీతమ్మ తల్లితో పాటు శివుడి విగ్రహం కూడా ఉన్నది. అంతేకాకుండా 20 ఫీట్ల కృత్రిమ రాతిపై నిర్మించిన 108 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ రాతి నిర్మాణం క్రింద గుహలో చిన్న హనుమాన్ దేవాలయం కూడా ఉన్నది.

SITA SAMAHIT STHAL, SITAMARHI, UP

Thursday, 11 February 2016

పర్యాటక స్వర్గధామం ఉత్తరాఖండ్‌

మనదేశంలోని అతిశీతల...ఆహ్లాదకర ప్రదేశాలలో ప్రముఖంగా చెప్పుకునేది డెహ్రాడూన్. ఉత్తరాఖండ్ రాజధాని అయిన ఈ ప్రదేశం దేశీయ, విదేశీ పర్యాటకులతో కిటకిటలాడుతుంది. కేవలం డెహ్రాడూన్ మాత్రమే కాదు నైనిటాల్, ముస్సోరీ, అల్మోరా, కౌసని, భిత్మల్, రాణీకత్, పితోర్‌గఢ్ లాంటి ప్రదేశాలు కూడా పర్యాటకులకు స్వర్గధామాలుగా ఉన్నాయి. చెప్పాలంటే... హిమలయ పర్వత శ్రేణి పాదాల చెంత పరుచుకున్న పచ్చదనంతో ఉత్తరాఖండ్ రాష్ట్రమంతా అందమైన పర్యాటేక కేంద్రాలతో, ఆధ్యాత్మిక కేంద్రాలతో అలరారుతుంది.


హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకుంటున్న ఉత్తరాఖండ్ విహారం... పర్యాటకుల మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది డెహ్రాడూన్. కానీ, ఇప్పటిదాకా బయటపడని ఎన్నో అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశుల్ని చేయడమే కాదు సంస్కృతీ సాంప్రదాయల్లో కూడా ఉత్తరాఖండ్ ఎంతో పేరెన్నికగన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళా... అంతేకాకుండా మనదేశంలో గోల్ఫ్ ఆటకు అనువైన ప్రదేశాలలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి.
కార్బెట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్... అంతరించిపోతున్న మన జాతీయ జంతువు పెద్దపులికి ఇష్టమైన నివాసం. అంతేకాకుండా పర్వాతారోహలకు ఎంతో ఇష్టమైన పర్వతశిఖారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి వాటిలో నందాదేవి పీక్ ప్రముఖమైనవి. జాతీయ వింతలు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, నందాదేవీ జాతీయ ఉద్యానవనం లాంటి ప్రదేశాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌లుగా గుర్తింపు సంపాదించుకున్న ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్శకుల మనసుదోచే ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.

శక్తిస్వరూపిణి ఆవాసం... నైనిటాల్
సరస్సుల నగరంగా గుర్తింపు పొందిన నైనిటాల్‌లో ఒకప్పుడు సుమారు 60కి పైగా చెరువులు, సరస్సులు ఉండేవట. ఇందులో నైనీ అనే సరస్సు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మహాఋషులు, మునులు నివాసం ఉన్నట్టు స్కందపురాణంలో ఉంది. నైనిటాల్ సరస్సును ట్రై రిషి సరోవర్ (ముగ్గురు ఋషుల సరోవరం) కూడా పిలుస్తారు. అత్రి, పులస్త్య, పులహ అనే మహా ఋషులు... నీరు దొరకకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నైనిటాల్‌లో ఒక సరస్సు నిర్మించాలని తలపెట్టారు. అలా ఒక లోతైన గుంతను తవ్వి... టిబెట్ దగ్గర ఉన్న పవిత్ర మానస సరోవరం నుండి నీటిని తెచ్చి నింపారని ప్రతీతి. అలా ఏర్పడిందే నేడు మనం చూస్తున్న నైనిటాల్ సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలోనే స్నానమాచరించినంత పుణ్యం దక్కుతుందట.

దేశంలో ఉన్న 64 శక్తిపీఠాలలో నైనిటాల్ కూడా ఒకటి. 64 ముక్కలైన పార్వతీ దేవి శరీరభాగాల్లో ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడిందట. అలా ఈ ప్రాంతానికి నైనిటాల్ (హిందీలో నయన్ అంటే కన్ను) అనే పేరు వచ్చిందని ప్రతీతి. అందుకే ఆ శక్తి స్వరూపిణిని ఇక్కడ నైనాదేవి పేరుతో పిలుస్తారు. నైనాదేవీ ఆలయం దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పర్యాటకులు ఇక్కడి చేరుకోవాలంటే... దగ్గరి విమానాశ్రయం పంత్‌నగర్. ఇది నైనిటాల్‌కు 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. రైలుమార్గం ద్వారా చేరుకునే పర్యాటకులు కథ్‌గోదామ్ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళవచ్చు (ఈ స్టేషన్ నైనిటాల్‌కు 31 కి.మీ).




ప్రముఖల తాత్కాలిక విడిది... ఆల్మోరా
ఉత్తరాఖండ్‌లో పచ్చదనంతో మైమరిపించే మరో ప్రదేశం ఆల్మోరా. ఇక్కడి ప్రకృతి పచ్చదనానికి పరవశించని పర్యాటకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత వాతారణంతో కొండకోనలతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతీమాత తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి మరీ తీర్చిదిద్దిందా అనిపిస్తుంది. కోశీ, సుయాల్ నదుల ప్రవాహం ఆల్మోరాకు మరింత అందాన్ని చేకూర్చింది. ఆల్మోరా ప్రకృతి అందాలతోనే కాదు, ప్రముఖుల నివాసాలతో ప్రసిద్ధిగాంచింది. స్వామీ వివేకానంద తన హిమాలయాల పర్యటనలో ఆల్మోరాను తాత్కాలిక విడిదిగా ఎంచుకున్నారట. అలా ఆయన కొన్నాళ్ళు ఇక్కడే గడిపాడట. అంతేకాకుండా స్వాత్రంత్య సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్, ప్రముఖ హిందీ విద్వాంసుడు సుమిత్రానందన్ పంత్, నోబెల్ గ్రహీత సర్ రొనాల్డ్ రాస్‌లకు జన్మస్థలం ఆల్మోరా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన బాల్యంలో కొంతకాలాన్ని ఇక్కడే గడిపాట. ధోని తండ్రికి రాంచీలో స్థిరపడక మునుపు ఇక్కడ ఫామ్‌లు ఉండేవట. ఇక్కడి చేరుకోవాలంటే నైనిటాల్‌కు మాదిరిగానే పంత్‌నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవాలి. రైలుమార్గం గుండా వచ్చే పర్యాటకులు కోథ్‌డామ్ రైల్వేస్టేషన్ నుండి చేరుకోవచ్చు.

గోల్ఫ్ కోర్స్‌ల చిరునమా... రాణీఖేత్
మనదేశంలో గోల్ఫ్ ఆటకు సంబంధింన మైదానాలకు మారుపేరు రాణీఖేత్. ఎటుచూసిన పచ్చని తివాచీ పరిచనట్లుండే ఈ ప్రాంతంలో 9 మౌంటేన్ గోల్ఫ్ లింక్‌లు ఉన్నాయి. ఓక్ అడవుల్లో విస్తరించి ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్‌లు పర్యాటకులను ఇట్టే కట్టిపడే స్తాయి. చలికాలంలో మంచు దుప్పటి పరుచుకున్న ట్లుండే ఈ ప్రదేశం వేసవిలో మాత్రం సైనిక స్థావరంగా సేవలందిస్తుంది. ఇవేకాకుండా ఝులా దేవి ఆలయం, చౌభాటియా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. సమీపంలోని కథ్‌గోదామ్ రైల్వేస్టేషన్ గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. దూర్రపాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం... పంత్ నగర్. ఇది రాణీఖేత్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

స్విట్జర్‌లాండ్ ఆఫ్ ఇండియా... కౌసని
ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన పూలలోయ కౌసనికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 10 కిలోమీటర్ల పొడవు, 12 కిలోమీటర్ల వెడల్పుతో పరుచుకున్న ఈ ఫ్లవర్ వ్యాలీ చూపరులను కట్టిపడేస్తుంది. దీనిని సాక్షాత్తు దేవభూమిగా పిలుస్తారు. ఇవేకాకుండా పంచ్ కేదార్, క్యారీ పాస్, బిన్సర్, ముక్తేశ్వర్, రూప్‌కుండ్‌లు కౌసని ని దేశంలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మలిచాయి. ఇప్పుడిప్పుడే అడ్వెంచర్ టూరిజం ఇక్కడ ఊపందుకుంటుంది. ప్రకృతి అందాలకు నెలవైన ఈ ప్రదేశంలో రివర్ రాఫ్టింట్, పారా గ్లైడింగ్, మౌంటెనేరింగ్, ట్రెక్కింగ్ లాంటి సదుపాయాలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ హిందీ కవి సుమిత్రనందన్ పంత్ జన్మస్థలం అయిన కౌసనిలోని హిల్ స్టేషన్లు, కఫ్నీ హిమనీ నదాలు, సుందర్‌దూంగా, సోమేశ్వర్, పినాకేశ్వర్, బైజ్‌నాథ్, లక్ష్మీ ఆశ్రమ్ వంటి వాటితో ఇండియన్ స్విట్జర్‌లాండ్‌గా పేరుగాంచింది.

మినీ కాశ్మీర్... పితోర్‌గఢ్
చాంద్ రాజుల కాలంలో దేవలయాల నగరంగా విరాజిల్లిన ఈ ప్రాంతంలో కనువిందు చేసే అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఈ నగరాన్ని సోర్ వ్యాలీ... అని, మినీ కాశ్మీర్ కూడా పిలుస్తారు. అశుర్ చులా, ఆస్కోట్ శాం క్చరీలు... చందక్ పర్వత సానువులు... మను, ధ్వజ్, తల్ కేదార్, నకులే శ్వర (దేశంలో నకుల సహదేవుల ఏకైక ఆలయం) దేవాలయాలు... లాంటి అనేక ప్రదేశాలతో, చుట్టూ పచ్చదనంతో అలరారుతోంది పితోర్‌గఢ్.

ఎడోబ్ ఆఫ్ గాడ్స్
వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ప్రదేశంలో ఎంతోమంది ఋషులు, మునులు నివసించారని ప్రతీతి. అంతేకాకుండా సకల పాపాలను దూరంచేసే పవిత్ర గంగా యమున మహానదులకు పుట్టినిల్లు ఉత్తరాఖండ్. ఏటా గంగోత్రి, యమునోత్రి ప్రదేశాలను సందర్శించే యాత్రికుల సంఖ్య లక్షల్లో ఉం టుంది. ఈ నదుల పరీవాహక ప్రదేశాలైన బద్రీనాథ్ (విష్ణుమూర్తి ఆలవాలం), కేదార్‌నాథ్ (శివుడి నివాసం) లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలతో అలరారుతుంది. అంతేకాదు, ఋషికేష్, ప్రయాగ, హరిద్వార్ లాంటి ప్రదేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు.

దేశంలో అతిపెద్ద హిందూ ఉత్సవంగా పేరుగాంచిన మహాకుంభ మేళా ఇక్కడ హరిద్వార్ లోనే జరుగు తుంది. ప్రతి పన్నెండు ఏళ్ళ కొకసారి జరిగే ఈ ఉత్సవానికి దేశంలోని అన్ని ప్రాంతాలనుండే కాకుండా ప్రపంచం నలుమూల నుండి భక్తులు తండో పతండాలుగా విచ్చేస్తారు. ఇలా ఆధ్యా త్మిక ప్రదేశాలకు ఆలవాలంగా ఉన్న ఈ ప్రదేశాన్ని దేవతల నివాసంగా పిలుచు కుంటారు. వేలాది సంవత్సరాలుగా భక్తులను ఆకర్షి స్తున్న పుణ్య క్షేత్రాలు బద్రీనాథ్, కేదార్ నాథ్, ఋషికేష్ లాంటి పుణ్యక్షేత్రాలే కాకుండా బ్రిటీష్‌కాలం నుండి ముస్సోరీ, ఆల్మోరా, రాణీకేత్ లాంటి పర్యాటకకేం ద్రాలు సందర్శకులకు మంచి ఆకర్షణలుగా అభివృద్ధి చెందాయి. ఉత్తరా ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమైన ఆర్థికవనరు ఆ రాష్ట్ర టూరిజం అంటే అతిశయోక్తికాదు.

గేట్‌వే ఆఫ్ గంగోత్రి... ముస్సోరీ
పవిత్ర గంగా, యమునా నదుల జన్మస్థలాలైన గంగోత్రి, యమునోత్రిలకు వెళ్ళాలంటే ఈ ముస్సోరీ నుండే వెళ్ళాలి. అందుకే దీనిని గేట్‌వే ఆఫ్ గం గోత్రి, యమునోత్రి అని పిలుస్తారు. ముస్సోరీ అనే పేరు చెట్ల నుండి వచ్చింది. ఎటు చూసినా ఇక్కడ ముస్సోరీ వృక్షాలు కని పిస్తాయి. ఇక్కడ అన్ని టికంటే చెప్పు కోవాల్సిన ప్రదే శం గన్‌హిల్ దేశంలోనే రెండో ఎత్తైన పర్వతసాణువు ఇది. గన్ హిల్‌పై రోప్ వే ప్రయాణం జీవితంలో మరిచి పోలేని మధురా నుభూతిని అందిస్తుంది. ఇవేకా కుండా నాగ్ దేవత ఆల యం, ముస్సోరీ సరస్సు, సర్ జార్జ్ ఎవరెస్ట్ హౌజ్, భట్టాపాల్, కెంఫ్టీ ఫాల్ ఇక్కడ చూడ దగ్గ ప్రదేశాలు. ఢిల్లీ, డెహ్రా డూన్‌ల నుండి ఇక్కడి రవాణా సదుపాయాలున్నాయి.

హిమశిఖరం.....ఉత్తరాఖండ్

 
హిమాలయాల ఒడిలో పర్యాటకుల మనసు దోచుకుంటున్న ఉత్తరాఖండ్ వేసవి విహారం... వారి మదిలో చిరకాలం గుర్తుండిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉత్తరాఖండ్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది డెహ్రాడూన్. కానీ, ఇప్పటిదాకా భయటపడని ఎన్నో అందాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రకృతి అందాలతో పర్యాటకులను పరవశుల్ని చేయడమే కాదు సంస్కృతీ సాంప్రదాయల్లో కూడా ఉత్తరాఖండ్ ఎంతో పేరెన్నికగన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కుంభమేళ. అంతేకాకుండా మనదేశంలో గోల్ఫ్ ఆటకు అనువైన ప్రదేశాలలో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. 'కోర్బట్ నేషనల్ పార్క్ అండ్ టైగర్ రిజర్వ్'... అంతరించిపోతున్న మన జాతీయ జంతువు పెద్దపులికి ఇష్టమైన నివాసం. అంతేకాకుండా పర్వాతారోహలకు ఎంతో ఇష్టమైన పర్వతశిఖారాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అలాంటి వాటిలో 'నందాదేవి పీక్' ప్రముఖమైనవి. జాతీయ వింతలు 'వాలీ ఆఫ్ ఫ్లవర్స్', 'నందాదేవీ జాతీయ ఉద్యానవనం' లాంటి ప్రదేశాలు తప్పకుండా చూసి తీరాల్సిందే. 'యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్'లు గా గుర్తింపు సంపాదించుకున్న ఈ ప్రదేశాలు పర్యాటకులను ఆకట్టుకోవడంలో ముందువరుసలో నిలుస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సందర్శకుల మనసుదోచే ఇలాంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ అనేకం ఉన్నాయి.

సరస్సుల నగరంగా గుర్తింపు పొందిన నైనితాల్ లో ఒకప్పుడు సుమారు 60కి పైగా చెరువులు, సరస్సులు ఉండేవట. ఇందులో 'నైనీ' అనే సరస్సు ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మహాఋషులు, మునులు నివాసం ఉన్నట్టు స్కందపురా ణంలో ఉంది. నైనితాల్ సరస్సును 'ట్రై రిషి సరోవర్' (ముగ్గురు ఋషుల సరోవరం) కూడా పిలుస్తారు. అత్రి, పులస్త్య, పులహ అనే మహాఋషులు... నీరు దొరకకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నైనితాల్‌లో ఒక సరస్సు నిర్మించాలని తలపెట్టారు. అలా ఒక లోతైన గుంతను తవ్వి... టిబెట్ దగ్గర ఉన్న పవిత్ర మానస సరోవరం నుండి నీటిని తెచ్చి నింపారని ప్రతీతి. అలా ఏర్పడిందే నేడు మనం చూస్తున్న నైనితాల్ సరస్సు. ఈ సరస్సులో స్నానం చేస్తే సాక్షాత్తు ఆ మానస సరోవరంలోనే స్నానమాచరించినంత పుణ్యం దక్కుతుందట. దేశంలో ఉన్న 64 శక్తిపీఠాలలో నైనితాల్ కూడా ఒకటి. 64 ముక్కలైన పార్వతీ దేవి శరీరభాగాల్లో ఆమె కన్ను ఈ ప్రాంతంలో పడిందట. అలా ఈ ప్రాంతానికి నైనితాల్ (హిందీలో నయన్ అంటే కన్ను) అనే పేరు వచ్చిందని ప్రతీతి. అందుకే ఆ శక్తి స్వరూపిణిని ఇక్కడ నైనాదేవి పేరుతో పిలుస్తారు. నైనాదేవీ ఆలయం దేశంలోని శక్తిపీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. పర్యాటకులు ఇక్కడి చేరుకోవాలంటే... దగ్గరి విమానాశ్రయం పంత్‌నగర్. ఇది నైనితాల్‌కు 71 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. రైలుమార్గం ద్వారా చేరుకునే పర్యాటకులు కథ్‌గోదామ్ రైల్వే స్టేషన్ గుండా వెళ్ళవచ్చు (ఈ స్టేషన్ నైనితాల్‌కు 31 కి.మీ).

 
ఉత్తరాఖండ్‌లో పచ్చదనంతో మైమరిపించే మరో ప్రదేశం ఆల్మోరా. ఇక్కడి ప్రకృతి పచ్చదనానికి పరవశించని పర్యాటకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రశాంత వాతారణంతో కొండకోనలతో అలరారుతున్న ఈ ప్రాంతాన్ని చూస్తే ప్రకృతీమాత తన నైపుణ్యాన్నంతటినీ రంగరించి మరీ తీర్చిదిద్దిందా అనిపిస్తుంది. కోశీ, సుయాల్ నదుల ప్రవాహం ఆల్మోరాకు మరింత అందాన్ని చేకూర్చింది. ఆల్మోరా ప్రకృతి అందాలతోనే కాదు, ప్రముఖుల నివాసాలతో ప్రసిద్ధిగాంచింది. స్వామీ వివేకానంద తన హిమాలయాల పర్యటనలో ఆల్మోరాను తాత్కాలిక విడిదిగా ఎంచుకున్నారట. అలా ఆయన కొన్నాళ్ళు ఇక్కడే గడిపాడట. అంతేకాకుండా స్వాతంత్య్ర సమరయోధుడు గోవింద్ వల్లభ్ పంత్, ప్రముఖ హిందీ విద్వాంసుడు సుమిత్రానందన్ పంత్, నోబెల్ గ్రహీత సర్ రొనాల్డ్ రాస్‌లకు జన్మస్థలం ఆల్మోరా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా తన బాల్యంలో కొంతకాలాన్ని ఇక్కడే గడిపాట. ధోని తండ్రికి రాంచీలో స్థిరపడక మునుపు ఇక్కడ ఫామ్‌లు ఉండేవట. ఇక్కడి చేరుకోవాలంటే నైనితాల్‌కు మాదిరిగానే పంత్‌నగర్ విమానాశ్రయం నుండి చేరుకోవాలి. రైలుమార్గం గుండా వచ్చే పర్యాటకులు కోథ్‌డామ్ రైల్వేస్టేషన్ నుండి చేరుకోవచ్చు.

మనదేశంలో గోల్ఫ్ ఆటకు సంబంధింన మైదానాలకు మారుపేరు రాణీఖేత్. ఎటుచూసిన పచ్చని తివాచీ పరిచనట్లుండే ఈ ప్రాంతంలో 9 మౌంటేన్ గోల్ఫ్ లింక్‌లు ఉన్నాయి. ఓక్ అడవుల్లో విస్తరించి ఉన్న ఈ గోల్ఫ్ కోర్స్‌లు పర్యాటకులను ఇట్టే కట్టిపడేస్తాయి. చలికాలంలో మంచు దుప్పటి పరుచుకున్నట్లుండే ఈ ప్రదేశం వేసవిలో మాత్రం సైనిక స్థావరంగా సేవలందిస్తుంది. ఇవేకాకుండా ఝులా దేవి ఆలయం, చౌభాటియా ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు. సమీపంలోని కథ్‌గోదామ్ రైల్వేస్టేషన్ గుండా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం... పంత్ నగర్. ఇది రాణీఖేత్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అందమైన ప్రకృతి ప్రాంతం పట్టిసీమ

పట్టిసీమ గ్రామం నుంచి కొద్ది దూరంలో గోదావరిలో దేవకూట పర్వతంపై వెలసిన వీరభద్రస్వామి, భావనారాయణ స్వామి వార్ల ఆలయాల వల్లే ఈ ఊరికి పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఆలయ విశేషాలు : 
పాపికొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న కొండపై ఈ వీరభద్రస్వామి దేవస్థానం కొలువై ఉంది. చుట్టూ గోదావరి మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం గంభీరంగానూ, అందంగానూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే దాదాపు అన్ని కాలాల్లో ఇక్కడ సినిమా షూటింగ్‌లు సైతం జరుగుతుంటాయి. పట్టిసం అని, పట్టిసీమ అని రెండు రకాలుగా పిలిచే ఈ ఊరిలో వెలసిన వీరభద్రస్వామి ఆలయం మరీ అంత పెద్దది కాకపోయినా సమీప గ్రామాల్లో ఈ ఆలయం అంటే విశేషమైనదిగానే పేరు పొందింది. ఏడాది మొత్తంలో జరిగే చిన్నా చితకా ఉత్సవాలతో పాటు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు చుట్టూ ఉన్న ఊర్ల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

వసతి సౌకర్యాలు :
కొంతకాలం క్రితం వరకు ఈ వీరభద్రస్వామి దేవస్థానం అంతగా అభివృద్ధి చెందని కారణంగా ఇక్కడ సౌకర్యాలు సైతం అరాకొరగానే ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో దేవస్థానంకు రాబడి పెరిగిన కారణంగా విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా దేవాలయం ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్కడ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

రవాణా సౌకర్యాలు: 
తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ నగరమైన రాజమండ్రి నుంచి ఈ పట్టిసీమ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి పట్టిసీమకు ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రకృతినీ ఆస్వాదిస్తూ వెళ్లాలనుకునే వారికి రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య ప్రవహించే గోదావరిపై ప్రయాణించే లాంచీలు కూడా అందుబాటులో ఉన్నాయి.


 
పట్టిసీమ భావనారాయణ స్వామి
పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలలో పట్టిసీమ భావనారాయణ స్వామికి ఎంతో విశిష్టత వుంది. ఇక్కడి భావనారాయణ స్వామికి యుగయుగాల నాటి చరిత్ర వుంది. శ్రీ మన్నారాయణుడి అనుగ్రహాన్ని కోరుతూ జాంబవంతుడు తపస్సు చేయగా, ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామిగా అవతరిస్తానని స్వామి మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కృతయుగంలో స్వామి వైకుంఠంలో అమ్మవారితో ముచ్చటిస్తూ వుండగా, ఒక ఏనుగు ఆర్తనాదం వినిపించింది. దాహం తీర్చుకోవడం కోసం ఒక ఏనుగు సరస్సులోకి దిగగా, దాని కాలును ముసలి గట్టిగా పట్టుకుంటుంది. తన శక్తినంతటిని ఉపయోగించి ఆ ఏనుగు దాని బారి నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తోంది. తన శక్తి నశిస్తూ ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో శ్రీ మహా విష్ణువును ప్రార్ధిస్తుంది. ఆ అరుపులోని భావనను బట్టి ఆ ఏనుగు ఎంతగా బాధపడుతుందో శ్రీ మహావిష్ణువు అర్థం చేసుకున్నాడు. ఆ మూగ జీవాన్ని రక్షించాలనే తాపత్రయంతో శంఖు చక్రాలను కూడా మరిచిపోయి కంగారుగా ఆ సరస్సు దగ్గరికి చేరుకొని ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆర్తుల మనసులోని భావనను బట్టి వారిని రక్షించే స్వామి కావడంతో భావనారాయణ స్వామిగా భక్తులు కొలుస్తుంటారు. ఏనుగును కాపాడే హడావిడిలో స్వామి ఉన్న సమయంలో, నారద మహర్షి ఆయన శంఖు చక్రాలను తీసుకు వచ్చి ఇచ్చాడు. ఏనుగును కాపాడే ఆదుర్దాలో స్వామి వాటిని అపసవ్యంగా ధరించాడు. నేటికీ స్వామి ఇదే ముద్రలో ఇక్కడ దర్శనమిస్తుంటాడు. జాంబవంతుడికి ఇచ్చిన మాటమేరకు స్వామి ఇక్కడ 'దేవకూట పర్వతం'పై శ్రీ భూనీలాదేవి సమేతుడై వెలిశాడు. ఇలా కృతయుగంలో ఆవిర్భవించిన స్వామి ఎందరో మహర్షులచే దేవతలచే పూజలందు కున్నాడు.

కలియుగంలో కూడా ఎందరో మహానీయులచే ఆరాధించబడిన స్వామికి చోళ రాజులు ఆలయాన్ని నిర్మించగా, రెడ్డి రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. భక్తుల భావనను గ్రహించి వారి కోరికలను స్వామివారు సత్వరమే నెరవేరుస్తాడని స్థానికులు చెబుతుంటారు. ప్రతియేటా స్వామివారికి చైత్ర శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరిస్తుంటారు.

మంచి కాఫీలాంటి మడికేరి

భారతదేశపు స్కాట్లాండ్‌గా పేరుగాంచిన కూర్గ్ లేదా మడికేరి, కొడగు జిల్లా కేంద్రంగా బాసిల్లుతూ ఉన్నది. సముద్ర మట్టానికి 1525 మీటర్ల ఎత్తున ప్రకృతి ఒడిలో ప్రభవించిన కూర్గ్, బెంగుళూరు నగరానికి 252 కి.మీ.ల దూరంలో ఉంది. ఏటవాలు పర్వతంపై చిక్కటి అరణ్యాన్ని పాదుకున్న కూర్గ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, దట్టమైన అడవి, వేల ఎకరాల మేర విస్తీర్ణంలో ఆవరించుకున్న టీ మరియు కాఫీ తోటలు, నారింజ తోటలు... ఊపిరి సడలనివ్వని సుందర దృశ్యాలతో మరిచిపోలేని విరామ విడిదిగా మడికేరి అలరారుతున్నది. అంతేకాదు... ఇక్కడ స్థానికంగా గల దర్శనీయ స్థలాలు మడికేరికి అదనపు ఆకర్షణను చేకూరుస్తున్నాయి.

సూర్యాస్థమయ వీక్షణం: 
శతాబ్ద కాలానికిపైగా చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న మడికేరి కోటలో దేవాలయం, ప్రార్థన మందిరం, చెరసాలలతో పాటు చిన్నపాటి పురావస్తు ప్రదర్శన శాల ఉన్నాయి. ఇక రాజాస్థానం గురించి చెప్పాలంటే, కొడగు రాజులు తమ సాయంత్రాలను ఇక్కడే గడిపేవారని వినికిడి. రాజాస్థానం నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షించడం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. మడికేరిలో ప్రత్యేకించి సందర్శించవలసినదిగా నాగర్‌హోళె జాతీయ ఉద్యానవనం పేరొందినది. ఏనుగులు, పులులు, చుక్కల జింకలు, అడవి దున్నపోతులు తదితర సమస్త జంతు జాలాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం రాత్రిపూట కూడా బసచేసే ఏర్పాట్లు ఉద్యానవనంలో ఏర్పాటు చేశారు. మడికేరి సమీపంలో పర్యాటకులను, సినీజనాన్ని అమితంగా ఆకర్షించే అబ్బీ జలపాతం, భాగమండల మరియు కావేరీ నదీ జన్మస్థానమైన తలకావేరీలు పర్వతాలతో ఆవృతమై నేత్రానందం కలిగిస్తున్నాయి.

రామలక్ష్మణులు సంచరించిన ప్రాంతం: 
సీతాదేవిని వెదుకుతూ రామలక్ష్మణులు సంచరించినదిగా చెప్పబడే ఇరుప్పు జలపాతం, అటవీశాఖకు చెందిన ఏనుగులను పట్టుట మరియు శిక్షణా కేంద్రమైన దుబరే, ఇక్కడకు 30 కి.మీల దూరంలోని కావేరీ నదీ నిలువ నీళ్ళతో మనసుకు ఉల్లాసాన్ని కలిగించే వలనూర్, కావేరి, కనిక మరియు సుజ్యోతి నదులు సంగమించే భాగమండల, ప్రశాంతతకు ఆలవాలమైన నిసర్గధామ పర్యాటక స్థలాలు ప్రకృతి రమణీయతకు పట్టం కడుతున్నాయి.

వసతి సౌకర్యాలు : 
రోడ్డు మార్గం ద్వారా మాత్రమే ఇక్కడకు చేరుకోగలము. ఇక్కడకు రైలు మరియు విమాన సౌకర్యం లేదు. బెంగుళూరు, మైసూరు, మంగళూరు, కన్ననూరు మరియు తెల్లిచెర్రి నుంచి మడికేరికి బస్సు సౌకర్యం కలదు. సుందర పర్వత ప్రాంతమైన మడికేరిలో బస చేసేందుకు హోటళ్ళు ఉన్నాయి. కూర్గ్‌లో ఎటు చూసినా పచ్చదనం పరుచుకుపోయి కనిపిస్తుంది. గలగల పారే సెలయేర్లు, నదులు , కొండలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక జలపాతాలంటారా మనసును ఎక్కడికో తీసుకుపోతాయి. యువత ఇష్టపడే ట్రెక్కింగ్, రిఫ్టింగ్, వన్యప్రాణులు, రక రకాల పక్షులను ఇక్కడ చూడొచ్చు. దేవాలయాలు, బౌద్ధ ఆరామాలు, కోటలు కూర్గ్‌లో కనిపిస్తాయి. ఇన్ని అందాలకు నెలవైన కూర్గ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...

 
అందమైన హిల్ స్టేషన్ కూర్గ్: 
దక్షిణ భారతదేశంలో కూర్గ్ అందమైన హిల్ స్టేషన్. బెంగుళూరుకు 252 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. సముద్రమట్టానికి 1525 మీటర్ల పైగా ఎత్తులో ఉండి దేశ విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులనెందరినో ఆకట్టుకుంటోంది. కూర్గునే కొడగు అని కూడా అంటారు. నిజానికి దీనిని పూర్వం కొడైమాలనాడు అని పిలిచేవారు. ఎత్తౖన కొండమీదున్న దట్టమైన అడవులు అని దీని అర్థం. ఇది దాదాపు 3000 నుంచి 4000 అడుగుల ఎత్తు ఉంటుంది. కొడగు లేదా కూర్గ్‌కు మడికెరి హెడ్‌క్వార్టర్స్. పచ్చటి ప్రకృతి, జలపాతాలు, వన్యమృగాలు, పక్షులకు కూర్గ్ నిలయం. అంతేకాదు ఇక్కడ కాఫీ, టీ ప్లాంటేషన్లు కూడా బాగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతోంది. కొడగులో మూడు తాలుకాలున్నాయి. అవి మడికెరి, విరాజ్‌పేట్, సోమ్‌వారప్పేట్. ఈ ప్రాంతాలన్నీ పచ్చటి లోయలతో, ఎత్తౖనకొండలతో, సెలయేర్లతో కనులవిందు చేస్తాయి.

హనీమూన్ జంటలకు కనువిందు: 
పొగమంచునిండిన పచ్చటి అడవుల అందాలు చెప్పనక్కర్లేదు. కూర్గ్ చరిత్ర కూడా ఎంతో విశిష్టమైంది. ఈ ప్రాంతాన్ని ఎందరో రాజవంశీయులు పరిపాలించారు. ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న పలు రాజవంశస్థులు అంటే కదంబాలు, గంగాలు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హోయసలలు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించిన వారిలో ఉన్నారు. కూర్గ్ హానీమూన్ జంటలకు ఎంతో బాగుంటుంది. అలాగే వేసవిలో గడపడానికి వచ్చేవారికి కూడా ఇది మంచి ప్రదేశం. ఇక సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చే కుర్రకారైతే ఈ ప్రదేశంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి జలపాతాలను జులై సెప్టెంబరు నెలల మధ్యలో చూస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ఇక్కడి మాన్‌సూన్ సీజన్ సాహసప్రియులకు ఎంతో అనుకూలమైనది. ఆ టైములో రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. కూర్గ్‌కి సమీపంలో బైలకుప్పె అనే ప్రాంతం ఉంది. ఇది దక్షిణాదిలోనే అతి పెద్ద టిబెట్ సెటిల్‌మెంట్. ఇది మడికెరి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కూర్గ్‌కు 94 కిలోమీటర ్ల దూరంలో నగర్‌హోలె నేషనల్ పార్క్ ఉంది. ఇది కూడా చూడాల్సిన ప్రాంతం. ఇది అతి పెద్ద వన్యప్రాణుల పార్కు. ఇక్కడ పులులు, ఏనుగులు, నీటిగుర్రాలు, తోడేళ్లు వంటివెన్నో జంతువులు కనిపిస్తాయి. అంతేకాదు 250 రకాల పక్షులు అందులో ఉన్నాయి. ప్రత్యేకంగా బర్డ్ వాచింగ్ చేసేందుకు ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఎందరో ఉన్నారు.

చూడాల్సిన ప్రదేశాలెన్నో : 
కూర్గ్ అందాలు వర్ణించలేనంత బాగుంటాయి. అక్కడ అడుగుపెట్టగానే భూలోకస్వర్గంలా అనిపిస్తుంది. దీన్ని స్కాట్‌లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు. బెంగుళూరు లేదా మంగళూరు నుంచి టాక్సీలో కూర్గ్‌కి వెడితే దారిపొడుగునా ఎన్నో ప్రకృతి అందాలను చూడొచ్చు. కూర్గ్‌లో ఎక్కడ చూసినా పచ్చదనమే. పొగమంచుతో కప్పబడిన కొండలు చూస్తుంటే మబ్బుల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాదు అక్కడ చిక్కటి అడవులు దర్శనమిస్తాయి. అడవిలోని రకరకాల మూలికా వృక్షాల వాసనలు అంతటా వ్యాపించి ఉంటాయి. ఎటు చూసినా కాఫీ ప్లాంటేషన్లు కనుల విందుగా కనిపిస్తుంటాయి. అక్కడి ప్రకృతి ఎంత స్వచ్ఛమైనదో కూర్గ్‌లోని ప్రజలు కూడా అంత స్వచ్ఛమనస్కులు. అక్కడి కొడవాలు ఎంతో స్నేహంగా ఉంటారు. విందు వినోదాలంటే వారికెంతో ఇష్టం. .

కావేరీ జన్మస్థలం: 
కూర్గ్‌లో చూడాల్సిన మరో ప్రాంతం తలకావేరీ. కావేరి నదికి మూలం ఇదే. 4,500 అడుగుల ఎత్తు నుంచి ఇది ప్రవహిస్తుంది. ఇది మడికెరి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం కన్నులు చెదిరేంత అందంగా ఉంటుంది.

అబ్బీ ఫాల్స్ ఇంకొకటి. దీన్నే జెస్సీ ఫాల్స్ అని కూడా అంటారు. అబ్బి అంటే స్థానిక కొడగు భాషలో జలపాతం అని అర్థం. మడికెరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. కూర్గ్ హిల్‌స్టేషన్‌కు వచ్చిన పర్యాటకులు దీన్ని చూడకుండా వెళ్లరు. ఈ జలపాతంలో వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీని శబ్దం రోడ్డు మీదకు వినిపిస్తుంది.

ఇంకో ప్రసిద్ధి చెందిన జలపాతం ఇరుప్పు ఫాల్స్. నాగర్‌హోల్ వెళ్లే దారిలోని విరాజ్‌పేట నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దానికి దగ్గరలోనే లక్ష్మీతీర్థ నది ప్రవహిస్తుంటుంది. ఇరుప్పు ఫాల్స్‌లో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని స్థానిక ప్రజల విశ్వాసం. శివరాత్రి రోజు తప్పనిసరిగా ఇక్కడకు వచ్చి స్నానాలాచరిస్తారు.

ఓంకారేశ్వర దేవాలయం: 
కూర్గ్‌లో చూడాల్సిన గుడి ఓంకారేశ్వర దేవాలయం. ఇందులో శివునికి పూజలు చేస్తారు. ఈ దేవాలయం ఇస్లామిక్, గోథిక్ స్టైల్ ఆర్కిటెక్చర్‌లో కట్టారు. గుడి గోపురం మీద వాతావరణాన్ని తెలిపే బంతి ఆకారంలో ఉన్న క్లాక్ నిర్మాణం ఉంటుంది.

ఇక రాజాస్ సీట్ వచ్చి అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్ని ఆవిష్కరిస్తుంది. ఎంతో అందమైన వ్యూ పాయింట్ ఇది. దీని నుంచి చుట్టూరా పరచుకున్న అడవులు, అందమైన సూర్యాస్తమయం చూడాలంటే రెండు కళ్లు చాలవు. కొడగు రాజులు ఇక్కడకు వచ్చి సాయంత్రాలు విశ్రాంతిగా గడిపేవారట. భాగమందాలా ఇక్కడ చూడాల్సిన మరో ప్రాంతం. దీన్ని టెంపుల్ టౌన్‌గా కూడా పేర్కొంటారు. కావేరి, కనిక, సుజ్యోతులనే మూడు నదుల కలిసిన చోట భాగమందాలా ఉంది. ఇక్కడ మడికెరి ఫోర్టును కూడా చూడొచ్చు. ఈ కోటను 19వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ఒక మ్యూజియం, జైలు, దేవాలయం, చర్చి ఉన్నాయి. కూర్గ్‌లో వెలనూర్ అనే అందమైన హామ్లెట్ ఉంది. ఇది దుబారే అడవికి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది.

అక్కడ ఒక వైపు అడవులుంటే మరోవైపు కావేరీనది ప్రవహిస్తుంటుంది. ప్రకృతి ప్రేమికులకు, ఫిషింగ్ ఇష్టపడేవారికి ఇది ఎంతో నచ్చే ప్రదేశం. మడికెరికి 22 కిలోమీటర్ల దూరంలో అవందూర్ ఫాల్స్ ఉన్నాయి. ఎన్నో చిన్న ఏరులు కలిసిన జలపాతం ఇది. ఈ జలపాతం అవందూర్ అడవిలో ఉంది కాబట్టి దీనికి అవందూర్ ఫాల్స్ అని పేరొచ్చింది. కోటెబెట్టా కొడగు జిల్లాలోని మరో అతిపెద్ద శిఖరం. సముద్రమట్టానికి 5,400 అడుగుల ఎత్తులో ఇది ఉంది. కోటెబెట్టా మడపూర్‌లో ఉంది. మడికెరికి 22 కిలోమీటర్ల దూరంలో మడపూర్ ఉంది. కూర్గ్‌లో ఇది ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలమైన ప్రదేశం. అక్టోబరు మార్చి నెలల మధ్యలో ఇక్కడ ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బైలకుప్పెతోపాటు చూడాల్సిన మరో ప్రదేశం సిద్దాపురా. బైలకుప్పెలో ఎన్నో బౌద్ధ ఆరామాలు ఉన్నాయి.

గోల్ఫ్ కోర్సులు: 
ఇక అక్కడి ల్యాండ్‌స్కేప్ అందాలైతే చూడాల్సిందే గాని చెప్పలేం. సిద్దాపురా ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు కొడవ, కన్నడ, ఇంగ్లీషు భాషలు మాట్లాడతారు. ఇంకో విశేషమేమిటంటే కూర్గ్‌లో ఇండియా మొత్తంలో అధిక సంఖ్యలో గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. వీటన్నింటినీ మీకు చూడాలని ఉందా... మరెందుకు ఆలస్యం సెలవుల్లో కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి మరి....కూర్గ్‌కు ఏ సీజన్‌లోనైనా వెళ్లొచ్చు. కానీ బెస్ట్ టైమ్ అంటే మాత్రం సెప్టెంబరు, మార్చినెలల మధ్య సమయమే. అకామడేషన్‌కు కూడా ఇబ్బంది లేదు. అన్ని రకాల కస్టమర్లకు తగిన వసతి సదుపాయాలు అక్కడ లభ్యమవుతాయి. లగ్జరీ హోటల్స్‌తోపాటు హిల్ రిసార్ట్స్ కూడా ఉంటాయి. మధ్యతరగతివారికి వీలుగా మీడియం ధరలకే ఎకానమీ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా క్యాంప్స్, హోంస్టేస్ కూడా ఉన్నాయి.

చూడాల్సిన ప్రదేశాలు: 
రాజాస్ సీట్, ఓంకారేశ్వర టెంపుల్, మడికెరి కోట, అబ్బీ ఫాల్స్, గడ్డిగె, బైలెకుప్పె, తలకావేరి, బారాపోలె రివర్, సోమ్‌వారప్పేట్

కూర్గ్‌కు మార్గాలు
బెంగుళూరు నుంచి కూర్గ్‌కు దగ్గర.
హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు బస్ సౌకర్యం ఉంది. ప్రయాణం 14 గంటలు పడుతుంది. ఇండివిడ్యువల్ ట్రావలెర్స్‌కు ఇది సౌకర్యంగా ఉంటుంది.
వైజాగ్ నుంచి కూర్గ్‌కు దూరం 1282 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా ప్రయాణం చేయడానికి 21 గంటలు పడుతుంది.

కూర్గ్‌కు దగ్గరలో మైసూర్ రైల్వే స్టేషన్ ఉంది. బస్సు, వాహనాల సౌకర్యం కూడా అందుబాటులో ఉంటాయి.
కూర్గ్ హైదరాబాద్‌కు 797 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ రైలు సౌకర్యం ఉంది. మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి కూర్గ్ 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కూర్గ్‌కు నేరుగా ఫ్లైట్ సర్వీసులు లేవు. బెంగుళూరు లేదా మంగళూరు వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కూర్గ్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఫ్లైట్‌లో వెళ్లాలను కుంటే హైదరాబాద్ నుంచి మంగళూరు వరకూ వెళ్లాలి. మంగళూరు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో కూర్గ్ ఉంది. హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఫ్లైట్‌లో వెళ్లాలనుకునే వాళ్లకు టికెట్ ఖర్చు 2,291 రూపాయలతో మొదలవుతుంది. వైజాగ్ నుంచి కూర్గ్‌కు ఫ్లైట్ డిస్టెన్స్ 994 కిలోమీటర్లు. వైజాగ్ నుంచి మంగుళూరు ఫ్లైట్‌లో వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ 2,938 రూపాయల నుంచి ఉంటుంది. వైజాగ్ నుంచి బెంగుళూరు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ 3,607 రూపాయల నుంచి ఉంటుంది.

లింగరాజు ఆలయం






లింగరాజు ఆలయం

ఒరిస్సా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని అతి పెద్ద దేవాలయం లింగరాజ దేవాలయం. లింగానికి రాజైన శివుని గుడి ఇది. ఇక్కడ శివుణ్ణి త్రిభువనేశ్వరుడనే పేరుతో పూజిస్తారు. దీనిని 1100 ఏళ్ల క్రితం నిర్మించారు. దీని ఎత్తు 180 అడుగులు. కళింగుల నిర్మాణశైలికి ఈ కట్టడం అద్దం పడుతుంది. ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్‌ని విశ్లేషించడం అంటే...గోల్డెన్ ట్రయాంగిల్‌ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు తెలుసుకోవాలి. అందులో ఒకటి భువనేశ్వర్ లోని లింగరాజ ఆలయం. తర్వాత పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఒడిషలో ప్రముఖ పర్యాటక కారకాలుగా చెప్పుకోదగినవి.

ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ సోమ వంశీయుడయిన కేసరి అనే రాజు 11వ శతాబ్దంలో నిర్మించి ఉంటాడని భావిస్తున్నారు. చారిత్రక ఆధారాలను బట్టి కేసరి తన రాజధానిని జైపూర్ నుంచి భువనేశ్వర్‌కి మార్చినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయం నాల్గు భాగాలుగా ఉంటుంది. వీటిలో ప్రధాన ఆలయం, యజ్ఞశాల, భోగ మండపం, నాట్యశాలలు ఉంటాయి.

లింగాలకు రాజు:
లింగరాజ అనగా లింగాలకు రాజు అనే అర్థము. ఈ ఆలయంలోని లింగమునకు త్రిభువనేశ్వర అనే పేరుగలదు. ఈ ఆలయం దాదాపు 1100 సంవత్సరాలకు ముందర నిర్మించబడినది. కానీ ఈ ఆలయ నిర్మాణం 6వ శతాబ్దంలోనే జరిగిందని చెప్పడానికి ఆలయం వద్ద నున్న శిలాశాసనాలపై చెక్కబడిన సంస్కత లిపి సాక్ష్యంగా ఉన్నది.

నిర్మాణ శైలి:
లింగరాజ ఆలయం నిర్మాణ పటం - పై నుండి కిందికి విమాన (గర్భగుడి కలిగిన నిర్మా ణం), జగమే హన (అసెంబ్లీ హాల్), నటమందిర (వేడుకలు జరిపే గది) మరియు భోగమండప (సంతర్పణల గది) ఈ ఆలయం భువనేశ్వర్ నగరంలోని అన్ని ఆలయాలలో కెల్లా పెద్దది. జేమ్స్ ఫెర్గుసన్ (1808 18 86), అనే చరిత్ర పకారుడి అభిప్రాయం ప్రకారం ఈ ఆలయం భారతదేశంలోని గొప్ప హిందూ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం చుట్టూ విశాలమైన ప్రహరీ ఉన్నది.

ఒడిష గోల్డెన్ ట్రయాంగిల్:
గోల్డెన్ ట్రయాంగిల్‌ని రూపొందించే మూడు ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి, భువనేశ్వర్‌లోని లింగరాజ ఆలయం, పూరిలోని జగన్నాధ ఆలయం, కోణార్క్‌లోని సూర్యదేవాలయం ఒడిషలో ప్రముఖ పర్యాటక కారకాలు. భువనేశ్వర్ యాత్ర ప్రయాణాన్ని ఒడిషలో ప్రారంభించడం ఖచ్చితమైన మార్గం. ఈ నగరం వందకంటే ఎక్కువ ఆలయాలను అందిస్తుంది వాటిలో అనేకమైనవి గొప్ప చారిత్రిక సంబంధం కలిగి ఉన్నాయి.

ఒడిష తరువాత పూరి మరో గమ్యస్థానం. పూరి భారత దేశంలోని పవిత్ర చార్‌దామ్‌లలో ఒకటి. మరో మూడు ద్వారకా, బద్రినాద్, రామేశ్వరం. ఆశక్తికరంగా, ఈ పవిత్ర భూమిని సందర్శిస్తే కనీస ప్రయత్నంతో ఎక్కువ ఫలితాలు పొందవచ్చని కూడా భక్తుల ప్రగాఢ నమ్మకం. ఒడిషలోని నిర్మాణ పరిపూర్ణ శైలిని ప్రతిబింబించే సూర్యదేవాలయంతో ఈ కోణార్క్ గ్రామం ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శిధిలమై పోయింది, ఇప్పటికీ ఇది శిల్పాలు, చేక్కుల్లలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరుగాంచింది. ఒడిష దాని విస్మయ-స్పూర్తితో రాష్ట్రం మొత్తంలో నిర్మాణ శైలిలో పెరుగంచడమే కాకుండా, గర్వించదగ్గ అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. జైన్ స్మరక చిహ్నాలు, బౌద్ధ కేంద్రాలు, వన్య ప్రాణుల అభయారణ్యాలు ఒడిష సంపద ఎంత వైవిధ్యంగా ఉందొ తెలియచేస్తుంది. ఒడిష పట్టణ, గ్రామీణ పరిపూర్ణ సమ్మేళనం. జనాభాలో ఎక్కువమంది వ్యవసాయ కార్మికులు. ఎక్కువమంది నివాసితులు నగరాలకంటే గ్రామాలలోనే ఉంటున్నారు. రాష్ట్రము మొత్తం జనాభాలో దాదాపు ఒక వంతు గిరిజన వర్గాల వారు ఉన్నారు. ఈ కమ్యూనిటీలు ఇప్పటికీ వారి సంస్కౄతిని అనుసరిస్తున్నారు, అలాగే వారి సంప్రదాయాన్ని సంరక్షించుకుంటున్నారు. ఒరియా రాష్ట్ర అధికారిక భాష. అయితే హిందీ, ఇంగ్లీష్ వినియోగం వల్ల రాష్ట్ర అభివృద్ది కుంటుపడలేదు.

ఒడిష సంస్కతి, వంటకాలు సంప్రదాయాన్ని ఆదరించే రాష్ట్రం కావడంతో, రాష్ట్ర ప్రజలు వారి మతాన్ని, ఆచారాలను ఖచ్చితంగా అనుసరిస్తున్నారు. ఒడిస్సీ, ఒడిష శాస్త్రీయ నృత్య విధానం, ఇప్పటికీ ఇది రాష్ట్రంలో సజీవంగా ఉంది. దీనిని రాష్ట్రంలో వివాహాలు, ఇతర ఉత్సవాల సమయంలో నిర్వహిస్తారు. ఈ పండుగలే కాకుండా ఒడిషలో కోణార్క్ ఫెస్టివల్, రాజారాణి మ్యూజిక్ ఫెస్టివల్, ఇతర ముక్తేశ్వర్ నృత్య పండుగ వంటి సాంస్కృతిక, కళా వేడుకలు జరుపుకుంటారు.



త్రిమూర్తులు కొలువుదీరిన త్రయంబకం


పాపవిముక్తికోసం గౌతముడు స్నానమాచరించిన పవిత్రస్థలమది. జ్యోతిర్లింగరూపంలో త్రిమూర్తులు కొలువైన క్షేత్రమది. అన్నింటినీ మించి ప్రాచీనకాలం నుంచీ కుంభమేళాకు వేదికగా నిలుస్తోన్న ఆ త్రిసంధ్యాక్షేత్రానికి ఉన్న మరో పేరే త్రయంబకం...కార్తీక మాసంలో దర్శనీయ పుణ్యక్షేత్రం..

ఇక్కడ ఉన్న బ్రహ్మగిరి పర్వతాల మీద బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తినీ సిద్ధినీ పొందాడట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరు అన్నది ఓ పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను ఐదు శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వెపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు. పడమటి వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది.

త్రయంబకం నాసిక్‌కు 28 కిలోమీటర్ల దూరంలోని త్రయంబక్ పట్టణంలో ఉంది. దేవాదిదేవుడయిన శంకరుని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇదీ ఒకటి. వేదకాలంనాటి గురుకుల పాఠశాలలూ, అష్టాంగమార్గాన్ని అనుసరించే ఆశ్రమాలూ అక్కడ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని క్రీ.శ.1755-1786 మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించారట. చూడ్డానికి ఇదో నల్లని రాతి యంత్రంలా అనిపిస్తుంది. ఆలయం నలువైపులా 20 నుంచి 25 అడుగుల ఎత్తులో రాతిగోడలు ఉన్నాయి. పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఈ మందిరంలోని మరో ఆకర్షణ.

గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివనామస్మరణ చేసే భక్తులతో ఆ ప్రాంతం మరో లోకాన్ని తలపిస్తుంది శివాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మందిరం గుండా గుడి అంతర్భాగానికి చేరుకుని, చిరుదీపకాంతిలో కనిపించే జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలు ఉన్నాయి. ఇలాంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్కచోటే కనిపించడం విశేషం.

స్వర్ణాభరణ భూషితుడు:
లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారుతొడుగుని తొడుగుతారు. దానిమీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు. పేష్వాల కాలం నుంచీ ఈ త్రయంబకేశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడుగా అలంకరించడం విశేషం. ఆ ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్రవెఢూర్యాలతోనూ విలువైన రాళ్లతో సుందరంగా ఉంది. ఈ కిరీటం పాండవుల కాలం నాటిదని అంటారు. దీన్ని ప్రతీ సోమవారం, కార్తీకపౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కుశావర్త తీర్థస్థలానికి తీసుకువెళతారు. తరవాత వూరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఒకప్పుడు నాసిక్ మణిగా పిలిచే నీలమణి కూడా దేవుడికి అలంకారంలో ఉండేదట. మరాఠాలు- ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్‌కు చేరి ఆపై అనేక చేతులు మారింది.

కుంభమేళాకు ఆరంభ స్థలం: 
జ్యోతిర్లింగ దర్శనానంతరం- ప్రధాన ఆలయం నుంచి కాలినడకన ఐదు నిమిషాల్లో కుశావర్త తీర్థానికి చేరుకోవచ్చు. దీన్ని వోల్‌వోకర్ శ్రీరావ్‌జీ సాహెబ్ పాఠ్‌నేకర్ క్రీ.శ. 1690-91లో నిర్మించారు. ఈ కుశావర్త తీర్థం పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం. ప్రపంచ నలుదిశల నుంచీ సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు. ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యులని అనుమతిస్తారు. గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులూ శైవులూ మధ్య తలెత్తిన వివాదంలో వందలాది మంది చనిపోయారట. ఆ సందర్భంగా ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పేష్వాలు విధించారట. వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామ్‌కుండ్‌లో సాన్నమాచరిస్తే, శైవ సాధువులు కుశావర్త్‌లో పుణ్యస్నానం చేస్తారట.

కుశావర్త్: 
గోదావరీ నది కుశావర్త్ నుంచి రామ్‌కుండ్‌లోకి ప్రవహిస్తుంది. అందువల్ల ఈ రెండు ప్రదేశాలూ కూడా పవిత్రమైనవే. అయితే భక్తులు సైతం కుశావర్త్‌లో స్నానమాచరించేందుకే మక్కువ చూపుతారు. భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మునకలేయడంవల్ల పోతాయని విశ్వసిస్తారు. అందుకే కుశావర్తాన్ని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు. గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుశావర్త్‌లో స్నానమాచరించడంవల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణేతిహాసం. అప్పట్లో వర్షాభావంతో తీవ్రమైన కరవు ఏర్పడటంతో తన ఆశ్రమం చుట్టూ ఉన్న కొద్దిస్థలంలోనే ధాన్యం పండించి, రుషులకు భోజనం పెట్టేవాడట గౌతమమహర్షి. ఓసారి తన పొలంలో ఆవు మేస్తుంటే, దాన్ని తోలేందుకు ఓ దర్భను విసిరాడట. సూదిమొనగుచ్చుకుని అది ప్రాణం విడిచిందట. గోహత్యా పాతకాన్ని చుట్టుకున్న గౌతముడు, దాన్ని తొలగించుకునేందుకు గంగలో స్నానం చేయదలిచి, బ్రహ్మగిరిమీద తపస్సు చేయగా, శివుడు గంగను విడిచాడట. శివుణ్ణి వీడటం ఇష్టంలేని గంగమ్మ ముందుగా బ్రహ్మగిరిమీద ఉన్న గంగాద్వార్, త్రయంబక, వరాహ, రామలక్ష్మణ, గంగాసాగర... ఇలా అనేక చోట్ల ప్రత్యక్షమై మాయమైపోతున్నదట. దాంతో ఆ తీర్థాల్లో మునకలేయలేక ఒకచోట వెలసిన నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటూ వెళ్లకుండా చేసి స్నానం చేశాడట గౌతముడు. అదే కుశావర్తంగా వాడుకలోకి వచ్చింది.

మహిమాన్విత బ్రహ్మగిరి: 
పుణ్యస్నానం తరవాత బ్రహ్మగిరికి వెళతారు యాత్రికులు. ఇది సముద్రమట్టానికి 4248 అడుగుల ఎత్తులో ఉంది. అంటే త్రయంబకేశ్వర పట్టణం కన్నా 1800 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెబుతారు.ఈ బ్రహ్మగిరి మీదే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తినీ సిద్ధినీ పొందాడట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరు అన్నది ఓ పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను ఐదు శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వెపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు. పడమటి వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది.

కైలాస ముఖద్వారం కేదారేశ్వరం


గంగోత్రి, యమునోత్రి, కేదారనాథ్, బదరీనాథ్ ఈ నాలుగు ప్రదేశాలను చార్‌ధామ్ అంటారు. యమునోత్రి, కేదారనాథ్, హరిద్వార్, రుషీ కేశ్ నుంచి వచ్చే అన్ని వాహనాలు గంగోత్రి ఆలయం ఉన్న ప్రదేశం వరకు వస్తాయి. బదరీనాథ్‌లో విష్ణు మూర్తి, కేదారనాథ్‌లో పరమ శివుడు స్వయంభువులుగా వెలసినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది.

కేదార్‌నాథ్ ఉత్తరాఖండ్‌లో ఉంది. హిమాలయ పర్వత సాణువుల్లో ఉన్న ఈ ఆలయాన్ని మే నుంచి సెప్టెంబరు (వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి) వరకు తెరిచి ఉంచుతారు. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 11, 760 అడుగుల ఎత్తులో ఉంది.

ప్రయాణం ఎలా చెయ్యాలి:
కేదార్‌నాథ్ ఉత్తరాఖండ్‌లో ఉంది. కేదార్‌నాథ్ క్షేత్రానికి చేరుకోవాలంటే ఢిల్లీ వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన హరిద్వార్, దేవప్రయాగ, రుద్ర ప్రయాగ మీదుగా రాంపూర్ చేరాలి. రాంపూర్ నుంచి సోన ప్రయాగ మీదుగా గౌరీకుండ్ చేరాలి. ఈ గౌరీకుండ్ గౌరీమాత జన్మస్థలం అని చెబుతారు. కేదార్‌నాథ్ పర్యాటకులు ఇక్కడ వేడినీటి కుండాలలో స్నానమాచరించి గౌరీమాతను దర్శించుకుని కేదార్‌నాథ్ పర్యటనను కొనసాగిస్తారు. గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ సుమారు 13 కి.మీలు ఉంటుంది. కాలి నడకన కాని, గుర్రాల మీద లేదా డోలీల్లో ప్రయాణించవచ్చు. వాతావరణాన్ని తట్టుకోవడం కొంచెం కష్టమే. విపరీతమైన చలి, అప్పుడప్పుడూ శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. 13 కి.మీల దూరం ప్రయాణించడానికి ఏడెనిమిది గంటలు పడుతుంది. యాత్రికులు కేదారనాథుడి మీద నమ్మకంతో యాత్ర సాగిస్తారు. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి.

హెలికాప్టర్ సదుపాయం:
పూర్తిగా ఒకటిన్నర రోజు ప్రయాణం. కేదారనాథ్‌లో ఆలయం ముందు నుంచి సుమారు ఒకటిన్నర ఫర్లాంగు పొడవున ఒక వీధి ఉంది. ఆ వీధిలో దుకాణాలు, ధర్మశాలలు ఉన్నాయి. అందులో కాలీ కమ్లి బాబా ధర్మశాల బాగా ప్రసిద్ధి. అందులో గది అద్దె రోజుకు సమారు 300 రూ ఉంటుంది. అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయి. ఈ మధ్యనే కేదార్‌నాథ్‌లోని గుడి వరకు హెలికాప్ట్టర్ సౌకర్యం కూడా ఏర్పడింది. అక్కడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి మీకుంటే అక్కడ ఎన్ని రోజులయినా ఉండవచ్చు. మే మధ్య భాగం నుంచి నవంబర్ మధ్య వరకు ఏడాదికి ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయం తెరచి ఉంటుంది. హిమాలయాల్లో కురిసే విపరీతమైన మంచు కప్పి వేయడంతో, మిగిలిన ఆరు నెలలు ఈ ఆలయం మూసే ఉంటుంది. ఆలయాన్ని తెరిచే సీజన్ ప్రారంభం కాగానే, లక్షలాది యాత్రికులు కేదారనాథ్‌ను సందర్శిస్తారు. ఆలయానికి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉండే గౌరీకుండ్ ప్రాంతం దాకా బస్సులు, మోటారు వాహనాలు వెళ్ల గలుగుతాయి. అక్కడ నుంచి గుడి దాకా మిగిలిన దూరమంతా యాత్రికులు కాలినడకన వెళ్లాలి. లేదంటే, గుర్రాల మీద వెళ్లాలి.

స్వయంగా అభిషేకం: 
కేదారేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. ఆలయానికి వెనుక వైపు జగద్గురువు ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది. సాధువులు ఒళ్లంతా విబూది పూసుకుని సంచరిస్తుంటారు. ఆధ్యాత్మిక వికాసానికి, పర్యాటక ఆహ్లాదానికి చక్కని వేదిక కేదార్‌నాథ్. కేదారేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. మందాకినీ నది పై భాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్ శివాలయం ఉన్న పుణ్యక్షేత్రం. గర్హ్వాల్ కోడల పై భాగంలో ఉంది. ప్రతి కూల వాతావరణం కారణంగా అక్షయ తృతీయ నుండి దీపావళి వరకు భక్త సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. గుడి చేరడానికి రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుండి గుర్రాలు, డోలీలు, కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్ నాథ్ గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాధ్‌లను చార్ ఉత్తరాఖండ్ ధామ్‌లుగా వ్యవహరిస్తారు.

చరిత్ర 
ఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయంభువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడూ భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవి ముక్తులైనట్లు పురాణ కధనం. తలభాగం నేపాల్‌లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థలపురాణం చెబుతుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు.

ఆలయ ప్రాంగణంలో యాత్రికులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...