Showing posts with label సూర్యకిరణాలు. Show all posts
Showing posts with label సూర్యకిరణాలు. Show all posts

Tuesday, 25 July 2017

జైనథ్‌ లక్ష్మీసూర్యనారాయణా...

ప్రాచీన శిల్పకళకు సజీవ దర్పణంలా నిలుస్తోంది జైనథ్‌ లక్ష్మీనారాయణ ఆలయం. 11, 13 శతాబ్దకాలంలో మహారాష్ట్రలోని వెమత్మాలపంత్‌ రాతితో ఈ ఆలయం నిర్మించబడింది. జైనథ్‌ పరిసరాల చుట్టూ ఈ ఆలయానికి వాడిన శిలలు ఎక్కడా లభించవు. ఈ శిలను మహారాష్ట్ర నుంచి తెప్పించారు. ఉన్నత శిఖరం కలిగి అడుగడుగునా శిల్పకళతో శోభితమైంది. 60 గజాల ఎత్తు, 40 గజాల వైశాల్యంలో, అష్టకోణాకార మండపం పైనున్న గర్భగుడిలో సూర్యనారాయణస్వామి వారు తన అపార కరుణకిరణాలను భక్తులపై ప్రసరింప చేస్తుంటారు. మూలవిరాట్లు లక్ష్మీనారాయణ స్వామి విగ్రహానికి దక్షిణదిశలో లక్ష్మీదేవి, ఆళ్వారులు, అన్యదేవతామూర్తులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కార్తికశుద్ధ ఏకాదశి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి.

ద్వాదశి రోజు స్వామి వారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. దీన్ని వీక్షించుటకు జిల్లావాసులేకాక మహారాష్ట్ర నుంచి పెద్దఎత్తున భక్తులు వస్తుంటారు. మండపం అంతర్భాగంలో స్తంభాలపై హనుమంతుడు, రంభాది అప్సరసల శిల్పాలు, ఆలయం ముందు భాగాన గరుడ స్తంభం ఉంది. ఆలయానికి ఇరువైపులా శృంగార భంగిమలతో కూడిన శిల్పఖండాలు దర్శనమిస్తాయి. ఆలయం ముందున్న కోనేరు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులో డోలాహరణ మండపం నిర్మించారు. కాలక్రమేణా అది శిథిలమైంది.

రవికిరణాలు తాకే పాదాలు...
ప్రతి ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాల్లో, దసరా అనంతరం ఆశ్వయుజ పౌర్ణమి నాడు ఉదయం లేలేత సూర్యకిరణాలు లక్ష్మీనారాయణ స్వామి పాదాలను తాకుతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూర్యదేవాలయంగా కూడా పిలుస్తారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించటానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

కోరికలు తీర్చే నారాయణుడు...
సంతానం లేనివారు స్వామిని మనసులో ధ్యానిస్తూ ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధద్వాదశి రోజున కళ్యాణోత్సవం సందర్భంగా స్వామివారి ప్రసాదం (గరుడముద్ద) స్వీకరిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం. బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన కార్తీక బహుళ పంచమి నాడు రాత్రి నిర్వహించే నాగవెల్లి పూజసమయంలో భక్తితో స్వామివారిని తలచుకుని, పూలదండలను ధరిస్తే తప్పనిసరిగా సంతానం కలుగుతుందని విశ్వాసం. కార్తీకమాసంలో పౌర్ణమినాటి నుంచి వరుసగా ఐదు పున్నములకు శ్రీవారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తే సుఖసంతోషాలతో వర్థిల్లుతారని భక్తుల నమ్మకం. సంతాన సాఫల్యత, కోరిన కోర్కెలు తీర్చే దేవుడని నమ్మకం.

జైనమత కేంద్రం...
శాతవాహనుల కాలం నాటి జైనథ్‌ జైనమత కేంద్రంగా వర్ధి్దల్లింది. శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయం అంతరాల మండపాన పగిలిపోయిన శిలాఫలకంపై దేవనాగరి లిపిలో చెక్కబడిన శాసనం సూర్యాయనమఃతో ప్రారంభమవుతుంది. ఈ శాసనం సూర్యభగవానుణ్ణి స్తుతిస్తూ శ్లోకంతో కూడి ఉంది.

ఉత్తర తెలంగాణ ఆదిలాబాద్‌లో ఉన్న ఈ ఆలయం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం నుంచి 21 కిలో మీటర్ల దూరంలో, హైదరాబాద్‌ నుంచి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్‌ మీదుగా 315 కి.మీల దూరంలో ఉంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డుమార్గమే తప్ప రైలు మార్గం లేదు. ఆదిలాబాద్‌ నుంచి జైనథ్‌కు నేరుగా బస్సులున్నాయి. బేల, చంద్రపూర్‌ వెళ్లే బస్సులు జైనథ్‌ మీదుగా వెళ్తాయి.

– రొడ్డ దేవిదాస్‌ సాక్షి, ఆదిలాబాద్‌

Saturday, 8 July 2017

నందలూరు - శ్రీ సౌమ్యనాథాలయం






నందలూరు సౌమ్యనాథుడు


దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాధుడని, చొక్కనాధ పెరుమాళ్‌ అని, కులోత్తుంగచోళ ఎంబరుమన్నార్‌ విన్నగర్‌ అనే పేర్లు ఉన్నాయి. సౌమ్యనాథుడన్నా..చొక్కనాథుడన్నా సౌందర్యవంతుడని అర్ధం. సౌమ్యనాథుడనగా సౌమ్యకు(శ్రీలక్ష్మీదేవికి) నాథుడని కూడా చెప్పుకోవచ్చు. స్వామి మూలవిరాట్టు ఏడడుగుల ఎత్తున ఎంతో అందంగా... అభయముద్రాలంకృతమై ఉంటుంది.

క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళవంశరాజు కుళోత్తుంగచోళుడు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చోళ, పాండ్య, కాకతీయ, విజయనగర రాజులచే 17వ శతాబ్దంవరకు ఆలయ నిర్మాణం కొనసాగింది. గజపతిరాజుల కాలంలో ఆలయం ప్రసిద్ధి చెందింది. 12వశతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు రాజగోపురాన్ని కట్టించారు. తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం నందలూరుకు సమీపంలో ఉన్నందున అన్నమాచార్యులు సౌమ్యనాథాలయాన్ని తరచు దర్శించుకొనేవారు. స్వామివారిపై శృంగార కీర్తనలు రచించారు. క్రీ.శ 11 వ శతాబ్దం మధ్యలో నందలూరులోని సౌమ్యనాథస్వామి దేవస్థానం మొట్టమొదటి వైష్ణవ ఆలయంగా గుర్తింపబడింది.

ఆలయ నిర్మాణం.. స్వరూపం...
శ్రీ సౌమ్యనాథాలయం దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో 180 స్తంభాలతో వైఖానస, వైష్ణవాగామ ఆర్షప్రోక్తంగా నిర్మించిన సువిశాలమైన రీతిలో అలరారుతుంటుంది. ఈ ఆలయంలో అధికంగా తమిళ శాసనాలు కనిపిస్తాయి. సింహద్వారంలో గాలిగోపురం ఉత్తరగోపురం, దక్షిణగోపురం ద్వారాలు ఉన్నాయి. ఆలయంలో రాతి దీపస్తంభం, బలిపీఠం, ధ్వజస్తంభం, గరుడ మందిరం, మత్స్యమంటపం, ఆంజనేయమంటపం, చిన్నకోనేరు, జయవిజయులు, అంకుర్పారణ మంటపం, వంటశాల, శ్రీ యోగనరసింహస్వామి, శిల్పకళ, అంతరాళం ఉన్నాయి.

దీపంలేకున్నా.... వెలిగే స్వామి
ఆలయంలో ఎటువంటి దీపంలేకున్నా, స్వామి వారు ఉదయం నుంచి సాయంకాలం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయం నిర్మించడం అద్భుతం. గర్భగుడి ప్రధానద్వారానికి వందగజాల దూరం నుంచి కూడా స్వామి చాల స్పష్టంగా కనిపిస్తారు. యేడాదిలో ఒకరోజు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై ప్రసరించడం ఇక్కడి ప్రత్యేకత.

ఆలయకుడ్యాలపై మత్స్య, సింహా చిహ్నాలు..
ఆలయ కుడ్యాలపై (లోపల)పై భాగంలో మత్స్య, సింహా చిహ్నాలు ఉన్నాయి. మత్స్య ఆకారంను మలిచి ఉన్నారు. భవిష్యత్తులో పెద్దఎత్తున వరదలు వచ్చి ఆలయాన్ని ముంచెత్తినప్పుడు ఆలయ పైభాగంలో ఉండే చేపబొమ్మకు ప్రాణం వచ్చి వరదలలో కలిసిపోతుందని స్ధానికుల నమ్మకం. అంటే అప్పటికి కలియుగం అంతమైపోతుందనే అర్ధం వస్తుందని చెబుతుంటారు.

ఆలయంలో మరో ఆలయం!?
రాతి మంటపంపై నుంచి గర్భాలయంలో ప్రవేశించాల్సివుంది. ఈ మంటపం ముందుబాగం శిఖరంలో సింహతల ఆకారంలో ఇరువైపుల ఉన్నాయి. ఏ దేవాలయానికైనా, ఆలయపైభాగంలో సింహతలలు అమర్చిబడి వుంటాయి. కాని సౌమ్యనాథస్వామి ఆలయంలో లోపలి మంటపంలోని ఓ భాగమంతా సింహాతలాటాలతో నిండివుండటం వల్ల భూగర్భంలో మరో ఆలయం ఉన్నట్లుగా గోచరిస్తుంది. దీనిని రాతి మంటపం అడుగున ఉన్న శివాలయంగా చెప్పుకుంటున్నారు.

ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి...
కడప–రేణిగుంట జాతీయరహదారిలో వైఎస్సార్‌ జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరు గ్రామంలో సౌమ్యనాథాలయం ఉంది. ఈ ఆలయానికి కడప, తిరుపతి, రాజంపేటల నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అలాగే జిల్లా రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రానికి ముంబాయి–చెన్నై మార్గంలో నడిచే ఏ రైలు ద్వారా నైనా చేరుకోవచ్చును. విమానాశ్రయం అయితే రేణిగుంటకు చేరుకొని అక్కడి నుంచి నేరుగా రైల్వేకోడూరు, రాజంపేట మీదుగా నందలూరుకు చేరుకోవచ్చు.

బ్రహ్మోత్సవాల క్రమమిది...
శ్రీ నారదమహర్షిచే ప్రతిష్టించబడిన అన్నమాచార్యులు ఆరాధ్యదైవమైన పరమేష్టి ప్రముఖ నిఖిల సురవంద బృంసదారవిందులైన, భక్తసులభుడైన శ్రీ సౌందర్యవల్లి సమేత శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైఖానస ఆగమోక్తంగా శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఆషాడ శుద్ధనవమి మొదలు అంటే జూలై 2 నుంచి ఆషాఢ బహుళ తదియ 11వతేది అత్యంతవైభవంగా జరగనున్నాయి. సౌమ్యనాథస్వామి వారు తన దేవేరితో కలసి రోజుకొక వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. 7న గరుడోత్సవం, 9 న కళ్యాణోత్సవం, 10న రథోత్సవ కార్యక్రమాలు ఉంటాయి.
మోడపోతుల రామ్మోహన్‌, సాక్షి, రాజంపేట, వైఎస్‌ఆర్‌ జిల్లా





Thursday, 22 June 2017

అరసవల్లి





ఆ 6 రోజులే కిరణాలెందుకు?

అది ఆదిత్యుడి గుడి! సంవత్సరానికి 365 రోజులున్నా.. ఆ గుడిలో ఏటా సంవత్సరంలో రెండుసార్లు.. మూడు రోజుల్లో ఒకసారి చొప్పున.. ప్రాతఃకాలాన గాలిగోపురాన్ని దాటి.. ధ్వజస్తంభాన్ని తాకుతూ.. గర్భాలయంలోని మూలవిరాట్టుపై సూర్యకిరణాలు పడతాయి. అప్పుడే ఎందుకు పడతాయి?

క్రమం తప్పదు...
దేశ తూర్పు తీరంలో ఉన్న మూడు సూర్యదేవాలయాల్లో.. తెలుగునాట ఉన్న క్షేత్రం అరసవల్లి. శ్రీకాకుళం పట్టణ సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని కళింగరాజు దేవేంద్ర వర్మ క్రీ.శ. 673వ సంవత్సరంలో నిర్మించాడు. ప్రతి సంవత్సరం మార్చి 9, 10, 11 తేదీల్లో ఒకసారి... అక్టోబరు 1, 2, 3 తేదీల్లో మరొకసారి అరసవల్లిలో సూర్య దేవుడిని భానుడి కిరణాలు తాకుతాయి. ఉదయం 6 గంటలకు గాలి గోపురం మీదుగా వచ్చే కిరణాలు.... అనివెట్టి మండపం, ధ్వజస్తంభాన్ని తాకుతూ మూల విరాట్‌పై ప్రసరిస్తాయి. ‘అరుణ శిల’తో చెక్కిన విగ్రహం... సూర్య కిరణాలు పడగానే బంగారు ఛాయలో మెరుస్తుంది.

వింతల ప్రసరణ...సూర్యుడికి నీడతో అవినాభావ సంబంధం. ఏదీ ఎదురు కానంత వరకే... సూర్యుడి కిరణ ప్రయాణం! ఏదైనా అడ్డు వచ్చిందంటే... దాని నీడే నేలపై కనిపిస్తుంది. అరసవల్లిలో దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. గాలి గోపురం నుంచి మూలవిరాట్టుకు మధ్య దూరం 306 అడుగులు! మధ్యలో... అనివెట్టి మండపం, ధ్వజస్తంభం, బేడా మండపం, అంతరాలయాలను దాటుకుని గర్భాలయంలోకి సూర్య కిరణాలు కనిపిస్తాయి. విచిత్రమేమిటంటే... ఆయా మండపాల తలుపులు మూసినప్పటికీ సూర్య కిరణాలు లోపలికి వస్తాయని చెబుతారు. ఆకాశం మేఘావృతమైతే తప్ప... ప్రతిఏటా రెండుసార్లు సూర్య నారాయణుడి విగ్రహాన్ని కిరణాలు తాకడం విశేషం.

సౌరగమనమే కీలకం..సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. పడమట అస్తమిస్తాడు! అయితే, ఈ ‘ఉదయ-అస్తమయాలు’ ఒకే పాయింట్‌ నుంచి జరగవు. కాలానుగుణం గా మారుతాయి. దీనిని బట్టి సూర్యుడి గమనం ఉంటుంది. ఈ సౌర గమనాన్ని గమనిస్తూ, ఏటా మార్చి 9, 10, 11 తేదీల్లో... అక్టోబరు 1, 2, 3 తేదీ ల్లో మరోసారి సూర్యకిరణాలు తాకేచోటును గుర్తించి అక్కడే ఆలయం ని ర్మించి, మూలవిరాట్టును కొలువుదీర్చినట్లు అర్థమవుతుంది.

Wednesday, 22 March 2017

నాగలాపురం వేదనారాయణస్వామి







మార్చి నెలలో మాత్రమే కనిపించే అద్భుతం
మూడు రోజులు ఆలయంలోకి సూర్య కిరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో టెంపుల్ సిటీ పేరు పొందిన చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది. ఈ దేవాలయంలో ఏటా మార్చిలో సూర్యపూజా మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు ఓ ప్రత్యేకత వుంది. అయిదు రోజుల పాటు స్థానిక పుష్కరిణిలో తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో తొలిరోజు సూర్యకిరణాలు రాజగోపురం ద్వారా నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించి స్వామివారి పాదాలను తాకుతాయి. రెండో రోజు నాభి వరకు, మూడో రోజు శిరస్సును స్ప్రుశిస్తాయి. ఈ అద్భుత దృశ్యాలను తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలివస్తారు.

తెప్పోత్సవాల తొలిరోజు రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వేధనారాయణుడు, రెండోరోజు గోదా సహిత వేదనారాయుణుడు, మూడో రోజు సీతాలక్ష్మీ సమేత కోదండరామస్వామి, నాల్గు, ఐదో రోజున శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణుడి అలంకరణలో స్వామివారు దేవేరులతో తెప్పలపై విహరిస్తారు.

మార్చి 27న తెప్పోత్సవం తర్వాత ముత్యపు పందిరి వాహానంలో స్వామివారిని ఊరేగిస్తారు. 28న పెద్దశేష వాహనంపై తిరువీధి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. సూర్యపూజా మహోత్సవాలకు సంబంధించి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ ఆలయాన్ని పల్లవుల కాలంలో నిర్మించారు. దీనిలో సొరంగా మార్గాలున్నాయని, వాటి రహస్యాలను చేధించేందుకు TTD, పురావస్తు శాఖ తవ్వకాలను చేపట్టింది. ఈ తవ్వకాల్లో 14 పంచలోహ విగ్రహాలు బయల్పడ్డాయి. నిధుల కోసం అన్వేషిస్తూ రెండో సొరంగంలో తవ్వకాలు మొదలెట్టారు. ఇందులో విలువైన సంపద ఉంటుందని భావిస్తున్నారు. మొదటి సొరంగంలో 2006లో తవ్వకాలు జరిపారు. రెండో సొరంగంలో తాజాగా తవ్వకాలు జరుగుతున్నాయి.






Monday, 14 March 2016

కన్యాకుమారి





కన్యాకుమారి

భారతదేశపు దక్షిణపు కొన కన్యాకుమారి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలిసే పవిత్ర ప్రదేశం ఇది. అక్కడికి సమీపంలోనే ఎత్తైన ప్రాకారాల మధ్య ఉన్న కన్యాకుమారి అమ్మవారి ముక్కెర విశేష కాంతుల్ని విరజిమ్ముతూ ఆకట్టుకుంటుంది. ఇక్కడి త్రివేణీ సంగమంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుంటాయి.

బీచ్‌ దగ్గరే ఉంది గాంధీ మెమోరియల్‌.. ఇక్కడ సముద్రంలో కలిపే ముందు గాంధీ అస్థికలు కొన్నింటిని ఉంచారు. అస్థికలు పెట్టిన ప్రదేశం మీద ప్రతి అక్టోబరు 2న సూర్యకిరణాలు పడేలా నిర్మించడం ఈ కట్టడంలోని విశేషం. ఇక్కడ మహాత్ముడి జీవిత విశేషాలను తెలిపే ఫొటో ప్రదర్శనను చూడవచ్చు. ఈ భవనంలో మెట్లెక్కి పై అంతస్థులోకి వెళితే అద్భుతమైన సాగర సంగమం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. కన్యాకుమారిలో తప్పకుండా చూడాల్సింది సూర్యోదయం, సూర్యాస్తమయం. అస్తమిస్తున్న సూర్యుణ్ని, ఉదయిస్తున్న చంద్రుణ్ని ఏకకాలంలో చూడాలంటే మాత్రం పౌర్ణమిరోజున ఇక్కడికి రావాల్సిందేనట. 1892లో యాత్రికుడిగా ఇక్కడికి వచ్చిన వివేకానందుడు ఇక్కడున్న రాతి కొండ మీద ఓ రాత్రంతా ధ్యానంలో గడిపాడట. ఆ తరవాతే భరతజాతికి తన జీవితాన్ని అంకితం చేయాలని సంకల్పించుకున్నాడట. ఆయన జ్ఞాపకార్థం 1970లో ఆ కొండ మీద పెద్ద భవనం నిర్మించి అందులో ఆయన నిలువెత్తు మూర్తిని ప్రతిష్ఠించారు. అక్కడి నుంచి పక్కనున్న కొండ మీద తమిళ కవీశ్వరుడు తిరువళ్లువార్‌ ఎత్తైన విగ్రహాన్ని మెట్లెక్కి విగ్రహం మండపం వరకూ వెళ్లి చూడొచ్చు. అక్కడి నుంచి కనిపించే ప్రకృతి సోయగం మాటల్లో వర్ణించలేనిది.

కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లోని చర్చి, ఉదయగిరి ప్యాలెస్‌, వట్టకొట్టై(వృత్తాకార కోట)లను చూడటానికి స్థానికంగా బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

Thursday, 3 September 2015

క్షీరా రామ లింగేశ్వరుడు






శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. పాలరాతి స్పటిక లింగం అయిదు అడుగుల ఎత్తు ఉంటుంది. లింగం వెనుక వైపు మూడు గీతలుండటం ప్రత్యేకత. నారద ప్రతిష్టగా ప్రసిద్ధి. శివుడు శూలంతో నేల మీద గుచ్చితే పాలు చిమ్మి కొలనుగా ఏర్పడింది కనుక "పాలకొలను" అయి క్రమంగా "పాలకొల్లు" అయింది. దుగ్దోవన పురం, ఉపమాన్యుపురం అనే పేర్లు కూడా ఉన్నాయి.

శివరాత్రి ఉత్సవంలో శివుడు "రావణ బ్రహ్మ వాహనం" పై ఊరేగటం ఇక్కడి విశేషం. చైత్ర శుద్ధ దశమినాడు ఒకే సమయంలో "శ్రీ లక్ష్మీ జనార్దనుల", "శ్రీ పార్వతీ రామ లింగేశ్వారుల" కల్యాణం జరగటం మరో విశేషం. జనార్దనుడు క్షేత్ర పాలకుడు .

శివ కల్యాణం జరిగిన మరునాటి ఉదయం సూర్యకిరణాలు శ్రీ క్షీరా రామేశ్వర లింగం పై పడటం చిత్రం.



కుంభ కోణం

తమిళనాడులోని కుంభకోణంలోని కుమ్భేశ్వర ఆలయం అత్యంత ప్రాచీన మైనది. ఇక్కడ బ్రహ్మ దేవుడికి ఆలయం ఉండటం ఒక విశేషం. దక్షిణ దేశంలో ఇంకెక్కడా బ్రహ్మకు గుడి లేదు. కుంభాలు అంటే కుండలు. కుండల్ని చేసే మట్టి తో శివుడు లింగాన్ని చేసి ప్రతిష్టించాదట. ఇక్కడ మహా మాఘ, బంగారు తామర అనే రెండు పుష్కరిణులున్నాయి. మొదటిది చాలా పవిత్ర మైంది. పన్నెండు ఏళ్ళ కొకసారి "మహా మాఘ" వస్తుంది. అప్పుడు పౌర్ణమి నాడు చంద్రుడు మఖా నక్షత్రం లో ప్రవేశిస్తాడు. శుక్రుడు చంద్రుని తో కలుస్తాడు. లక్షలాది భక్త జనం వచ్చి పుష్కరిణి లో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శిస్తారు. అంటే పుష్కరానికి ఒక సారేమహా మాఘ ఉత్సవం జరుగు తుంది అన్న మాట. అదీ విశేషం.

కుమ్భేశ్వరాలయం-కుంభకోణం (తంజావూర్ జిల్లా) 
నిత్యాభిషేకం లేని శివలింగం కుంభకోణం తంజావూర్ జిల్లాలో ఉంది. దీనిని "దక్షిణ దేశపు ఆక్స్ ఫర్డ్" అని ఇంగ్లీష్ వారే కీర్తించారు. ఇక్కడి కుమ్భేశ్వరాలయం అతి ప్రాచీనమైనది. 350 అడుగుల పొడవు, 156 అడుగుల వెడల్పు ఉన్న పెద్ద ఆలయం. పది అంతస్తుల గోపురం ఇక్కడి ఒక వింత. అమ్మవారు మంగళాంబిక. గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండంలో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుకతో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల  కుమ్భేశ్వరుడయ్యాడు. అందుకని ఇక్కడ నిత్యాభిషేకాలు ఉండవు. సుగంధ ద్రవ్యాలనే లేపనంగా పూస్తారు ఇదో విచిత్రం. చిత్రమాసంలో సూర్యకిరణాలు లింగం పై పడటం విశేషం. విశాలమైన నటరాజ మండపానికి పెద్ద రాతి చక్రాలు అమర్చబడటం మరో వింత. పన్నెండు ఏళ్ళకోసారి ఇక్కడ మాఘమాసంలో మహామాఘం ఇక్కడి కోనేరులో జరగటం ఇంకో విశేషం. పవిత్ర నదులన్నీ ఈ కోనేటిలో ప్రవేశిస్తాయని నమ్మకం. లక్షలాది భక్తులు వచ్చి మాఘ స్నానం చేసి స్వామిని దర్శించి వెళ్ళటం మరొక విశేషం. కోనేరు విస్తీర్ణం యిరవై ఎకరాలు. అందులో ఇరవై రెండు బావులు ఉండటం విశేషాలకే విశేషం.

చిదంబర రహస్యం
పంచతత్వ లింగాలలో "ఆకాశ లింగం" ఉన్న పవిత్ర క్షేత్రం చిదంబరం. ఇక్కడి నటరాజ దేవాలయం నాట్యశాస్త్ర ప్రాముఖ్యత కలిగింది. ఆలయం ఫర్లాంగు పొడవు, ఫర్లాంగు వెడల్పు ఉంటుంది. చక్కని కనువిందు చేసే శిల్పాలు ఆకర్షిస్తాయి. శతాబ్దాలు గడచినా రంగు మారని చిత్ర కళా రహశ్యం అబ్బురపరుస్తుంది. నటరాజ ఆలయం ఆరు అడుగుల ఎత్తు మండపం. అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. మానవరూపంలో శివుడు నృత్యం చేసే భంగిమ లో విగ్రహం దర్శన మిస్తుంది. ఇక్కడే శివ లింగం ఉంది. అయినా పూజలన్ని నటరాజ స్వామికే జరగటం విశేషం.

గర్భగుడికి కుడి వైపు ఒక గది ఉంటుంది. గుడ్డ తెరలతో చీకటిగా ఉంటుంది. అర్చకుడు తెర తొలగించగానే, గోడ మీద బంగారు ఆకుల లాంటి వాటితో ఒక తోరణం వేలాడుతూ ఉంటుంది. శివుడు ఆకాశ రూపంలో ఉన్నాడు అని చెప్పి పూజారి తెరను మూసేస్తాడు. అదే చిదంబర రహశ్యం. సృష్టిలో మొదటిది ఆకాశం. దాని నుంచే మిగిలినవి ఏర్పడి, చివరికి అన్నీ ఆకాశంలో అంటే శూన్యంలో చేరిపోతాయి కనుక ఏ తాపత్రయము లేకుండా, ఆకాశం లాగా మనసును నిర్మలం గా ఉంచుకోవాలి. చిత్ అంటే మనసు. అంబరం అంటే ఆకాశం. నిర్మల మైన మనసును కలిగి ఉండాలి అని చెప్పేదే చిదంబర రహశ్యం.  నటరాజస్వామి ఎడమ కాలు కొంచెం పైకి ఎత్తి, కుడి కాలు వైపుగా మడిచి, నాట్యం చేస్తున్నట్లు ఉంటాడు. దీన్ని "భుజంగ త్రాస" అభినయం అంటారు. ఆయన చేతిలో ఉన్న డమరుకం నుంచి సృష్టి ఏర్పడిందని, అభయ హస్తాలు సృష్టిని రక్షిస్తున్నాయని, ఎడమ చేతిలోని అగ్ని లయ కారకత్వానికి చిహ్నం అని, పాదం కొంచెం ఎత్తి ఉండటం వల్ల మోక్షం ఇస్తున్నట్లు సూచన అని శిల్ప రహశ్యం తెలిసిన వారు శిల్పార్ధాన్ని వివరిస్తారు.

ఆలయాలు - విచిత్ర విషయాలు









ఆలయాలు - విచిత్ర విషయాలు



అభిషేక జలం హరించే ఉమా కమండ లేశ్వరుడు
తూర్పు గోదావరి జిల్లాలో వసిష్ఠ నదీ తీరంలో ఉన్న క్షేత్రం ర్యాలి. అక్కడ జగన్మోహన ఆలయంతో బాటు ఉమా కమండలేశ్వర దేవాలయం కూడా ప్రసిద్ధి చెందంది. బ్రహ్మ దేవుడు తపస్సు చేసిన ప్రదేశంగా పేరు పొందింది. బ్రహ్మ, తన కమండలం పై ఉమా దేవితో కూడిన శివుడిని ప్రతిష్టించాడు. అదే ఉమా కమండ లేశ్వర ఆలయం. శివ లింగం రుద్రాక్ష లాగా గరుకు గా ఉంటుంది. సోమ సూత్రం లేక పోవటం ప్రత్యేకత. శంకరుడు కాముడిని దాహించాడు కనుక చాలా వేడి గా ఉంటాడు. అందుకని అభిషేకం చేసిన గంగా జలం అంతా అప్పటి కప్పుడు హరించుకు పోవటం వింత గా అని పిస్తుంది. బయటకు కాని, కిందకు కాని నీళ్ళు పోయే మార్గ మే లేదు. అక్కడ జగన్మోహన కేశవాలయంలో నీరు ఎప్పుడూ ఊరుతుంది. ఇక్కడ హరించుకు పోతుంది. అదీ చిత్రాతి చిత్రం.

రావణ బ్రహ్మ వాహనం పై ఊరేగే క్షీర లింగేశ్వరుడు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్షీర రామ లింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.  పాల తాతి స్పటిక లింగం అయిదు అడుగుల ఎత్తు ఉంటుంది.  లింగం వెనుక వైపు మూడు గీతలుండటం ప్రత్యేకత. నారద ప్రతిష్ట గా ప్రసిద్ధి. శివుడు శూలంతో నేల మీద గుచ్చితే పాలు చిమ్మి కొలను గా ఏర్పడింది కనుక "పాల కొలను" అయి క్రమంగా "పాలకొల్లు" అయింది. దుగ్దోవనపురం, ఉపమాన్యుపురం అనే పేర్లు కూడా ఉన్నాయి.శివ రాత్రి ఉత్సవంలో శివుడు "రావణ బ్రహ్మ వాహనం" పై ఊరేగటం ఇక్కడి విశేషం. చైత్ర శుద్ధ దశమి నాడు ఒకే సమయంలో శ్రీ లక్ష్మీ జనార్దనుల, పార్వతీ రామ లింగేశ్వారుల కల్యాణం జరగటం మరో విశేషం. జనార్దనుడు క్స్శేత్ర పాలకుడు.శివ కల్యాణం జరిగిన మరు నాటి ఉదయం సూర్య కిర ణాలు క్షీర రామేశ్వర లింగం పై పడటం చిత్రాతి చిత్రం.

నాట్యాభినయ  కరణాలు ఉన్న  కూచి పూడి రామ లింగని గుడి
కృష్ణా జిల్లా కూచిపూడి - కూచి పూడి నాట్య సిద్ధాంత కర్త సిద్ధేంద్ర యతీంద్రుల జనం స్థానం. కూచిపూడి నాట్యానికి కేంద్రంగా వర్ధిల్లింది. శ్రీ బాలా త్రిపుర సుందరీ సాహిత శ్రీ రామ లింగేశ్వర  స్వామిని శ్రీ రాముడు ప్రతిష్టించినట్లు స్థల పురాణ కధనం. ఆలయ ముఖమండపంలో 108   నాట్యాభినయ కారణాలను అత్యద్భుతం గా చెక్కారు. చిదంబరం ఆలయంలోని కరణాలను చూసి, ప్రముఖ కూచి పూడి నాట్యా చార్యులు పద్మ శ్రీ వెంపటి చిన సత్యం గారు వీటిని ఏర్పాటు చేసి తమ కళాభిమానాన్ని చాటుకొన్నారు.

పడమర ద్వారం - తూర్పు ఆలయం ఉన్న - కోడూరు
కృష్ణా జిల్లా దివి తాలూకాలో అవనిగడ్డకు దగ్గరలో కోడూరు గ్రామంలో శ్రీ సోమ శేఖర స్వామి ఆలయం తూర్పు వైపున ఉన్నా, ద్వారం మాత్రం పడమర వైపుకు ఉండటం విశేషం. ఈ ఆలయాన్ని ప్రఖ్యాత కవి, పండితుడు, శతాధిక గ్రంధ కర్త అయిన నాదెళ్ళ పురుషోత్తమ కవి 1894లో నిర్మించారు. కోడూరు ఒకప్పటి రేవు పట్టణం. "దివి దుర్గం" అనే పేరు దీనికి సార్ధక నామం గా ఉండేది. ఇప్పుడు మంచి వ్యాపార కేంద్రం. నిత్య ధూప దీప  నైవేద్యాలతో అభిషేకాలతో ఆలయం వర్ధిల్లు తోంది.

స్వయంభు లింగం తాడి పత్రీ
అనంత పురం జిల్లా తాడిపత్రీలో సి రామేశ్వర ఆలయం ఉంది. ఇది పశ్చిమాభి ముఖంగా ఉందాం విశేషం. పానవాట్టం ఆకారంలో ఒక శీల ఉంటుంది. లింగం ఉండదు. ప్రతిష్ట జరగలేదు. దీన్ని స్వయంభూ లింగంగా భావిస్తారు.  తురుష్కుల దండ యాత్రలో లింగం అపహరణకు గురైందట. ఆలయపు గోపురం అంతా నల్ల రాతి కట్టడంగా ఉండటం విచిత్రం                           

మత సామరస్యం విలసిల్లె కదిరి సమాధి
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో "చంద్ర వాదన మొహియార్ "అనే సమాధిని హిందువులు, ముస్లిములు సమానంగా దర్శిస్తారు. ఈ సమాధి దగ్గర మట్టిని చేతిలో పట్టు కొంటే విడిపోయిన భార్యా భర్తలు కలిసి పోతారనే నమ్మకం ఉంది. సంసారంలో కలతలు రావనీ, కార్పణ్యాలు రావని విశ్వసిస్తారు.                    

కంచు శబ్దం చేసే రాతి నంది
ప్రకాశం జిల్లా అద్దంకికి పది కిలో మీటర్ల దూరంలో ధర్మవరం ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, అనేక జీర్ణ ఆలయాల నిలయం. ఒక కొండ మీద శ్రీ నీల కన్తేశ్వర ఆలయం ఉంది. శిధిల మైన స్తితిలో స్వామికి ఎదురుగా రాతి నంది ఉంది. ఈ నందిని రాయి తో కొడితే "కంచు శబ్దం" వినిపించటం అపూర్వ మైన వింత. ఇక్కడున్న కొండల చుట్టూ "రాక్షస గుడులు" ఉన్నాయి. ఇవి, రాతి యుగం నాటి మానవ ఆవాస భూమి గా భావిస్తున్నారు.

లింగోద్భావాన్ని చూపే శివ లింగం
గుంటూరు జిల్లా చండవోలులో చాలా పురాతన మైన "లింగోద్భవ స్వామి" దేవాలయం ఉంది. శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో శివుడు ఇక్కడ లింగరూపం పొందాడని ప్రజల విశ్వాసం. ఆ లింగం ఆది, అంతాలను తెలుసుకోవ టానికి బ్రహ్మా, విష్ణువు ప్రయత్నించి విఫలురైనా సంగతి అందరికి తెలిసిన విషయమే. చిన్న లింగం గుడిలోను, పెద్ద లింగం బయటా ఉంటాయి. మొగలి రేకు గుర్తు, హంస గుర్తు ఈ లింగాల పై ఉండటం చిత్రాతి చిత్రం. లింగోద్భవం జరిగింది ఇక్కడే నని చెప్ప టానికి ఈ రెండు గుర్తులు సాక్ష్యంగా ఉన్నాయని ఇక్కడి వారి విశ్వాసం.

చేజెర్ల కపోతెశ్వరుడు
గుంటూరు జిల్లా నరసరావు పేట కు ౨౫ కి.మీ. దూరంలో "చేజెర్ల" గ్రామంలో కపోతేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది చతుర్భుజా కారంలో ఉండటం విశేషం. స్వామి పావురం ఆకారంలో లింగ రూపంలో ఉండటం మరో విచిత్రం. శిబి చక్ర వర్తి, త్యాగ ఉద్దితో తన తోడలోని మాంసాన్ని కోసి పావురాయిని కాపాడిన ప్రదేశం ఇదే అని జనుల విశ్వాసం. దాని గుర్తు గానే ఇక్కడ శివుడు కపోతేశ్వరుడై, శిబి త్యాగానికి చిహ్నం గా నిలిచాడు. 

అయిదంతస్తుల మహాద్వారం ఉన్న పుష్పగిరి
కడప జిల్లాలో పినాకినీ నదికి తూర్పున కొండ పై పుష్పగిరి ఉంది. దీని పైనే గొప్ప ప్రాకారం, మహా ద్వారం ఉన్నాయి. దీని లోపల చెన్న కేశవా స్వామి, ఆయనకు ఉత్తరంగా "పుష్పాచ లింగం" ఉండటం విశేషం. మహాద్వారం అయిదు అంతస్తులు కలిగి విపరీతమైన ఆశ్చర్యం కలిగిస్తుంది. పుష్పాచ లింగేశ్వరునికి, ఎడమ వైపు ఉమామహేశ్వర లింగం ఉండటం విశేషం. కొండ కింద "ప్రయాగ మాధవ మూర్తి" ఉన్నాడు. ఈ స్వామికి పశ్చిమం వైపు "రుద్ర పాదం" ఉంది. 24 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న కుడి పాదం ఇది. దీనికి సుమారు కిలో మీటర్ దూరంలో "ముని పాక" అనే గ్రామంలో విష్ణు పాదం ఉంది. ఆంధ్రులకు ఏకైక పీఠం పుష్పగిరి యే.

తేళ్ళ మండపం
కడప జిల్లాలో రాయచోటిలో వీర భద్ర స్వామి ఆలయం ఉంది. దసరా పండుగ రోజున స్వామి వారి గ్రామ విహారంలో "పారు వేట "ఉత్సవం జర్గు తుంది. ఈ ఉత్స వాన్ని "తేళ్ళ మండపం" అనే చోట జర పటం ఆన వాయితీ గా వస్తోంది  ఆ సమయంలో  వేలాది తేళ్ళు అక్కడికి చేరు కొంటాయి. ఎవర్నీ ఏమీ చేయవు. ఉత్సవం అయి పోగానే ఒక్క తేలు కూడా అక్కడ ఉండ కుండా వెళ్లి పోవటం చిత్రాతి చిత్రం.

రస భాండ నిలయం - సిద్ధ వటం
కడప జిల్లా పెన్నానదీ తీరాన సిద్ధ వటం అనే గ్రామంలో అనేక సిద్ధ పురుషులు ఉండే వారట. అందుకే ఆ పేరు సార్ధక మైంది. అందులో "రస సిద్ధులు" చాలా మంది ఉండే వారట. అక్కడ భూమి ని తవ్వితే నేక రస భాండాలు కన్పించాయట. వాటిలో ఏమి ఉందొ, వాటి వివరాలు ఇప్పటికీ ఎవరికీ తెలియదట. ఆ రసం ఎందుకు ఉపయోగించారో, ఉపయోగిస్తారో ఈ నాటికి అంతుపట్టని మిస్టరిగానే ఉందట. అదీ సిద్ధవటం హిస్టరీ. తిరునాళ్ళలో ఇక్కడి నీటి బుగ్గలు ఉబుకుతాయత. అదొక వింత గా చెప్పు కొంటారు.

గోపాద ముద్రలున్న మహా నందీశ్వరుడు
కర్నూలు జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్న మహా నంది గొప్ప శైవ క్షేత్రం. మహా నందీశ్వర లింగం కింద "రుద్ర కుండం" అనే కోనేటిలోకి, నీరు నిరంతరం గా ప్రవహిస్తూ ఉంటుంది. లింగం మీద ఆవు పాద ముద్రలు కనిపించటం ఇక్కడి వింత. అది సాలగ్రామలింగం అవటం మరీ విశేషం. పుష్కరిణిలో నీళ్ళు ఎప్పుడు అయిదు అడుగుల లోతులో ఉండటం మరో విశేషం. దీనిలో స్నానం చేయటం పరమానందం, వింత అనుభవం. అడుగున వేసిన చిన్న పైసా కూడా స్పష్టం గా కని పిస్తుంది. స్నానం చేస్తుంటే మనం దేవతలమేమో నన్న దివ్య భ్రాంతి, కాంతి మన శరీరాలకు కలిగి మరిచిపోలేని అనుభూతిగా మిగిలి పోతుంది. ఆనంద పారవశ్యం కల్గిస్తుంది. దీని కంతటికీ కారణం ఆ జలం శుద్ధ స్పటిక జలం అవటమే. దివ్యాను భూతి అంటే ఏమిటో ఇక్కడే మనం పొందగలం.

అభిషేక జలాన్ని మాయం చేసే  మహేశ్వరుడు
ప్రకాశంజిల్లాలో కనిగిరి పట్టణానికి ఇరవైకిలో మీటర్ల దూరంలో "మల్లప్ప సెల" అనే ఊరిలో, ఈశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది. శివునికి చేసిన అభిషేక జలం బయటకు పోయే మార్గంలో ఒక రుషి శయనించి ఉన్నట్లుగా ఒక శిల్పం ఉంది. స్వామి వారి పుష్కరిణీ జలాన్ని తెచ్చి, అభిషేకం చేస్తే ఒక్క చుక్క నీరు కూడా కనిపించాడు. పుష్కరిణి నీరు కాకుండా, ఇంకే రకమైన నీటి తోఅభిషేకం చేసినా, ఆ నీరు అక్కడే నిలచి ఉండి పోవటం చూస్తే ముక్కు మీద వేలు వేసుకొని ఆశ్చర్య పోతాం.

అభిషేక జలం బయటకు రానివ్వని బాల బ్రహ్మేశ్వర లింగం
మహబూబ్ నగర్ జిల్లాలో, కర్నూలు కు దగ్గరగా"అలంపురం" చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. దక్షిణ కాశి అంటారు. తుంగ భద్రా నదీ తీరం. ఇక్కడా నవ బ్రహ్మ లకు ఆలయాలున్నాయి. ఇక్కడి బాల బ్రహ్మాలయం చాలా ప్రసిద్ధి పొందింది. బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎంత నీటితో అభిషేకం చేసినా, ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదట. గుడి లోపల ఉన్న గణపతి విగ్రహాన్ని వన మూలికలు, పసరులు, ఇసుకతో కలిపి, ఈ ఆలయాన్ని నిర్మించిన రససిద్ధుడు తయారు చేశాడట. ముట్టుకుంటే గరుకుగా ఉంటుందట. ఇక్కడి ఆలయాలన్నీ  మహోన్నత శిల్పాలతో విరాజిల్లుతూ ఉంటాయి. జోగులాంబా దేవి శక్తి క్షేత్రం ఇది. ఆలాయాలన్ని గుహల్లా గా ఉండటం విచిత్రం. రాతికీ, రాతికీ మధ్య అతికించాటానికి  సున్నం లాంటిది ఏదీ వాడక పోవటం మరీ విచిత్రం.

బోయలే పూజారు  లైన బీచు పల్లి
మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా తీరాన బీచు పల్లి ఆంజనేయ స్వామి ఆలయం, మహిమాన్విత మై ప్రసిద్ధి చెందింది. స్వామి స్వయం గా వెలసిన దివ్య క్షేత్రం. స్వామి అర్చకులు బోయ వాళ్ళే. స్వామి దర్శనం తో దీర్ఘ వ్యాదు లన్నీ మాటు మాయం అవుతాయని భక్త జన విశ్వాసం. స్వామి సమీ పంలో ఉన్న "కడిమి చెట్టు "మహా మహిమాన్విత మైనదని ఇక్కడి ప్రజల అచంచల విశ్వాసం.

లింగం మీద ఒకే మట్టంలో నీరు ఉండే వాడ పల్లి
మూసీ నదికి ముచి కుంద నది అని పేరు. ఇది నల్గొండ జిల్లా వాడ పల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఇక్కడి అగస్స్త్యేశ్వర దేవాలయం పురాణ ప్రసిద్ధ మైనది. శివ లింగం మీద నీరు ఎప్పుడూ ఒకే ఎత్తులో ఊరుతూ ఉండటం ఇక్కడి విశేషం. దీనికి దగ్గరలో నర సింహ స్వామి ఆలయమూ విశిష్ట మైనదే. స్వామికి ఎదురుగా పద కొండు దీపాలు నిరంతరం వెలుగుతూ ఉండటం విశేషం. అందులో నర సింహ స్వామి ముక్కుకు దగ్గరగా ఉన్న దీపం గాలికి రెప రెప లాడుతూ కన్పించటం మరీ విచిత్రం.. మిగిలిన దీపాలు నిశ్చలంగా వెలుగుతూ కన్పిస్తాయి. దేవుడు ఊపిరి పీలుస్తున్నాడు అన్న భావన కలిగేట్లు శిల్పి నిర్మించిన నిర్మాణ చాతుర్యం ఆశ్చర్యం కలిగించి ఆతని చాతుర్యానికి జోహారు లర్పిస్తాం. శైవ, వైష్ణవ దివ్య  క్షేత్రం వాడ పల్లి.

కంచి - అయ్య వారికి దూరం గా అమ్మ వారున్న కంచి
కంచి కామాక్షి క్షేత్రం పరమ పవిత్ర మైనది. ఏకాంబరేశ్వరుడు దర్శనీయుడు. సాధారణంగా స్వామి వారి విగ్రహానికి ఎడమ వైపు అమ్మ వారి విగ్రహం ఉంటుంది. అయితె కంచిలో మాత్రం, ఎకామ్రారేశ్వర ఆలయానికి సుమారు రెండు ఫర్లాంగుల దూరంలో కామాక్షి దేవి ఆలయం ఉండటం విశేషం. కామాక్షి ఆలయంలో, అమ్మ వారి ఎదుట బీజాక్షరాలతో ఉన్న యంత్రం ప్రతిష్టించబడి ఉంది. పూజాదికాలను యంత్రానికే చేయటం ఇక్కడి ప్రత్యేకత.   ఇక్కడే శ్రీ కంచి కామ కోటి పీఠం ఉంది. విష్ణు కంచిలో వరద స్వామి ఆలయం ఉంది. ఇక్కడి వెండి బల్లిని తాకితె పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.  కామ కోటి అంటే కామం తర్వాత వచ్చే మోక్ష దశ్శ. అంటే మోక్షం పొంద టానికి దారి చూపేది కామ కోటి పీఠం అని అర్ధం.

మత సామరస్యం తో వెలిగే వేముల వాడ
కరీం నగరం జిల్లా వేముల వాడలో శ్రీ రాజా రాజేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది ఒకప్పటి రాజ దాని.  జైన,  బౌద్ధాలు విలసిల్లిన ప్రదేశం.  ఒక ముస్లిం ముల్లా గారి స్మారక చిహ్నం ఈ ఆలయంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.  రాజా రాజేశ్వర లింగం "నీల మాణిక్య లింగం. "పాన వట్టం కింద బ్రహ్మ, మధ్య విష్ణువు, పైన శివుడు ఉంటారు. అమ్మ వారు శ్రీ రాజ రాజేశ్వరి దేవి. ఆమె వాహనం వ్యాఘ్రం కాదు "వరాహం". ఇదీ ఇక్కడి విశేషం. వెయ్యి బంగారు నాణాలతో శివుడికి అభి షేకం చేయటం ఇక్కడి మరో విచిత్ర విషయం. అంటే కాదు అన్నం తో కూడా స్వామికి అభిషేకం నిర్వహించటం మరో వింత. కోడె గిత్తలను స్వామికి సమర్పించటం మరో వింత. అవి రాత్రి పూట ఆలయం,లో నిద్రిస్తాయి. దీన్నే"కోడె కట్టటం"అంటారు. ఆలయంలో బౌద్ధ, జైన విగ్రహాలు కూడా ఉండటం అబ్బుర పరుస్తుంది.దీనికి దక్షిణ కాశి అని పేరుంది. నన్నయ గారి భారత రచనకు రాజ రాజ నరేంద్రుడు ప్రేరణ గా నిలిస్తే, వేముల వాడ రాజు "అరి కేసరి" 10 వ శతాబ్ది లోనే తన ఆస్తాన కవి"పంప"కవి ని ప్రేరేపించి కన్నడ భారతాన్ని రాయించి కృతిని అంకితం గా పొందటం విశేషం. పంపకవి జైనుడు. అతని సోదరుడు జన వల్లభుడు ఇక్కడి వాడే. ఇతడు తెలుగులో "కంద పద్యాలు" రాసిన మొదటి కవి గా ప్రసిద్ధి చెందాడు. "లేగల వాడ", "వెంబుల వాడ" అయి చివరికి "వేముల వాడ" అయిందని చెబుతారు.

కుంభ కోణం  
తమిళనాడులోని కుంభకోణంలోని కుమ్భేశ్వర ఆలయం అత్యంత ప్రాచీన మైనది. ఇక్కడ బ్రహ్మ దేవుడికి ఆలయం ఉండటం ఒక విశేషం. దక్షిణ దేశంలో ఇంకెక్కడా బ్రహ్మకు గుడి లేదు. కుంభాలు అంటే కుండలు. కుండల్ని చేసే మట్టి తో శివుడు లింగాన్ని చేసి ప్రతిష్టించాదట. ఇక్కడ మహా మాఘ, బంగారు తామర అనే రెండు పుష్కరిణులున్నాయి. మొదటిది చాలా పవిత్ర మైంది.  పన్నెండు ఏళ్ళ కొక సారి "మహా మాఘ" వస్తుంది. అప్పుడు పౌర్ణమి నాడు చంద్రుడు మఖా నక్షత్రంలో ప్రవేశిస్తాడు. శుక్రుడు చంద్రుని తో కలుస్తాడు. లక్షలాది భక్త జనం వచ్చి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శిస్తారు. అంటే పుష్కరానికి ఒక సారేమహా మాఘ ఉత్సవం జరుగు తుంది అన్న మాట. అదీ విశేషం.

చిదంబర రహస్యం
పంచతత్వ లింగాలలో "ఆకాశ లింగం" ఉన్న పవిత్ర క్షేత్రం చిదంబరం. ఇక్కడి నటరాజ దేవాలయం నాట్యశాస్త్ర ప్రాముఖ్యత కలిగింది. ఆలయం ఫర్లాంగు పొడవు, ఫర్లాంగు వెడల్పు ఉంటుంది. చక్కని కనువిందు చేసే శిల్పాలు ఆకర్షిస్తాయి. శతాబ్దాలు గడచినా రంగు మారని చిత్ర కళా రహశ్యం అబ్బురపరుస్తుంది. నటరాజ ఆలయం ఆరు అడుగుల ఎత్తు మండపం. అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. మానవరూపంలో శివుడు నృత్యం చేసే భంగిమలో విగ్రహం దర్శన మిస్తుంది. ఇక్కడే శివ లింగం ఉంది. అయినా పూజలన్ని నటరాజ స్వామికే జరగటం విశేషం. గర్భగుడికి కుడి వైపు ఒక గది ఉంటుంది. గుడ్డ తెరలతో చీకటిగా ఉంటుంది. అర్చకుడు తెర తొలగించగానే, గోడ మీద బంగారు ఆకుల లాంటి వాటితో ఒక తోరణం వేలాడుతూ ఉంటుంది. శివుడు ఆకాశ రూపంలో ఉన్నాడు అని చెప్పి పూజారి తెరను మూసేస్తాడు. అదే చిదంబర రహశ్యం. సృష్టిలో మొదటిది ఆకాశం. దాని నుంచే మిగిలినవి ఏర్పడి, చివరికి అన్నీ ఆకాశంలో అంటే శూన్యంలో చేరిపోతాయి కనుక ఏ తాపత్రయము లేకుండా, ఆకాశం లాగా మనసును నిర్మలం గా ఉంచుకోవాలి. చిత్ అంటే మనసు. అంబరం అంటే ఆకాశం. నిర్మల మైన మనసును కలిగి ఉండాలి అని చెప్పేదే చిదంబర రహశ్యం.  నటరాజస్వామి ఎడమ కాలు కొంచెం పైకి ఎత్తి, కుడి కాలు వైపుగా మడిచి, నాట్యం చేస్తున్నట్లు ఉంటాడు. దీన్ని "భుజంగ త్రాస" అభినయం అంటారు. ఆయన చేతిలో ఉన్న డమరుకం నుంచి సృష్టి ఏర్పడిందని, అభయ హస్తాలు సృష్టిని రక్షిస్తున్నాయని, ఎడమ చేతిలోని అగ్ని లయ కారకత్వానికి చిహ్నం అని, పాదం కొంచెం ఎత్తి ఉండటం వల్ల మోక్షం ఇస్తున్నట్లు సూచన అని శిల్ప రహశ్యం తెలిసిన వారు శిల్పార్ధాన్ని వివరిస్తారు.

నడుంలోతు నీటిలో శివ లింగం         
నల్గొండ జిల్లాలో నల్గొండకు అతి సమీ పంలో "పాను గల్లు" గ్రామం ఉంది. అక్కడున్న ఛాయా సోమేశ్వర ఆలయం ప్రసిద్ధ మైనది. ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న మండపాలున్డటం ప్రత్యేకత. వీటి మధ్యలో మూడు గర్భ గుడులు ఉన్న దేవాలయం ఉండటం విశేషం. దీన్నే "త్రికూటాలయం" అంటారు. గర్భాలయంలో నడుము లోతు జలంలో శివలింగం ఉండటం ప్రత్యేకత. ఈ జలం అన్ని కాలాల్లో అదే లోతులో ఉండటం విచిత్రం. ఈ జల లింగం పైన అన్ని సమయాల్లో స్తంభాకారంలో నీడ పడటం మరో వింత. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీడ ఒకే రకంగా పడటం వింతల్లో వింత. ఇదే "ఛాయా సోమేశ్వరం". ఈ రహశ్యం ఇప్పటికీ దుర్భేద్యంగానే ఉంది.
ఇంకో వింత కూడా ఉందండోయ్. సింహ ద్వారానికి ఎదురుగా, గర్భాలయం ద్వారంలో నిలబడితే, మన నీడ ఒకటి మూడు చాయాల్లో, అయిదు చాయాల్లో ఎదుటి గోడ మీద పడుతుందట. ఈ కాంతి రహశ్యం తెలిసిన ఆ అజ్ఞాత శిల్పి చాతుర్యానికి మప్పి దాలు.
అంతే కాదండోయ్ ఈ ఊరి దగ్గరే "పచ్చల సోమేశ్వరాలయం" ఉందట. నల్ల రాతి స్థంభ నిర్మాణం అది. ఆ స్తంభాలపై మన ప్రతి బింబాన్ని చూసుకోవచ్చు నట. అంటే అంత నున్నగా చేక్కారన్న మాట. అద్దం లాగా ఉంటుందన్న మాట. లింగంలో "ఒక పచ్చ" ను శిల్పి పోదిగాడట. పచ్చలహారం నిత్యం స్వామికి ధరింపజేయటం వల్ల పచ్చల సోమేశ్వరుడు అయాడు.                                            

కొలను పాక కోటి లింగం
నల్గొండ జిల్లా భువన గిరికి ముప్ఫై కిలో మీటర్ల దూరంలో "కొలను పాక" ఉంది. ఇక్కడి కాశీ బుగ్గ అనే బావిలో ని నీరు "గంగా జలం" గా భావిస్తారు. దీని ప్రక్కనే  శివాలయం ఉంది. అందులోని స్వామిని "అపర కాశీవిశ్వనాధుడు "గా పూజిస్తారు. దీనికి దాదాపు ఎనిమిది వందల సంవత్స రాల చరిత్ర ఉంది. ఈ వూరికి నైరుతి భాగంలో ఒక చిన్న దేవాలయంలో ఒక శివ లింగం ఉంది. దీన్నే "కోటి లింగం" అంటారు. లింగం చుట్టూ గొలుసు లాగా అనేక లింగాలున్డటం ప్రత్యేకత. అందుకే ఆపేరు వచ్చింది.      

యజ్ఞోప వీతం ఉన్న కాళింగ  దేవి  
కరీం నగర్ జిల్లాలో మందెన గ్రామం ప్రసిద్ధి చెందినదే. మంత్ర కూటం అనే పేరు దానికి ఉండేది. నేపాల్ లోని పశుపతేశ్వర దేవాలయంలోని పూజారులు మందెన గ్రామ వాసులేనట. ఇక్కడ గౌతమ మహర్షి తపస్సు చేశాడట. ఇక్కడి శివాలయాన్ని అందుకే "గౌతమేశ్వర ఆలయం" అంటారు. ఇక్కడ భూమిని తవ్వితే బయట పడ్డ ఇటుకలను నీటి పై వేస్తె తేలి పోతాయట. ఇదీ ఇక్కడి వింత. అమ్మ వారు కాళిందీ దేవి. నల్ల రాతి విగ్రహం. ఆమెకు యజ్ఞోప వీతం ఉండటం విశేషం. అంతే కాదు గోదావరి నది మధ్యలో ఒక దిబ్బ మీద పానువట్టంలో పద కొండు శివ లింగాలున్డటం వింతల్లో వింత అయితే నందీశ్వర విగ్రహంలో పద కొండు నందులున్డటం మరీ విడ్డూరం అని పిస్తుంది. మందెన గోదావరి తీర గ్రామం. వేద పండితులకు నిలయం. మన పూర్వ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని బహు భాషా వేత్త పీ.వి.నర సింహారావు గారిది కూడా ఈ గ్రామం కావటం మరో విశేషం.

మన వైపే చూసే నందీశ్వరుడు
వరంగల్ జిల్లా హనుమ కొండకు 70 కి.మీ. దూరంలో ఉన్న "పాలం పేట" చిన్న గ్రామం.  గ్రామానికి, చెరువుకు మధ్య రామప్ప దేవాలయం ఉంది. కాకతి చక్రవర్తి న్గనపతిదేవుడు నిర్మించిన రుద్రేశ్వరాలయం ఇకడే ఉంది. నక్షత్ర ఆకారంగా ఉండే వేదిక పై ఆలయం నిర్మించారు. పన్నెండు నల్ల రాతి యక్షినీ విగ్రహాలు, ఆలయ పై భాగాన్ని మోస్తున్నట్లుగా శిల్పాలుంటాయి. అనీ కదులుతున్న బొమ్మల్లాగా కనిపించటం విశేషం. ఆ శిల్ప శోభ అనన్య సదృశం. ఆలయ నిర్మాణానికి చాలా పెద్ద  ఇటుకలను ఉపయోగించారు. అవి తేలికగా ఉండటమే కాదు, నీటి పై తేలటం విచిత్రంగా వుంటుంది. రుద్రేశ్వర స్వామి భారీ శివ లింగం. నాగిని అనే నగ్న స్త్రీ శిల్పం అందర్నీ యిట్టె ఆకర్షిస్తుంది. ఆమె శరీరం చుట్టూ పాములు చుట్టూ కొన్నట్లుగా నిర్మించి, అబ్బుర పరుస్తాడు శిల్పాచార్యుడు. ఆ శిల్ప సోయగం ఆనందపు అంచుల్ని చేరుస్తుంది. ఇక్కడి రుద్ర స్వామికి అభిముఖంగా ఉండే నందీశ్వర విగ్రహం వింత గోలుపుతుంది. నందీశ్వరుని కళ్ళు మన వైపే చూస్తున్నట్లుగా ఉంటాయి. ఏ వైపు నుంచి చూసినా, మనల్నే ఆయన చూస్తున్నట్లు గా చెక్కటం పరమాద్భుతం అని పిస్తుంది. నల్ల రాతి విగ్రహంలో అనంత మైన శిల్ప విన్నానాన్ని దర్శింప జేసిన ఆ శిల్ప బ్రహ్మ. .సృష్టికే ప్రతి సృష్టి చేశాడనిపిస్తుంది. 

భారీ శిలా ధ్వజ స్తంభం
చిత్తూరుజిల్లా మదనపల్లికి దగ్గరలో "సోమపాలెం" శివాలయంలో 45 మీటర్ల ఎత్తు ఉన్ననాల్గు పలకల రాతితో చేయబడిన ధ్వజస్తంభం చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆనందంతో పాటు విపరీతమైన ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది. ఇంత భారీ రాతి ధ్వజ స్తంభం ఇంకెక్కడా లేదని చెబుతారు. ఈ స్వామికి రాతి రధం కూడా ఉండటం మరో విశేషం. ఈ భారీ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారట. వారి కళా పోషణకు, భక్తీ  వైభవానికి ఇది మచ్చు తునక.

తండ్రీ కొడుకులకు గుడులున్న "భైరవ కొండ"
బ్రహ్మకు ఆలయాలు ఉండటమే వింత అయితె, ఆయన తండ్రి విష్ణువు తో కూడిన ఆలయం వుండటం మరీ వింత.  ఆ విచిత్రానికి నిలయమే నెల్లూరు జిల్లా లోని ఉదయగిరికి దగ్గరలో ఉన్న భైరవ కొండ గ్రామం. ఒకే రాతి తో చేసిన  ఎనిమిది గుహాలయాల సముదాయంలో శివ లింగాలున్డటం ఇక్కడ మరో విశేషం. ముందు ముఖ మండపం,  తర్వాత గర్భ గుడి ఉంటాయి. ఈ గుహలన్నీ తూర్పు ముఖం గా ఉంటే, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా ఉంటుంది. గుహల ముందు చిన్న సెలయేరు ఉంటుంది. దక్షిణాన వైపు బ్రహ్మ విగ్రహం, ఉత్తరం వైపు విష్ణు విగ్రహం ఉంటాయి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను అంటే త్రిమూర్తులను ఒక్క చోటే దర్శించే మహద్భాగ్యం కలుగు తుందన్న మాట.                 

బొట్టు పెట్టు కోని లచ్చి 
నెల్లూరు జిల్లా పెంచలకోన గ్రామంలో నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. స్వామిని "పెంచలయ్య" అని భక్తులు ఆప్యాయంగా పిలుచుకొంటారు. ఆ పేరునే పిల్లలకు పెట్టు కొంటారు భక్తిగా. ఆ స్వామికి నిత్య పూజ ఉండదు. ఇదే ఇక్కడి వింత. ఒక్క శని వారమే పూజాదికాలు నిర్వ హిస్తారు.  మూల విరాట్టు అయిన నరసింహ స్వామి రెండు రాళ్ళు పెన వేసుకోన్నట్లు ఉండే శిలా ప్రతిమ. ఆయనకు లచ్చి (లక్ష్మి), చెంచీత అనే ఇద్దరు భార్యలున్నారని మనకు తెలుసు. చెంచీతను పెండ్లాడాడని లచ్చికి కోపం వచ్చింది. ఇంకేముంది అలిగి బొట్టు చెరుపుకుని, చీకట్లో ఒక మూల కూర్చుందట. అందుకే లచ్చి విగ్రహానికి భక్తులు ఎన్ని సార్లు కుంకుమ అద్దటానికి ప్రయత్నం చేసినా అతకదట. జారి పోతుందట. తమాషా గా ఉంది కదా! అదీ ఆడ వారి ప్రతిజ్ఞా, సాధింపూ.

ఒంటిపాదం పై లక్ష్మీ నృసింహులు   
అంతపురం జిల్లాలో అనంతపురానికి దగ్గరలో "పెన్నఅహోబిల క్షేత్రం" ఉంది. సముద్ర మట్టానికి 1360 అడుగుల ఎత్తున శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం ఉంది. అయితే వింత ఏమిటంటే విగ్రహం లేని ఆలయం ఇది. నల్ల రాతి మీద శ్రీ లక్ష్మీనరసింహని పాదం ఒక్కటి మాత్రమే కన్పిస్తుంది. హిరణ్యకశిపుని వధ తర్వాత స్వామి ఇక్కడికి వచ్చి, ఒంటి పాదం పై నిలబడ్డాడని ఐతిహ్యం. పాదం కింద ఒక బిలం ఉంది. ఎన్ని బిందెల నీరు స్వామి పాదానికి అభిషేకం చేసినా ఆ నీరు ఆ బిలంలోకి జారి పోతుందట. ఆ బిలం ఎప్పుడూ నిండదు . ఇదీ విచిత్రం. కొండ  కింద లక్ష్మీ దేవి ఆలయం ఉంది. ఇక్కడా అమ్మ వారి విగ్రహం లేదు. ఒక్క శిల మాత్రమే ఉంది. గుడికి కొద్ది దూరంలో ఒక రాతి మీద వరాహ పాద చిహ్నాలు కన్పిస్తాయి. కనుక స్వామి వరాహాన్ని వేట ఆడాడని భక్తుల విశ్వాసం.

రంగులు మారే కోనేరు
అనంతపురం జిల్లా లోని "హేమావతి" అతి ప్రాచీన చోళ రాజదాని. ఇక్కడ గొప్ప విశ్వ విద్యాలయం ఉందట. దానికి అనంత శివ దేవుడు అది పతి అని చరిత్ర. ఇక్కడే సిద్దేశ్వర, మల్లేశ్వర ఆలయాలున్నాయి. ఆలయంలోని కోనేరులోని నీరు ఉదయం ఎరుపు రంగులో మధ్యాహ్నం ఆకుపచ్చగా, సాయంత్రం పసుపు రంగు  లోను కన్పించి చిత్రాతి చిత్రం అని పిస్తుంది. ఈ విచిత్రానికి కారణం ఏమిటో ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్ట లేకపోయారు. 

నారాయణ పాద పూజ చేసే సూర్య నారాయణుడు
చిత్తూరు జిల్లా తిరుపతికి దగ్గరలో "నాగలా పురం" లో శ్రీ కృష్ణదేవరాయలచే నిర్మింపబడిన "వేద నారాయణ స్వామి" ఆలయం ఉంది. సూర్యకిరణాలు వేద నారాయణ స్వామి పాదాలపై పడిన సమయంలోనే, ఇక్కడి నారాయణ స్వామికి పూజ జరగటం ప్రారంభమవుతుంది అదీ విశేషం.

కుంభకోణంలో కుండ మూతి లింగం
తమిళ నాడు లోని కుంభకోణంలో వెలసిన "కుమ్భేశ్వర స్వామి" లింగం కుండా మూతి లాగా ఉండటం తో ఆ పేరు వచ్చింది. ఇక్కడ మహా మాఘం అనే కొలను ఉంది. పన్నెందేల్లకు వచ్చే పర్వ దినమే మహా మాఘం. .ఆ సమయంలో ఆ కొలనులో "గంగా జలం" పుడుతుందని భక్తుల విశ్వాసం. ఇదీ ఇక్కడి వింత, విశేషం.  మహా మాఘంలో ఉత్సవం అమోఘం గా జరుగుతుంది.

వ్రేలి ముద్రలు కని పించే సైకత లింగం
కర్నూలు జిల్లా ప్రొద్దుటూరు కు దగ్గర్లో ముక్తి రామేశ్వరం ఉంది. .ఇక్కడి లింగం ఇసుక తో చేసింది. సైకత లింగం అంటారు. .లింగం అయిదు అంగుళాల ఎత్తు మాత్రమే ఉండటం విచిత్రం. ఈ లింగం పై ఇసుకను అదిమి పెట్టిన చేతి వ్రేలి ముద్రలు ఇప్పటికీ కని పించటం విశేషం.

ఉత్సవాలు లేని కోటి పల్లి లింగం
తూర్పు గోదావరి జిల్లా కాకినాద కు దగ్గర్లో గోదావరి ఒడ్డున కోటి పల్లి దివ్య క్షేత్రం. దేవేంద్రుడు నిర్మించిన స్వంభూ శివలింగం, ఆలయం ఉన్నాయిక్కడ. పాతాళం నుంచి ఈ లింగం ఉద్భవించినదని పురాణ కధనం. ఇది ‘’యోగా లింగం ‘’అవటం వల్ల ఉత్స వాలు ఉండవు. ఈ కోటేశ్వర స్వామికి చైత్ర మాసం నుండి అయిదు నెలలు కోటి తీర్ధంలో ఉంటాడు. మిగతా ఏడు నెలలు కోటి తీర్ధ జాలం నేల మట్టం వరకు వుండి, భక్తులకు దర్శనం ఇస్తూ, ఆనందం మాత్రమే కల్గించటం విశేషం.
                                   
కన్నీరు కార్చే గరుడుడు
నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేటకు రెండు కిలోమీటర్ల దూరంలో మన్నారు పోలూరు గ్రామం పురాణ ప్రసిద్ధి చెందింది. ఇక్కడే జాంబవంతునికి, శ్రీ కృష్ణుడికి యుద్ధం జరిగిందని అంటారు. ఇక్కడున్న "అలఘు మల్లామ్క్రిష్ణ" దేవాలయం చాలా పురాతన మైనది. చాళుక్య రాజులు కట్టిన దివ్య దేవాలయం ఇది. ఇక్కడ సుగ్రీవ, జాతాయు, జాంబవంత, గరుత్మంతుల భారీ విగ్రహాలు అందర్ని ఆకర్షిస్తాయి. స్వామి భక్తులంతా కొలువుదీరినట్లు ఉంటుంది. దీన్ని మనికాంత క్షేత్రం అని కూడా పిలుస్తారు. స్వామి గర్భాలయానికి దక్షిణంగా "సౌందర్య వల్లి" అమ్మవారు ఉంటారు. స్వామికి ఎదురుగా తొమ్మిది అడుగుల ఎత్తున గరుత్మంతుని విగ్రహం సమ్మోహన పరుస్తుంది. గరుడుని కంటి నుంచి కన్నీరు ఒలుకుతున్నట్లు శిల్పి విగ్రహాన్ని మహాద్భుతంగా మలిచాడు. శమంతక మణిని శ్రీ కృష్ణుడు ఇక్కడే జాంబవంతుని దగ్గర నుండి పొందాడని ఐతిహ్యం. సత్య, జాంబవతీ సమేత శ్రీ కృష్ణ స్వామి దర్శనం సర్వ శుభ ప్రదం. ఇక్కడే సత్యభామకు గర్వభంగం అయిందట. ఈ ప్రదేశంలోనే ఆంజనేయుని చేత గర్వభంగం అయిందిని తనకు జరిగిన అవమానాన్ని దుఃఖిస్తూ, తన స్వామికి మొర పెట్టు కొనే సన్నివేష రూప కల్పనే గరుడుని కన్నీరు గాధ. ఇప్పటికి ఆ కన్నీరు గాధను మనం చూడ వచ్చు. అద్భుత మైన వింత ఇది. ఇక్కడి శిల్ప సౌందర్యం చిత్రాతి చిత్రంగా ఉంది మనసులను ఆకర్షిస్తుంది.



Friday, 22 August 2014

అష్టాదశ శక్తిపీఠాలు 2



అష్టాదశ శక్తిపీఠాలు
శ్రీ శాంకరీ దేవి
ఈ పీఠం శ్రీలంకలో ఉంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి. ఇది అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం. రావణుని స్తోత్రాలకు ప్రసన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది.రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధాన మైందని తెలుస్తోంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షుల చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.

శ్రీ శృంఖలా దేవి
శృంఖలా దేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని ప్రతీతి.త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు.ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ.ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు.

శ్రీ చాముండేశ్వరీ దేవి
ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. సముద్రమట్టానికి 3500 కి.మీ. ఎత్తున ఉన్న చాముండీ హిల్స్‌పై ఈ శక్తి పీఠం ఉంది.మైసూరులో ఉన్న ఈ శక్తిపీఠం వద్ద దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయ గోపురం ఏడు అంతస్తులు. ప్రతి గోపురంపై ఒక చాముండేశ్వరి శిల్పం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావిచెట్టు, ఆలయం చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశం. ఈ దేవాలయానికి సమీపంలోనే నల్లరాతితో మలచిన 16 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు గల నంది విగ్రహం ఉంటుంది. ఈ శక్తిపీఠం సుమారు రెండువేల సంవత్సరాల నాటిదని చెబుతారు.
ఈ శక్తి పీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా, చాముండేశ్వరిగా కొలువైవుంది. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వామి ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి.దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.
ఆలయ చరిత్ర:
ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి క్రౌంచపట్టణమని పేరుండేది. అశోకుని కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసుర మండలమని పిలిచేవారు. ఆధునిక కాలంలో మైసూర్‌ ప్రాంతాన్ని పరిపాలించిన వడయార్‌ (రాజవంశరాజు) ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. 1895-1940 కాలంలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో చాముండేశ్వరి ఆలయం అత్యంత సుందరమైన ఆలయంగా రూపొందింది.
పురాణగాథ:
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై ఒక స్ర్తీ శక్తిని సృష్టిస్తారు. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. ముందుగా చండ, ముండ అనే రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళే మార్గంలోనే మహిషాసురుని విగ్రహం ఉంది. ఒక చేతిలో కత్తితో, మరొక చేతిలో పడగవిప్పిన పాముతో ఈ శిల్పం భయంకరంగా కనిపిస్తుంది. మహిషాసురుని వధించిన ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను చాముండేశ్వరి ప్రసాదిస్తుందని విశ్వాసం.

శ్రీ కామాక్షీ దేవి
ఈ పీఠం తమిళనాడులో ఉంది. ఇది అమ్మవారి వీపు భాగం పడిన చోటు. కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసింది. కాంచి అంటే వడ్డాణం. భూమికి వడ్డాణం స్థానంలో కంచి ఉందిట. ఇక్కడ విభిన్నాకారాలతో ఆకులు ఉండే ఒక మామిడి చెట్టు ఉంది. ఒక్కొక్క కొమ్మకు ఒక్కో రుచి ఉన్న పండు కాస్తుందని చెబుతారు.

పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్‌లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, తామర పుష్పాన్ని, చిలుకను పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.

కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిిష్ఠించారట.

శ్రీ మహాలక్ష్మీ దేవి
ఈ పీఠం మహారాష్టల్రోని కొల్హాపుర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయి అని చెప్పుతారు. మహాలక్ష్మి అనే పేరు ఉండడం మూలంగా ఈ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు భార్య అని అనుకుంటారు. కానీ, ఈమె విష్ణుపత్ని కాదు. 18 భుజాలతో రజోగుణంతో భాసిల్లుతున్న మహాశక్తి. ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

పంచగంగ నది ఒడ్డున కొల్హాపూర్‌ నగరం ఉంది. కొల్హాపూర్‌ దేవాలయాన్ని క్రీస్తు శకం ఏడో దశాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజు కరణ్‌ దేవ్‌ కట్టించారు. ఆ తరువాత 9వ శతాబ్దంలో యాదవ రాజు వంశానికి చెందిన షిలాహార యాదవుడు మరింత అందంగా దేవాలయాన్ని తీర్చిదిద్దటానికి కృషిచేశాడు. దేవాలయంలో లోపల మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం స్వయం వ్యక్తమని ప్రజలు భావిస్తారు. అమ్మవారికి అర్చకులు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు.

ఈ మహాలక్ష్మి దేవాలయం హేమాడ్‌ పంతి నిర్మాణశైలిలో కట్టబడినది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్‌ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్న తెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

శ్రీ గిరిజా దేవి
ఒరిస్సాలో వైతరణీనదీ తీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి భాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. ఇక్కడి గిరిజాదేవి సింహవాహనగా కనిపిస్తుంది. అమ్మ వారు ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని దర్శనమిస్తుంది. ఈమె శక్తి త్రయరూపిణి.

శ్రీ ఏకవీర్యకా దేవి
ఈ శక్తి పీఠం మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. ఇది అమ్మవారి కుడి హస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శన మవుతుంది. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి. ఒక దానిపై అత్రి- అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరికా దేవి ప్రతిష్ఠితిమయ్యారు. అమ్మవారి ముఖం గర్భాలయపు పై కప్పునుతాకేంత పెద్దదిగా ఉంటుంది. జమ దగ్ని రేణుకా దంపతులకు చెందిన కథ ఇక్కడ జరిగిందని చెపుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ఛిన్నమస్త అని కూడా అంటారు.

శ్రీ మహంకాళీ దేవి
ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడిఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమినుంచి కుజుడు విడిపోయిన ప్రాంతం ఇది అని జ్యోతిషశాస్తవ్రేత్తలు చెపుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది. ఈ ఆలయాన్ని గర్‌ కాళికా అని కూడా పిలుస్తుంటారు. దేవీ మాతలందరిలో కాళికామాతకు ఎనలేని ప్రాధాన్యముంది. ప్రాచీన భారతీయ కవులలో అగ్రగణ్యుడైన కాళిదాసు సైతం కాళికా దేవి భక్తుడని చెబుతుంటారు.

పురాణాల ప్రకారం కాళిదాసు నిత్యం కాళీమాతను పూజించేవాడు. గర్‌ కాళిక ఆశీర్వాదం వల్లే అతడికి అపూర్వమైన కవితాశక్తి అబ్బింది. కాళికా మాతను పూజించడానికి శ్యామలా దండకం పేరిట జగత్ప్రసిద్ధమైన స్తోత్రాన్ని కాళిదాసు రచించాడు. ఉజ్జయినిలో ప్రతి ఏటా నిర్వహించే కాళిదాస్‌ సమారోహ్‌ కార్యక్రమంలో ఈ దండకాన్ని పఠిస్తుంటారు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ఈ గర్‌ కాళిక ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనే విషయం ఎవరికీ తెలీదు కానీ మహాభారత కాలంలో నిర్మించారని ప్రజల నమ్మకం. అయితే మహా భారత కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించిన ప్పటికీ కాళికామాత విగ్రహం మాత్రం సత్య యుగానికి చెందినదని చెబుతుంటారు. హర్ష వర్ధన రాజు హయాంలో ఈ ఆలయానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు ఆధారాలు ఉన్నాయి. తర్వాత చాలాకాలానికి గ్వాలియర్‌ రాజు ఈ ఆలయానికి తిరిగి మరమ్మతులు చేయించారు. సంవత్సరం పొడవునా ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి కాని,నవరాత్రులలో మాత్రం భారీస్థాయిలో ఉత్సవాలు నిర్వహించబ డతాయి. మతపరమైన యజ్ఞాలు, పూజలు కూడా నవరాత్రుల సమయంలో ఇక్కడ భారీ స్థాయిలో నిర్వహించబడతాయి.

శ్రీ మాధవేశ్వరీ దేవి
ఈ పీఠం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా ఈ స్థలాన్ని చెబుతారు. బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో గాయాలు చేసినందున ప్రయాగగా మారింది. ఈమెను కృతయుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి.అమృతతీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ఱుడు ఈ తల్లిని పూజించారు. సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.ఈ తల్లి శక్తిత్రయస్వరూపిణి.

శ్రీ సరస్వతీ దేవి
కాశ్మీర్‌లో శ్రీనగర్‌కు 40 కి.మీ. దూరంలో తుళుముల ప్రదేశంలో ఈ శక్తి పీఠం ఉంది.అమ్మవారి దక్షిణ హస్తం పడిందని చెబుతారు. సరస్వతీ దేవిని కీరవాణి అని పిలుస్తారు.పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్ధ్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణ కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తన ను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠం. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

శ్రీ కామ రూపా దేవి
అస్సాం గౌహతి సమీపంలోనీ నీలాచలపర్వతశిఖరం పై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాఢమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

శ్రీ మాంగళ్య గౌరీ దేవి
ఈ పీఠం బీహార్‌లోని గయలో ఉంది. అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరియైైన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.

శ్రీ విశాలాక్షీ దేవి
ఈ పీఠం ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ఉంది. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. కాశీలో 1500 ఆలయాలకు పైగా ఉన్నాయి. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదాన పుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం నిర్మించుకున్న పట్టణం కాశి. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలిసింది విశాలాక్షి పీఠం.

అయోధ్య, మధుర, హరిద్వార్‌, కాంచీపురం, కాశీ, ఉజ్జయిని, ద్వారక సప్త మోక్ష ప్రదాయికాల్లో కాశీక్షేత్రం శ్రేష్టమైనది. ఈ పుణ్యస్థలంలో మహావిష్ణువు ముక్కంటిని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఓసారి సూర్యభగవానుడు ఆకాశ మార్గాన వెళ్తుండగా, మహావిష్ణువు కాశీలో శివ లింగపూజలో ఉండటం గమనిస్తాడు. ఉమాపతి కొలువైన ఈ పుణ్యస్థలంలో పూజలు చేస్తే అత్యంత పుణ్య ఫలం లభిస్తుం దని మహావిష్ణువుచే తెలుసుకుని ఆదిత్యుడు ఆ ప్రాంతంలో లింగాన్ని స్థాపించి పూజించ సాగాడు. మహావిష్ణువు మాత్రమే కాకుండా, సృష్టికర్త బ్రహ్మ కూడా ఈశ్వరుని వేడు కుంటూ పది అశ్వమేధయాగాలు చేశాడు.

ఈ దశాశ్వ మేథఘాట్‌కు ఇప్పటికీ బ్రహ్మదేవుడు పూజలు చేస్తుంటాడని ప్రతీతి. అటువంటి ఈ పుణ్యస్థలిలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ, పుష్పమాలాలంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.

శ్రీ వైష్ణవీ దేవి
హిమాచలప్రదేశ్‌లో పఠాన్‌కోటలో జ్వాలా ముఖి రైల్వే స్టేషన్‌కు 20 కి.మి.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటిది. జమ్మూలో కాట్రా వద్ద ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని శక్తిపీఠంగా చెపుతారు. భైరవనాథుడు అనే తాంత్రికుని బారి నుండి విష్ణుభక్తురాలైన ఒక బాలిక తప్పించుకుని, అతని తం త్రాలను తిప్పికొట్టిన కథ ప్రచారంలో ఉంది. ఈమెను వైష్ణవ దేవి అని పిలుస్తారు.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...