Showing posts with label ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు. Show all posts
Showing posts with label ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు. Show all posts

Sunday, 5 August 2018

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు అష్టాదశ శక్తిపీఠాలు

State Name12 Jyotirlingas18 Shakti Peethas
1.Maharastra - మహారాష్ట్ర్ర 1) Grishneshwar -Near Aurangabad-గ్రిష్ణేశ్వర్
2) Triambak- Near Nashik- త్రయంబక్
3) Bhimashankar -భీమశంకర్ Near Pune
1) Ekaveerika/Renukadevi -Mahur ఏకరవీరికా దేవి,మహూర్
2) Mahalaskhmi - Kolhapur మహాలక్ష్మీ, కొల్హాపూర్
2.Gujarath గుజ‌రాత్ 4)Somnath-సోమనాధ్
5) Nageshwar -నాగేశ్వర్ Near Dwaraka
3.Madya Pradesh మధ్యప్రదేశ్ 6) Mahakaleshwar- Ujjain మహాకాశేశ్వర్, ఉజ్జయిని
7) Omkareshwar ఓంకారేశ్వర్
3)Ujjain – ఉజ్జయిని


4.Jammu & Kashmir జమ్ము,కాశ్మీర్ 4) Vishnodevi-వైష్ణోదేవి Jammu-Katra
5.Himachal Pradesh హిమాచల్ ప్రధేశ్ 5) Jwalamukhi - జ్వాలాముఖి – Kangra
6.Uttarakhand ఉత్తరాఖండ్ 8) Kedharnath కేధార్ నాధ్ (Temple Closing Times up to Ukimat)
7.Uttara Pradesh ఉత్తరప్రధేశ్ 9) Vishwanath Temple -Kasi/Varanasi విశ్వనాధ ఆలయం,కాశి 6)Madhaveshwari-Allahabad మాధవేశ్వరి, అలహాబాదు
 7) Vishalakshi- Kasi/Varanasi విశాలక్ష్మీ, కాశి
8.Bihar బిహార్ 8) Sarwa Mangala Devi-Gaya సర్వమంగళదేవి,గయ
9.Jharkhand జార్కండ్ 10) Baidyanath, Deogarh బైధ్యనాధ్, థియోగర్
10.West Bengal వెస్ట్ బెంగాల్ 9)Srinkala-Pandua (Present Minar) శ్రుంకళ- పాండువ
10) Kalika Mandhir, Kalighat, Kolkata కాళికమందిర్,కలకత్తా (Adi Shakti Peetha)
11.Assam అస్సాం 11) Kamarupadevi, కామరూపదేవి,గౌహతి Kamakhya – Guwahati
12.Orissa ఒరిస్సా 12) Girijadevi-Jaipur గిరిజాదేవి, జైపూర్ 
13) Bhimaladevi-Puri భీమల(Adi Shakti Peetha)
14) TaraTarani-తారతరణి బెర్హంపూర్ Berhumpur (Adi Shakti Peetha)
13.Andhra Pradesh ఆంధ్రఫ్రదేశ్ 11) Mallikarjuna Swamy, Srisailam మల్లిఖార్జున,శ్రీశైలం 15) Puruhutika devi -పురుహుతిక - పిఠాపురం
16) Manikyamba Devi -మానిక్యాంబదేవి(ద్రాక్షారామం)
17) Bramarambika- భ్రమరాంభిక- Srisailam
14.Telangana తెలంగాణ 18) Jogulamba-జోగులాంబ- అలంపూర్
15.Tamilnadu తమిళనాడు 12) Rameshwaram రామేశ్వ‌రాల‌యం , రామేశ్వరం 19) Meenaskshi-Kanchi మినాక్షి – కంచి
16.Karnataka కర్ణాటక 20) Chamuneshwari-చాముండేశ్వరి- Mysore

Wednesday, 14 March 2018

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు









ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు










సోమనాథలింగం



ద్వాదశ జ్యోతిర్లింగాలలో(12) మొదటిదిగా వర్ణించబడింది సోమనాథలింగం. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రములోని ప్రభాస పట్టణానికి సుమారు 40 కి.మీ.ల దూరంలో ఉన్నది.

యాత్రామార్గం:
విజయవాడ నుండి ఖాజీపేట, సికింద్రాబాద్, కురిదివాడి, పూనాల మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాద్, వీరంగం స్టేషన్‌లమీదుగా వెరావల్ స్టేషన్‌లో దిగాలి. వెరావల్ రైల్వేస్టేషన్ నుండి 7 కి.మీ. దూరంలో వున్న సోమనాథ్ క్షేత్రానికి బస్సు ద్వారా వెళ్ళవచ్చు.

పురాణగాథ:
ఈ జ్యోతిర్లింగము చంద్రుని వలన ప్రతిష్ఠింపబడిందని చెబుతారు. దక్షప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరియైన జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయిన చంద్రునికిచ్చి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావటంవల్ల ఆమె పై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికి ఇది అసూయను కల్గించింది. రోహిణి తప్ప మిగిలిన 26 మంది ఈర్ష్యతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి తమబాధను చెప్పుకున్నారు. దక్షుడు చంద్రుణ్ణి పిలిచి భార్యలందరిని సమానమైన ప్రేమతో చూడమని పలువిధాలుగా నచ్చచెప్పాడు. కాని మామగారి మాటలు చంద్రుని మనస్సునకు ఎక్కలేదు. అందువల్ల అతడు మునుపటి కంటే ఎక్కువగా రోహిణిపై అనురాగాన్ని చూపించాడు అందుకు దక్షుడు పట్టరానికోపంతో చంద్రుణ్ణి “క్షయరోగంతో పీడించబడుదువుగాక” అని శపించాడు. అప్పటినుంచి ఆ శాపం కారణంగా చంద్రుడు తన కళలను కోల్పోవటం ప్రారంభించాడు. సుధాకరుని సుధాకిరణములు నీరిసంచి పోవటంవల్ల అమృతమే ఆహారముగా గల దేవతలు హాహాకారాలు చేయసాగారు. ఓషధులు వాడిపోయాయి. చరాచరజగత్తు అంతా నిస్తేజం అయిపోయింది. అపుడు ఇంద్రుడు మొదలైన దేవతలు, వశిష్టుడు మొదలైన మునీంద్రులు కలసి చంద్రుని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ ఉపద్రవం నుండి లోకాలనన్నింటిని రక్షించమని వేదుకున్నారు. అప్పుడు బ్రహ్మ చంద్రునితో పవిత్రమైన ప్రభాసతీర్థానికి వెళ్ళి పరమశివుని ఆరాధించవలసినదిగాను అందువల్ల సమస్త శుభములు చేకూరగలవని హితవు చెప్పి, అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు.

ఆ తరువాత చంద్రుడు దేవతలతో కలసి ప్రభాసక్షేత్రానికి వెళ్ళి నిష్టతో మహేశ్వరుని ఆరాధించి, ఆరు మాసాల కాలం (ఘోరమైన) తపస్సు చేశాడు. దీక్షతో 10 కోట్లసార్లు మృత్యుంజయమంత్రాన్ని జపించాడు. చంద్రుని భక్తికి మెచ్చిన శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు చంద్రుడు ఆ పరమ శివునికి సాష్టాంగ ప్రణామం చేసి తనను అనుగ్రమింపమని శివుని కటాక్షవీక్షములను తనపై ప్రసరింపచేసి శాప నివృత్తిని కలిగించమని ప్రార్థించడు. కరుణామయుడైన శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షుడి శాపాన్ని రూపుమాపే అవకాశం లేదని చెప్పి దానికి సవరణలు చేస్తాడు. కృష్ణ పక్షంలో మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగానూ, శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్థమానం అయ్యేటట్లు, పూర్ణిమనాటికి కళాపరిపూర్ణుడుగా విరాజిల్లగలడనీ వరం ప్రసాదించాడు.

ఈ విధంగా మరల అమరత్వం ప్రసాదించిన చంద్రుడు కళాప్రపూర్ణుడై కళకళలాడుతూ మునుపటి వలెనే అమృతవర్షాన్ని కురిపంచసాగాడు. అపుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతీసమేతుడై ఈ ప్రభాసక్షేత్రములో సోమనాథునిగా నిలిచిపోయాడు.

ఈ సోమనాథ లింగమును దర్శించటానికే తప్ప తాకటానికి మాత్రం భక్తులకు అవకాశం లేదు. పశ్చిమ సముద్రతీరాన, రామేశ్వరంలాగా ఉన్న జ్యోతిర్లింగం ఇది. ఈ ఆలయ వాస్తునిర్మాణం, త్రయంబకేశ్వరాలయాన్ని గుర్తుకు తెస్తుంది.








మల్లికార్జున లింగం:

12 జ్యోతిర్లింగాలలో రెండవదిగా చెప్పబడే ఈ జ్యోతిర్లింగం శక్తిపీఠంలో కలిసి ఉండటం వలన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. ధూళి దర్శనం ఆచారంగా ఉన్న శ్రీశైలమహాక్షేత్రంలో యుగయుగాలనుండి స్వామిని తాకి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకొనే అవకాశం ఉంది.

యాత్రామార్గం:
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన కూడలుల నుండీ నేరుగా బస్సులున్నాయి. విజయవాడ- కర్నూలు మార్గంలోని దోర్నాల నుండి 49 కి.మీ. ఘాట్ రోడ్డులో ప్రయాణించవలసి ఉంటుంది. రాత్రి గం 9.00 ల నుండి ఉదయం 6 గం ల వరకు ప్రేవేటు వాహనాలు ఘాట్‌లో ప్రవేశించే అవకాశం ఉండదు. దోర్నాల నుండి శ్రీశైలానికి రోజూ సుమారు 40 ఆర్.టి.సి. బస్సులు వెడతాయి. ఇవన్నీ ఇతర ప్రాంతాల నుండి శ్రీశైలం వెళ్ళే బస్సులే.

ఉనికి:
శ్రీశైలమహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, ఆత్మకూరు తాలూకాలోనున్న నల్లమల అడువులలోని పర్వతశ్రేణుల నడుమ పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున ఉంది. 16⁰12 ఉత్తర అక్షాంశము, మరియు 78⁰5 తూర్పు రేఖాంశముల వద్దనున్న యీ క్షేత్రపు ఎత్తు సముద్రమట్టానికి 476 మీటర్లు (1500 అడుగులు).

శ్రీశైల మహిమ:
12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జునస్వామికి 18 శక్తిపీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవికి, నిలయమైన యీ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై, ఎనిమిది శృంగాలతో, 44 నదులతో, 60 కోట్ల తీర్థరాజాలతో, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్రగుండ, సూర్యగుండాది పుష్కరిణులతో, స్పర్శ వేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో, అనంతమైన ఓషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనస్సులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

శ్రీశైల దర్శనఫలం:
కురుక్షేత్రంలో లక్షలకొలదీ దానమిచ్చినా రెండువేలసార్లు గంగాస్నానం చేసినా,నర్మదానదీ తీరంలో బహుకాలం తపస్సాచరించినా, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైల మల్లికార్జునుని ఒక్కసారి దర్శించినంతనే కలగుతుందని స్కాందపురాణం చెబుతోంది.

శిఖరదర్శన మాత్రాన, అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మనుండి ముక్తిని కలిగించే ఈ క్షేత్రాన్ని ఆయా మాసాలలో సందర్శించేవారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు అచరించినందువల్ల కలిగే ఫలాన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణం చెబుతున్నది.

యుగయుగాలుగా  ప్రసిద్ధికెక్కిన యీ శైవక్షేత్రం కృతయుగంలో హిరణ్య కశిపునికి పూజామందిరం కాగా, అహోబిలక్షేత్రం సభామండపమనీ, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీసమేతుడై శ్రీశైలనాధుని సేవించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాస సమయంలో ద్రౌపదీ సమేతులై యీ క్షేత్రంలో కొంతకాలముండి, లింగాలను ప్రతిష్ఠించారని చెప్పబదుతోంది. ఇందుకు నిదర్శనంగా నేటికీ యీ క్షేత్రంలో, రామప్రతిష్ఠితసహస్రలింగం, సీత్పాతిష్ఠిత సహస్రలింగం, పాండవులచే ప్రతిష్ఠింపబడిన ‘సద్యోజాత ‘ మొదలైన ఐదు లింగాలు భక్తుల సేవల నందుకొంటున్నాయి.








మహాకాళేశ్వర లింగం:

మాలవ దేశంలోని ఉజ్జయిని పట్టణంలో శిప్రానది ఒడ్డున ఈ జ్యోతిర్లింగం ఉన్నది. ఉజ్జయిని నగరాన్నే అవంతి అని కూడా అంటారు. భారతేశంలోని మోక్షదాయకములైన 7 నగరాలలో అవంతిక ఒకటి. ఈ విషయాన్ని

అయోధ్యామధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః ||
అనే పురాణ వచనం చెబుతోంది.

స్కౌంద పురాణంలోని ఆవంత్య ఖండం ఈ నగరం యొక్క గొప్పతనాన్ని ఎంతగానో వర్ణించింది. శివపురాణంలోను మహాభారతంలోను ఉజ్జయిని యొక్క మహిమ ఎంతగానే చెప్పబడింది. ఇక్కడ ప్రవహించే శిప్రానదిలో స్నానం చేసినవారికి సర్వపాపాలు నశిస్తాయని, అష్టదరిద్రాలు దూరమైపోతాయని పురాణాలు చెప్పబడింది. శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేసిన సాందీపని ఆశ్రమం ఇక్కడే ఉన్నది. ఈ క్షేత్రమే విక్రమాదిత్యునికి రాజధాని అయి కాళిదాసు మొదలైన మహాకవులకు నిలయమయ్యింది.

యాత్రామార్గం:
విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్ళే మార్గంలో ఉజ్జయిని రైల్వేస్టేషన్ వుంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వరాన్ని సందర్శించిన భక్తులు 5 గంటల కాలం ప్రయాణించి ఉజ్జయినిని చేరుకోవచ్చు. ఈ దారిలో ప్రయాణించేవారు దారిలో ఇన్‌డోర్ నగరాన్ని కూడా చూడవచ్చు. ఇన్‌డోర్ నగరం ఒకప్పుడు రాణి అహాల్యాబాయ్ నివాసస్థలం. ఇన్‌డోర్ నగరం ఉజ్జయినికి 53 కి.మీ. దూరంలో వుంది.

పురాణగాథ:
ఒకప్పుడు అవంతి నగరంలో వేద విద్యలలో గొప్పవాడైన వేదప్రియుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దేవప్రియుడు, ప్రియమేథుడు, సుకృతుడు, సువ్రతుడు అని నలుగురు కుమారులు ఉండేవరు. వారంతా శివభక్తులే. ఇది యిలా ఉండగా అవంతి నగరానికి సమీపంలో ఉన్న రత్నమాల పర్వతం మీద నివసించే దూషణుడు అనే రాక్షసుడు వేదప్రియుని కీర్తిప్రతిష్ఠలు విని తన సైన్యంతో అవంతి నగరం మీదికి దండెత్తాడు.

ఆ పట్టణంలోని ప్రజలంతా ఆ రాక్షసుని చూచి ఆర్తనాదాలు చేయటం ప్రారంబించారు. ప్రజల ఏడుపుల ధ్వని ఆకాశాన్ని అంటుకుంది. కానీ శివభక్తుడైన వేదప్రియుడు మాత్రం ఆవంతైనా చలించలేదు. ఆయన నిశ్చలమైన మనస్సుతో శివదీక్షతో నిమగ్నుడై ఉన్నాడు. రాక్షసుడు అతనిని చూచి క్రోధంతో “నరకండి, చంపండి ” అంటూ వేదప్రియునిపై దురాక్రమణ చేశాడు. అప్పుడు శివుడు మహాకాళ రూపంతో సాక్షాత్కరించి ప్రళయ హుంకారంతో ఆరాక్షసుని భస్మంచేశాడు. తరువాత శంకరుడు ప్రసన్నవదనంతో వేదప్రియుని చూచి వరం కోరుకోమన్నాడు. వేదప్రియుడు చేతులు జోడించి నమస్కరించి “దేవ దేవా నా వంటి దీనులైన భక్తులను అకాల మృత్యువు నుండి రక్షిస్తూ సర్వకాలములలో ఇక్కడనే నెలకొని వుండు” అని ప్రార్థించాడు. శివుడు ఆ భక్తుని కోరికను అనుసరించి మహాకాళ నామంతో జ్యోతిర్లింగమై అచ్చట వెలసి ముక్తిని ప్రాసాదిస్తున్నాడు.

ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజు గొప్ప శివభక్తుడు. ఒకనాడు అతడు శివపూజలో నిమగ్నమై ఉండగా ‘శ్రీకరుడు ‘ అనే ఐదేళ్ళ గోపాలబాలుడు తన తల్లితోపాటు అక్కడకు వచ్చాడు. రాజుగారి దైవభక్తిని చూచి తన్మయుడైతాను కూడా స్వయంగా భగవంతుని ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్ళే మార్గంలోని శిలాఖండాన్ని ఒకదానిని తీసుకొని వెళ్ళి ఆ రాతిబండనే శివలింగంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించాడు. శ్రీకరుడు శివధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు అతని తల్లి వచ్చి భోజనమునకు రమ్మని పిలిచింది. తల్లిమాటలు వినిపించుకొనక కళ్ళు మూసుకొని తన్మయుడై ఉన్నాడు శ్రీకరుడు. పిలిచి పిలిచి వేసారిన అతని తల్లి చివరకు శిలాశకలాన్ని తీసి దూరంగా పారవేసింది.

శ్రీకరుడు తన ఇష్ట దైవమైన శివునికోసం పెద్దగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి మూర్ఛ పొందాడు. అపుడు భక్తసలభుడైన శంకరుడు శ్రీకరుని ముందు నిజరూపముతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీకరుడు కళ్ళు తెరచేటప్పటికి ఎదురుగా మహాకాళ మందిరం, అందులో దేదీప్యమానంగా ప్రకాశించే జ్యోతిర్లింగం అతనికి కనిపించాయి. అది చూచిన బాలుడు ఆశ్చర్యంతో పులకించిపోయాడు.మాహాదేవుడైన ఆ శివుని మరల స్తుతించటం ప్రారంభించాడు. ఇంతలో తల్లివచ్చి జరిగినదానిని చూచి ఆనందంతో ఉప్పొంగిపోయింది. కొద్ది సేపటిలోనే ఈ విషయం నగరమంతటా వ్యపించింది.

చంద్రసేన మహారాజు ఆ విషయం తెలుసుకొని వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి శ్రీకరుని భక్తికి ఆశ్చర్యం పొందాడు. ఇంతలో హనుమంతుడు వారి ముందు ప్రత్యక్షమై “ఓ మానవులారా ! ఈ చరాచర సృష్టికి శంకరుడే ఏకైక శరణ్యడు. ఆ మహాదేవుని ఆరాధించి తరింపుడు. వేలకొలది సంవత్సరములు తపస్సు చేసిన మహార్షులు కూడా పొందలేని ఫలమును శివపూజవలన ఈ బాలుడు సునాయాసంగా పొందగలిగెను. వీని సందర్శనము వలన వీరందరు ధన్యులైరి. ఈ గోపబాలుని ఎనిమిదవ తరమున నందుడను వాడు జన్మించును. మహావిష్ణువు ఆ నందునికి కుమారుడై జన్మించి లోకోద్ధరణ చేయగలడు.” అని చెప్పి అదృశ్యమయ్యాడు.

శ్రీ మహాకాళలింగమును సేవించి వేదప్రియుడు, శ్రీకరుడు, చంద్రసేన మహారాజు మొదలైనవారు శివసాన్నిద్యం పొందారు.

“ఆకాశే తారకం లింగం పాతాలే హటకేశ్వరం
మర్త్యలోకే మహాకాలం లింగత్రయ నమోస్తుతే ||”

అని పురాణములలో మహాకాళేశ్వరుని యొక్క మహిమ చెప్పబడింది.








ఓంకారేశ్వరలింగం:

ఓంకారేశ్వరుని అమరేశ్వరుడని, అమలేశ్వరుడని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ నర్మదానదికి రెండువైపుల ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు ఉన్నాయి. వాటిమధ్య నర్మదానదిమీద వంతెన కూడా నిర్మించబడింది. ఈ క్షేత్రంలో నర్మదానది, నర్మద, కావేరిక అని రెండు పాయలుగా ప్రవహిస్తోంది. ఈ రెండుపాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని ‘‘ శివపురి ” అని ‘‘మాంధాతృపురి ‘ అని పిలుస్తారు.

మాంధాత సూర్యవంశపురాజు. ఈయన రఘవంశానికి మూలపురుషుడు. శ్రీరామచంద్రుడు కూడా ఈ వంశములోనివాడే. మహావీరుడైన మాంధాత ఇక్కడి పర్వతశిఖరం మీద అనేక సంవత్సరాలు తప్పస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకొని స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. అందువలన దీనికి మాంధాతపురి అని పేరు వచ్చింది.

మాంధాత పర్వతం మీద చాలా దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ “ఓం ” అనే ప్రణవకారంలో ఉండి. ఓంకారేశ్వర దేవాలయం ఆ ప్రణవంపై బాలచంద్రుని లాగే ప్రకాశింస్తొంది. ఈ ఓంకారేశ్వరుని దగ్గరకు వెళ్ళే మార్గంలో విష్ణుపురి, బ్రహ్మపురి అనే చిన్న చిన్న రెండు కొండగుట్టలున్నాయి. ఆ రెండింటి మధ్య “కపిలధార” అనే నది ప్రవహించి నర్మదానదిలో కలుస్తూంది.








వైద్యనాథ లింగం:

జ్యోతిర్లింగంగా చెప్పబడే వైద్యనాథలింగం బీహార్ రాష్ట్రంలోని చితాభూమిలో ఉన్నదని ఉత్తరాదివారు భవిస్తారు. వారి దృష్టిలో మహారాష్ట్రలోని పర్లివైద్యనాథలింగం జ్యోతిర్లింగం కాదు. కానీ దక్షిణాదివారు మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ క్షేత్రాన్నే జ్యోతిర్లింగ క్షేత్రంగా చెబుతారు. ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉన్నదిగా చెప్పబడినప్పటికి దానికి సంబంధించిన పురాణగాథ ఒక్కటే.

యాత్రామార్గం:
ఔరంగాబాద్ నుంచి 12 గం|| ల కాలం బస్సులో ప్రయాణించి పర్లివైద్యనాథ క్షేత్రాన్ని చేరవచ్చు. లేదా పర్భిణి రైల్వేజంక్షన్ నుంచి 40 కి.మీ. దూరం రైలులో ప్రయాణించి పర్లివైద్యనాథ్ క్షేత్రంలో దిగవచ్చు.

పురాణగాథ:
శివభక్తుడైన రావణాసురుడు ఒకప్పుడు వెండికొండకు పోయి శివుని ప్రీతికోసం తన తలలను హోమంచేసి 9 తలలను హోమంలో వేసిన తరువాత 10వ తలను కూడా ఖండిచబోగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు ఇతరులు తన తలలను ఖండించినప్పుడు అవి వెంటనే మరల మొలచి యథాస్థితిగా ఉండాలని, శివుడు తన లంకారాజ్యానికి వచ్చి అక్కడే స్థిరంగా ఉండాలని వరం కోరాడు. అందుకు శివుడు అలాగే అంటూ తన బదులు ఆత్మలింగాన్ని ఇస్తున్నానని, దానిని తీసుకొనిపోయి లంకారాజ్యంలో ఉంచమని అది లంకలో ఉన్నంతకాలం రావణునికి అపజయం అన్నది లేక రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రాజ్యానికి ఎటువంటి పతనావస్థా ఉండదని చెప్పాడు. కానీ ఆత్మలింగాన్ని లంకకు వెళ్ళేలోపు మరెక్కడా క్రిందపెట్టకూడదని, నేలపై పెట్టిన తరువాత దానిని పెకలించటం ఎవరికీ సాధ్యంకాదని కూడా శివుడు చెప్పాడు.

దానికి అంగీకరించిన రావణుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకొని మధ్య దారిలో సంధ్యా వందనానికి సమయం కాగా ఆ సమయానికి కనిపించిన ఒక బాలుని చేతిలో ఆ లింగాన్ని ఉంచి వెంటనే తిరిగి వస్తాననీ, అప్పటివరకు క్రింద పెట్టికుండా జగ్రత్తగా పట్టుకోవలసినదిగాను చెప్పి సంధ్యావందనానికి వెళ్ళాడు.

శివుడు ఆత్మలింగం లంకకు చేరినందువల్ల దేవతలకు కష్టములు నాలుగింతలు అవుతాయని ఊహించిన దేవతలు నారదుని సలహామేరకు గణాధిపతి అయిన వినాయకుని ఆత్మలింగం లంకకు చేరకుండా చూడమని ప్రార్థించినట్లుగానీ, వినాయకుడే పిల్లవాని రూపంలో తనకు కనిపించాడని గానీ రావణాసురునికి తెలయదు.

సంధ్యావందనానికి వెళ్ళిన రావణుడు 48 ని||ల కాలంవరకు రాలేదు. పనిపూర్తి చేసుకొని తిరిగివస్తున్న రావణుని చూడగానే ఆ పిల్లవాడు ” రావణా ! ఈ లింగాన్ని ఇంక మోయలేను ” అని గట్టిగా అరుస్తూ ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టివేశాడు. పరుగు పరుగున వచ్చిన రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగంపైకి రాలేదు సరికదా అతని శరీరమంతా గాయాలయ్యాయి. అపుడు శివుడు ప్రత్యక్షమై అతని గాయాలను మానపి ఇక ఆ లింగం కదలదని కనుక రావణసురునే ప్రతిరోజు వచ్చి ఆ లింగాన్ని సేవించుకోవలసినదిగాను ఉపదేశించి అదృశ్యమయ్యాడు.

రావణాసురునికి వైద్యం చేసి గాయాలను మానపినందువల్ల స్వామికి వైద్యనాథుడని పేరు వచ్చింది. ఈ సందర్భంగా రావణాసురుడు చేసిన శివతాండవ స్తోత్రం ఎంతో పేరు పొందింది.








భీమశంకర లింగం :

సహ్య పర్వతం యొక్క శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు ” భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టినచోట శివలింగం ప్రక్కభాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తుంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణవచనం.

యాత్రా మార్గం:

బొంబాయి దగ్గరలోని పూనావరకు రైలులో వెళ్ళి పూనాలో బస్సు ఎక్కి 75 కి.మీ. ప్రయాణం చేసి ”డాకినీ భీమ శంకరం” క్షేత్రాన్ని చేరాలి. యాత్రికులకు వసతులు అంతగా లేని యీ క్షేత్రానికి పూనా నుండి ప్రతిరోజు ఐదారు బస్సులు వస్తాయి. ఆలయం చుట్టూ అరణ్యం దట్టంగా ఉంటుంది. లోయలో నిర్మించబడిన ఈ ఆలయానికి ప్రక్కనే ఉన్న కోనేరులో స్నానం చేసి భీమశంకరుని సేవించవచ్చు.

పురాణ గాథ:
పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లియైన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని ”అమ్మా నా తండ్రి ఎవరు ?” ఎక్కడున్నాడు? నీవు ఈ కొండమీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి ” అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో “నాయనా లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి, పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెదతండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి. నా మొదటి భర్త విరాధుడు. అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు.

ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్యమహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనేవాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా” అని చెప్పింది.

తల్లిమాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తినీ, ఆయన భక్తులనూ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టుపెట్టాలని పట్టుపట్టాడు. బ్రహ్మదేవుని గురించి వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని , అనంతమైన దైర్యాన్ని వరంగా ప్రసాదించాడు.

వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకొన్నాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహార్షులను బాధించాడు.

ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి “ఓరీ బుద్ధిమాలినవాడా ఈ జపము లేమిటి? ఈ శివపూజలేమిటి ? ఇకపై ఈ పిచ్చిపనులు మాను ” అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి వళ్ళు మండింది పళ్ళు పటపట కొరకుతూ కత్తిని తీసి ” మూర్ఖుడా ఏమి మాట్లాడవు ! నిన్నే !” అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరచి “రాక్షసరాజా మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికి పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పత్తిని సేవిస్తూన్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు” అన్నాడు. అంతటితో భీముడు మరింత … మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని ఝుళిపిస్తూ “ఈ లోకానికి వీడేనా కర్త ? వీడేనా రక్షించేది ? ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను. తనను తాను రక్షించుకోమను” అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి, ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తిపారవశ్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు. పరమశివుని కరుణాకటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయ్యింది. ఇంద్రుడు మొదలైన దేవతలంతా తమ తమ స్థానాలను అలంకరించారు. అప్పటినుండి మునులంతా నిరాటంకంగా తపస్సు చేసుకోవటం ప్రారంభించారు. సుదక్షిణుడు తన రాజ్యాన్ని పొంది ఎప్పటివలెనే పరిపాలించసాగాడు. నారదుడు మొదలైనవారి కోరికమేరకు జ్యోతిర్లింగరూపిగా అక్కడే నెలకొన్న పరమశివుడు భీమశంకరునిగా భక్తుల పూజలందుకొన్నాడు.








రామేశ్వరలింగం:

రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి స్కాందపురాణం ఎంతగానో వర్ణించింది. ఈ జ్యోతిర్లింగం శ్రీరామచంద్రుని చేతులమీదుగా ప్రతిష్టించబడింది. రామేశ్వరస్వామి దేవాలయం 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తు కలిగి అనంతమైన శిల్పకళతో అలరారుతోంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వెండి రథము, బంగారు గోపురాలు చూడవలసినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో 23 తీర్ధాలు ఉన్నాయి. కాగా సముద్రాన్ని 24వ తీర్థమైన అగ్ని తీర్థముగా చెబుతారు. ఉత్తర భారతం నుండి వచ్చే యాత్రికులు గంగాజలన్ని తెచ్చి రామలింగేశ్వరునికి అభిషేకిస్తారు. మన దక్షిణాదివారు రామేశ్వరంలో సముద్రమునందలి ఇసుకను సేకరించి కాశీలో గంగానదిలో కలుపుతారు. ఈ పుణ్యకార్యం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని నుండి నేటివరకు కొనసాగుతూనే వుంది.

యాత్రామార్గం:
విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళి, మద్రాసు ఎగ్మోర్ స్టేషన్ నుంచి రామేశ్వరానికి నేరుగా రైలులో వెళ్ళవచ్చు. గంగా, కావేరి ఎక్స్‌ప్రెస్ కాశీ – రామేశ్వరం మధ్య మద్రాసు మీదుగా నడుస్తోంది. ఒకప్పుడు బస్సులో ప్రయాణించి వెళ్ళిన యాత్రికులు పాంబన్ వరకు వెళ్ళి అక్కడి నుండి 34 కి.మీ. రైలులో సముద్రం మీదుగా ప్రయాణించి రామేశ్వరం చేరేవారు. ప్రస్తుతం బస్సులో ప్రయాణించేవారు కూడా నేరుగా రామేశ్వరాన్ని చేరటానికి వీలుగా ఇటీవల సముద్రంపై వంతెనను నిర్మించారు.

పురాణగాథ:
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత సీతతో కలసి సపరివారంగా పుష్పక విమానంపై సముద్రాన్ని దాటి గంధమాదన పర్వతానికి వచ్చాడు. అక్కడ మునులంతా శ్రీరామచంద్రుని చూచి పులస్త్యబ్రహ్మ కొడుకైన రావణాసురుని చంపటంవలన బ్రహ్మహత్యాపాపం సంభవించిందని, కనుక ఆ పాపపరిహారార్థం ఆ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించవలసినదిగాను చెప్పారు.

శ్రీరాముడు శివలింగమును తీసుకొనిరమ్మని హనుమంతుని కైలాసానికి పంపాడు. ఆంజనేయుడు శివలింగమును తెచ్చునంతలో శుభముహూర్తం సమీపించినందువల్ల ఋషుల ఆజ్ఞప్రకారం సీతాదేవి చేతులతో అక్కడ ఇసుకను పోగు చేయించి శివలింగమును సిద్ధంచేసి యథావిధిగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ పూర్తి అయ్యే సమయానికి హనుమంతుడు శివలింగంతో వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న హనుమంతుని శ్రీరాముడు పైకి లేవనెత్తి బుజ్జగిస్తూ జరిగినదానికి కారణాన్ని చెప్పాడు.

శ్రీరాముని మాటలు హనుమంతునికి తృప్తిని కలిగించలేదు. అప్పుడు శ్రీరాముడు ఒక నవ్వు నవ్వి “ఆంజనేయా శుభముహూర్తం మించినదని కదా ప్రతిష్ఠ జరిపితిమి. నీకు ఇష్టం లేనిచో ఆ లింగమును పెకలించి వేయుము. తరువాత నీవు తెచ్చిన లింగమునే అక్కడ ప్రతిష్టించుదము” అన్నాడు. హనుమంతుడు పట్టరాని సంతోషముతో కుప్పిగంతువేసి, ముందుకు దూకి, శివలింగాన్ని పెకిలించాలని ప్రయత్నించాడు. గొప్ప బలసంపన్నుడైన వాయుపుత్రుడు ఎంత ప్రయత్నించినా శివలింగం కదలలేదు. పొడవాటి తన తోకను లింగం చుట్టూ చుట్టి బలవంతంగా ఒక్క గుంజు గుంజాడు. ఆవగింజంతైన ఉపయోగం లేకపోగా ఆ ఊపుకు హనుమంతుడు ఎగిరి క్రిందపడి మూర్చపోయాడు. సీత భయపడింది. శ్రీరాముని బ్రతిమాలింది. రాముడు తన చల్లని చేతులతో హనుమంతుని శరిరాన్ని తాకి మూర్చను పోగొట్టి,తన వడిలోనికి చేరదీశాడు. కన్నీరు తుడిచి బుజ్జగిస్తూ “నాయనా శాస్త్రోక్తముగా స్వామిని ప్రతిష్ఠించాం కదా! ఇప్పుడు ఈ శివలింగాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ కదిలించలేదు” అని ఓదార్చి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని ఆ దగ్గరలోనే శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చయించి హనుమంతుని తృప్తిపరచాడు. రామునిచే ప్రతిష్ఠించబడిన లింగం రామేశ్వరునిగాను, హనుమంతుడు తీసుకొనివచ్చిన శివలింగం హనుమదీశ్వరునిగాను ప్రసిద్ధి పొంది పూజలను అందుకొంటున్నాయి.








నాగేశ్వరలింగం:

నాగేశ్వర జ్యోతిర్లింగం. దారుకావనంలో గోమతికీ అరేబియా సముద్రానికి సంగమ స్థానంలో వుంది. ఒకప్పుడు శ్రీకృష్ణుని నివాసస్థానమైన ద్వారకా నగరం ఈ దారుకావనంలోనిదే.

యాత్రామార్గం:
గుజరాత్ రాష్ట్రంలోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే బొంబాయినుండి అహ్మదాబాద్, సోమనాథ్, జూనాగఢ్ మీదుగా ద్వారాకచేరి అక్కడ నుండి 22 కి.మీ దూరంలో ఉన్న నాగేశ్వరాలయానికి సముద్ర ప్రయాణం చేసి దారుకావనంలో దిగి ‘గోపీ తలాబ్’ వెళ్ళే బస్సులో నాగ్‌నాథ్ వద్ద దిగాలి.

జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ క్షేత్రమునుండి 7 గంటల కాలం బస్సులో ప్రయాణించి ద్వారకను చేరుకోవచ్చు.ద్వారకలో యాత్రికులకు వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నాగ్‌నాథ్, ద్వారకకు 22 కి.మీ దూరం కాగా భేట్ ద్వారక 32 కి.మీ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాగ్‌నాథ్ ఆలయమే అతి చిన్నది.

మహారాష్ట్రులు గుజరాత్‌లోని దీనిని జ్యోతిర్లింగముగా కాక పర్లి, వైద్యనాథ్ సమీపంలోని ఔండా నాగనాథ్‌ను క్షేత్రముగా భావిస్తారు.

పురాణగాథ:
పుర్వం దారుకుడు అనే పేరుగల రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య దారుక ఆ రాక్షస దంపతులు మానవులను బాధిస్తూ, మహర్షుల యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ పశ్చిమ సముద్ర తీరంలో 1000 యోజనాల పొడవు 1000 యోజనాల వెడల్పుగల వనాన్ని సొంతం చేసుకొని విలాసంగా విహరించసాగారు. వారిచే బాధింపబడే సాధువులందరు ఔర్వమహర్షి దగ్గరకు వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు. వానిని రక్షించాలని భావించిన ఔర్వ మహర్షి “నిరపరాధులైన భూమిమీది ప్రజలను హింసించిన యెడల ఆ రాక్షసులు మరుక్షణమే మరణించెదరుగాక” అని శపించాడు.

ఆ విషయం తెలిసిన దారుకుడు ఆ వనాన్నంతటిని పైకెత్తి సముద్రం మధ్యలో స్థాపించుకున్నాడు. మహర్షి తన శాపంలో “భూమిమీద ప్రజలు” అన్నందువల్ల ఆ రాక్షస దంపతులు భూమిపై ఉన్న ప్రజల జోలికి పోకుండా సముద్రంలో ప్రయాణించేవారిని సంహరిస్తూ నిర్భయంగా కాలం గడపసాగారు.






విశ్వేశ్వరలింగం

విశ్వేశ్వర జ్యోతిర్లింగం పురాణ ప్రసిద్ధమైన కాశీనగరంలో ఉన్నది. కాశీక్షేత్రానికి వారణాసి, వారణాసి, మహాశ్మశానం,ఆనందకాననం, అవిముక్తం, రుద్రావాసం, ముక్తిభూమి, శివపురి, క్షేత్రపురి,కాశిక మొదలైన పేర్లున్నాయి. “వరణ” “అసి” అనే రెండు నదులు రెండు ప్రక్కల ఈ క్షేత్రానికి ప్రవహించటం వల్ల దీనికి వారణాసి అనే పేరు వచ్చినట్లు కనబడుతుంది.

మోక్షదాయకమైన ఏడు క్షేత్రాలలో కాశీ ప్రసిద్ధి పొందింది. వేదాలలోను పురాణాలలోను కాశీక్షేత్రం యొక్క మహిమ గొప్పగా వర్ణించబడింది. స్కాంద  పురాణంలోని కాశీఖండం ఈ క్షేత్రాన్ని గురించిన అసంఖ్యాకమైన వివరాలను తెలియజేస్తోంది.

ప్రళయ కాలంలో పరమేశ్వరుడు కాశీనగరాన్ని, తన త్రిశూలంమీద నిలబెట్టాడని చెబుతారు. “కాశ్యాంతు మరణాన్ముక్తిః” అనే సూక్తివలన ఈక్షేత్రంలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుందని తెలుస్తోంది. ఈ క్షేత్రంలో మరణించిన వారికి కాశీ విశ్వనాథుడు కుడిచెవిలో తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని పూరాణాలు చెబుతున్నాయి.

“ఎప్పుడు కాశీకి వెళతానో! ఎప్పుడు విశ్వనాథుని సేవిస్తానో!” అని మనస్సులో పదే పదే తపన పడేవారికి కాశీలో నివసించినంత పుణ్యఫలం లభిస్తుందని.

    కదా కాశీం గమిష్యామి కదా డ్రక్ష్యామి శంకరం |
    ఇతి ఋవాణస్సతతం కాశీవాసఫలం లభేత్ ||

అనే పురాణవచనం చెబుతోంది.

యాత్రామార్గం:
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచీ కాశీ క్షేత్రానికి వెళ్ళటానికి రైలు సదుపాయాలున్నాయి. విజయవాడ నుంచి ఈ క్షేత్రం వెళ్ళేవారు కాజీపేట నాగపూర్, ఇటార్సీ, అలహాబాద్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.

పురాణగాథ:
చిత్‌స్వరూపుడైన పరమశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాలని అనుకున్నప్పుడు సగుణ రూపములో శివ స్వరూపుడుగా ఆవిర్భవించాడు. స్త్రీ పురుష రూపాలలో ప్రకటీకృతమైన ఆ పరబ్రహ్మమే శక్తిగాను, శివుడుగాను రూపొందారు. ఆ శివశక్తులు ప్రకృతి, పురుషులను సృష్టించారు. ప్రకృతి, పురుషుడు ఇరువురూ తమ తల్లిదండ్రులను తెలుసుకోలేక విచారిస్తున్నారు. అదే సమయంలో నిర్గుణ పరబ్రహ్మ అయిన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై “మీరిద్దరూ తపస్సు చేయండి బ్రహ్మాండాన్ని సృష్టించండి ” అని చెప్పాడు.

“ప్రభూ తపస్సు చేయటానికి అనువైన స్థానం ఏది ” అని ప్రశ్నించారు ప్రకృతి పురుషులు. అప్పుడు పరమశివుడు ఐదు కోసుల పరిమితి గల ఒక సుందరమైన నగరాన్ని వారికి నిర్మించి ఇచ్చాడు. ఆ మహానగరం ఆ పురుషునికి దగ్గరలో ఆకాశంలో నిలబడింది. ఆ నగరమే కాశీక్షేత్రం. పురుషుడే శ్రీమహావిష్ణువు.

విష్ణుదేవుడు కాశీనగరం నుండి సృష్టి చేయాలని సంకల్పించి చాలా సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. ఆ సమయములో అలసిపోయిన ఆయన శరీరం నుండి అసంఖ్యాకమైన స్వేదజలధారలు ప్రవహించి విశాలమైన ఆకాశంలో వ్యాపించాయి. ఆ విచిత్రమైన దృశ్యాన్ని చూచి విష్ణువు ఆశ్చర్యంతో శిరస్సును కంపించాడు. అప్పుడీతని కుడిచెవి నుండి ఆభరణం (మణిభూషణం) జారిపడింది. అది పడిన ప్రదేశమే “మణికర్ణిక” అనే మహాతీర్థమయ్యింది. మహత్తరమైన ఆ జలరాశిలో కాశీనగరం మునిగిపోవటం మొదలయ్యింది. అప్పుడు పరమశివుడు కాశీపట్టణాన్ని తన త్రిశూలంపై ధరించాడు. మహావిష్ణువు తన భార్య అయిన ప్రకృతితో అక్కడ నిద్రించాడు. అప్పుడు ఆయన నాభినుంచి చతుర్ముఖబ్రహ్మ ఆవిర్భవించాడు. ఆయన శివాజ్ఞను పొంది బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఆ సందర్భంలో మహావిష్ణువు అణువుకంటే చిన్న, బ్రహ్మాండంకంటే పెద్ద అయిన పరమాత్మ స్వరూపుడగు పరమశివుని ఎన్నో విధాల స్తుతించాడు.

శ్రీమన్నారాయణుని సోత్రానికి పరమశివుడు సంతుష్టుడై, బ్రహ్మ, విష్ణు మొదలైనవారి ప్రార్థనను మన్నించి విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వారణాసిలో కొలువుతీరాడు.





త్ర్యంబకేశ్వరలింగం:

నాసిక్ మండలంలోని సహ్య పర్వతశిఖరం మీద వెలసియున్న త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. ఆ పరిసరాలలోనే పంచవటి ఉన్నది. లక్ష్మణుడు, శూర్పణఖకు ముక్కు, చెవులు కోసిన ప్రదేశమే పంచవటి. రావణాసురుడు సీతను అపహరించినది కూడా ఈ ప్రదేశంలోనే. ఇక్కడికి కొద్దిదూరంలో ఉన్న బ్రహ్మగిరి మీద గోదావరి నది పుట్టింది.

భక్తుల పాపాలను పోగొట్టుటలో ఉత్తర భారతదేశంలోని  గంగానది ఎలా ప్రసిద్ది గాంచినదో దక్షిణ భారతదేశంలోని గోదావరినది అంతటి ప్రసిద్ధిగాంచినది. గంగానది అవతరించటానికి భగీరథుని తపశ్శక్తి కారణం కాగా, గోదావరినది ఆవిర్భవించడానికి గౌతమమహర్షి త్యాగఫలం కారణమయ్యింది. అందువల్లనే గంగానదికి ‘భాగీరథి ‘ అని ప్రేరువచ్చినట్లు గోదావరికి ‘గౌతమి’ అని పేరు వచ్చింది.

గోదావరి, గౌతమ మునీంద్రుల ప్రార్థనవల్ల భక్తవత్సలుడైన శివుడు త్ర్యంబకేశ్వర రూపంలో ఇక్కడ వెలసియున్నాడు. ఈ ఆలయంలో మూడు చిన్న చిన్న లింగాకృతులు ఉన్నాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన వాటిగా భక్తులు భావిస్త్తారు.

యాత్రామార్గం:మహారాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చూడటానికి బొంబాయి నగరం నుండి నాసిక్ వరకు 184 కి.మీ.లు రైలులో ప్రయాణించి అక్కడి నుండి 30 కి.మీ. బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రాన్ని చేరవచ్చు.

పురాణగాథ:
గౌతముడు తపస్సంపన్నుడైన మహర్షి. ఆయన ధర్మపత్ని అహల్యాదేవి. బ్రహ్మగిరి శిఖరంమీద గౌతముడు అహల్యతో కలసి 1000 సం||రాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు అనావృష్ఠి కారణంగా దేశం నాలుగు మూలలా కరువుకాటకాలు వచ్చాయి. త్రాగటానికి నీరుకానీ, తినటానికి తిండిగానీ లేక ప్రజలు మలమలా మాడిపోయారు. పశువులకు గడ్డిలేక ఒక్కొక్కటి అంతరించి పోయాయి. చెట్టు చేమలు ఎండిపోయాయి. నేలబీటలు వారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచమంతా పాడుపడినట్లు అయింది.

దేశంలోని ఆ పరిస్థితి గౌతముని మనస్సును కదిలించివేసింది. కరుణామయుడైన గౌతముడు, వరుణదేవుని గురించి ఆరునెలలు తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమై “మహర్షీ నీ తపస్సుకు కారణం గ్రహించాను. నీవు చిన్న సరస్సు ఒకటి నిర్మించుకో, నేను దానిని నిండుగా అయ్యేలా చేస్తాను. అందులోని నీటిని ఎంతవాడినా తరగక అక్షయమై ఉంటుంది. అది అని చెప్పి అంతర్థానమయ్యాడు.

గౌతముడు సరస్సును నిర్మించాడు. వరుణదేవుని అనుగ్రహం వలన అది అక్షయ జలంతో నిండిపోయింది. గౌతముడు ఆ నీటితో తన నిత్యకృత్యాలు నెరవేర్చుకుంటూ జపహోమాలు, పూజలు మొదలైనవి యథావిధిగా చేసుకొంటున్నాడు. ఈ సరోవరంలోని నీటివల్ల పరిసర ప్రాంతమంతా చెట్లు చిగిర్చి పచ్చపడింది. పశువులకు, పక్షులకు సుఖజీవితం లభించింది. ఆ సరసున చుట్టూ ఒక చక్కని తపోవనం తయ్యారయ్యింది.

ఎక్కడెక్కడి ఋషులు అక్కడికి వచ్చి చేరారు. మునులంగా గౌతమాశ్రమం చుట్టూ వర్ణశాలలను నిర్మించుకొని కాలం సుఖంగా గడపసాగారు .

ఇది ఎలా ఉండగా ఒకరోజు ఋషుల భార్యలు గౌతముని భార్య అయిన అహల్యాదేవితో కారణం లేకుండానే తగాదాపడ్డారు. అంతటితో ఆగక తమ భర్తలను గౌతమునిపైకి పురికొల్పారు. విశ్వాసం లేని ఆ ఋషులు గౌతముని మీదికి కయ్యానికి కాలుదువ్వారు. చివరకు గౌతమునికి హాని తలపెట్టారు. అయినా ఋషుల దూషణలనుగానీ రోషంతో కూడిన తీవ్రపదజాలాన్ని గానీ గౌతముడు లెక్కపెట్టక సహనంతో ఉన్నాడు. అతని సహనం. వారి కోపాన్నీ వేయింతలు చేసింది. చివరకు చెడ్డవారైన ఆ ఋషులు గౌతముని పంటపొలాలలోనికి తోలరు. ఆవు పంటను పాడుచేయుట చూచి గౌతముడు ఒక గడ్డిపరకతో ఆవును అదలించాడు. ఆ గడ్డిపరక ఆవును తాకునంతనే ఆ ఆవు గిరగిర తిరిగి నెలపై కొరిగి మరణించింది.ఇదంగా ఋషులు చేసిన కుట్ర అని గౌతముడు ఊహించలేదు.

ఆవు నేలపై పడినే వెంటనే సమయం కోసం వేచి చూస్తున్న ఆ ఋషులందరూ పరుగు పరుగున గౌతముని వద్దకు వచ్చి గోహత్య చేసినందుకు గౌతమ మహర్షిని రకరకాలుగా నిందించారు. అహంకారం వల్ల కళ్ళు మూసుకుపోతున్నాయా! అని నిలదీశారు. అంతేకాక తక్షణమే ఆ వనాన్ని వదలి వెళ్ళిపోవలసినదని శాసించారు. ధర్మమూర్తి అయిన గౌతముడు చేసేదిలేక భార్యతో కలసి ఆశ్రమాన్ని వదలి కొంతదూరం వెళ్ళి అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకొన్నాడు.

మునులంతా అహంకారంతో గౌతముని కుటీరానికి వెళ్ళి “ఓయీ గౌతమా నీతలపై గోహత్యా పాతకం తాండవిస్తోంది. నీ ముఖం చూస్తేనే పంచ మహాపాపాలు అంటుకుంటాయి. నీ దర్శనంవల్ల అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి. నీవు మాకు దగ్గరలో ఉన్నందువల్ల మేము చేసే యజ్ఞయాగాదులకు దేవతలు హాజరుకావటంలేదు. హోమంలో వేసే పదార్థలు దేవతలకు కానీ పితృదేవతలకు కానీ చెందటంలేదు. అందువల్ల ఇక్కడ ఉండే అర్హత నీకులేదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో ” అని గర్జించారు.

గౌతముడు “మునులతో నా పాపానికి ప్రాయశ్చిత్తం కూడా మీరే చెప్పండి.” అన్నాడు.

అప్పుడు ఋషులు గౌతముని చూచి “నీవు మూడుసార్లు భూప్రదక్షిణం చేసిరావాలి. ఒక నెలకాలం ఏ విధమైన ఆహారం తీసుకోకుండా తపోదీక్ష సాగించాలి. ఈ బ్రహ్మగిరి చుట్టూ 101సార్లు తిరిగి రావాలి. ఇక్కడకు గంగను తీసుకొనిరావాలి. ఆ నీటితో కోటీ శివలింగాలకు అభిషేకం చేసి పూజించాలి. తరువాత 100 బిందెల నీటితో శివుని అభిషేకించాలి. అప్పటికి గానీ నీ గోహత్యాపాతకం తీరదు.” అని కఠోరంగా పలికారు.

గౌతముడు ఋషుల ఆదేశాన్ని శిరసా వహించాడు. వాళ్ళు చెప్పిన పనులన్నీ కొనసాగించాడు. భార్యతో కలసి బ్రహ్మగిరిపైన పార్ధివలింగాకారములో ఉన్న పరమశివుని భక్తితో పూజించాడు.

గౌతముని ధర్మాసక్తికి, దైవభక్తికి, సహనానికి శివుడు సంతోషించి ప్రమథగణంతో సహా ప్రత్యాక్షమై గౌతమునితో “నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక తీర్చటనికే వచ్చాను. కావలసిన వరం ఏమిటి కోరుకో.” అన్నాడు.

గౌతముడు ఆనందంతో ప్రభూ నీ దర్శనం వలన నా జన్మ తరించినది. నాకు ఇంకేమీ వద్దు” అని శివుని పాదాలు పట్టుకోని ప్రార్థించాడు.

శివుడు “నీవు మునులలో శ్రేష్ఠవు. నీ తోడి ఋషులు నీ గొప్పతనాన్ని సహించలేక అజ్ఞానముతో నిన్ను హింసించారు. వారిని క్షమించు. ” అన్నాడు .

అందుకు గౌతముడు “స్వామీ వారు నాకు చాలా ఉపకారం చేశారు. లేకుంటే మీ దర్శనభాగ్యం నాకు కలిగేది కాదుగదా” అన్నాడు.

గౌతముని శాంత స్వభావానికి పరమశివుడు సంతోషించి “గౌతమా ఇదిగో నీ కోరికను అనుసరించి గంగను ప్రసాదిస్తున్నాను. ఈ గంగ గౌతమి అనే పేరుతో నీ కీర్తిప్రవాహంలాగా ప్రవహిస్తుంది. నేను త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంతో ఈ గౌతమి తీరంలో ఉండి నీవంటి భక్తులను అనుగ్రహిస్తాను.” అని అంతర్ధనమయ్యాడు.

ఋషులంతా గౌతముని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. దేవతలంతా సంతోషించారు. అప్పటి నుండి గంగ “గౌతమి” పేరుతో ప్రవహిస్తూ భూమిని పవిత్రం చేస్తోంది. శివుడు త్ర్యంబకేశ్వర రూపంతో ఆ తీరంలో విరాజిల్లుతున్నాడు.








కేదారేశ్వర లింగం

హిమాలయాలలోని కేదార శిఖరంపై విరాజిల్లే జ్యోతిర్లింగమే కేదారనాథ లింగం. కేదార శిఖరానికి పడమటి వైపున ‘మందాకిని’, తూర్పువైపున అలకనంద ప్రవహిస్తున్నాయి. మందానికి ఒడ్డున కేదారనాథస్వామి, అలంకనంద ఒడ్డున బదరీనారాయణ స్వామి వెలసియున్నారు. అలకనందా, మందాకిని నదులు ‘రుద్రప్రయాగ’లో కలసి కొంతదూరం ప్రవహించి ‘దేవప్రయాగ’ దగ్గర ‘భాగీరథి’లో కలుస్తున్నాయి. అందువల్ల గంగా స్నానముచేసే భక్తులు కేదారనాథ, బదరీనాథ్‌ల చరణ కమలాల నుండి వచ్చిన నీటిలో మునుగుతున్నట్లుగా భావించి పులకించిపోతారు. స్కాందపురాణంలోని కేదారఖండం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం మహిమను గొప్పగా వర్ణించింది. ఏ భక్తుడైన కేదారనాథుని దర్శించకుండా బదరీయాత్ర చేసినట్లుయితే వాని యాత్ర నిష్ఫలమని పై పురాణం చెబుతోంది.

కేదారనాథుని దర్శించటానికి బయలుదేరిన ప్రాణి మార్గమధ్యంలో మరణించినా స్వామిని దర్శించిన పుణ్యం తప్పక లభిస్తుందని పురాణలు చెబుతున్నాయి.

కేదారనాథక్షేత్రం హరిద్వారమునకు 240 కి.మీ.లు., ఋషి కేశమునకు 211 కి.మీ.లు. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ఉన్నతమైనది కేదారనాథ్. ఇది సముద్ర మట్టానికి సుమారు 16,000 అడుగుల ఎత్తులో వుంది. 12 జ్యోతిర్లింగాలలో అతిపెద్దది కూడా ఇదే. పర్వతశిఖరమే జ్యోతిర్లింగము కనుక దీనికి పానుపట్టంలేదు. గర్భగృహాన్ని లింగాకారములో ఉన్న పర్వత శిఖరము ఆక్రమించివున్నదని చెప్పటంకంటే జ్యోతిర్లింగ రూపమైన పర్వత శిఖరం చుట్టూ ఆలయం నిర్మించబడిందని చెప్పటం బాగుంటుందేమో. ఈ జ్యోతిర్లింగంలో కైలాసపర్వతం యొక్క సూక్ష్మరూపం గోచరిస్తుంది.

కేదారనాథ్ యాత్రలో శివశక్తి స్పష్టంగా కనపడుతుంది.

యాత్రామార్గం:
ఉత్తరప్రదేశ్‌లోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే విజయవాడ నుండి నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి ఋషికేశ్ దాకా రైలులో ప్రయాణించి అక్కడ నుండి 280 కి.మీ బస్సులో వెళ్ళి గుప్తకాశీని దాటి గౌరీకుండాన్ని చేరాలి. అక్కడే గౌరీదేవి ఆలయం ఉంది. అక్కడే మంచుకొండల మధ్య నిరంతరం ఒక నీటిబుగ్గలో నుండి వేడినీరు వస్తూ ఉంటుంది. అదే గౌరీకుండం. అక్కడే పార్వతీదేవి తపస్సు చేసింది. ఆమె సౌకర్యం కోసమే తండ్రి అయిన హిమవంతుడు ఆ తపోభూమిని ఏర్పాటు చేశాడు. అదే నేడు భక్తులకు సౌకర్యంగా వుంది. ప్రకృతిలోని విచిత్రాలలో యీ వేడినీటిబుగ్గ ఒకటి.

గౌరీకుండం నుంచి భక్తులు తప్పనిసరిగా కాలినడకనగానీ, డోలీలలో గానీ, పొట్టి గుఱ్ఱాలపై గానీ 14 కి.మీ.లు ప్రయాణించి కేదరనాథ్‌ను చేరాలి. గుఱ్ఱపుస్వారికి సుమారు 200 రూ.లు, డోలీకి 350 రూ.లు తీసుకుంటారు. ఉదయం బయలుదేరితే కేదరానాథ్ దర్శనము చేసుకొని సాయంత్రానికి గౌరీకుండానికి తిరిగి రావచ్చు.

రాత్రిపూట కేదరానాథ్‌లోని ఉండాలనుకొన్న యాత్రికులకు “కాలీకంబ్లీ వాలాసత్రం” “భారత్ సాధూసమాజ్” వారి యాత్రా నివాసం, టూరిస్ట్ బంగ్లా మొదలైనవి వసతిని కల్పిస్తున్నాయి. కేదారేశ్వర వాతావరణం చాలా మనోహరంగా ఉంటుంది. కానీ తరుచు హఠాత్తుగా మబ్బులు కమ్మి వడగండ్లతో వాన పడుతుంది.

పురాణగాథ:
నరనారాయణులు గొప్ప తపస్సంపన్నులు. వారిద్దరూ విష్ణుమూర్తి యొక్క అవతారములు. ఆ మహర్షులు బదరికాశ్రమంలో చాలా సంవత్సరాలు తపస్సు చేసి జగత్తుకు మేలు కలగాలన్న కోరికతో కేదార శిఖరంపై శివుని ఆరాధించటం మొదలుపెట్టారు.

వారిద్దరూ ప్రతిరోజు ప్రభాత కాలంలో మందాకినిలో స్నానం చేసి ఈశ్వరుని పార్థింప లింగములను నిర్మించుకొని భక్తితో పూజ చేసేవారు. మందాకిని నీటితోనూ పవిత్రమైన బిల్వప్రతితోనూ చక్కగా వికసించిన తామర పువ్వులతోనూ వారిద్దరూ ప్రతిరోజు మిక్కిలి శ్రద్ధతో శివుని పూజించేవాళ్ళు.

ఇలా కొంతకాలం గడిచాక పరమశివునికి నరనారాయణులపై కరుణ కలిగి వారికి సాక్షాత్కరించాడు. అప్పుడు వారిద్దరు శివునికి సాష్టాంగ నమస్కారములు చేసి ఏంతగానో స్తుతించారు. ప్రసన్నుడైన శివుడు వారిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారిద్దరు చేతులు జోడించి “మృత్యుంజయా ! జగత్ కళ్యాణం కోసం మేము నిన్ను ఆరాధించాము. నీవు మమ్ము అనుగ్రహించావు. ఇక ముందుకాలములో కూడా నిన్ను ఇక్కడ సేవించినవారికి కోరికలు నెరవేరుస్తూ ఈ శిఖరం మీదనే ‘కేదారేశ్వరుడు’ అనే పేరుతో నిలిచివుండు. నిన్ను దర్శించి స్తుతించిన భక్తులు తరిస్తారు. ఇదే మా కోరిక”  అని ప్రార్థించారు. పరమశివుడు వారి కోరికను మన్నించి కేదారనాథ్ జ్యోతిర్లింగ రూపంలో అక్కడే ప్రకాశిస్తున్నాడు.

ఈ స్వామిని కృతయుగంలో నరనరాయణులు, త్రేతాయుగంలో ఉపమన్యు మహర్షి, ద్వాపర యుగంలో పాండవులు పూజించి ధన్యులయ్యారు. కేదారనాథ్ దేవాలయంలో పాండవులు శిలావిగ్రహాలను మనం చూస్తాం.





ఘృష్ణేశ్వరలింగం

దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సమిపంలో వుంది. దౌలతాబాద్‌కు 4 కి.మీ. దూరంలోని ఎల్లోరాలో ఉన్న ఈ జ్యోతిర్లింగం “స్పర్శవేది లింగం”. సంతానం లేనివారు ఈ స్వామిని సేవించి సంతానాన్ని పొందుతారు. ఇతిహాస కాలంలో ‘విశాల’ దేశంగా ప్రసిద్ది చెందిన ఆ ప్రాంతానికి అదే ముక్తికేద్రం.

యాత్రామార్గం:
ఈ క్షేత్రానికి చేరటానికి ఔరంగాబాద్ నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. స్థానికులచే “వెరూలా”గా పిలువబడే ఈ క్షేత్రం ఔరంగాబాదుకు 8 కి.మీ.లు ఇది చిన్నగ్రామం అయినందువల్ల యాత్రికుల వసతికి ఏర్పాట్లు అంతగా లేవు. అందువల్ల యాత్రికుల ఔరంగాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటారు.

పురాణగాథ:
పూర్వం దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు, సుదేహ అనే బ్రాహ్మణ దంపతులుండేవారు. వారిద్దరు ధర్మ కార్యాలలో ఆసక్తి కలిగి వైదిక విధులను నిర్వర్తిస్తూ శివభక్తులై ఉండేవారు. వారికి సకల సంపదలు ఉన్నప్పటికి సంతానం లేనందువల్ల ఎన్నో నోములు నోచి తీర్థయాత్రలు చేసి అప్పతికీ ఫలితం లేనందువల్ల తమ వంశాన్ని ఎలా నిలుపుకోవాలా అని ఆలోచించసాగారు.

ఒకనాడు సుదేహ తన భర్తతో సంతానం కోసం తన చెల్లెలు అయిన ఘృశ్మలను వివాహం చేసుకొనవలసినదిగా వత్తిడి చేసింది. భార్య కోరికమేరకు సుధర్ముడు చివరకు ఘృశ్మలను పెళ్ళిచేసుకొన్నాడు. శివానుగ్రహం వలన ఘృశ్మలకు చక్కని కుమారుడు పుట్టాడు. వారు ముగ్గురు పిల్లవానిపై మమకారాన్ని పెంచుకుటూ ఎంతో గారాబంతో విద్యాబుద్దలు చెప్పించారు.

శివభక్తురాలైన ఘృశ్మల తన వివాహం అయినప్పటినుంచి ప్రతిరోజూ 1001 పార్థివ లింగాలకు పూజచేసి అనంతరం వాటిని ఇంటికి దూరంగా ఉన్న ఒక చెరువులో వేసివచ్చిన తరువాతనే భోజనం చేసేది. తమ కుటుంబానికి మంచి జరగటం కోసం ఆమె చేస్తున్న పూజలవల్లనే తనకు పుత్రసంతానం కలిగిందని ఆమె విశ్వసించేది.

ఇదిలా వుండగా ఘృశ్మల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. సుధర్ముడు మంచి సంస్కారం, చక్కని రూపంగల ఒకామెను తీసుకొని వచ్చి ఆమెతో తన కుమారునికి వివాహం జరిపించాడు.

సుధర్ముడి పెద్ద భార్య సుదేహ తన చెల్లెలి వివాహం అయినప్పట్టి నుండి చుట్టు ప్రక్కల ప్రజలు ఆమెకు యిస్తున్న గౌరనాన్ని, ఆమెకు పుత్రుడు కలిగిన తరువాత ప్రజలు ఆమెకు మరింత గౌరవాన్ని యివ్వడాన్ని ఓర్చుకోలేకపోయింది. కొడుకు, కోడలుతో ఘృశ్మల ఎంత ఆనందంగా ఉన్న విషయం సుదేహకు మరీ భాదను కలిగించింది.ఎలాగైనా ఆ ఆనందాన్ని కాలరాయాలని అనుకొంది. అసూయా ద్వేషాలతో కుళ్ళిపోతున్న ఆమె మనస్సుకు ఘృశ్మల కొడుకును చంపేయాలనిపించింది. ఒకనాటి రాత్రి అందరూ నిద్రిస్తుండగా కొడుకు తలనరికి యింటికి దూరంగా ఉన్న చెరువులో వేసి ఏమీ తెలియనిదానిలా వచ్చి నిద్రకు ఉపక్రమించింది. భర్త మొండెం నుంచి ప్రవహించిన రక్తం తన శరిరానికి తాకగానే కోడలు నిద్రలేచి భర్త తలనరికి ఉండటం చూసి పెద్దగా ఏడుస్తూ అత్తమామలకు చెప్పబోయింది. శివపంచాక్షరీ జపంలో నిమగ్నమై ఉన్న సుదర్ముడు ఏమీ గమనించే స్థితిలో లేదు. ఘృశ్మల ఆనాటి లింగార్చనలో లీనమై ఉంది.

కోడలి ఏడుపులు విని కళ్ళు తెరచిన ఘృశ్మల కొడలితో “అమ్మా నేటితో కోటింగార్చన పూర్తి అయ్యింది. శివుడు మనకు సాక్షాత్కరించునున్నాడు. అందువల్ల యీ శుభసమయంలో నీకు పతివియోగం కాని, నాకు పుత్రశోకం గాని ఉండదు నా కుమారుడు ఎలా మరణించాడో అలాగే తిరిగి జీవిస్తాడు” అంటూ పూజలో నిమగ్నమయ్యింది.

కోడలికి ఏం చేయాలో దిక్కుతోచలేదు.

పూజ పూర్తి అయిన వెంటనే ఘృశ్మల లింగాలను తీసుకొని వెళ్ళి చెరువులో వేసింది.

వెంటనే శివుడు ప్రత్యక్షమై “నీ కోటి లింగార్చనకు, శివపూజలో నీ ఏకాగ్రతకూ మెచ్చాను. వరం కోరుకో.” అన్నాడు.

అందుకు ఘృశ్మల “స్వామీ నా కోడలు పతి వియోగం విలవిలలాడుతోంది. ఆమెకు పతిబిక్ష పెట్టు. నీవు ప్రత్యక్షమైన ఈ ప్రదేశంలోనే జ్యోతిర్లింగ రూపునివై ఘృశ్మేశ్వరునిగా ప్రజల సేవలనందుకొంటూ నిన్ను సేవించినవారికి సంతాన నష్టంగాని అకాల మరణంగాని లేకుండా కాపాడు.” అని కోరింది.

‘తథాస్తు’ అన్నాడు శివుడు.

ఇప్పుడున్న ఘృష్ణేశ్వరలింగానికి దగ్గరలో చెరువులో కోటిలింగాలున్నాయి.





Wednesday, 1 November 2017

ఘృశ్నేశ్వరస్వామి









ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం
భక్తులు తాకే జ్యోతిర్లింగం


అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన శిల్పాలకు నెలవైన ఎల్లోరా గుహలకు సమీపంలో ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండవదిగా వినుతికెక్కింది. ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులది మహాద్భాగ్యమని చెప్పొచ్చు. జ్యోతిర్లింగా ఆఖరిది అయిన ఘృశ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.

ఇళాపురే రమ్య విశాల కేస్మిన్‌ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే

పురాణగాథ
పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్‌’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్‌గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం.

చరిత్ర
ఈ ప్రాంతంలో ఏల్‌ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్‌. అదే వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒకసారిరాజు వేటకు వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు. ఆ శాపం వల్ల రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు. అయిన కూడా ఎక్కడా నీరు దొరకదు. ఒక చోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటికుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది. రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అవుతాయి. రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్టిస్తాడు. దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు. బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మసరోవరం. కాలక్రమేణ అది శివాలయంగా ప్రసిద్ధి గాంచింది.

స్థలపురాణం
పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్మడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది. వివాహం అయిన తరువాతా అక్కాచెల్లెళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేన ఘుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి ఘుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ.. ఘుష్మ కుమారున్ని చంపి కోనేటిలో పడేస్తోంది. శివ భక్తురాలైన ఘుష్మ ‘ ఇదంతా పరమేశ్వరుని లీల’ అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు. పరమ శివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాపపరిహారం కల్పిస్తాడు. అప్పుడు ఘుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువుతీరమని వేడుకుంటుంది. అంతట ఆ స్వామి అక్కడ స్వయంభువు కొలువయ్యాడు. ఘుశమేశుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఆ ఘుశమేశుడే కాలక్రమంలో ఘృశ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం.

ఆలయ విశిష్టత
పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్‌ గ్రామ పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృశ్నేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. అంతేకాక శిఖర సింగనపూర్‌లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి. ఆ తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు ఆ భోలానాథుడే జన్మించి వంశప్రతిష్ఠను పెంచాడని కథనం. తరువాతి కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కార్‌ జీర్ణోద్ధరణ పనులు చేయించిందని ప్రశస్తి.

240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి ధృఢంగా, సుందరంగా నిలిచి ఉంది. మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలూ భక్తి భావం రేకిత్తిస్తాయి.

24 రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు. నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనిమిస్తాడు. ఇక్కడ స్వామి వారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒక్కటే భక్తులు తాకే జ్యోతిర్లింగం. గర్భగుడిలోనికి పురుషులు పై వస్త్రాన్ని విడిచి వెళ్లాలి.

ఎలా చేరుకోవాలి
ఔరంగాబాద్‌ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
* దిల్లీ, ముంబయిల నుంచి ఔరంగాబాద్‌కు విమానాలను నడుపుతున్నారు.
* రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్‌ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు.
* రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్‌, సొంత వాహనాల్లో ఔరంగాబాద్‌ నుంచి చేరుకోవచ్చు.
* వేరూల్‌ గ్రామం నుంచి ఔరంగాబాద్‌కు బస్సులు నడుస్తుంటాయి.



Friday, 7 April 2017

కాశీకి..పోయాము లింగా!





కాశీకి పోయాము లింగా!


భారత్‌లో ఆధ్యాత్మిక పరమైన భక్తి భావనలు కలిగించే హిందూయాత్రా స్థలాలలో కాశీ (వారణాసి, బెనారస్) అతి విశిష్టమైన, పవిత్రమైన పుణ్య క్షేత్రంగా చెప్తుంటారు. కాశీకి పోయినోడు కాటికి పోయినట్లే అనే నానుడి మా చిన్నతనంలో వింటుండే వాళ్లం. అయితే ఈ ఆధునికయుగంలో, అద్భుతమైన శాస్త్ర, సాంకేతిక ప్రగతి సాధించిన నేటికాలంలో పై మాటలకు అర్థం లేకుండా పోయింది. భూ, వాయు మార్గాలలో పయనించి కాశీ విశ్వనాథుని దర్శించుకుని స్వల్ప సమయంలోనే క్షేమంగా తిరిగి రావచ్చు.




మా కాశీయాత్ర ఫిబ్రవరి 20 తేదీన ప్రారంభై మార్చి 3వ తేదీతో ముగిసింది. ఈ యాత్రలో కాశీతో పాటు అలహాబాద్, ప్రయాగ, గయ - బుద్ధగయ, అయోధ్య, వింధ్యాచల్ లాంటి చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశేషాలు గల ప్రాంతాలను దర్శించాం. కాశీ గోల్డెన్‌గా ప్రఖ్యాతి పొందిన ఆలయంలో జ్యోతిర్లింగాలలో ప్రప్రథమంగా వెలసిందిగా భావిస్తున్న శ్రీ విశ్వనాథుడు కాశీ విశ్వానాథునిగా ఖ్యాతి పొందాడు. మహ్మదీయులు ముఖ్యంగా ఔరంగజేబు సృష్టించిన విధ్వంసాల పరంపరను తట్టుకుని నిలిచి లక్షలాది హిందువులను వందల సంవత్సరాలుగా ఆకర్షిస్తున్నది విశ్వనాథుని జ్యోతిర్మయ శివలింగం. ఇది గొప్ప శక్తిమంత, మహిమాన్వితమైందిగా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇన్ని గంగా జలాలు, ఇంత భస్మంతో సంతృప్తి చెందెదవా పరమేషా అనుకుంటూ భక్తులు పవిత్ర గంగా జలాలతో అభిషేకిస్తుంటారు. ఇటీవల పవిత్ర మహా శివరాత్రి రోజున భక్తులంతా సుమారు ఐదు గంటలు క్యూలైన్లలో నిల్చుని ఆ విశ్వనాథుని, ఆ పరమశివున్ని దర్శించుకున్నారు.

శ్రీ విశ్వనాథుని గోల్డెన్ టెంపుల్‌కు అతి సమీపంలోనే సర్వ సంపదల దాత, మాతా అన్నపూర్ణేశ్వరీ మాత ఆలయం ఉంది. మరికొంత దూరంలో లక్ష్మీ స్వరూమైన దేవి విశాలాక్షి ఆలయం ఉంది. శ్రీ విశ్వేశ్వరుని, అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని దర్శించిన వారికి ఉత్తమగతులు కలుగునని చెప్తుంటారు.

ఇవేగాక కాలభైరవ్, మాత దుర్గాదేవి, బిర్లా టెంపుల్, సారనాథ్, తులసీ మానస మందిర్, సంకట యోచన మందిర్, దుండిరాజ్ గణేష్, భారతమాత మందిర్‌లు ఉన్నాయి.

బుద్ధుడు తాను గయలో పొందిన జ్ఞానోదయ ఫలితమైన బుద్ధిజాన్ని తన శిష్యులకు బోధించిన స్థలం సారనాథ్. ఇక్కడ థాయ్‌లాండ్, చైనీస్, జపాన్, బర్మా దేశాల ఆలయాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి ముందే బెనారస్(కాశీ)లో పండిట్ మదన్ మాలవ్యా స్థాపించిన బెనారస్ హిందు విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విద్యా సంస్థ. ఈ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో విశ్వనాథుని టెంపుల్, విద్యాలయం స్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్యా విగ్రహం కూడా ఉన్నాయి.

సిరిగలవానికి..
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడువు పార్వతి చాలున్..
అని శ్రీనాథ కవి అన్నట్లు విశ్వనాథుని సిగలో నుంచి దుమికి పడి లేచినట్లుగా కాశీని ఒరుసుకుని ప్రవహించే గంగా నది దానికి మరింత పవిత్రతను చేకూరుస్తున్నది. బోటులో గంగానదిలో తిరుగుతూ 64 ఘాట్‌లను పరిశీలిస్తూ బోటులోనే కూర్చుని సాయంత్రం 7 గంటలకు గంగమ్మ తల్లికి సమర్పించే హారతిని తిలకించడం గొప్ప ఆధ్యాత్మిక భావనను కలిగిస్తుంది. అతి ముఖ్యమైందిగా చెప్పుకుంటున్న మణి కర్ణికా ఘాట్‌లో స్నానం చేశాం. ప్రధాని మోదీ వాగ్దానం చేసిన గంగానది ప్రక్షాళన ఏది? ఎక్కడ? అది ఎన్నికల వరకేనా అన్న సందేహం కలుగుతుందిప్పుడు అక్కడి పరిస్థితిని చూసినప్పుడు. మరోరోజు అలహాబాద్ ప్రయాగ ప్రయాణమై అక్కడి పవిత్ర త్రివేణి సంగమంలో స్నానమాచరించినాం. గంగా యమున సరస్వతి నదుల సంగమ స్థలమే త్రివేణి సంగమం. ఇక్కడ గతించిన తమ పెద్దలకు పిండ ప్రదానం చేయడం ఆచారంగా వస్తుంది. అలహాబాద్‌లో మరో చారిత్రక ప్రాధాన్యం గల స్థలం.. ఆనంద్ భవన్. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1927లో దీన్ని నిర్మించారు. ఈ భవనం స్వాతంత్య్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు ముఖ్య కేంద్రంగా ప్రాచుర్యం పొందింది. ఆ భవనంలో గాంధీజీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైనది. గాంధీ నివసించిన గది, నెహ్రూ గది, ఆయన తనయ ఇందిరా ప్రియదర్శిని గది వేర్వేరుగా ఉన్నాయి. ఆ రోజుల్లో వారు వాడిన వస్తువులు, రాసిన పుస్తకాలు వంటివి ఎన్నో భద్రపరిచి ఉన్నాయిక్కడ.

1963లో నెహ్రూ ప్రభుత్వంపై నాటి ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా, నెహ్రూపై నాకు గల అభిమానంతో ఈ తీర్మానాన్ని విమర్శిస్తూ నేను రాసిన ఓ ఆర్టికల్ నాటి కృష్ణా పత్రికలో అచ్చవటం, 1964 మే 27న మధ్యాహ్నం నల్లగొండలో ఆంగ్లవార్తలు విని అటు నుంచి కదలబోగా ఓ ప్రత్యేక బులెటిన్ ద్వారా ప్రధాని మరణించారన్న వార్త విని తట్టుకోలేక బోరున విలపిస్తున్న బజార్‌గుండా నా గదికి పరుగెత్తిన జ్ఞాపకాల పుటలు నా మదిలో రెపరెపలాడగా హృదయం బరువెక్కింది.

ఇంకోరోజు గయ ప్రయాణం. గయాసురుడనే రాక్షసుని పేరుతో గయ పేరు ప్రసిద్ధి నొందినట్లు చెబుతారు. ఇక్కడ వెలసిన విష్ణు పాద మందిరం, శక్తిపీఠ మంగళగిరి ఆలయం సందర్శనీయ స్థలాలు. ఇక్కడ సైతం పిండ ప్రదానం కార్యక్రమం జరుగుతుంది. నా పితృ పాదులకు పిండ ప్రదానం గావించాను.

ఇక్కడ మరో విశేషం.. గౌతముడు జ్ఞానోదయం కలిగి బుద్ధుడుగా పరిణితి చెందిన స్థలం బుద్ధగయ. బౌద్ధ ఆలయంలోని బుద్ధ విగ్రహాన్ని దేశ, విదేశీ బౌద్ధ సన్యాసులే గాక ఇతర ప్రజలు సైతం సందర్శిస్తుంటారు. థాయ్‌లాండ్, చైనా, బర్మా, శ్రీలంక, జపాన్ మొదలైన దక్షిణాసియా దేశాల బౌద్ధ సన్యాసులు ఇక్కడ కన్పిస్తుంటారు.

బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
నిరంతం ప్రతిధ్వనిస్తుంటుంది.

మేము సందర్శించిన ముఖ్య ప్రదేశం అయోధ్య. ఇక్కడ శ్రీరామ జన్మభూమి, సరయూనది, రామమందిర నమూన, శ్రీరామ పట్టాభిషేకం, హనుమాన్ మందిర్ చూడదగిన స్థలాలు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన ప్రదేశమే రామజన్మభూమి. దేశంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన సంఘటన. అక్కడ ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య ఆ ప్రదేశాన్ని దర్శించాం.

మేము సందర్శించిన మరి రెండు స్థలాలు.. వింధ్యాచల్, సీతామడిలో సీతాదేవి హనుమంతుని దర్శించుకున్నాం.

ఇలా సాగిన మా యాత్ర చివరగా కాశీ విశ్వనాథునికి అభిషేకం, అన్నపూర్ణా దేవికి కుంకుమార్చన, విశాలాక్షి దర్శనంతో విజయవంతంగా ముగిసింది.
డోకూరి శ్రీనివాసరెడ్డి

Saturday, 1 April 2017

చార్‌ధామ్‌ యాత్ర





చార్‌ధామ్‌ యాత్ర

జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్లితీరాలని కోరుకునే యాత్ర. వెళ్లే మార్గం సంక్లిష్టమైనదైనా ప్రకృతి సోయగాలలో ప్రశాంతతను పొందాలని ఆకాంక్షించే యాత్ర. హిమాలయ పర్వత శ్రేణులలో వెలసిన ఆరాధ్య దైవాలను దర్శించి, తరించాలని తపించే యాత్ర. అదే, అతిపవిత్రమైన చార్‌ ధామ్‌ యాత్ర.

గంగోత్రి, యమునోత్రి,  బద్రీనాథ్, కేదార్‌నాథ్‌ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలను ఒకేసారి సందర్శించుకొని రావటాన్ని ‘చార్‌ధామ్‌ యాత్ర’ అంటారు. సంవత్సరంలో ఆరు నెలల పాటు దేవతలు పూజిస్తారని పేరొందిన ఈ నాలుగు ఆలయాలను మిగిలిన ఆరు నెలల కాలంలో మానవులు సందర్శించుకోవచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాల ద్వారాలు ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి నవంబర్‌లో దీపావళి పర్వదినం తర్వాత మూసివేస్తారు.  ఈ నాలుగు ఆలయాలూ ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయి. గంగానది, యమునా నది జన్మస్థలాలను గంగోత్రి, యుమునోత్రి అంటారు. అలాగే బద్రీనాథ్‌లో శ్రీ మహావిష్ణువు, కేదార్‌నాథ్‌లో శివుడు స్వయంభువుగా వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి.

యమునోత్రిచార్‌ధామ్‌ యాత్రలో మొదటగా దర్శించుకునే ధామం (క్షేత్రం) యమునోత్రి. యమునానది జన్మస్థలంలోనే యమునాదేవి ఆలయం ఉంది. యమునానది ప్రాశస్త్యం గురించి ఒక్కో పురాణం ఒక్కో కథను వివరిస్తున్నాయి. ప్రముఖంగా చెప్పుకునేది – సూర్యదేవుడి అర్ధాంగి ఛాయాదేవి. వీరికి యముడు, యమున సంతానం. ఛాయాదేవికి కూతురైన యమున మీద ఒకానొక సమయంలో ఆగ్రహం కలిగి భూలోకంలో ఉండమని శపించిందట. దాంతో యమున భూలోకంలో నదిగా అవతరించిందట.

గంగోత్రిచార్‌ధామ్‌ యాత్రలో సులువుగా చేరుకోగలిగే ప్రాంతం గంగోత్రి. ఈ నది జన్మస్థలం ఉత్తరాఖండ్‌లోని ఉత్సర కాశీ జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. సముద్రమట్టానికి 3,750 మీటర్ల ఎత్తులో హిమాలయ పర్వత శ్రేణులలో ఉంది. నదులన్నింటిలో గంగానది పరమపవిత్రమైనదిగా పూజలందుకుంటోంది. గోముఖం నుండి గంగోత్రి చేరే వరకు ఈ ప్రవాహంలోని నీటికి ఎక్కడా మానవ స్పర్శ అంటదు. అందువల్లే తమిళనాడు రామేశ్వరంలోని లింగేశ్వరస్వామికి నిత్యాభిషేకం గంగోత్రి నీటితోనే చేస్తారు.

కేదార్‌నాథ్‌అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది కేదార్‌నాథ్‌. వైశాఖమాసంలో అంటే ఏప్రిల్‌ ఆఖరి వారం లేదా మే నెల మొదటి వారంలో తెరుస్తారు. తిరిగి అక్టోబరు నెల ఆఖరి వారం లేదా నవంబరు  మొదటి వారంలో మూసివేస్తారు. నరనారాయణులు కేదారనాథుని అనుమతి తీసుకొని, బదరీనాథ్‌లో తపస్సు చేశారని స్థలపురాణం చెప్తోంది.

బద్రీనాథ్‌జగద్గురు ఆదిశంకరుల వారు నెలకొల్పిన ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలలోని సమస్త దేవతలూ నివసిస్తారనీ నమ్మకం. ఈ ఆలయంలో వైశాఖం నుండి కార్తీక మాసం వరకు మానవులు, మార్గశిరం నుండి చైత్రమాసం చివరి వరకు నారద మహర్షి స్వామికి పూజలు చేస్తారని కథనాలు. గర్భాలయంలో ఉత్సవమూర్తితో పాటు స్వామి ఎడమవైపున నరనారాయణులు శ్రీదేవి– భూదేవి, నారదుడు, ఉద్ధవుడు... కుడివైపున కుబేరుడు, గరుత్మంతుడు కొలువుదీరి ఉన్నారు. పితరులకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే వారికి మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

చార్‌ధామ్‌ యాత్ర ఏప్రిల్‌ చివరి వారం, మే నెలలో చేయవచ్చు.



Sunday, 19 March 2017

ద్వారకను చూసొచ్చాం!








ద్వారకను చూసొచ్చాం!



‘‘శ్రీకృష్ణుడు పాలించిన అలనాటి ద్వారక విశేషాలనూ, సోమనాథ్ జ్యోతిర్లింగ మహాత్త్వాన్నీ వైభోగాలకు నెలవైన చిత్తోడ్, ఉదయ్ పూర్ కోటల అందచందాలను ఏకకాలంలో చూసి రావాలంటే గుజరాత్,రాజస్తాన్ రాష్ట్రాలను పర్యటించాల్సిందే. ’’

మా పర్యటనలో భాగంగా ముందుగా మేం అహ్మదాబాద్‌కు వెళ్లాం. మేం వెళ్లింది దసరా సమయం కావడంతో ఎక్కడ చూసినా గార్భా సందడే. గుజరాతీలు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా జరుపుకునే పండగల్లో దసరా అత్యంత ముఖ్యమైనది. అందుకే నవరాత్రుల తొలి రోజున గార్భాను పూజామందిరాల్లో పెట్టి అమ్మవారిని ఆవాహన చేస్తారు. తొమ్మిదిరోజులూ భక్తిశ్రద్ధలతో పూజించి దశమినాడు హోమంతో పూజ పూర్తి చేసి దగ్గరలోని దేవాలయాల్లో ఉన్న పూజారులకు దక్షిణ తాంబూలాలతో గార్భాను సమర్పిస్తారు. చుట్టూ చిల్లులు ఉన్న కుండలో దీపం పెట్టి పైన మూతపెట్టినదే గార్భా. ప్రత్యేక ప్రదేశాల్లోనూ వీధికూడళ్లలోనూ మనం అమ్మవారి విగ్రహం పెట్టినట్లుగా ఈ గార్భాలను పెడతారు. చీకటిపడిన దగ్గర్నుంచీ తెల్లారేవరకూ చేసే ఈ గార్భా నృత్యాలనే రాస్‌ అంటారు.

తీన్‌ దర్వాజా!
ముందుగా మేం అహ్మదాబాద్‌లోని భద్రకాళీ మందిరంలో అమ్మవారిని దర్శించుకున్నాం. దేశానికి పశ్చిమం వైపున ఉండటంవల్లనేమో మనకన్నా గంట ఆలస్యంగా సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఉన్నాయక్కడ. పూర్వం నగరానికి స్వాగత ద్వారంలాంటి తీన్‌ దర్వాజా నేడు ప్రముఖ వ్యాపార కూడలి. దానిగుండానే పురాతన జామామసీదుకు వెళ్లాం. తరవాత సబర్మతీ నదీతీరాన్నే ఉన్న గాంధీజీ ఆశ్రమాన్నీ అక్కడ ఉన్న మ్యూజియాన్నీ చూశాం. ఆ మ్యూజియంలోని ఆనాటి దినపత్రికల్లో మన ఆంధ్ర పత్రిక కూడా ఉంది. అవన్నీ తిరిగి చూస్తుంటే నాటి పరిస్థితులు కళ్లకు కట్టినట్లుగా అనిపించాయి.

శ్రీకృష్ణ ద్వారక!
తరవాత చార్‌ధామ్‌లలో ఒకటైన ద్వారకకు బయలుదేరాం. దారి పొడవునా పవన విద్యుచ్ఛక్తికోసం ఏర్పాటుచేసిన గాలిమరలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి ఏడు గంటలు ప్రయాణించి ఇరుకిరుకు సందులతో ఉన్న ద్వారకలోకి అడుగుపెట్టాం. గోమతీనది అరేబియా సముద్రంలో కలిసే సంగమ ప్రదేశంలో విశ్వకర్మ చేతుల్లో రూపుదిద్దుకున్న శ్రీకృష్ణ రాజధాని ద్వారక ఇదేనా అనిపించింది. అలనాటి ద్వారక అనేకసార్లు సముద్రంలో మునిగిపోయింది. ఏడోసారి నిర్మించినదే ప్రస్తుత ద్వారక. ముందుగా ద్వారకాదీశ మందిరానికి వెళ్లాం. అద్భుతమైన శిల్పకళతో కట్టిన ఆ గుడిలో స్వామివారి నల్లరాతి విగ్రహం చక్కని అలంకరణతో నయన మనోహరంగా ఉంది. కృష్ణభక్తురాలైన మీరాబాయి భజన కీర్తనలు ఆలపిస్తూ ప్రజలు చూస్తుండగానే గర్భగుడిలోకి వెళ్లి మరి బయటకు రాలేదట. ఆ మహాభక్తురాలు కృష్ణుడిలో ఐక్యమైపోయిందని విశ్వసిస్తారు భక్తులు.

అక్కడకు బెట్‌ ద్వారక ఐదు కిలోమీటర్లు. ఆ దారిలో జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వరలింగం, గోపీతలావ్‌, రుక్మిణీమందిరం, సముద్ర నారాయణుని గుడి మొదలైన దర్శనీయ స్థలాలు ఉన్నాయి. లాంచీలో చిన్నదీవిలా ఉన్న బెట్‌ ద్వారకకు వెళ్లాం. అక్కడ కృష్ణుడు, సత్యభామ, ఇతర దేవేరుల మందిరాలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ ద్వారక, బెట్‌ ద్వారకల మధ్య గరుత్మంతునిపై తిరిగేవాడట. సూర్యాస్తమయ సమయానికి సముద్రతీరానికి చేరుకున్నాం. నేలనుంచి సుమారు 30-40 అడుగులు కిందకు కుంగిపోయినట్లు దిగబడిపోయిన సముద్ర ఒడ్డును చూస్తుంటే ఒళ్లు జలదరించినట్లయింది. ఏదో ఉపద్రవంతో ఒక్కసారిగా భూమి ముక్కలైపోయినట్లుగా పొరలుపొరలుగా కనిపిస్తుంది. అది చూస్తుంటే నాటి పురాణాలూ ఇతిహాసాలూ నిజంగా జరిగాయా అనిపించకమానదు. గాంధీగారి సొంతూరు!

ద్వారకకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది పోరుబందరు. కృష్ణుడు కుచేలుడికి బహూకరించిన నాటి సుధామపురే నేటి పోరుబందరు. కృష్ణుడు రాజమందిరాన్ని ప్రసాదించినా అందులో నివసించకుండా పక్కనే చిన్న గదిలో ఉంటూ కృష్ణుణ్ణి పూజించి తరించిన ఆ సుధామ మందిరం, దాని పక్కనే ఆయన గదీ నాటి బావీ నేటికీ ఉండటం విశేషం. అక్కడనుంచి తరవాత గాంధీజీ జన్మించిన ఇంటిని చూడ్డానికి బయలుదేరాం. పురాతన భవనమైనా చెక్కుచెదరలేదు. ఎగువ మధ్యతరగతి వైశ్య కుటుంబం కావడంతో ఇల్లు దర్పంగా విశాలంగా ఉంది. బాపూజీ తల్లిదండ్రులవీ బాపూజీ-కస్తూర్బాలవీ నిలువెత్తు తైలవర్ణ చిత్రాలు అలంకరించారు.

ప్రభాస పట్టణ దర్శనం...
అక్కడకు 129 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమనాథ్‌కు రాత్రికి చేరుకున్నాం. పురాణాల్లో దీన్నే ప్రభాస పట్టణంగా చెబుతారు. పాలసముద్రంలాంటి అరేబియా ఒడ్డున విశాలమైన ప్రాంగణాల్లో అద్భుత శిల్పకళా చాతుర్యానికి నితువెత్తు దర్పణంలా మెరిసిపోతుంది ఈ దేవాలయం. మందిరం దగ్గర్లోనే కపిల, హిరణ్య, సరస్వతి అనే మూడు నదుల త్రివేణీ సంగమస్థానం భక్తులతో సందడిగా ఉంది.

కృష్ణుని మహాప్రస్థానం..!
మహా ప్రళయానికి ద్వారక నాశనం కాగా శ్రీకృష్ణుడు సోమనాథ్‌ పక్కనే ఉన్న భాలకా అనే ప్రదేశం చేరుకుని చెట్టు కింద విశ్రమిస్తున్నాడట. ఆయన పాదాన్ని లేడి కన్నులా భావించి కిరాతకుడు వేటకై బాణాన్ని విడవగా అది కృష్ణ పరమాత్మ ప్రాణాలు గైకొందట. బలరాముడు ఆదిశేషుని రూపంలో త్రివేణీసంగమం దగ్గర ఉన్న పుట్ట ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయాడట. శంఖుచక్రాలు సముద్రంలో లీనమై గోమతీ చక్రాల రూపంలో సోమనాథ్‌-ద్వారకల మధ్య ఉన్న సముద్ర ప్రదేశంలో మాత్రమే లభిస్తున్నాయట. ఒకవైపు శంఖం, మరోవైపు చక్రంలా ఉండి ఇవి లక్ష్మి-విష్ణు స్వరూపంగా సర్వశక్తిమంతమై నేటికీ పూజలందుకుంటున్నాయి.

చిత్తోడ్‌గఢ్‌ కోటలో...


అక్కడ నుంచి రాజుపుత్రుల శౌర్యప్రతాపాలూ వైభోగాలూ దర్శించడానికి రాజస్థాన్‌కు బయలుదేరాం. దారిపొడవునా పాలరాతి కొండలు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఉదయ్‌పూర్‌కు ముందు మేవాడ్‌ రాజుల రాజధాని ఈ చిత్తోడ్‌గఢ్‌. క్రీ.శ. 7-16 వరకూ ఎన్నో వైభోగాలతో తులతూగింది. ఖిల్జీల దండయాత్రలో నాశనమైపోయింది. మీరా పూజలందుకున్న కృష్ణమందిరం నేటికీ పూజలందుకుంటూ గత స్మృతుల్లోకి మనల్ని నెడుతుంది. శివమందిరంలో బాల, ఫ్రౌడ, వృద్ధ రూపాలుగా శిరస్సు మాత్రమే కనిపించేలా చెక్కిన ఎత్తైన శివుని విగ్రహం కొంత భయం గొలిపేలా ఉంది. ఆ పక్కనే గోముఖ్‌ రిజర్వాయర్‌, కాళీమందిరం, రాణీ పద్మినీ ప్యాలెస్‌, గులాబీవనం, జైనమందిరం కనిపిస్తాయి.

అద్భుత అందగత్తె అయిన రాణీ పద్మినీ, రాణీ కర్ణావతిల సమాధుల్ని చూశాం. చిత్తోడ్‌ సామ్రాజ్యాధికారం కోసం పసిబిడ్డగా ఉన్న ఉదయ్‌సింగ్‌ని చంపాలనుకున్నారట దాయాదులు. ఈ కుట్రను పసిగట్టిన దాసి పన్నాబాయి ఉదయ్‌సింగ్‌ స్థానంలో అదే వయసున్న తన బిడ్డను ఉంచిందట. దాయాదుల చేతిలో ఆ బిడ్డ హతం కాగా చిన్నారి ఉదయ్‌సింగ్‌తో పన్నాబాయి కోట దాటి తప్పించుకున్న ప్రదేశం మనకు కనిపిస్తుంది. ఇలా ఎన్నో చారిత్రక సాక్ష్యాలకు నిలయం చిత్తోడ్‌కోట. ప్రస్తుతం కొండజాతివారు ఈ కోటలో సీతాఫలాలు పండించుకుంటూ జీవిస్తున్నారనీ వాళ్లు రాణా ప్రతాప్‌కు సహాయం చేసిన భీల్‌ తెగవారనీ మా గైడ్‌ చెప్పాడు. నార చీరలు తయారుచేయడం, అతి తేలికైన రజాయిలు చేయడం వాళ్ల ప్రత్యేకత అనీ, ప్రభుత్వ సహకారంతో వాటిని కోటలోని దుకాణాల ద్వారా అమ్ముకుంటూ ఆ డబ్బుతోనే జీవించే నిజాయతీ పరులనీ చెప్పాడు. తరవాత అక్కడినుంచి ఉదయ్‌పూర్‌కు వెళ్లాం.

సరస్సుల నగరంలో విహారం... 


మహారాణా ఉదయ్‌సింగ్‌ అడవిలాంటి ఈ ప్రదేశానికి వేటాడుతూ రాగా గోస్వామి ప్రేమ్‌జీ అనే సన్యాసి ఇక్కడ కోటను నిర్మించమన్నాడట. ఆయన ఆదేశంతో 1559లో నాలుగు అంతస్తులుగా కోటనూ నగరాన్నీ నిర్మించాడట. అందుకే ఈ నగరం ఆయన పేరు మీదనే ఉదయ్‌పూర్‌గా స్థిరపడింది. నగరానికి రాణీలాంటి సిటీ ప్యాలెస్‌ పిచోలా సరస్సు పక్కనే ఉన్న కొండమీద ఉంది. ఇప్పటికీ ఉదయ్‌సింగ్‌ వంశంలోని 24వ తరం వారి అధీనంలోనే ఈ కోట ఉంది. వారి కులదైవమైన సూర్యుని ముద్ర ప్రవేశద్వారంపై ఉంటుంది. లోపల విశాలమైన వరండాలూ గదులూ ఉన్నాయి. ఉదయ్‌సింగ్‌ కుమారుడు రాణా ప్రతాప్‌, మొఘల్‌ చక్రవర్తుల కొమ్ముకాస్తున్న జైపూర్‌ రాజు రాజా మాన్‌సింగ్‌ని చంపడానికి తన గుర్రం చేతక్‌కు ముందు ఇనుముతో చేసిన ఏనుగుతొండం కట్టి కదనరంగంలోకి వెళతాడు. మాన్‌సింగ్‌ అధిరోహించిన ఏనుగు, దాన్ని ఓ పిల్ల ఏనుగుగా భావించి చేతక్‌ జోలికి రాదు. అయితే అది దగ్గరకొచ్చాక చేతక్‌ ఒక్కసారిగా కత్తులు కట్టిన తనముందు కాళ్లతో పైకి లేవడంతో రాణా చేతిలో మావటి క్షణాల్లో చనిపోయాడట. కానీ మాన్‌సింగ్‌ కిందకు వంగడంతో ప్రాణాలతో బయటపడతాడు. ఆ యుద్ధంలో గాయపడ్డ రాణాప్రతాప్‌ను తను గాయపడ్డా కూడా యుద్ధభూమి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంబాల్‌గఢ్‌ వరకూ తీసుకెళ్లి అక్కడ 42 అడుగుల వెడల్పు ఉన్న బనాస్‌ నదిలో దూకి రాణా ప్రాణాలు కాపాడి చేతక్‌ కన్ను మూసిందట. ఆ దృశ్యాలన్నీ తైలవర్ణ చిత్రాల్లో చిత్రించి ఉన్నాయి. ఇక, రాజదర్బారు, సింహాసనాలతోబాటు రాజప్రాసాదానికే తలమానికమైన అద్దాల నెమలి ఆనాటి కళాకారుల పనితనానికి ప్రతీక. మేవాడ్‌ రాజులు సూర్యదర్శనం తరవాతే భోజనం చేస్తారు. శ్రావణమాసంలో సూర్యదర్శనం కష్టం కాబట్టి, ఆ సమయంలో దర్శించుకోవడానికి ప్రజ్వలంగా వెలుగుతున్నట్లున్న సూర్యబింబం ఆకారాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దారు. అతిథులను ఆటపట్టించడానికి నిర్మించిన రాతి తలుపులూ సరదా పుట్టించే వేట దృశ్యాల వర్ణ చిత్రాలూ... ఇలా ఎన్నెన్నో చిత్రవిచిత్రాలు అక్కడ ఉన్నాయి.

పాలరాతితో చేసిన తొట్టెలో బంగారునాణాలను నింపి దసరా కానుకగా జనానికి పంచేవారట. సుగంధద్రవ్యాలతో హోలీ ఆడుకునే చిన్న కొలనూ ఫౌంటెయినూ అద్దాల మందిరమూ ముఖమల్‌ మందిరమూ... ఇలా అవన్నీ చూస్తుంటే సమయమే తెలియలేదు.


కోటపైనుండి ఒకవైపు సరస్సు మధ్యలో మహారాజా జగత్‌సింగ్‌ నిర్మించిన వేసవి విడిది లేక్‌ ప్యాలెస్సూ దానికి కొద్దిదూరంలో ఉదయ్‌విలాస్‌ కోటా కనిపిస్తాయి. అక్కడ నుంచి సహేలియోంకీ బాడీకి వెళ్లాం. రాణా సంగ్రామ్‌సింగ్‌ ఆనాటి రోజుల్లోనే అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఫౌంటెయిన్లు నిర్మించిన అందమైన ఉద్యానవనమే ఈ సహేలియోంకీ బాడీ. ముందుగా వెల్‌కమ్‌ ఫౌంటెయిన్‌ కనిపిస్తుంది. మనం వస్తుంటే ఇందులోంచి నీళ్లు పైకి చిమ్ముతాయి. తరవాత జోరువాన శబ్దం వినిపించే బాదల్‌ బర్‌సాత్‌, చెట్ల ఆకులూ పొదలమీద పడుతున్న వాన శబ్దాన్ని వినిపించే శ్రావణ బరసాత్‌ ఫౌంటెయిన్లనీ చూశాం. చివరగా తామరకొలను దగ్గరకు వెళ్లాం. దానికి నలువైపులా పాలరాతి ఏనుగుల తొండాల నుంచి నీరు చిమ్మేలా నిర్మించారు. అలాగే కొలను మధ్యలో రకరకాల పక్షుల ముక్కుల నుంచి నీళ్లు రావడం ఎంతో బాగుంది. చివరిగా రాణాప్రతాప్‌ స్మారక స్తూపం చూసి తిరుగు ప్రయాణమయ్యాం.



Friday, 24 February 2017

అంతా శివమయం

అంతా శివమయం

నిరాకార రూపుడైన శివుడు.. భారతావనిలో పన్నెండు ప్రదేశాల్లో జ్యోతిర్లింగ స్వరూపునిగా వెలిశాడు. మన దేశానికి నాలుగు దిక్కులా ఈ జ్యోతిర్లింగ ఆలయాలున్నాయి. వాటిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందులో ఒక్క లింగాన్నైనా దర్శించుకోగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందని పెద్దల వాక్కు. శివరాత్రి పర్వదిన వేళ.. వాటి గురించి మరిన్ని విశేషాలు..

తైత్తీరియో ఉపనిషత్తును అనుసరించి మనిషిలోని పన్నెండు తత్వాలే ఈ జ్యోతిర్లింగాలు. అవేంటంటే..
1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనసు 5. బుద్ధి 6. చిత్తం 7. అహంకారం 8. పృథ్వి 9. జలం 10. తేజస్సు 11 వాయువు 12. ఆకాశం

జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ..
  • సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతం తీరాన రామేశ్వరం, ఆరేబియా ఒడ్డున సోమనాథాలయం)
  • పర్వతసానువుల్లో నాలుగు (శ్రీశైల శిఖరాన మల్లికార్జున, హిమాలయాల్లో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాల్లో భీమశంకరుడు, మేరు నగపై వైద్యనాథుడు )
  • మైదానాల్లో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగబాద్‌ - ఘృష్ణేశ్వర, ఉజ్జయిన నగరాన - మహాకాలేశ్వరుడు)
  • నదులు తీరాన మూడు (గోదావరి ఒడ్డున త్రయంబకేశ్వరుడు, నర్మదా నదీతీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీ తీరాన విశ్వేశ్వరుడు)
జ్యోతిర్లింగ రూపాల్లో ఉన్న ఆ లింగాలు పరమశివుని తేజస్సు అని పురాణాలు చెబుతున్నాయి. ద్వాదశాదిత్యులకు ప్రతీకలుగా భావిస్తారు. లయకారుడైన పరమశివుడు స్వయంభువుగా వెలిసిన దివ్యక్షేత్రాలుగా ఇవి పేరొందాయి.

సోమనాథ జ్యోతిర్లింగం :
గుజరాతలోని వీరావల్‌ దగ్గరున్న ప్రభాస పట్టణంలో సోమనాఽథ ఆలయం ఉంది. చంద్రుని కీర్తిని దశ దిశలా వ్యాప్తి చెందించుటకు శివుడు సోమనాథునిగా ఇక్కడ వెలిశాడని స్థల పురాణం.

మల్లిఖార్జున జ్యోతిర్లింగం :
ఇది ఆంద్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని శ్రీశైలంలో ఉంది. పర్వతుడనే రుషి తపఃఫలంగా ముక్కంటి ఇక్కడలింగ రూపంలో ఆవిర్భవించాడని స్థానిక కథనం. ఆది శంకరుడు ‘శివానందలహరి’ని ఇక్కడే రాశాడని చెబుతారు.

మహాకాళే శ్వర జ్యోతిర్లింగం :
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉందీ క్షేత్రం. స్మశానం, ఎడారి, పాలపీఠం, అరణ్యం ఉన్న ప్రదేశం ఉజ్జయిని. అందుకే అన్ని క్షేత్రాల్లో కంటే మహాకాళేశ్వరం అత్యుత్తమైందిగా భక్తులు భావిస్తారు.

కేదారనాథ్ ఆలయం :
ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో మందాకిని నదీ సమీపంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం పర్వత రాజైన హిమవంతుని కేదార నామ శిఖరంపై ఉండటంతో ఇది కేదార జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది.శీతాకాలంలో అక్కడ ఎక్కువగా మంచు కురుస్తుంది. వాతావరణ పరిస్థితులు కారణంగా ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో మాత్రమే దీన్ని సందర్శించవచ్చు.

నాగేశ్వర దేవాలయం :
మరో జ్యోతిర్లింగ క్షేత్రం ద్వారకవనంలో వెలిసిన ‘నాగేశ్వర లింగం’. ఒంటినిండా సర్పాలనే వస్ర్తాలుగా చుట్టబెట్టుకుని శివుడు ఈ తీర్థాన కొలువైనందున ‘నాగేశ్వరుడి’గా పూజలందుకుంటున్నాడు. పతి వెంటే సతీ అన్నట్లుగా... పార్వతీదేవి ఇక్కడ నాగేశ్వరిగా కొలువు తీరింది. గుజరాత పోరుబందర్‌ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఈ తీర్థముంది.

రామేశ్వరం :
తమిళనాడులోని ‘రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం’ పరమపవిత్రమైందిగా ప్రసిద్ధి గాంచింది. రామేశ్వర దర్శనం చేసుకుంటే.. కాశీ యాత్ర చేసినంత ఫలితం వస్తుందని పెద్దల మాట. ఈ ఆలయంలో 36 తీర్థాలు ఉండటం విశేషం. బంగాళాఖాతంలో శంఖు ఆకారంలో ఉండే చిన్న ద్వీపం రామేశ్వరం.

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం :
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ స్వామిని కొలిచిన వారికి సంతాన నష్టం ఉండదు. అకాల మరణ దోశం కూడా తొలగిపోతుందట. జ్యోతిర్లింగాల్లో ఇది పన్నెండో జ్యోతిర్లింగం.

త్రయంబకేశ్వర దేవాలయం :
పరమ పవిత్ర నది గోదావరి పుట్టిన చోట ఈ క్షేత్రం ఉంది. త్రయంబకేశ్వరుని పూజిస్తే.. ప్రమాదాలతో పాటు, అకాల మృత్యుదోషాలు తొలగుతాయని స్థలపురాణం చెబుతోంది. ఈ లింగం చెంతనే మూడు చిన్న లింగాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపాలే ఆ లింగాలు. అందుకే ఈ క్షేత్రం త్రయంబకేశ్వర పేరుతో విరాజిల్లుతోంది.

వైద్యనాథ దేవాలయం :
జార్ఖండ్‌లోని దేవ్‌ఘడ్‌లో వైద్యనాథ ఆలయం ఉంది. ఈ స్వామిని పూజించిన వారికి సకల రోగాలు సమసిపోతాయని భక్తుల నమ్మకం. ఈ దేవాలయాన్ని రాణి అహల్యదేవి అభివృద్ధి చేసినట్టుగా అక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయంలోని శివలింగ శిరస్సుపై ఉన్న నొక్కును రావణాసురుని బొటన వేలు నొక్కుగా చెబుతారు.

భీమశంకర జ్యోతిర్లింగం :
మహారాష్ట్రలోని భీమశంకర్‌లో కలదు. పూణె నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఇది ఇంది. కృష్ణానదికి ఉపనదిగా ఉన్న భీమనది ఇక్కడే పుట్టింది. ఈ నది పేరుమీదనే ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది.

కాశీ విశ్వనాథ దేవాలయం :
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పరమేశ్వరుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా అవతరించాడు. పవిత్ర గంగానదీ తీరంలో ఈ క్షేత్రం ఉంది. వరుణ, అసి నదులు గంగానదిలో సంగమించిన ప్రదేశం ఇది కనుక వారణాసిగా చరిత్రకెక్కింది. ‘కాశి వంటి పుణ్య క్షేత్రం, తల్లి వంటి దైవం, గాయత్రి వంటి మంత్రం’ లేదు అని ఓ నానుడి.

ఓంకారేశ్వర ఆలయం :
ఈ ఆలయం మధ్యప్రదేశ్‌, ఖాండ్వాలో నర్మదా నదీ తీరాన మంధాత పర్వత ప్రాంతంపై కొలువై ఉంది. ఇక్కడి లింగం చుట్టూ ఎప్పుడు నీళ్లు ఆవరించి ఉండటం విశేషం. ఈ దేవాలయం కృత యుగం నాటిది.

Wednesday, 22 February 2017

జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్‌!







జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్‌!



నర్మదానది నీటి పరవళ్లలో అల్లనల్లన తేలియాడుతూ వచ్చే చల్లని గాలి ఓంకార నాదం చేస్తూ హృదయంలో భక్తిరసాన్ని తట్టిలేపుతుంది. వింధ్య పర్వత సోయగాల వీక్షణతోనే మనసు శివపంచాక్షరి స్తోత్రాన్ని జపించడంలో మునిగిపోతుంది.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై న కారాయ నమఃశివాయ...
అంటూ స్వామిని స్తుతిస్తూ ఓంకారేశ్వరుని ఆలయానికి చేరుకుందాం.

నర్మద, కావేరీ సంగమ క్షేత్రం ఓంకారేశ్వర్‌. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమాన్వితమైన రెండు జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వర్‌లోనే ఉండటం ఈ ప్రాంత విశిష్టత. మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌ పట్టణానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్‌. కాషాయ దుస్తులు ధరించిన సాధువులు, గంభీరంగా సాగే నర్మదానది, అక్కడి ఘాట్లలో భక్తుల సందడి.. చూడగానే మనసుకు కాశీ క్షేత్రం తలపుకు రాకుండా ఉండదు. అందుకే ఈ పట్టణాన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. నర్మదానది ఒడ్డునే ఓంకార రూపంలో వింధ్యపర్వతం ఉంది. ఈ పర్వతం ఓంకార రూపంలో ఉండటంతో స్వామికి ఓంకారేశ్వరుడు అని, స్వామి పేరుమీదుగానే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్‌ అని పేరు వచ్చింది.

గిరి పరిక్రమ ఫలితం ఎంతెంతో!
ఇక్కడ నర్మదా నది స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉండటం విశేషం. అందుకే భక్తులు కూడా నదికి, స్వామికి పరిక్రమను పూర్తి చేసి, స్వామి కృపకు పాత్రులవుతారు. ఓంకారగిరి ప్రదక్షిణ కైలాసపర్వతాన్ని చుట్టి వచ్చిన ఫలితం ఇస్తుందని, జన్మజన్మల సుకృతంగా భావిస్తారు భక్తులు. ఏడు కిలోమీటర్ల ఈ గిరి పరిక్రమకు మొత్తం నాల్గు గంటల సమయం పడుతుంది. ఈ పరిక్రమలో ముందుగా ‘పంచముఖ గణనా«థుడి’ని దర్శించుకుంటాం. ఈ గణనాథుడిని మాంధాత మహర్షి ప్రతిష్టించాడని ఐతిహ్యం. ఇక్కడ నుంచి మార్గమధ్యంలో అతిపురాతనమైన ‘ఖేరాపతి హనుమాన్‌’ ఆలయం చేరుకుంటాం.

దీనికి సమీపంలోనే కేదారేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ స్వామి లింగరూపంలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ప్రదేశంలోనే నర్మదా నదిలో రాళ్ల మీద రాళ్లు అంతస్తులుగా పేర్చి కనిపిస్తాయి. సొంతంటి ఇల్లు కల నెరవేరాలని భక్తులు ఈ రాళ్లు పేర్చి మొక్కుకుంటారు. అక్కడ నుంచి మరికొంత ముందుకు వెళితే ‘రుణముక్తేశ్వర స్వామి’ని ఆలయాన్ని చేరుకుంటాం. ఇక్కడ స్వామి వారికి శనగలు సమర్పిస్తే రుణ విముక్తులు అవుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే సుందర రాధాకృష్ణుల మందిరం, గౌరీ సోమనాథుల ఆలయాలు ఉన్నాయి. ‘లాలాహనుమాన్‌ దేవాలయం’లో స్వామి శయనరూపంలో కనిపించడం విశేషం.

అనంతరం భక్తులు ఆశాదేవి ఆలయం చేరుకుంటారు. ఈ మార్గంలోనే ఆఖరుగా గౌరీనా«ద్‌ ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి అత్యంత సమీపంలో ఓంకారేశ్వర్‌ మందిరం ఉంటుంది. గిరి ప్రదక్షిణ పూర్తిచేసిన భక్తులు స్వామి ఆలయానికి చేరుకుంటారు. దర్శనమాత్రం చేతనే భక్తులకు అషై్టర్యాలను ప్రసాదించే పరమేశ్వరుడు నాగాభరణ ధారిగా దర్శనమిస్తాడు. ఈ ప్రధాన ఆలయంలోనే త్రిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాలేశ్వర్, కేదారినాథ్, గుప్తనాథ్‌ అనే ఐదు ఉప ఆలయాలూ ఉన్నాయి. ఈ ఐదు ఆలయాలను పంచలింగ ధామాలుగా వ్యవహరిస్తారు.

వింధ్య తపస్సు మెచ్చిన ఈశ్వరుడు
దేశంలోని పర్వతాలలో మేరు పర్వతం, వింధ్య పర్వతం అత్యంత ఎల్తైనవిగా పేరుపొందాయి. కలహభోజనుడైన నారదుడు ఒక రోజు వింధ్య పర్వతం వద్దకు వచ్చి మేరు పర్వతాన్ని విశేషంగా ప్రశింసించాడట. దీంతో వింధ్యకు కోపం, అసూయ కలిగి తాను మేరు పర్వతం కంటే మించి పోవాలనే సంకల్పంతో శివుని ప్రార్థిస్తూ తపస్సు చేసిందట. శివుడు ప్రత్యక్షమై, నీ మనసులోని కోరిక సిద్ధిస్తుందని పలికాడట. శివుడు వింధ్యకు దర్శనం ఇచ్చినప్పుడు పలువురు మహర్షులు అక్కడికి వచ్చి శివుని దర్శించి, అతడు ఇదే స్థలంలో నిలిచిపోవాలని కోరారట. దీంతో శివుడు వింధ్య పర్వతం మీదనే కొలువుదీరాడట.

శివుని వరంతో వింధ్య రెచ్చిపోయి విపరీతంగా పెరగసాగిందట. వింధ్య ఎత్తు సూర్యచంద్రులకు కూడా ఆటంకం కలిగించిందట. వింధ్య ఎత్తు వల్ల కలిగిన ఉపద్రవాన్ని అరికట్టాలని దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు దేవతల మొర విని వింధ్య సమస్య పరిష్కారానికి అగస్త్యమునిని ప్రార్థించమని సూచించాడట. కాశీలో ఉన్న అగస్త్యుని దేవతలు కలుసుకొని వింధ్య వల్ల ఎదురవుతున్న సమస్యను వివరించి కాపాడమని అర్థించడంతో అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించి తాను దక్షిణాదికి వెడుతున్నానని,

నీ ఎత్తు ఎక్కువగా ఉన్నందున ఎక్కజాలనని, ఇదివరకటి ఎత్తుకు చేరుకోమని కోరడంతో మహర్షి మాట కాదనడానికి వీలులేదు కనుక వింధ్య సాధారణ ఎత్తుకు తగ్గిపోయిందట. అగస్త్యుడు పర్వతం దాటి వెడుతూ తాను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండాలని కోరి ముందుకు వెళ్లాడట. అయితే అతడు తిరిగి ఉత్తరాదికి రాకుండా శ్రీశైలంలో నిలిచిపోయాడట. మహర్షులు దేవతల ప్రార్థనపై వెలసిన శివలింగాన్ని రెండు భాగాలుగా విభజించగా వాటిలో ఒక భాగం ఓంకారేశ్వరుడుగా మరో భాగం అమలేశ్వరుడిగా వెలిశారు. ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శించినంతనే తమ జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు.

అలంకారంగా శయనహారతి
ఓంకారేశ్వర్‌లో స్వామికి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ప్రతిరోజూ శయన అలంకార హారతి కనులారా వీక్షించాల్సిందే. శ్రావణమాసంలో తిరునాళ్లు, కార్తికమాసంలో ప్రత్యేక ఉత్సవాలు, మాఘమాసంలో మహా శివరాత్రి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగు తాయి. ఇక శ్రావణమాసంలో జరిగే శ్రావణ మేళా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకో దగింది. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు నర్మదానదిలో మేళ తాళాల నడుమన జలవిహారం చేస్తారు. నది మధ్యలో ఒక చోట కలిసి, ఒకరి చుట్టూ ఒకరు ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తారు. శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం జరిగే ఈ వేడుకను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.

ఆధునికత అంటని వాతావరణం
ఓంకారేశ్వర్‌లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ స్థానిక సంస్కృతికి ఏమాత్రం విఘాతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఇక్కడి గిరిపుత్రుల అమాయకత్వం, ప్రశాంత వాతావరణం, ప్రజల సామాన్య జీవనస్థితిగతులను చూస్తే నాగరికత ఇక్కడి మనిషినీ, ప్రకృతిని ఇంకా స్పృశించలేదని స్పష్టం అవుతుంది. ఎంతో కళాత్మకంగా ఉండే ఈ పట్టణంలో మహిళలు కొండల మీద పూచే పువ్వులను కోసుకొచ్చి శివారాధనకు తెచ్చి అమ్ముతుంటారు. విభిన్నరకాలుగా ఉండే ఆ పువ్వుల పరిమళం మన మనసులో ఆధ్యాత్మిక పరమళాలను వెదజల్లుతుంది. హనుమాన్‌ మూర్తి రంగు వస్త్రధారణలో సాధువులు కనిపిస్తారు. నిలువ నీడలేని భిక్షకులు దేశం అంతటా కనిపిస్తారు. అయితే, ఇక్కడ మాత్రం దారికి అడ్డం పడకుండా ఒక సేవకు ఎదురుచూపులా కనిపిస్తారు భిక్షకులు. మౌనంగా అతిథులు ఇచ్చిన దానిని కళ్లకు అద్దుకుని భగవద్‌కృపగా తీసుకుంటారు. తీర్థయాత్రలు చేయడం అంటే ఆపన్నులకు సాయం చేయడమే అనేది ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు.

స్వామి దర్శనం
ప్రతి రోజు ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చు. ఈ పట్టణంలో బస చేయడానికి ధర్మశాలలు, సత్రాలు, వివిధ ట్రస్ట్‌ల గెస్ట్‌ హౌస్‌లు ఉన్నాయి.

ఓంకారేశ్వర్‌కు దారి
ఇండోర్‌ నుంచి ఓంకారేశ్వర్‌ 77 కిలోమీటర్లు. ఇండోర్‌లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఉజ్జయిని నుంచి 133, హైదరాబాద్‌ నుంచి 772 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్‌. హైదరాబాద్‌ నుంచి ఓంకారేశ్వర్‌కు నేరుగా రైలు మార్గం లేదు. భోపాల్‌ లేదా ఇండోర్‌ వెళ్లి అక్కడ నుంచి ఓంకారేశ్వర్‌ చేరుకోవాలి.

– నిర్మలారెడ్డి చిల్కమర్రి



Monday, 14 November 2016

నాగేశ్వర జ్యోతిర్లింగం నమో నమామి!

ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాగేశ్వర లింగం ఒకటి. ఇది గుజరాత్‌లోని దారుకావనంలో ఉంది. నేటి దారుకావనాన్నే పురాణాలలో కామ్యకవనం అని, ద్వైతవనమనీ పేర్కొన్నారు. దీని గురించిన గాథలు చాలా ఉన్నాయి కానీ, ముఖ్యమైనవాటిని చూద్దాం..

పూర్వం ఒక సముద్రతీరాన గల ఒక వనంలో దారుకుడనే రాక్షసుడుండేవాడు. వాడి భార్య దారుకి. వాళ్లు తపశ్శక్తి సంపన్నులు. వారికి బోలెడంత మంది సంతానం, మహాదుష్టులు, బలవంతులైన అనుచరగణం ఉన్నారు. వారి అండ చూసుకుని ఆ వనంలో ఉన్నవారినే కాదు, అటుగుండా వచ్చీపోయేవాళ్లని కూడా వదలిపెట్టకుండా హింసించనారంభించారు. దాంతో బాటసారులందరూ కలసి ఔర్వుడు అనే మహాముని పాదాలు పట్టుకుని, తమకు ఆ రాక్షస దంపతుల పీడ వదిలించమని ప్రాధేయపడ్డారు. అప్పుడు ఔర్వముని, ఆ రాక్షసులెవరైనా భూమిమీద ఉంటే, వారిలో హింసాప్రవృత్తి ఉంటే, వారు ఇక ప్రాణాలు కోల్పోవలసిందేనని శాపం పెట్టాడు. దాంతో దారుకుడు సముద్రంలోకి వెళ్లి, అక్కడ ఒక నగరాన్ని నిర్మించుకుని, అందులో ఉంటూ, సముద్ర ప్రయాణీకులను హింసించ డమే ప్రవృత్తిగా పెట్టుకున్నాడు.

ఒకసారి వాడలా సుప్రియుడనే వర్తకుడిని, అతని బంధుమిత్రులను పట్టి బంధించి, వారిని సముద్రం అడుగున గల తన నగరంలో ఒక చెరసాలలో బంధించాడు. ఈ చెరసాలకు అసంఖ్యాకమైన జలసర్పాలు, రాక్షసులు కాపలా కాస్తూ ఉంటారు. సుప్రియుడు మహాశివభక్తుడు కావడంతో చెరసాలలోని మట్టినంతటినీ ఒకచోట చేర్చి, దానిలో కాసిని నీళ్లుపోసి, ఆ మట్టితోనే ఒక శివలింగాన్ని తయారు చేసుకుని, శివుణ్ణి పూజించనారంభించాడు. సుప్రియుని సలహామేరకు అతనితో కలసి ఉన్నవారందరూ కూడా మహా పవిత్రమైన, అత్యంత శక్తిమంతమైన శివపంచాక్షరీ మంత్రాన్ని తదేక దీక్షతో జపించసాగారు. అప్పుడు ఆ రాక్షసుడి అనుచరులు సుప్రియుడి వద్దకు వచ్చి, ‘‘నీవు శివారాధన చేయరాదు. చేస్తే, మా రాజు, రాణి అయిన దారుకా దారుకిల ఆరాధన మాత్రమే చేయాలి. తక్షణం నీ శివపూజ మానకుంటే నిన్ను చంపేస్తాం’’ అని బెదిరించారు.

సుప్రియుడు అందుకు లొంగకపోవడంతో దారుకుణ్ణి పిలుచుకు వచ్చారు. దారుకుడు సుప్రియుడి భుజం మీద కత్తిపెట్టి, బెదిరించాడు. అయినా వినలేదు. ఇలా లాభం లేదని, కంఠాన్ని ఖండించబోయాడు. అప్పుడు ఆ పార్థివలింగం నుంచి శివుడు ప్రత్యక్షమై, ఆ రాక్షసుని తన త్రిశూలంతో ఒక్క దెబ్బకొట్టి, దుష్టులైన వాడి అనుచరగణాన్ని భస్మం చేశాడు. సుప్రియుని ప్రార్థన మేరకు అక్కడే జ్యోతిర్లింగరూపంలో కొలువయ్యాడు. అన్ని కథల్లా ఈ కథ ఇంతటితో ముగియలేదు. ఎందుకంటే ఆ రాక్షసుడి భార్య దారుకి పార్వతీదేవికి ప్రియభక్తురాలు కావడంతో తనకు లభించిన కొన్ని శక్తుల వల్ల తన అనుచరుల సాయంతో ఆ అడవినంతటి నీ తీసుకుపోయి సముద్రం అడుగుకు చేర్చింది.దాంతోపాటు ఆ వనంలోకి అడుగుపెట్టిన వారినందరినీ తమ అధీనంలోకి తీసుకుని, వారిని బలవంతంగా తమ రాజ్యప్రజలుగా మార్చసాగింది.

శివపూజ చేస్తున్న సుప్రియుణ్ణి పూజమానవలసిందిగా నిర్బంధిస్తూ, ఆమె, ఆ రాక్షసగణం సుప్రియుని చిత్రహింసల పాలు చేయడం మొదలు పెట్టారు. మరల శివుడు ప్రత్యక్షమై, సుప్రియుడికి ఒక శక్తిమంతమైన ఆయుధాన్నిచ్చాడు. ఆ ఆయుధంతో సుప్రియుడు వారందరినీ జయించాడు. ఈసారి పరమేశ్వరుడు ఆ జ్యోతిర్లింగంలోనికి తన శక్తులను ప్రవేశపెట్టి, వారందరినీ ఏ దుష్టశక్తులూ ఏమీ చేయకుండా వారికి రక్షణగా అక్కడే కొలువుతీరాడు. పార్వతీదేవి అక్కడ నాగేశ్వరిగా కొలువుతీరి, భక్తులను అనుగ్రహించడం ఆరంభించింది. ఆ రాక్షసగణాన్ని అక్కడినుంచి దూరంగా పంపించి, వారు జనావాసాలలోకి రాకుండా చేసింది జగన్మాత. సుప్రియుడు రూపొందించిన ఆ లింగమే నాగేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వరుడిగా తనను కొలిచిన వారికి తాను సరైన మార్గాన్ని చూపుతానని, మోక్షాన్నిస్తానని, భక్తి, వైరాగ్య జ్ఞానాలను అనుగ్రహిస్తానని శివుడు సుప్రియుడికి వాగ్దానం చేశాడు. ఈమేరకు శివపార్వతులు నాగేశ్వరుడు, నాగేశ్వరిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు.

అతి ప్రాచీన గాథ:
పూర్వం వాలఖిల్యులనే మునులు దారుకావనంలో శివుని గురించి సుదీర్ఘకాలంపాటు ఘోర తపస్సు చేశారు. అయినప్పటికీ శివుడు వారి భక్తిని, సహనాన్ని మరిన్ని పరీక్షలకు గురి చేయాలనుకున్నాడు. దాంతో ఒక యువసన్యాసి రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువసన్యాసి వంటిమీద నాగులు తప్ప వేరే వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ లేవు. అత్యంత సుందరాకారంలో ఉన్న ఆ యువసన్యాసిని చూసి, మునిపత్నులు మనసు పారేసుకుని, భర్తలను వదిలేసి, ఆ దివ్యసుందరాకారుడి వెంట పరుగులు తీశారు. దాంతో సహనం చచ్చిపోయి, కోపం కట్టలు తెచ్చుకుంది ఆ మునులలో. ఆ యువసన్యాసి లింగం తెగిపోవాలని శపించారు. ఇంకేముంది, శివుడి లింగం కాస్తా జారి భూమి మీద పడింది. దాంతో లోకాలన్నీ కంపించిపోయాయి. బ్రహ్మ, విష్ణులు భూమి మీదకు వచ్చి, ఆ మునుల తప్పిదాన్ని మన్నించి, లింగాన్ని వెనక్కు తీసుకుని, లోకాలను కాపాడమని శివుని ప్రార్థించారు. శివుడు శాంతించి, భూమి మీద పడిన ఆ లింగంలో జ్యోతిర్లింగాకారంలో కొలువుదీరి, మునులను అనుగ్రహించాడు. వంటిమీద పాములనే వస్త్రాలుగా చుట్టబెట్టుకుని వచ్చాడు కాబట్టి, నాగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు శివుడు. పతి వెంటే సతి అన్నట్లుగా... పార్వతీదేవి నాగేశ్వరిగా పక్కనే కొలువుదీరింది.

మరోగాథ:
తన ప్రియపత్ని అయిన సతీదేవి యోగాగ్నిలో దగ్ధం కావడంతో సతీవియోగాన్ని తట్టుకోలేక ఓ నదీతీరానికొచ్చి తాను కూడా దహించుకుపోయాడు. ఆ భస్మరాశి ఆ నదిలో కలిసిపోయింది. కొంతకాలానికి పాండవులు ఆ నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటుండగా, కొన్ని ఆవులు వచ్చి నదిలో స్నానానికి దిగగానే వాటి పొదుగులు పాలతో నిండిపోయి, ఆ నదీజలాలు వాటి పాలధారలతో తెల్లబడిపోసాగాయి. ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్న భీమార్జునులతో ధర్మరాజు, బహుశా ఈ నదిలో ఏదో మహిమ ఉండి ఉంటుంది. నదిలో దేవతలో, తపస్సులో ఉండి ఉండవచ్చు అని అన్నాడు. భీముడు నదీజలాలను తోడేసే ప్రయత్నం చేసి, సాధ్యం కాకపోవడంతో కోపంతో నదిమీద తన గదతో మోదాడు. ఆ దెబ్బకు నది రెండుగా చీలి పోయింది. నది మధ్యభాగంలో భీముడు తన గదతో మోదిన చోట రక్తపుచారికలు కనిపించాయి. నీళ్లు వేడెక్కిపోయి, నీటి అడుగున నాగేశ్వరుడి ఆకారంలో ఉన్న శివలింగం బయటపడింది. పాండవులు అక్కడ గుడిని నిర్మించారు. దారుకలు అంటే దేవదారు వృక్షాలు. ఇక్కడ దేవదారు వృక్షాలు విరివిగా ఉండటం వల్ల దారుకావనమనే పేరు వచ్చింది. ఈ వనంలో 20 మీటర్ల ఎత్తున్న శివుని విగ్రహం చూపరులను కన్నులు తిప్పుకోనివ్వదు. ఆలయం సుందరంగా ఉంటుంది.
D.V.R.భాస్కర్

Saturday, 3 September 2016

ఘృష్ణేశ్వర స్వామి

జ్యోతిర్లింగ స్వరూపుడు

ఆ స్వామిని ఏ పేరుపెట్టి పిలిచినా వచ్చి ఆదుకుంటాడు. భక్తితో ఏది సమర్పించినా ఆదుకుని, కటాక్షిస్తాడు. అందుకే ఆ స్వామి భక్తవ శంకరునిగా, భోళాశంకరునిగా పూజలందుకుంటున్నాడు. శివ పూజ అనేది ప్రాప్తంతో కూడుకున్నది. శివానుగ్రహం ఉంటేనేగానీ శివపూజ లభించదు. శివపూజకు ఎలాంటి నియమ నిబంధనలు లేవు... భక్తితో రెండు చుక్కలు నీరు పోస్తే మహాదేవుడైన ఆ స్వామి పెద్ద మనస్సు చేసుకుని కటాక్షిస్తాడు. అయితే ఉండాల్సిందల్లా భక్తి, విశ్వాసం. శివుడు తన భక్తుల్ని అనుగ్రహించడానికి అనేక చోట్ల వెలిసినప్పటికీ, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలే ఎక్కువగా ప్రసిద్ధి పొందాయి. కారణం, ఆయా క్షేత్రాలతో శివుడు భక్తుల అభీష్టం మేరకు, లోక కళ్యాణం కోసం వెలిశాడు. అలా శివుడు తనకు తానుగా ఆవిర్భవించిన క్షేత్రాలే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల మహిమ అపారం. ఆ మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసిన పుణ్యథామమే ‘వెరూల్’.

మహారాష్టల్రోని ఔరంగాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. శివుడు ఇక్కడ ఘృష్ణేశ్వర స్వామిగా కొలువులందుకుంటున్నాడు. వెరూల్ దివ్యక్షేత్రంలోని శ్రీఘృష్ణేశ్వర స్వామి ఆలయం అందమైనది. మనోహరమైన కట్టడాలతో అలరారుతున్న ఈ ఆలయం చూపురులను ఇట్టే ఆకర్షిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో అలలారుతున్న ఈ దివ్యాలయాన్ని రోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.

సాక్షాత్తు మహాదేవుడు జ్యోతిర్లింగ రూపంలో వెలసిన వెరూల్ దివ్యక్షేత్రంలో పూర్వం నాగజాతి ఆదివాసులుండేవారు. ‘బాంబీ’ అంటే పాముల పుట్టలని అర్థం. పాముపుట్టలను మరాఠీలో ‘వారూళ్’ అంటారు. ‘వారుళే’ కాలక్రమంలో వెరూల్గా రూపాంతరం చెందినట్టు తెలుస్తోంది. అలాగే పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని ‘యెల’ అనే పేరుగల రాజు పాలించేవాడు. అతని రాజధాని ‘యేలాపూర్’. ఆ యేలాపూర్ యేలూరుగా, వెరూల్గా పేర్గాంచింది.

మనోహరమైన కట్టడాలు, ప్రాకారాలతో అందంగా అలరారుతున్న శ్రీఘృష్ణేశ్వర స్వామి ఆలయం అతి పురానతనమైంది. ఈ ఆలయాన్ని జైజాబాయి, అహిల్యాదేవి హోల్కర్ తదితర భక్తులు పునర్నిర్మించారు. అలాగే ఈ ఆలయ గోపురానికి జయరామ్ భాటియా అనే భక్తుడు స్వర్ణరేకు తాపడం చేశాడు. అలాగే 24 రాళ్ల స్తంభాలతో సభా మండపాన్ని కూడా చేయించాడు. అతి పురానతమైన ఘృష్ణేశ్వరం మహిమాన్వితమైనది. శివుడు ఈ క్షేత్రంలో కొలువై ఉండడానికి పలు పురాణగాథ ప్రచారంలో ఉన్నాయి.

పూర్వం దేవ పర్వతంపై సుదేహ, సుధర్ముడనే బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. సుదేహాకు సంతానం కల్గకపోవడంతో తన చెల్లెలు అయిన ధుశ్శను తన భర్తకిచ్చి వివాహం చేసింది. కొంతకాలానికి ధుశ్శ గర్భాన్ని ధరించి ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. ఆ కొడుకు పెద్దవాడై సంతోషభాగ్యాలతో ఉండడంతో ద్వేషాన్ని పెంచుకున్న సుదేహ, తన చెల్లెలు ధుశ్శ కొడుకును చంపించింది చెరువులో పడవేయించిందట. శివ భక్తురాలైన ధుశ్శ, తన కొడుకు మరణించినా చెక్కుచెదరకుండా శివార్చన చేసిందట. శివుడు అనుగ్రహించి ధుశ్శ కొడుకుకి పునర్జీవితం ప్రసాదించాడు. దీనికి కారణమైన సుదేహను భస్మం చేయడానికి ఉద్యుక్తుడవుతుండగా, తన అక్క చేసిన పాపాన్ని క్షమించమని, లోకకళ్యాణం కోసం స్వామిని అక్కడ వెలవమని ప్రార్థించిందట. ధుశ్శ అభీష్టం మేరకు శివుడు అక్కడ ఘృష్ణేశ్వర స్వామి’ నామధేయుడై జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు.

మరో పురాణగాథ ప్రకారం ఒకసారి శివుడు, పార్వతి కామ్యకవనంలో ఏకాంతంలో వుండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళం నుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యందట. ఆ లింగం నుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా, పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణం కోసం అక్కడ ప్రతిష్టించిందట. ఆనాటి నుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది. సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్టించిన జ్యోతిర్లింగం కాబట్టే, దీనికి ఇంత మహత్తు ఏర్పడిందంటారు.

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం విశాలమైనది. పూర్తిగా రాతి కట్టడం. ఆలయానికి ముందు భారీ ఆకారంలో ఉన్న రాతి నంది ఉంది. ఈ నంది శిల్పం అందం వర్ణనాతీతం. గర్భాలయానికి ముందు ఎడమవైపు భాగంలో విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. గర్భాలయంలో ఉన్న ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ దర్శనం సర్వపాపహరణం. ముక్తిదాయకం... భూమిలోకి చొచ్చుకుపోయి ఉన్న ఈ జ్యోతిర్లింగానికి దిన వారాలతో పనిలేకుండా రోజూ జల, ఫల, పుష్ప, పంచామృతాభిషేకాలు జరుగుతాయి. అలాగే మాఘ, కార్తీక మాసాలలో ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ఇంకా పార్వతిమాత, వినాయకుడు, ఆంజనేయ స్వామి తదితర దేవతామందిరాలు కూడా ఉన్నాయి.

దాసరి దుర్గా ప్రసాద్


Monday, 29 August 2016

ఐదు ద్వారకలు








ఐదు ద్వారకలు



‘‘మధ్యప్రదేశ్‌ నర్మదాతీరంలోని ఓంకారేశ్వరుణ్ణీ ఉజ్జయినీ మహంకాళేశ్వరుణ్నీ రాజస్థాన్‌లోని చారిత్రక కోటల్నీ గుజరాత్‌లో కృష్ణభగవానుడు నడయాడిన ప్రదేశాలనూ ముఖ్యంగా పంచద్వారకలుగా చెప్పే ఐదు శ్రీకృష్ణ మందిరాల్నీ ఏకకాలంలో చూసొచ్చా’మంటూ ఆయా విశేషాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన మాఢభూషి అరవిందవల్లి.



పంచద్వారకలైన మూల ద్వారక, బెట్‌ద్వారక, శ్రీనాథ్‌ద్వారక, కాంక్రోలి ద్వారక, డాకోర్‌ ద్వారకలకు వెళ్లాలని ఆలోచన. ఒకరోజు ఓ ప్రకటనలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల ఇరవై రోజుల యాత్ర గురించి చదివి వెంటనే టిక్కెట్లు తీసుకున్నాం. బెంగళూరు నుంచి దిల్లీ Sampark Kranti Expressలో బయలుదేరి రాత్రి 11.30కి భోపాల్‌కి చేరుకున్నాం. ఒకే కుటుంబానికి చెందిన 25 మంది మాతోపాటు వచ్చారు. మా టూర్‌ ఆపరేటరు మరో 8 మందితోనూ వంటవాళ్లతోనూ సామాన్లతో ముందే భోపాల్‌ చేరుకుని మా అందర్నీ బస్సులో ఉజ్జయినీకి తీసుకెళ్లారు. తెల్లవారుజామున 4 గంటలకు ఉజ్జయినీకి చేరుకున్నాం.

భస్మ దర్శనం!
ఉదయం ఎనిమిది గంటలకే స్నానపానాదులూ కాఫీటిఫిన్లూ కానిచ్చి మర్నాడు మహాకాళేశ్వరుని భూరిదర్శనంకోసం మా గుర్తింపుకార్డులతో గుడిదగ్గర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. రోజుకి 300 మందిని మాత్రమే ఆ దర్శనానికి అనుమతిస్తారు. అక్కణ్ణించి ఓంకారేశ్వరుణ్ణి చూడ్డానికి బస్సులో ఇండోర్‌ మీదుగా వెళ్లాం. ఘాట్‌రోడ్డు ప్రయాణం ఆహ్లాదకరంగా అనిపించింది. సాయంత్రం నాలుగుగంటలకు ఓంకారేశ్వరుడి దర్శనానికి వెళ్లాం. అభిషేకాలు చేయించుకుని తిరిగి బస్సులో ఉజ్జయినీకి ప్రయాణమయ్యాం. రాత్రి పదకొండు గంటలకు ఉజ్జయినీకి వెళ్లాం. కానీ రెండు గంటలకే లేచి మహాకాళేశ్వరుని దర్శనం కోసం క్యూలో నిలబడ్డాం. అప్పటికే చాలామంది ఉన్నారు. నాలుగు గంటలకు దర్శనం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ శివలింగాన్ని అభిషేకించవచ్చు. జలాభిషేకం తరవాత అందర్నీ మూలవిగ్రహానికి ఎదురుగా పెద్ద హాలులో కూర్చోబెట్టి పంచామృత అభిషేకం చేసి తిరిగి నీటితో శుద్ధి చేసి లింగాన్ని వెన్నా పూలూ పండ్లతో అలంకరించి భూరి (కొన్ని గంటల ముందు కాల్చిన శవం తాలూకూ భస్మం)తో అభిషేకం చేస్తారు. ఈ సేవను స్త్రీలు చూడకూడదని ముఖంమీద కొంగు కప్పుకోమని చెబుతారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ చప్పట్లూ వాద్యాలూ తాళాలూ ఢమరుక ధ్వనులూ హరహరమహాదేవ అనే నినాదాలతో దద్దరిల్లిపోతుంది. ఆ అనుభూతిని వర్ణించలేం.

రాజస్థాన్‌లో...
తరవాత ఉజ్జయినీలో ఉండే మహంకాళి, భైరవస్వామి, విష్ణాలయాలు అన్నీ చూసుకుని ఆ రోజు రాత్రి అక్కడ జైపూరుకి వెళ్లే రైలు ఎక్కి ఉదయానికి చేరుకున్నాం. అక్కడ భవంతులూ ఆఫీసులూ అన్నీ గులాబీరంగులోనే ఉన్నాయి. ముందుగా జంతర్‌మంతర్‌కు వెళ్లాం. ఇది ఖగోళశాస్త్రం, జ్యోతిషం నేర్చుకునేవాళ్లకి పాఠశాల లాంటిది. సూర్యుడి వెలుతురూ నీడలతోనే సమయమూ దినమూ తిథీ వారమూ నక్షత్రమూ రాశీ వంటివన్నీ తెలుసుకునేందుకు వీలుగా కట్టిన సిమెంట్‌ కట్టడాలను అక్కడ చూడవచ్చు. పక్కనే ఉన్న సిటీప్యాలెస్‌లో రాజామాన్‌సింగ్‌ వాడిన వస్తువుల రాజకుటుంబీకుల ఫొటోలూ ఉన్నాయి. సిటీప్యాలెస్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని ప్రాచీన జైపూర్‌ కోటను చూసి జలమహల్‌ చూడ్డానికి వెళ్లేటప్పటికి రాత్రి ఏడున్నర అయిపోయింది. చుట్టూ నీళ్లూ మధ్యలో దీపాలతో అది అందంగా ఉంది.

మర్నాడు ఉదయం మూడు గంటలకు జైపూరు నుంచి బికనీరుకి ప్రయాణమయ్యాం. సాయంత్రం నాలుగు గంటలకు బికనీరు చేరుకున్నాం. కనకమహల్‌, మేఘమహల్‌ చూశాక సభామండపంమీద చిత్రపటాలనూ పాలరాతి శిల్పాలనూ వీక్షించాం. అవన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. అక్కణ్ణుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్‌నాక్‌ గ్రామంలోని మూషికాలయంలోని ప్రాంగణమంతా ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కాళ్లతో ఎక్కడ వాటిని తొక్కేస్తామేమోనని భయం కలుగుతుంది. గుడిలోపల వేలకొద్దీ ఎలుకలు ఉన్నాయి. గుడి బయట ఒక్క ఎలుకా లేదు. ఎలుక విగ్రహానికి రోజూ సాయంత్రం హారతినిస్తారట. తిరిగి బికనీరుకి చేరుకున్నాం. ఉదయాన్నే బస్సులో జైసల్మేరు వెళ్లాం. జనవరి నెల కావడంతో చలి బాగా ఉంది. దారంతా పొగమంచు... డ్రైవరు జాగ్రత్తగా నడిపాడు. మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌దేవ్‌ బాబా సమాధి ఉన్న వూరు చేరుకున్నాం. రాజస్థానీలకు ఆరాధ్యదైవం రామ్‌దేవ్‌ బాబా. ప్రజలు తమ కోరికలను బాబాకు చెప్పుకుని అవి తీరాక బట్టతో తయారుచేసిన గుర్రపు బొమ్మలూ, తీపి వంటకాలను మేళతాళాలతో తీసుకొచ్చి బాబాకు నివేదన చేస్తారు.

అది చూశాక మూడు గంటలకు జై సల్మేర్‌ చేరుకున్నాం. ఆ వూళ్లొ అన్ని ఇళ్లూ ఆఫీసులూ బంగారురంగులో ఉన్నాయి. దీన్ని గోల్డెన్‌ సిటీ అంటారు. ఇక్కణ్ణించి గోబీ ఎడారి, థార్‌ ఎడారులకు వెళ్లొచ్చు. మమ్మల్ని సాయంత్రం నాలుగు గంటలకల్లా గోబీ ఎడారిలో వదిలారు. అక్కడ ఒంటెలమీద ఇద్దరం చొప్పున కూర్చుని ఎడారిలో ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణించాం. ఎడారిలో కూర్చుని సూర్యాస్తమయం దృశ్యాన్ని వీక్షించడం మరచిపోలేని అనుభవం. ఉదయాన్నే కోట చూడ్డానికి వెళ్లాం. ఇందులో రెండు గుడులు ఉన్నాయి. ఒకటి శీతలామాత ఆలయం, రెండోది జైనమందిరం. దీన్నే శ్వేత మందిరం అని కూడా అంటారు. రాజస్థాన్‌లోని ప్రతీ కోటా చూడదగ్గదే. మధ్యాహ్నం భోజనం చేశాక రాత్రి పది గంటలకు బయలుదేరి జోధ్‌పూర్‌కి చేరుకున్నాం. జోథ్‌పూర్‌ను సన్‌సిటీ అంటారు. ఈ కోటను ముగ్గురు చక్రవర్తుల హయాంలో కట్టించారు. ఇది పూర్తయ్యేసరికి మూడువందల సంవత్సరాలు పట్టింది. యుద్ధాల్లో శిథిలమైన కోటను పునర్నిర్మించడానికి 150 సంవత్సరాలు పట్టిందనీ ఇది సుమారు 600 ఏళ్ల నాటిదనీ గైడు చెప్పాడు. కోట పైకి చేరుకుని చూస్తే వూరంతా కనిపిస్తుంది. నీలం రంగు ఇళ్లు ఎక్కువగా కనిపించాయి. ఎండ నుంచి రక్షిస్తుందన్న కారణంతో నీలిరంగు వేస్తారనీ అందుకే దీన్ని నీలినగరం అంటారనీ గైడు చెప్పాడు. అక్కణ్ణుంచి పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్నీ ఆ తరవాత చిత్తౌడ్‌గఢ్‌లోని కోటల్నీ చూసి పంచద్వారకల్లో ఒకటైన శ్రీనాథ్‌ ద్వారకకు చేరుకున్నాం.

నాథ్‌ ద్వారక!
నాథ్‌ద్వారానే శ్రీనాథ్‌ ద్వారక అంటారు. ఇక్కడ కృష్ణుడు ఏడేళ్ల పిల్లాడిగా దర్శనమిస్తాడు. ప్రస్తుతం ఇక్కడున్న విగ్రహాన్ని 17వ శతాబ్దంలో మధుర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఉదయాన్నే హారతి ఇస్తూ స్వామిని మేలుకొలుపుతారు. తరవాత కాసేపు గుడి మూసి స్వామిని అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. దీన్నే శింగార్‌ సేవ అని పిలుస్తారు. ఇక్కడ అభిషేకానికి భక్తులు పాలే కొని ఇస్తారు. తరవాత అక్కణ్ణుంచి కాంక్రోలి ద్వారకకు వెళ్లాం. ఉదయ్‌పూర్‌ సమీపంలోని రాజసమండ్‌ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని కృష్ణుణ్ణి ద్వారకాధీశ్‌గా కొలుస్తారు. ఇక్కడి విగ్రహం కూడా మధుర నుంచే వచ్చిందట. ఈ ఆలయాన్ని దర్శిస్తే చింతలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇవన్నీ ఆయన నడయాడిన స్థలాలే. అక్కణ్ణుంచి ఉదయపూర్‌కి చేరుకుని కోట చూడ్డానికి వెళ్లాం. అది చాలా అందంగా ఉంది. ఆ రాత్రికి అక్కడే ఉండి మౌంట్‌ అబూకి చేరుకున్నాం. అక్కడ బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్లాం. అది చాలా పెద్దది. హాల్లో 2000 మంది కూర్చునే స్థలం ఉంది. ఇక్కడకు వెళ్లినవాళ్లంతా రెండు నిమిషాలైనా ధ్యానం చేస్తారు. తరవాత ఆబ్రూ దేవాలయానికి వెళ్లాం. 500 మెట్లు ఎక్కి పెదవి ఆకారంలో ఉన్న గుహలోని దేవీమాతను దర్శించుకున్నాం. రాజస్థానీ భాషలో ఆబ్రూ అంటే పెదవి అని అర్థం. ఇది క్రమేణా ఆబూగా మారింది. ఎర్రచలువరాతితో కట్టిన దిల్‌వారా మందిరాలను చూసి ఎవరైనా నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. మధ్యాహ్నం భోజనం చేసి రాజస్థాన్‌ సరిహద్దుల్లో నుంచి గుజరాత్‌లోకి ప్రయాణించాం.

బంగారు ద్వారక!
దారిలో గబ్బర్‌ అనే వూరిలో అంజేమాత గుడికి వెళ్లాం. ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి. ఇక్కడే సతీదేవి గుండె పడిందని చెబుతారు. అది చాలా పెద్ద గుడి. రాత్రికి సిద్ధాపూరులో విశ్రమించి ఉదయాన్నే మాతృగయకు వెళ్లాం. అక్కడ తల్లికి పిండప్రదానాలు చేసేవాళ్లు చేసుకున్నారు. ఎందుకంటే తల్లికి పిండప్రదానం చేసే చోటు ఇదొక్కటేనట. ఇక్కడి బిందుసరోవరంలో స్నానం చేసి పిండప్రదానం చేస్తే మంచిదని భాగవతంలో ఉన్నట్లు పూజారులు చెప్పారు. తరవాత మూల ద్వారకకు చేరుకున్నాం. అరేబియా సముద్రతీరంలోని ఈ నగరాన్ని ఒకప్పుడు గోల్డెన్‌సిటీగా పిలిచేవారు. క్రీ.పూ. 1500నాటి పురాతన నగరమే ద్వారక. తప్పక చూడాల్సిన సప్త పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. ప్రధాన ఆలయంలో సాయంత్రం హారతి దర్శనం చేసుకుని మళ్లీ ఉదయాన్నే గోమతీనదిలో స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకుని వెన్న ప్రసాదాలు స్వీకరించాం. తరవాత సముద్రంలో ఉన్న బెట్‌ ద్వారకకు మరబోటులో వెళ్లాం. సముద్రపు పక్షులు మా తలమీదుగా ఎగురుతూ మేం వేసే మరమరాలు తింటూ ఆలయం వరకూ వచ్చి మళ్లీ మాతో ద్వారకకు వచ్చాయి. బెట్‌ద్వారకలో కృష్ణుడి పరివారం ఉండేదట. అక్కడి స్వామిని దర్శించుకుని నాగేశం చేరుకున్నాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ పార్వతీపరమేశ్వరులు నాగ్‌, నాగిని రూపాల్లో ఉంటారు. పిల్లలు లేనివాళ్లు ఇక్కడ అమ్మే జంటపాముల బొమ్మలు పెట్టి ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

డాకోర్‌ రణ్‌ఛోడ్‌రాయ్‌!
తరవాత సోమనాథ్‌ ఆలయాన్నీ కృష్ణుడు నిర్యాణం పొందిన స్థలాన్నీ బోయవాడు బాణం వేసిన చోటునీ చూసి భావనగర్‌కు బయలుదేరాం. అక్కడ సముద్రం ఒడ్డు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో చిన్న రాయి మీద పాండవులు శివలింగాలు పెట్టి పూజ చేశారట. సముద్రంలో నీళ్లు వెనక్కి వెళ్లినప్పుడు అక్కడ ఐదు శివలింగాలు కనిపిస్తాయి. సాధారణంగా ఉదయం పదిగంటలలోపే ఇది సాధ్యం. ఆ తరవాత నీళ్లు వచ్చి ఏమీ కనిపించవు. కానీ మేం ధైర్యం చేసి బురదలో నడుచుకుంటూ వెళ్లి దర్శించుకుని గంటన్నరలో వెనక్కి వచ్చాం. సాయంత్రానికి డాకోర్‌ ద్వారకకు చేరుకున్నాం. ఇక్కడ కృష్ణుణ్ని రణ్‌ఛోడ్‌రాయ్‌జీగా కొలుస్తారు. బోడన అనే భక్తుడి కోరిక మేరకు నిండుపౌర్ణమినాడు కృష్ణుడు ఇక్కడకు వచ్చాడట. అందుకే పున్నమినాడే ఇక్కడకు భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడి ఆలయనిర్మాణం ఎంతో బాగుంది. అక్కడ కృష్ణుణ్ణి దర్శించుకున్నాక రుక్మిణీదేవి ఆలయాన్నీ చూసొచ్చాం. ఇక్కడితో మా పంచద్వారకలు పూర్తయ్యాయి. మర్నాడు గాంధీనగర్‌, అహ్మదాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసి వెనుతిరిగాం.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...