Showing posts with label ఆలయాలు. Show all posts
Showing posts with label ఆలయాలు. Show all posts

Tuesday, 11 December 2018

బృహదీశ్వరాలయం B









అణువణువూ అద్భుతం
బృహదీశ్వరాలయం


‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరులోని బృహదీశ్వరాలయం. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన ఆ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అంటూ అక్కడి విశేషాలను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌.

బృహదీశ్వరాలయం గురించి ఎప్పటి నుంచో విని ఉండటంతో ఆ ఆలయాన్ని సందర్శించేందుకు తంజావూరు బయలుదేరాం. చెన్నై నుంచి మదురై వెళ్లే మార్గంలో ఉంది తంజావూరు. తిరుచిరాపల్లి నుంచీ వెళ్లొచ్చు. చోళుల రాజధాని నగరమే తంజావూరు. ఒకప్పుడు ఈ ప్రాంతం తంజా అనే రాక్షసుడి చేతిలో ఉండేదనీ అతను విష్ణుమూర్తి చేతిలో మరణిస్తూ ఈ నగరానికి తన పేరు పెట్టాలని కోరడంతో ఆ పేరు వచ్చిందనేది ఓ కథనం. మొదటి చోళరాజైన రాజరాజ చోళుడు క్రీ.శ.985-1012 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడే కాదు, కళాభిమాని కూడా. మదురై నుంచి శ్రీలంక వరకూ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన విజయానికి గుర్తుగా తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని కట్టించాడు. అదీ క్రీ.శ.1004లో ప్రారంభించి 1009కల్లా అంటే కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో కట్టించాడు. ఆలయ నిర్వహణకు ప్రత్యేక భూములు కేటాయించి, దేవాలయ నిధిని ఒకదాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా చోళరాజులదే. దేవాలయాలను విద్యా సాంస్కృతిక కేంద్రాలుగానూ ప్రజా సమావేశ మందిరాలుగానూ తీర్చిదిద్దడం వీళ్ల నుంచే ప్రారంభమైందట.

ముందుగా తంజావూరులో దిగగానే బృహదీశ్వరాలయానికి బయలుదేరాం. సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. బృహ అంటే పెద్ద అని అర్థం. ద్రవిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయం మనదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. చోళరాజులు శైవభక్తులు. వీరి కాలంలో తమిళనాట శైవ మతం చక్కగా విలసిల్లింది. ఆలయంలోకి వెళ్లగానే గర్భగుడిలో 13.5 అడుగుల ఎత్తున్న ఏకశిలా శివలింగం దర్శనమిస్తుంది. ఏకశిలతో అంత పెద్ద శివలింగాన్ని రూపొందించడం అరుదు. అర్చకస్వాములు రెండు అంతస్తుల్లో నిర్మించిన మచ్చుపై నుంచి స్వామికి అభిషేకం, ఇతర పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి ఎదురుగా పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న అతి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 20 టన్నుల నల్లని గ్రానైట్‌ రాయితో- అంటే ఏకశిలతోనే ఈ నందిని కూడా నిర్మించడం విశేషం. ఇది దేశంలోని రెండో అతిపెద్ద ఏకశిలా నంది. మొదటిది అనంతపురం జిల్లాలోని లేపాక్షి బసవేశ్వరుడు అన్నది తెలిసిందే.

ఆలయం... అద్భుతనిలయం!
క్రేనుల్లాంటి భారీ మెషీన్ల సాయం లేకుండా ఆ రోజుల్లో 13 అంతస్తుల్లో నిర్మించిన ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. నేలమీద నుంచి 216 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం నుంచి జారిపడిన వానచినుకులన్నీ భూగర్భంలో ఇంకేలా చేయడం మరో అద్భుతం. ఇంత ఎత్తైన నిర్మాణానికి పునాది కేవలం ఒకట్రెండు అడుగులు మాత్రమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆనాటి నిర్మాణకౌశలానికి ప్రత్యక్షసాక్ష్యం. ఈ ఆలయం మొత్తాన్నీ గ్రానైట్‌ రాయితోనే కట్టారు. కానీ తంజావూరు కావేరీ డెల్టా ప్రాంతంలో ఉంది. దీనికి 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా గ్రానైట్‌ రాయి లభించే కొండలు లేవు. మదురై నుంచి రాళ్లను తెప్పించి ఆలయ నిర్మాణం చేపట్టారట. అప్పట్లో ఇనుము లేదు. సిమెంట్‌ తెలీదు. కేవలం కొండలను తొలిచి తీసుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను అద్భుత శిల్పాలుగా రూపొందించి ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు. ఆలయం అంతా లేత ఎరుపురంగు గ్రానైట్‌ రాళ్లతో ఉంది. పై భాగంలో 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మండే ఎండాకాలంలో కూడా ఈ కలశం నీడ ప్రాంగణంలో ఎక్కడా పడకపోవడం ఈ నిర్మాణం వెనకున్న మరో విశేషం. విశాలమైన గర్భాలయ ప్రాంగణంలో మాట్లాడిన మాటలేవీ ప్రతిధ్వనించకుండా కట్టడం నాటి సాంకేతిక విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. ఆగమ, వాస్తు శాస్త్రాలను అనుసరించి కట్టిన ఈ ఆలయానికి వెయ్యేళ్లు దాటుతున్నా ఇంకా నిత్యనూతనంగానే కనిపిస్తుంటుంది. ఆనాటి రాజధానిగా వెలుగొందిన తంజావూరు నేడు ఓ చిన్న పట్టణమే కావచ్చు. కానీ నేటికీ ఆలయంలోని నిత్యపూజల్లో మార్పు లేదు. శిల్పాలు చెక్కు చెదరలేదు. మహాశివరాత్రినాడు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆలయంలోని కళారూపాలు నాటి చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు అనే చెప్పాలి. రాజరాజచోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్న శిల్పం, భూదేవీసహిత విష్ణుమూర్తి, పార్వతీ సమేత శివుడు, మార్కండేయ చరిత్రను తెలిపేవీ... ఇలా పలు శిల్పాలూ చిత్రాలూ ఆలయ శోభను మరింత ఇనుమడింపజేస్తాయి. ముస్లిం రాజుల దండయాత్రలో బృహదీశ్వరాలయం కొంత దెబ్బతిన్నా పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. పై అంతస్తు బయటిగోడమీద భరత నాట్యంలోని 81 నృత్య భంగిమలు చెక్కి ఉన్నాయి.

వ్యవసాయ క్షేత్రం!
తంజావూరు నగరం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుంది. చోళరాజుల సమయంలోనే వ్యవసాయ సాగుబడికోసం ఏర్పాటుచేసిన పంటకాల్వల వ్యవస్థ నేటికీ చెక్కు చెదరలేదు. అందుకే ఇక్కడ అన్నిరకాల పంటలూ పుష్కలంగా పండుతాయి. ఈ ఆలయం తరవాత తంజావూరులో రాజభవనం, సరస్వతి మహల్‌, స్థానిక మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ తప్పక చూడాల్సినవి. అందులో భాగంగా రాయల్‌ ప్యాలెస్‌ చూడ్డానికి వెళ్లాం. తంజావూరు చరిత్రకో ప్రత్యేకత ఉంది. మరాఠా, తమిళ సంస్కృతులు రెండూ ఇక్కడ ప్రతిబింబిస్తాయనడానికి ఈ ప్యాలెస్‌ చక్కని ఉదాహరణ. ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవంతిని మొదట విజయనగర చక్రవర్తులు నియమించిన నాయక్‌లు నిర్మించగా తరవాత మరాఠాలు అభివృద్ధి చేశారట. దీని వాస్తుశైలి, చిత్రకళ చూసి తీరాల్సిందే. లోపల కంచుతో చేసిన విగ్రహాలు అనేకం ఉన్నాయి. అనేక చిన్నా పెద్దా భవంతులు కలగలిసినట్లుగా ఉన్న ఈ భవంతిలోని కొన్ని హాళ్లను మ్యూజియంగానూ ఆర్ట్‌ గ్యాలరీగానూ మార్చి అందులో నాటి వస్తువులనూ కళారూపాలనూ ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఒక భాగమే సరస్వతీ మహల్‌ గ్రంథాలయం. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన లైబ్రరీల్లో ఇది ప్రధానమైనది. 1535 నుంచీ సేకరించిన అరుదైన తాళపత్ర గ్రంథాలూ తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లిషు తదితర భాషా గ్రంథాలూ ఇక్కడ అనేకం ఉన్నాయి. ఆనాటి తాళపత్రగంథాల్లోని అంశాలనూ కంప్యూటరీకరణ చేస్తున్నారిక్కడ. ఇక్కడ ఉన్న ఫూంపుహార్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కంచు బొమ్మలూ నృత్యభంగిమల్లోని తంజావూరు బొమ్మలూ కృష్ణుడి చిత్రాలూ వాద్యపరికరాలూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ పట్టణం ఆలయాలకే కాదు, వీటన్నింటి తయారీకీ పెట్టింది పేరు.

త్యాగరాజ సమాధి!
అక్కడినుంచి శివగంగై పూంగ అనే అమ్యూజ్‌మెంట్‌ పార్కుకి వెళ్లాం. అందులో పిల్లలకోసం టాయ్‌ రైలు, మోటారుబోటు షికారు వంటివన్నీ ఉన్నాయి. ఇక్కడి నీటి కొలనును చోళ చక్రవర్తులే ఏర్పాటుచేశారట. కొలను మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లేందుకు బోటు సదుపాయం ఉంది.తరవాత సంగీతమహల్‌కి వెళ్లాం. మదురైలోని తిరుమల నాయక్‌ కోటని పోలినట్లుగా ఉండేలా దీన్ని రాజా సర్ఫోజి నిర్మించాడట. అక్కడికి రెండు కి.మీ. దూరంలోని కరుంతిట్టంగడి ఆలయంలో త్రిపురసుందరి సమేత వశిష్ఠేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. బృహదీశ్వరాలయానికి ఓ శతాబ్దం ముందే దీన్ని నిర్మించారట.

సరిగ్గా తంజావూరుకి 13 కి.మీ. దూరంలో ఉంది తిరువయ్యారు... అంటే ఐదు నదుల మధ్యలోని ప్రదేశం అని అర్థం. కర్ణాటక సంగీత ప్రముఖులైన త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి ప్రముఖ సంగీత విద్వాంసులంతా తమ గానామృతంతో ఈ ప్రాంతాన్ని పరవశింపజేశారు. ఇక్కడి కావేరి నది ఒడ్డున ప్రముఖ సంగీత విద్వాంసుడైన త్యాగరాజు సమాధి ఉంది. ఆయన గౌరవార్థం ఏటా జనవరి నెలలో ఆయన పుట్టినరోజున అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఓ ప్రాచీన శివాలయం కూడా ఉంది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఆరు శివాలయాలూ కాశీ అంతటి పవిత్రమైనవనీ అందులో ఇదీ ఒకటనీ చెబుతారు. దీన్నే దక్షిణ కైలాసం అనీ అంటారు. పరమశివుడు పంచనటేశ్వర రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో అడుగడుగునా శిల్పకళ తాండవిస్తుంటుంది. ఆ తరవాత తిరువరూరులోని త్యాగరాజస్వామి(సోమస్కందుడు) ఆలయానికి వెళ్లాం. ఇక్కడి స్వామిని విష్ణుమూర్తే స్వయంగా ఆరాధించాడనేది పురాణ కథనం. దేశంలోకెల్లా అతిపెద్ద రథాన్నీ ఇక్కడ చూడొచ్చు. వేడుకల సమయంలో అనేక వేలమంది ఈ రథాన్ని లాగుతారట. తరవాత దగ్గరలోని పూవనూర్‌ చాముండేశ్వరీ ఆలయం, తిరు కందియార్‌లోని సుబ్రహ్మణ్య దేవస్థానాలు చూసి తిరుగుప్రయాణమయ్యాం.

Saturday, 8 December 2018

సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు









సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు
ఆరు ముఖాలు ఆరు ధామాలు


ఆదిదంపతుల పుత్రుడైన సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు దేశ, విదేశాల్లో ఎన్నో ఉన్నాయి. తమిళనాడులో వీధికొక మురుగన్‌ ఆలయం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఆ ఆలయాలన్నిటికీ మకుటాయమైనవిగా, మహిమాన్వితమైనవిగా తమిళనాడులోని ‘ఆరుపడై వీడుగళ్‌’ (ఆరు దివ్యధామాలు) ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఒక్కో ఆలయానిదీ ఒక్కో ప్రత్యేకత.


తిరుచందూర్‌
సాగరతీరంలో

ఆరుపడై వీడుగళ్‌ సుబ్రహ్మణ్య క్షేత్రాలైన ఆరింటిలో అయిదు కొండలపై ఉండడం విశేషం. ఒక్క తిరుచందూరు ఆలయం సాగరతీరంలో ఉంటుంది. అన్నిటికన్నా మహిమాన్వితమైనదిగా దీన్ని పరిగణిస్తారు. శూరపద్ముడు అనే రాక్షసుడిని అంతం చేయడానికి దేవతల సేనాని అయిన కుమారస్వామి తన సేనలతో ఇక్కడ విడిది చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. రణసన్నద్ధుడైనట్టు సర్వాలంకారాలతో సమ్మోహనకరంగా కనిపించే మురుగన్‌ రూపాన్ని ఎంత చూసినా తనివి తీరదంటారు భక్తులు. ఈ స్వామివారి విభూతిని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందనీ, దుష్ట శక్తుల పీడ నివారణ అవుతుందనీ నమ్మకం. ఆలయానికి సమీపంలోని సముద్ర తీరం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడికి 92 కి.మీ. దూరంలో కన్యాకుమారి చక్కటి పర్యాటక ప్రదేశం.

ఎక్కడుంది?: తమిళనాడులోని తూత్తుకుడి (ట్యుటికోరన్‌) జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: తూత్తుకుడికి 46 కి.మీ., తిరునల్వేలికి 53 కి.మీ., మదురైకి 180 కి.మీ. దూరంలో తిరుచందూర్‌ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల నుంచి తిరునల్వేలికి నేరుగా రైలు సదుపాయం ఉంది. మదురై వరకూ రైలులో వెళ్ళి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాలలో తిరుచందూరు చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి తిరునల్వేలి వరకూ ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. రైళ్ళ కన్నా తక్కువ సమయంలో వెళ్ళొచ్చు. సమీప విమానాశ్రయం ట్యుటికోరన్‌లో
ఉంది.

తిరుప్పరన్‌కుణ్రమ్‌
పెళ్ళిళ్ళకు ప్రసిద్ధి

ఎక్కడుంది?: తమినాడులోని మదురై నగర శివార్లలో
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ మదురైకి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులు కూడా ఉన్నాయి. అక్కడి నుంచి తిరుప్పరన్‌కుణ్రమ్‌ ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు: ఒకే కొండలో మలచిన ఆలయం ఇది. దీన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతీతి. దేవసేన (దేవయాని)తో సుబ్రహ్మణ్యస్వామికి ఇక్కడే వివాహం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. అందుకే వివాహాలు చేసుకోవడానికి ఇది ఎంతో పవిత్రమైన ప్రదేశంగా తమిళులు భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే, మిగిలిన అయిదు ఆలయాల్లో స్వామి నిలబడి ఉంటారు. తిరుప్పరన్‌కుణ్రమ్‌ గుహాలయంలో మాత్రం ఆయన ఆసీనుడై ఉంటారు. ఒకవైపు దేవసేన, మరోవైపు నారద మహర్షి విగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో స్వామి విగ్రహానికి బదులు ఆయన శూలానికి (వేలాయుధం) అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడికి దగ్గరలోని మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం మరో ముఖ్యమైన యాత్రాస్థలం.

పళని
కావడి మొక్కుల జ్ఞానక్షేత్రం

ఎక్కడుంది?: తమినాడులోని దిండిగల్‌ జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: దిండిగల్‌కు 57 కి.మీ., కోయంబత్తూరుకు 118 కి.మీ., మదురైకి 120 కి.మీ. దూరంలో పళని ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల నుంచి ఈ మూడు ప్రాంతాలకూ నేరుగా రైళ్ళున్నాయి. సమీప విమానాశ్రయం కోయంబత్తూరులో ఉంది.
ప్రత్యేకతలు: పళనిని ‘తిరు ఆవినన్‌కుడి’ అని కూడా అంటారు. ఇక్కడి బాల సుబ్రహ్మణ్యుణ్ణి ‘దండాయుధపాణి’ అనీ, ‘వేలాయుధుడ’నీ పిలుస్తారు. కుడిచేత దండాన్ని పట్టుకొని, ఎడమ చేతిని నడుముకు ఆన్చి, కౌపీనంలో బాల సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. పళనిని ‘జ్ఞాన క్షేత్రం’ అంటారు. జ్ఞానప్రదాతగా దండాయుధపాణిని ఎందరో తమిళ కవులు స్తుతించారు. మురుగేశుడికి మొక్కుకొని కావళ్ళు ఎత్తే సంప్రదాయం ఇక్కడే మొదలైందని పెద్దలు చెబుతారు. ఈ ఆలయాన్ని చేరుకోడానికి 690 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. చిన్న రైలులో కూడా వెళ్ళవచ్చు.

స్వామిమలై
ఓంకార ఉపదేశ స్థలం

ఎక్కడుంది?: తమిళనాడులోని కుంభకోణానికి సుమారు 6 కి.మీ. దూరంలో
ఎలా వెళ్ళాలి?: తిరుచురాపల్లి (తిరుచ్చి) నుంచి సుమారు 80 కి.మీ. దూరంలో స్వామిమలై ఉంది. తిరుచ్చికి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన ప్రాంతాల నుంచి కుంభకోణానికి నేరుగా (వీక్లీ) రైలు సౌకర్యం ఉంది. లేదా తిరుచ్చిలో దిగి, అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో కుంభకోణం చేరుకోవచ్చు. సమీపవిమానాశ్రయం తిరుచ్చిలో ఉంది.
ప్రత్యేకతలు: స్వామిమలైలోని సుబ్రహ్మణ్యుణ్ణి ‘స్వామినాథుడు’ అని పిలుస్తారు. ఈ ఆలయానికి 60 మెట్లు ఉంటాయి. అవి భారతీయ సంప్రదాయంలోని అరవై సంవత్సరాలకు సంకేతమని పెద్దలు చెబుతారు. ప్రణవమంత్రమైన ఓంకారాన్ని తండ్రి అయిన శివుడికి మురుగన్‌ ఉపదేశించాడనీ, ఆ ప్రదేశం ఇదేననీ స్థలపురాణం పేర్కొంటోంది. తండ్రికే గురువైన స్వామి వెలసిన చోటుగా దీన్ని ‘గురుమలై’ అని కూడా అంటారు. కుంభకోణం చుట్టుపక్కల అనేక సందర్శనీయ స్థలాలూ, ఆలయాలూ ఉన్నాయి.

పళముదిర్చోళై
అటవీ ప్రాంతంలో ఆరోగ్య దాత

ఎక్కడుంది?: తమిళనాడులోని మదురైకి సుమారు 24 కి.మీ. దూరంలో
ఎలా వెళ్ళాలి?: తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ మదురైకి రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి ప్రైవేటు బస్సులు కూడా ఉన్నాయి.
ప్రత్యేకతలు: ‘ఆరుపడై వీడు’ ఆలయాల్లో తన దేవేరులు వల్లి, దేవసేనలతో కుమారస్వామి కొలువైన ఏకైక గుడి ఇది. అడవుల మధ్య ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. సమీపంలో ‘నూపురగంగ’ అనే జలప్రవాహం ఉంటుంది. ఈ స్వామిని కూడా ఆరోగ్యప్రదాతగా అర్చిస్తారు. ప్రముఖ తమిళ కవయిత్రి, సాధువు అయిన అవ్వయార్‌ను స్వామి పరీక్షించింది ఇక్కడే అని ఐతిహ్యం. ఈ ఆలయంలో స్వామివారి శక్తి ఆయుధానికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయానికి దగ్గరలో అనేక జలపాతాలున్నాయి. భక్తులు వీటిలో స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. శివ, గణేశ ఆలయాలు కూడా ఈ సముదాయంలో ఉన్నాయి.

తిరుత్తణి
365 మెట్ల స్వామి వాసం


ఎక్కడుంది?: తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లాలో
ఎలా వెళ్ళాలి?: తిరుపతికి 67 కి.మీ., చెన్నైకి 83 కి.మీ. దూరంలో తిరుత్తణి ఉంది. ఆ నగరాలకు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచీ బస్సు, రైలు, విమాన సదుపాయాలు ఉన్నాయి. తిరుపతి, చెన్నై నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో తిరుత్తణి చేరుకోవచ్చు.
ప్రత్యేకతలు: తమిళనాడుకు ఒక చివర ‘తిరుచందూర్‌’ ఉంటే, మరో చివర ‘తిరుత్తణి’ ఉంది. తెలుగు రాష్ట్రాలకు అతి సమీపంగా ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుత్తణి. ఈ ఆలయానికి చేరుకోడానికి 365 మెట్లు ఎక్కాలి. అవి ఏడాదిలోని 365 రోజులకు సంకేతం అంటారు. వల్లి-సుబ్రహ్మణ్యుడు కలుసుకున్న చోటు, వారి వివాహం జరిగిన ప్రదేశం ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే అభీష్ట సిద్ధి, మానసిక ప్రశాంతత లభిస్తాయని భక్తులు నమ్ముతారు. తిరుత్తణికి సుమారు 50 కి.మీ. దూరంలో ‘వల్లిమలై’ ఉంది. వల్లీదేవి స్వస్థలంగా దాన్ని భావిస్తారు. స్వామివారి ఉత్సవమూర్తులకు పైన ఉండే గొడుగు రుద్రాక్షలతో చేసి ఉండడం విశేషం.

Sunday, 30 September 2018

తొండమనాడు - కూర్చున్న శ్రీనివాసుడు









తొండమనాడు
కూర్చున్న శ్రీనివాసుడు


ప్రభాతవేళ తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామిని మేల్కొల్పేందుకు ఆలపించే సుప్రభాతం ఎంత మధురంగా ఉంటుందో అభయ, కటి హస్తాలతో దర్శనమిచ్చే శ్రీవారి రూపం కూడా అంతే మనోహరంగా ఉంటుంది. అయితే ఆ నిలువెత్తు రూపానికి భిన్నంగా శ్రీదేవీ భూదేవిసమేతంగా సుఖాసీనుడై యోగముద్రలో ఉన్నట్టుండే శ్రీనివాసుడిని దర్శించుకోవాలంటే తిరుపతికి సమీపంలోని తొండమనాడు వెళ్లాల్సిందే.

‘‘దొమ్ములు చేసిన యట్టి తొండమాన్‌ చెక్కురవర్తి రమ్మన్న చోటికివచ్చి నమ్మినవాడు’’ అంటూ తొండమాన్‌ చక్రవర్తి గురించి వివరించాడు పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు. శ్రీనివాసుడి సేవలో తరించిన రాజుగా తొండమానుడికి ఎంతో పేరుంది. శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయానా సోదరుడు ఈ తొండమాన్‌ చక్రవర్తి. ఆయన తన చివరి దశలో తిరుమలకు వెళ్లి స్వామిని సేవించే పరిస్థితిలేక... తన ఇంటనే స్వామి వెలసి ఉండాలని ఆ కలియుగ దేవుడిని వేడుకున్నాడు. చక్రవర్తి భక్తికి మెచ్చి శ్రీవారు తొండమాన్‌ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించాడు. సుఖాసీనుడై చక్రవర్తి సేవలందుకున్నాడు. స్వామి విగ్రహం ఒక చేతితో యోగముద్ర, మరో చేత్తో అభయహస్తం కలిగి ఉండటంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరుడిగా భక్తులకు దర్శనమిస్తుంది.

తొండమానుడి నిర్మాణం
శ్రీవారికి గొప్ప భక్తుడైన తొండమానుడు అగస్త్యాశ్రమానికి వెళ్లి అక్కడ సేదతీరుతున్న శ్రీనివాసుడిని దర్శించుకుంటాడు. ఆ సమయంలో శ్రీనివాసుడు తొండమానుడితో ‘కలియుగం అంతమయ్యే వరకూ నేను శేషాచల కొండల్లోనే స్థిరనివాసం ఏర్పర్చుకుంటాను. అక్కడ నా కోసం ఒక ఆలయాన్ని నిర్మించి దాని మధ్యలో బంగారు విమానాన్ని ఏర్పాటు చేయి’ అని ఆదేశిస్తాడు. దీనికి అంగీకరించిన తొండమానుడు విశ్వకర్మ సహాయంతో శ్రీవారి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తాడు. రత్న ఖచితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి, దాని చుట్టూ మూడు ప్రాకారాలతో, మూడు ప్రదక్షిణ మార్గాలనూ, మూడు మండపాలనూ, వంటశాలలనూ, బంగారుబావినీ నిర్మిస్తాడు. ఆనంద నిలయ విమానంపైన వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆయనే విమాన వేంకటేశ్వరుడు. ఆయనను దర్శించిన వెంటనే ఆనందం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే శ్రీవారి గోపురం ఆనంద నిలయమని ప్రసిద్ధి. రోజూ తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చాకే రాజ్యపాలన వ్యవహారాలు చూసుకోవడం తొండమానుడికి అలవాటు. ఒక సొరంగ మార్గం ద్వారా తిరుమలకు వెళ్లివచ్చేవాడట. అయితే, కొంతకాలానికి వృద్ధాప్యం కారణంగా తొండమానుడు స్వామిని దర్శించుకోవడానికి వెళ్లలేకపోయేవాడు. దీంతో స్వామినే తన కోటలో వెలిసి, తనకు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించాలని వేడుకుంటాడు. దీంతో శ్రీవారు అభయహస్తంతో ఆసీన భంగిమలో శ్రీదేవీ, భూదేవిలతో కలిసి తొండమనాడులో స్వయంభూగా వెలిశాడు.

తామరగుంట పుష్కరిణి
తిరుమలలోని ఆకాశగంగ, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే జలాన్ని కాలువల ద్వారా తొండమనాడు చెరువులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. ఈ జలాలతోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుంది. రేణిగుంట రాళ్లకాలువ మీదుగా ఈ నీల్లు తొండమనాడు చెరువులోకి వస్తాయి. దీన్ని తామరగుంట చెరువుగా పిలుస్తారు. అంతరాలయ ద్వారంమీద తొండమానుడి విగ్రహం కనిపిస్తుంది. ఆలయ విమాన శిఖరం తిరుమలలో ఆనంద నిలయంమీద ఉన్నట్లే ఇక్కడా ఉండటం విశేషం. ఈ ఆలయం గత రాజుల వైభవానికి చిహ్నంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహంలేదు. గద్వాల్‌ మహారాణి ఈ ఆలయానికి భూములను విరాళంగా ఇచ్చినట్లు ఆలయచరిత్ర పేర్కొంటోంది. ఆ రోజుల్లో స్వామికి నిత్య పూజలు, సేవలు, నివేదనలు, ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేవారని ప్రతీతి. 2008లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేసింది. ప్రతి శ్రావణమాసంలో స్వామివారికి పవిత్రోత్సవాలు జరుగుతాయి. యోగ ముద్రలో వెలసిన స్వామిని దర్శించుకుంటే సకల మనోభీష్టాలు నెరవేరడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందనేది భక్తుల విశ్వాసం.

ఇలా చేరుకోవచ్చు
తిరుపతికి సుమారు ముప్పై కిలోమీటర్లు, శ్రీకాళహస్తికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందీ తొండమనాడు గ్రామం. ఇక్కడికి చేరుకోవడానికి తిరుపతి, శ్రీకాళహస్తిల నుంచి ప్రతి అరగంటకో బస్సు అందుబాటులో ఉంటుంది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి మీదుగా పాపానాయుడుపేట వెళ్లే బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు.

- ఆడెపు రాజ్‌కుమార్‌

Tuesday, 18 September 2018

మహావిద్యాగణపతి








మహావిద్యాగణపతి



సత్యప్రమాణాల దేవుడిగా విద్యలకు ఒజ్జగా కృష్ణాజిల్లాలో కొలువైన మహావిద్యాగణపతిని ఆరాధిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పార్వతీనందనుడిని పూజిస్తారు. చోళరాజుల కాలంనాటి నల్లరాతి విగ్రహంతోపాటు ఆలయ మండపంలో ముఫ్ఫైరెండు రూపాల్లో గణనాథుడు దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశిష్టత.

వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత అండ. అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. పేదాగొప్పా తేడాలేకుండా ప్రతి ఇంటా గణపయ్యను కొలువుదీర్చి శక్తిమేరకు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పిస్తారు. అలాంటి గజముఖుడు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో మహావిద్యాగణపతిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు ఆలయమండపం చుట్టూ వినాయకుడిని సిద్ధీబుద్ధీ సమేతంగా, సంతాన గణపతిగా, జ్ఞానమూర్తిగా... ఇలా వివిధ రూపాల్లో ఏర్పాటుచేశారిక్కడ.

విగ్రహం వెనక...
ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలసిన గణనాథుడు భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తూ వరసిద్ధి వినాయకుడయ్యాడు. విద్యార్థులకు మంచి చదువులు ప్రసాదిస్తూ మహావిద్యాగణపతిగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఈ ఆలయంలో పూజలందుకుంటున్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రెండేళ్ల కిందట... చల్లపల్లిలోని కేసీపీ చక్కెర కర్మాగారం ఆవరణలో వినాయకుడి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమ యాజమాన్యం భావించింది. దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మట్టిని తవ్వుతుండగా మూడు అడుగుల ఎత్తున్న నల్లరాతి వినాయకుడి విగ్రహం కనిపించింది. దైవానుగ్రహంగా భావించి ఆ విగ్రహాన్నే మూలవిరాట్టుగా ప్రతిష్ఠించి, పూజాదిక క్రతువులు నిర్వహిస్తున్నారు. పురావస్తు అధికారులు ఈ విగ్రహాన్ని పరిశీలించి ఇది చోళరాజుల కాలానికి చెందిందిగా గుర్తించారు. మొదట ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని అందులో ఉంచారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ దొరికిన విగ్రహాన్నే గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఇక్కడి వినాయకుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాణిపాకం వినాయకుడి దర్శనం వల్ల కలిగే ఫలితమే ఇక్కడి స్వామిని దర్శించినా సిద్ధిస్తుందని స్థానికుల నమ్మకం.

ఎన్నెన్ని రూపాలో...
లంబోదరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. పైన రెండు చేతుల్లో పాశాంకుశాలు అనే ఆయుధాలనూ, కింది వాటిలో కుడి చేతిలో అక్షరమాల, ఎడమ చేతిలో మామిడి పండును పట్టుకుని కనిపిస్తాడు. అక్షరమాలను చేతిలో ధరించడం వల్లే ఇక్కడి వినాయకుడిని మహావిద్యా గణపతిగా అర్చిస్తారు. ఈ ఆలయంలో ఆగమశాస్త్ర ప్రకారం పూజాదిక క్రతువులను నిర్వహిస్తారు. ఏ ఆలయంలోనైనా ప్రధాన విగ్రహం ఒక్కటే ఉండటం సర్వసాధారణం. కానీ మహావిద్యా గణపతి ఆలయంలో మాత్రం మండపంగా ఏర్పాటు చేసిన పదహారు శిలా స్తంభాలకూ ఒక్కోదానికి రెండేసి చొప్పున మొత్తం ముప్ఫైరెండు విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. సంకట గణపతి, త్రిముఖ గణపతి, రుణ విమోచన గణపతి, సృష్టి గణపతి, ఏకాక్షర గణపతి... ఇలా అనేక రూపాల్లోని వినాయకుడి విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నిత్య పూజలు
ఇక్కడ కొలువైన మహావిద్యాగణపతికి ఉదయం నుంచే వివిధ రకాల అభిషేకాలూ అర్చనలూ ప్రారంభమవుతాయి. శాస్త్ర ప్రకారం పంచహారతులు, నీరాజన సహిత మంత్రపుష్పాలు సమర్పిస్తారు. ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. వీటితోపాటు హస్తద్రవ్య అభిషేకం, సహస్రనామార్చనలు, సంకష్టహర చతుర్ధినాడు ప్రత్యేక హోమాలు, కార్తికమాసంలో కోటి దీపోత్సవం, లక్ష గరిక పూజలను విశేషంగా జరిపిస్తారు. ఏటా చైత్రబహుళ పాఢ్యమి రోజున వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవాలి...
విజయవాడకు అరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉందీ మహావిద్యాగణపతి ఆలయం. బస్‌స్టాండ్‌ నుంచి కరకట్ట మీదుగా చల్లపల్లి వెళ్లే బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్లే రహదారిలో అయిదు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బస్సులూ, ప్రయివేటు వాహనాల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

- ముత్తా నారాయణరావు

Friday, 31 August 2018

‘కంచి’ - బంగారు బల్లి








‘కంచి’
బంగారు బల్లి


ఏ కథైనా సరే కంచికి వెళ్లాల్సిందే అంటారు. మరి, కాంచీపురంగా పేరొందిన ఆ ‘కంచి’ కథ ఏమిటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాచీపురం అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. కంచి పట్టు చీరలు, బంగారు బల్లి మాత్రమే కాదు. దాదాపు వెయ్యికి పైగా ఆలయాలు కలిగిన ఈ ప్రాచీన నగరంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

తమిళనాడులోని కాంచీపురంలో అడుగుపెట్టగానే.. మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోతాం. చెన్నైకి 72 కిమీలో మీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి ‘కంజీవరం’ అనే పేరు కూడా ఉంది.

ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ‘కంచి’కి రావల్సిందేనని మన పూర్వికులు చెబుతుండేవారు. అందుకే కాబోలు కథలను ముగించేప్పుడు.. కథ ‘కంచి’కి అనేవారు.

హిందూ మత పురాణాల ప్రకారం.. ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పేరొందిన కంచిలో ఉన్న ముఖ్య ఆలయాలను ‘పంచ భూత స్థలాలు’ అని అంటారు. ఈ నగరంలో ఎక్కడ చూసినా శివుడు, విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉంది. ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం, కైలసనతార్ ఆలయాలు కూడా సందర్శించతగినవి.

‘క’ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అంటే లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. అంటే, సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని అర్థం. అలాగే, కంచికి ఆ పేరు రావడం వెనుక మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది. ‘క’ అంటే బ్రహ్ అని, ‘అంచి’ అంటే విష్ణువని చెబుతారు. అందుకే, ఆ ప్రాంతానికి కంచి అనే పేరు వచ్చిందంటారు.

ఏకాంబరేశ్వర, కైలాశనాథ్ ఆలయాల శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయంలో శివుడిని పంచభూతాల్లో ఒక్కటైన భూమిగా పూజిస్తారు. 20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలోని దక్షిణ గోపురం ఎత్తు 58.5 మీటర్లు. ఈ ఆలయానికి మొత్తం 11 అంతస్థుల ఎత్తైన గోపురాలు ఔరా అనిపిస్తాయి. వైకుంఠ పెరుమల్ ఆలయం, వరద రాజ ఆలయాలు సైతం యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

కంచి వెళ్లినప్పుడు మీరు తప్పకుండా పై ఆలయాలనే కాదు, కంచి వస్త్రాలను కూడా షాపింగ్ చేయండి. వేదంతంగల్ పక్షుల అభయారణ్యం, ఎలగిరి హిల్స్, శ్రీపెరుంబదర్, కంచి పీఠం తదితర ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి.

‘బంగారు బల్లి’.. కథ!
కంచి కథ ముగించేప్పుడు.. ‘బంగారు బల్లి’ గురించి తెలుసుకోకపోతే కథ కంచికి వెళ్లదు. శరీరం మీద బల్లి పడగానే.. కంచి నుంచి వచ్చినవారిని తాకితే దోషం పోతుందని అంటారు. లేదా కంచి క్షేత్రానికి వెళ్లి వరదరాజ పెరుమళ్ ఆలయంలోని బంగారు, వెండి బల్లిని తాకాలని అంటారు. దీనికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. గౌతమ అనే మహర్షికి ఇద్దరు శిష్యుటు ఉండేవారు. ఒక రోజు వారిద్దరు నది నుంచి కుండతో నీరు తీసుకొస్తారు. అయితే, ఆ నీటిలో బల్లి పడిన విషయాన్ని గుర్తించారు. మహర్షి ఆ బల్లిని చూసి.. ఇద్దరిని బల్లులుగా మారిపోవాలని శపిస్తాడు. శపవిముక్తి కోసం ప్రార్థించగా.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఉపశమనం లభిస్తుందని చెబుతాడు. దీంతో పెరుమాళ్ ఆలయంలో స్వామిని ప్రార్థించిన కొన్నాళ్లకు వారికి మోక్షం లభిస్తుంది. ఆ సమయంలో వారిద్దరూ సూర్య, చంద్రుల ప్రతిరూపాలుగా బంగారు, వెండి బల్లుల బొమ్మలుగా భక్తులకు దోషనివారణ చేయాలని ఆదేశిస్తాడు. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించారనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.



Sunday, 29 July 2018

పూరీ జగన్నాథుడు





Jun 21, 2018

జగన్నాథునికి జలుబు..జ్వరం!



ఏ క్షేత్రంలో అయినా మూలవిరాట్టుకు నిత్యాభిషేకాలు నిత్యం జరుగుతాయి. సందర్భానుసారం సహస్ర ఘటాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహిస్తుంటారు. కానీ, పూరీలో కొలువైన జగన్నాథుడికి ఏడాదికి ఒకేసారి అభిషేకం నిర్వహిస్తారు. ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజు ఇది జరుగుతుంది. దీనిని దేవస్నాన పూర్ణిమగా వ్యవహరిస్తారు.

పూరీలోని మూలవరులను వేప చెక్కలతో  రూపొందిస్తారు. నిత్యాభిషేకాలు చేస్తే కలప పాడవుతుందని ఇలా ఏడాదికోసారి అభిషేకం నిర్వహించే సంప్రదాయం వచ్చింది. స్వామివారికి నిత్యం దర్పణ స్నానం నిర్వహిస్తారు. అంటే.. స్వామివారి ఎదుట అద్దం ఉంచి.. అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం చేస్తారన్నమాట. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమినాడు మాత్రం మూలమూర్తికి ప్రత్యక్ష అభిషేకం చేస్తారు. జగన్నాథుడితో పాటు బలభద్రుడు, సుభద్రలకు కూడా అభిషేకం ఘనంగా నిర్వహిస్తారు.

స్నానపౌర్ణమి ఉత్సవం పూర్తయ్యాక.. ముగ్గురు దేవతా మూర్తులను ఆలయ ప్రాంగణంలోని చీకటి మందిరానికి తరలిస్తారు. దీనికీ ఓ కారణముంది. నీటిలో తడిసిన దేవతలకు జలుబు చేస్తుందని, జ్వరం వస్తుందని ఓ నమ్మకం. అందుకే దేవతామూర్తులను పదిహేను రోజుల పాటు చీకటి మందిరంలో ఉంచి ప్రత్యేకంగా చూసుకుంటారు. ఈ పదిహేను రోజులు స్వామికి సమర్పించే నైవేద్యాల్లోనూ ఆయుర్వేద మూలికలు వాడుతారు. ఈ పదిహేను రోజులు భక్తులకు జగన్నాథుడి దర్శనం లభించదు. గర్భాలయంలో స్వామివారి పటాన్ని ఉంచుతారు. దీనిని పట్టచిత్రా అని పిలుస్తారు. సరిగ్గా రథయాత్రకు ముందురోజు చీకటి మందిరం నుంచి మూలవరులను గర్భాలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు.



Saturday, 28 July 2018

కొలనుభారతి సరస్వతీదేవి ఆలయం









కొలనుభారతి సరస్వతీదేవి ఆలయం



సరస్వతీదేవికి ఆలయాలు ఎక్కడున్నాయని అడిగితే భాసర, వర్గల్‌... ఇంకా ఎక్కువ పేర్లు చెప్పాలంటే ఎంతటివారైనా కాస్తంత తడబడతారు. అయితే, కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని దట్టమైన అడవీ ప్రాంతంలో ఎల్తైన కొండల నడుమ, చారుఘోషిణీ నది ఒడ్డున అమ్మవారికి ఆలయం ఉంది. కొలనుభారతి అనే పేరుతో వెలసిన ఈ అమ్మవారికి 11వ శతాబ్దికి చెందిన మల్లభూపతి అనే చాళుక్యరాజు నిర్మించినట్లు శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. భారతీదేవి సన్నిధిలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే, అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం.

ఎలా వెళ్లాలంటే..
కొలనుభారతి క్షేత్రానికి వెళ్లాలంటే ముందు శ్రీశైలం లేదా కర్నూలుకు చేరుకోవాలి. ఆత్మకూరుకు చేరినా దగ్గరే. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తపల్లివ మీదుగా సుమారు 15 కిలోమీటర్లు వెళ్తే శివపురం గ్రామం వస్తుంది. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్లు మెటల్‌ రోడ్డుగుండా ప్రయాణించి కొలనుభారతి ఆలయాన్ని చేరుకోవచ్చు.



Wednesday, 27 June 2018

వైష్ణోదేవి






కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి

ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన వైష్ణోదేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి. ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు. భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు. ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం.

ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు. అందుకే ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు. నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి .... ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి. ఆ కధ ఏమిటంటే...

పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా వుండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు. వారి సంకల్పమాత్రంచేత అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నతస్ధాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయబడ్డది.

వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది. ఏ గురువులూ ఆమె జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు. జ్ఞానసముపార్జనలో ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి అంతర్ముఖి అయిచేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని, ఇల్లు వదిలి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది.

అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలోవున్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమనికోరింది. శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమెదగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు.

బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, పేద, బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు.

శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది. అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.

కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు. భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు.

వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్ ని, భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు. భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించటానికి.

భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణపాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరంమీదపడింది.

అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధిస్తాడు. మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.

తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, అలాగే తనని సృష్టించిన త్రిమాతలు, మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.

వైష్ణోదేవి ఆలయం చేరటానికి 14 కి.మీ. దూరం కొండలెక్కాలి. దోవ పొడుగుతా తినుబండారాలు, త్రాగు నీరు, శౌచాలయాలు వగైరా యాత్రీకులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు వున్నాయి. దోవలో అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతికూడా తీసుకోవచ్చు. 24 గంటలూ యాత్రీకుల సందడితో వుండే దోవ పైన చాలా మటుకు రేకులతో కప్పబడి పైనుంచీ పడే రాళ్ళనుంచేకాక, ఎండా వానలనుంచీ కూడా యాత్రీకులని రక్షిస్తుంటాయి. ఎత్తైన కొండలమీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనీయవు. కొండ ఎక్కలేనివారికోసం గుఱ్ఱాలు, డోలీలు వున్నాయి. గుఱ్ఱం కొంచెం నడుం గట్టితనాన్ని పరీక్షించినా, డోలీలో ఎలాంటివారైనా తేలికగా వెళ్ళవచ్చు. కుర్చీ లో మనం కూర్చుంటే దానికి వున్న కఱ్ఱల సహాయంతో నలుగురు మనుష్యులు మనల్ని మోసుకెళ్తారు. అదే డోలీ. తోవ పొడుగూతా భక్తులు జై మాతాకీ అంటూ లయ బధ్ధంగా చేసే నినాదాలు యాత్రీకులలో ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

ఆగేవాలే బోలో జైమాతాకీ| పీఛేవాలే బోలో జైమాతాకీ||
పాల్కీవాలే బోలో జైమాతాకీ| ఘోడేవాలే బోలో జైమాతాకీ||

అంటూ అందరినీ కలుపుకుంటూ చేసే నినాదాలతో మనమూ శృతి కలపకుండా వుండలేము.
అర్ధరాత్రి అయినా జనసంచారం, విద్యుద్దీపాలు వుంటాయి. నిర్భయంగా కొండ ఎక్కవచ్చు. అయితే రాత్రిళ్ళు డోలీలుండవు. ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది (రాత్రంతా కూడా).

దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్ళవలసి వచ్చేదిట. ప్రస్తుతం మార్గం సుగమంచేశారు. ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు.

ఇక్కడ దర్శనానికి చాలా చక్కని ఏర్పాట్లు చెయ్యబడ్డాయి. దర్శనానికి బయల్దేరే ముందే కింద ముఖ్యద్వారంగుండా వెళ్ళటానికి కూపన్ తీసుకోవాలి. పరఛీ అంటారు దీనిని. ఎక్కువ సమయం పట్టదు దీనికి. గ్రూప్ కి ఒకళ్ళు వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇది తీసుకున్న ఆరు గంటలలోపు ముఖ్యద్వారంగుండా లోపలకి వెళ్ళాలి. లేకపోతే ఇంకొకటి తీసుకోవాల్సి వుంటుంది. అది వుంటేనే ముఖ్యద్వారంగుండా లోపలకి (కొండ ఎక్కటానికి) వెళ్ళనిస్తారు. మనం పైకి వెళ్ళాక పరఛీ చూపించి బేచ్ నెంబరు తీసుకోవాలి. దర్శనానికి వచ్చేవారిని ఇలా బేచ్ నెంబర్లు ఇచ్చి క్రమబధ్ధీకరిస్తారు. ఆ నెంబరు ప్రకారం దర్శనానికి వెళ్ళాలి. జరుగుతున్న బేచ్ నెంబరు బోర్డుమీదు చూపిస్తుంటారు. ఖాళీ వుంటే తర్వాత బేచ్ వాళ్ళనికూడా వెళ్ళనిస్తారు. దానితో తొక్కిడి వుండదు 5, 6 చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది. డోలీలు ఆలయానికి ఒక కి.మీ. దూరం దాకా వెళ్తాయి. గుఱ్ఱాలు ఇంకా కొంచెం దూరంగా ఆగుతాయి. అక్కడనుండి నడక తప్పదు. అయితే ఎలాంటివారైనా నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ వెళ్తే శ్రమ తెలియదు. అనేక చోట్ల వచ్చే సెక్యూరిటీ చెక్ లతో మనం అంత దూరం వెళ్ళామని కూడా తెలియదు. కెమేరా, సెల్, తోలు బెల్టులు వగైరాలు అన్నీ అక్కడ లాకర్లలో పెట్టి వెళ్ళాల్సిందే.

ఆలయానికి చేరుకోవటానికి హెలికాప్టరుకూడా వున్నది. ఈ సర్వీసు కాట్రానుంచి వుంటుంది. ముందుగా ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. అయితే ఆ సర్వీసులు వాతావరణాన్నిబట్టి వుంటాయి. మేము వెళ్ళినప్పుడు పొగమంచు ఎక్కువగా వున్నకారణంగా నెల రోజులనుంచి హెలికాప్టర్లు నడపలేదు.

ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెబుతాను. డోలీలో వెళ్ళాలనుకుంటే కిందే కౌంటర్ లో రానూ పోనూ కావాలో, కేవలం దింపటానికే కావాలో చెప్పి బుక్ చేసుకోండి. ఇవ్వాల్సిన డబ్బు, డోలీ తీసుకొచ్చేవాళ్ళల్లో ఒకరిద్దరి పేర్లతో సహా అన్ని వివరాలూ రాసి ఇస్తారు. ఇది గవర్నమెంటు వాళ్ళ కౌంటర్. అక్కడ అది ఒక్కటే వుంది అని అన్నారు. విడిగా డోలీ గానీ, గుఱ్ఱంగానీ మాట్లాడుకుంటే వాళ్ళకి లైసెన్సు టోకెన్లుంటాయి. మీ యాత్ర పూర్తయ్యేదాకా అవి అడిగి తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఎవరికీ పూర్తి డబ్బు ముందు ఇవ్వద్దు. మాట్లాడుకున్న డబ్బుకాకుండా మళ్ళీ మీదగ్గర నాస్తా, చాయ్ అంటూ వసూలు చేస్తారు.

డోలీ మాట్లాడుకునేటప్పుడే పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది..అది చూస్తేగానీ యాత్ర సంపూర్తి కాదంటారు. ఇవ్వన్నీ చూపించాలి అని చెప్పండి. మాకు తెలియక అవి చూడలేదు. మధ్యలో డోలీ వాళ్ళనడిగితే దోవ సరిగాలేదని పైన కొండ చూపించి అదే భైరవాలయం దణ్ణం పెట్టమన్నారు (పెళ్ళిలో అరుంధతీ నక్షత్రంలాగా).

దోవ ఒకటే వుంటుంది. ఎలా వెళ్ళాలి అని కంగారు పడకండి. మీకు కావాల్సిన వివరాల బోర్డులుంటాయి. సీనియర్ సిటిజన్స్ కోసం 6 కి.మీ. కొండ ఎక్కిన తర్వాత ఆలయం వారి ఆధ్వర్యంలో బేటరీతో నడిచే కార్లున్నాయి (ఆటోలు). అక్కడదాకా గుఱ్ఱాలు, డోలీలలో వెళ్ళవచ్చు.

గర్భగుడిలో పూజారులెవ్వరూ డబ్బులు తీసుకోరు. మీరు అమ్మవారికిచ్చే కానుకలు హాయిగా హుండీలో వెయ్యండి. అమ్మవార్లు ముగ్గురుంటారు.. కాళీ, వైష్ణవీ, సరస్వతి...లింగ రూపంలో...మధ్యలో దేవి వైష్ణవి. ఈ సంగతి అక్కడవున్న పూజారి అందరికీ చెబుతూనే వుంటారు. అమ్మవార్ల పైన కిరీటాలుంటాయి. అంతేగానీ అక్కడ అమ్మవార్ల రూపం వుండదు.

దర్శనమయ్యాక అక్కడే కేంటీన్లు వుంటాయి.. పూరీ కూరా, రజ్మా రైస్ వగైరా ధరలు తక్కువే. భోజనం చేసి మరీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టవచ్చు. పైన వుండటానికి కూడా వసతి వున్నది.

మార్గం
జమ్మూ రాష్ట్రంలోని కట్రాదాకా రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి. అక్కడనుండి యాత్ర మొదలయ్యే మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్ళవచ్చు. దోవలో బస్ స్టాండులో ఆటో ఆపి పరఛీ తీసుకుని, అక్కడేవున్న డోలీ కౌంటర్ లో డోలీ మాట్లాడుకుని మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్తే అక్కడనుంచి మాత్రమే డోలీ వగైరా యాత్ర మొదలవుతుంది.

ఆంధ్రభూమి

తిరుమల మెట్ల ప్రయాణం






ఆహ్లాదం తిరుమల మెట్ల ప్రయాణం

తిరుమల. తెలుగువారి జీవితంలో ఓ భాగం. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా తిరుమల తిరుపతి సందర్శించని తెలుగు వారు ఉండరు. ఎన్నిసార్లు చూసినా కొత్తగా, సరికొత్తగా ఉండే పుణ్యక్షేత్రం. నిత్య కల్యాణం, పచ్చతోరణంలా కళకళలాడుతూ కనిపించే తిరుమలకు మెట్ల దారిలో వెళితే ఆధ్యాత్మిక అనుభూతి మాత్రమే కాదు, ఆరోగ్యం, ఆహ్లాదకరం కూడా.

ఉరుకులు పరుగుల నేటి నవనాగరిక, యాంత్రిక జీవితంలో మనిషికి కాసింత ఊరటనిచ్చే వాటిలో కుటుంబ సమేతంగా జరిపే విహార, తీర్థయాత్రలు ప్రధానమైనవి. 28 సంవత్సరాల నా పాత్రికేయ జీవితంలో కుటుంబ సమేతంగా తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల దారిలో కాలినడకన తిరుమల చేరడం మధురానుభవం.


ఓ శనివారం డ్యూటీ చేసి, కాచిగూడ స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కడంతో తిరుమల తిరుపతికి మా కుటుంబ ప్రయాణం సాగింది. ఉదయం ఆరు గంటలకు తిరుపతి చేరాల్సిన మా రైలు.. మూడు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరింది.

చలో... శ్రీవారిమెట్లు
తిరుపతి బస్టాండ్‌లో అలిపిరి బస్సెక్కి శ్రీవారిమెట్ల స్టాప్‌లో దిగి ఉచిత లగేజీ కౌంటర్లో సామాన్లు భద్రపరిచాం. అనంతరం శ్రీవారి మెట్లమార్గం ద్వారా తిరుమలకు మా కుటుంబ అధిరోహణ యాత్ర ప్రారంభమయ్యింది.


పచ్చటి ప్రకృతి ఒడిలో ఠీవిగా నిలబడి, రారండంటూ ఆహ్వానంతో పాటు, సవాలు విసురుతున్నట్లుగా కనిపించే శేషాద్రి కొండల్లో... ఎన్నో వ్యయప్రయాసల కోర్చి నిర్మించిన 2,350 మెట్లు ఎక్కుతూ, తిరుమల చేరడంలో ఉన్న శ్రమ, ఆనందం కలగలిసిన అనుభూతిని ఎవరికి వారు వ్యక్తిగతంగా పొందాల్సిందే తప్ప మాటల్లో వర్ణించలేం.

పొలోమంటూ పిల్లలు, పెద్దలు
నాలుగేళ్ల పిల్లల నుంచి ఆరుపదుల పెద్దల వరకూ, ఆడమగ తేడా లేకుండా మెట్లదారిలో హరితవనాల సౌందర్యం, పిల్లగాలి వీచికల ద్వారా హాయిగా తాకిన శేషాద్రి వనాల పరిమళాలను అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ తిరుమల దిశగా కదిలిపోవడం ఈ ఈ దారిలో నిత్యకృత్యం. సుదూర యాత్రలు చేసే బహుదూరపు బాటసారులను గుర్తు చేసుకొంటూ... ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఆపసోపాలు పడేవారు కొందరైతే, ఇదేం కష్టమైన పని కాదంటూ చెంగు చెంగున లేడిపిల్లల్లా, కోడెదూడల్లా దూసుకుపోయే వారు మరికొందరు. 'మీకు హైబీపీ ఉంటే మెట్ల దారి నడక ప్రాణంతకం' అన్న ముందస్తు హెచ్చరికను పక్కన పెట్టి, బిక్కు బిక్కుమంటూ నడిచే భక్తులు కొందరైతే, తమ శరీరాన్ని మోయటమే కష్టంగా భావించే స్థూలకాయులు సైతం మెట్ల దారిలో పాట్లు పడటం స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది.

900 మెట్లు చేరితే...
మెట్లదారిలో 900వ మెట్టు చేరగానే మేమున్నామంటూ భక్తుల నమోదు ప్రత్యేక కౌంటర్‌ ఉద్యోగులు పలుకరిస్తారు. తొమ్మిది వందల మెట్లు ఎక్కిన ప్రతి ఒక్క యాత్రికుడి/రాలి ఫోటోతీసి శ్రీవారి ఉచిత దర్శన అనుమతి పత్రాన్ని ఇస్తారు.

అప్పటివరకూ ఆడుతూ, పాడుతూ హాయిగా సాగిన మెట్లదర్శన భక్తులకు అసలు పరీక్ష 1600 మెట్లు చేరగానే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే మెట్లను మోకాలి మెట్లుగా చెబుతారు. నిట్టనిలువుగా నిర్మించిన మెట్లను ఎక్కడం అంత తేలిక కాదు. నాలుగు మెట్లు ఎక్కడం, కాసేపు విశ్రాంతి, ఆ తర్వాత మరోనాలుగు మెట్లు... ఇలా భారంగా, ఓ పరీక్షలా సాగుతుంది. ప్రయాణం 2100 మెట్లు దాటిన తర్వాత మరో చెక్‌ పాయింట్‌లో యాత్రికుల ఫొటో పత్రాలను మరోసారి పరీక్షించి, టీటీడీ స్టాంపువేసి మరీ ఇస్తారు. ఇక్కడి నుంచి మిగిలిన 250 మెట్ల ప్రయాణం 'అదిగో.. అల్లదిగో శ్రీహరివాసమూ' అన్నట్లుగా... గోవింద, గోవిందా అంటూ సాగిపోతుంది. శ్రీవారి మెట్లలో ఆఖరి మెట్టుపైన ఉన్న మండపం చేరడంతో ప్రతి ఒక్కరికీ ఏదో సాధించామన్న సంతృప్తి, శ్రీవారి పాదాల చెంతకు చేరామన్న భరోసా కలుగుతాయి.

మెట్ల మార్గం ద్వారా తమ ప్రయాణం పూర్తి చేయడం ద్వారా ఫిట్‌నెస్‌ను బేరీజు వేసుకొనే యాత్రికులు చాలామందే కనిపిస్తారు. ఏడాదికి ఓ సారైనా మెట్లదారిలో తిరుమల చేరందే తమకు తృప్తి ఉండదని, గత కొద్ది సంవత్సరాలుగా ఇలా చేయడం జీవితంలో ఓ భాగం చేసుకొన్నామని చెప్పేవారూ కనిపిస్తారు.

ఎన్నో లాభాలు
తిరుపతి నుంచి బస్సులో వచ్చే యాత్రికులకంటే మెట్లదారిలో కాలి నడకన వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. మెట్ల దారిలో వెళ్లిన భక్తులు 24 గంటల వ్యవధిలో శ్రీవారి దర్శనం చేసుకొనే అవకాశం ఉంటుంది. ప్రత్యేక క్యూ ద్వారా ఉచితంగా దర్శనం లభిస్తుంది. అంతేకాదు. కాలినడక భక్తులకు 25 రూపాయల ఖరీదు చేసే ఉచిత లడ్డూను సైతం అంద చేయాలని నిర్ణయించింది.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన నిరుపేద భక్తులకు మెట్లదారి ప్రయాణం నిజంగా ఓ వరమే అని చెప్పాలి. తిరుపతి నుంచి తిరుమల చేరాలన్నా, తిరుమల నుంచి తిరుపతి రావాలన్నా ఒక్కొ యాత్రికుడు 90 రూపాయలు బస్సు చార్జీగా చెల్లించాలి. విపరీతంగా పెరిగిన చార్జీల భారం మోయలేని పేదయాత్రికుల్లో కాలినడకనే మెట్లదారిలో తిరుమల వచ్చి వెళ్లే వారి సంఖ్య రాను రాను పెరుగుతోందని టీటీడీ గణాంకాలే చెబుతున్నాయి. దీనికితోడు మెట్లదారి ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది.

మంచీ - చెడూ
ప్రతి చోటా మంచీ, చెడూ ఉండటం సహజమే. దానికి 'తిరుమల తిరుపతి' ఏ మాత్రం మినహాయింపు కాదు. తిరుమల దేవస్థానం అన్నా, శ్రీవారన్నా భక్తి విశ్వాసాలున్న చాలా మందికి అంతులేని భక్తి. అయితే దేవస్థానం ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రం దక్షిణల పైన కూడా భక్తి ఉన్నట్లు కనిపిస్తుంది. స్వామి వారి కల్యాణం క్యూ దగ్గర నానా హడావిడి చేస్తూ 'దగ్గర నుంచి కల్యాణం చూడండి'  అంటూ భక్తులను ప్రలోభపెట్టి, స్వామివారి సాక్షిగా దక్షిణ పేరుతో లంచాలు డిమాండ్‌ చేసే ప్రబుద్ధ ఉద్యోగులకూ కొదవలేదు.

అయినా కూడా దేశం నలుమూలల నుంచి అనునిత్యం తిరుమలకు వచ్చే వేల, లక్షల భక్తులకు టీటీడీ చేస్తున్న సేవలు అసమానం. తిరుమలలో 24 గంటలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం, నిత్యాన్నదాన పథకాలను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.

రెండున్నర గంటల మెట్ల నడక, ఎనిమిదిగంటల పాటు క్యూలో నిరీక్షణ, 80 సెకన్ల శ్రీవారి దర్శనంతో మా తిరుమల యాత్ర ముగిసింది.

చొప్పరపు కృష్ణారావు

Saturday, 16 June 2018

అరుణాచలేశ్వరుడు






అగ్నిలింగాకారంలో కనిపించే అరుణాచలేశ్వరుడు!
పంచభూతాల్లో అగ్నిలింగం
ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడించే గిరి ప్రదక్షిణం
పాపాలు హరించే శివపుణ్యక్షేత్రం


భరతఖండం వేదభూమి. లెక్కకు మించిన అద్భుతాలు ఈ నేలపై కొలువైవున్నాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి అరుణాచలం. గాలి, నీరు, భూమి, వాయువు, అగ్ని అనే పంచభూతాల్లో ఒకటి. ప్రకృతిలో మమేకమై పరమాత్మునితత్వం ఉట్టిపడేలా వెలసిన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు. ఈ పేరు మదిలో తలంపుకు రాగానే మనసు భక్తిభావంతో ఉప్పొంగిపోతుంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిప్రదక్షిణం ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడిస్తుంది. ప్రతి యేటా కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవం అణువణువునూ శివతేజంతో నింపి భక్తులను పులకింపజేస్తుంది. అంతేనా.. అరుణాచలం అనగానే రమణమహర్షి గుర్తుకు వచ్చే ఆధ్యాత్మిక కేంద్రం తిరువణ్ణామలై. అలాంటి అరుణాచలేశ్వరుని గురించి ప్రత్యేక కథనం.

చరిత్ర పుటలను తిరగేస్తే...
దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. శివభక్తుల పుణ్యక్షేత్రం. అరుణ అంటే ఎర్రని, ఆచలము అంటే కొండ అని అర్థం. అ-రుణ అంటే పాపములు హరించునది అనే అర్థం కూడా వస్తుంది. తమిళంలో తిరువణ్ణామలై అని అంటారు. తిరు అనగా శ్రీ అని, అణ్ణామలై అనగా పెద్దకొండ అని అర్థం. ఇక్కడ కొలువైవున్న శివుడిని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేదాలు, పురాణాల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. స్కంద పురాణంలోని మహేశ్వరకాండలో వేదవ్యాసుడు అరుణాచలం గొప్పతనం గురించి వర్ణించాడు.

శివాజ్ఞ్ఞతో విశ్వకర్మ నిర్మించిన ఆలయం...
అరుణాచలేశ్వర ఆలయాన్ని శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని, ఆలయం చుట్టూ అరుణ అనే పురము నిర్మించబడిందని పురాణాలు చెపుతున్నాయి. పైగా ఈ ఆలయంలో జరిగే పూజాపునస్కారాలకు సంబంధించిన విధానమంతా శివుడి ఆదేశం మేరకు గౌతమ మహర్షి రూపకల్పన చేశారని స్కందపురాణంలోని అరుణాచలేశ్వర మహాత్మ్యంలో ఉంది. ఈ జ్యోతిర్లిగం తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రమని అంటారు. ఈ ఆలయాన్ని తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ మహారాజులు 9, 10 శతాబ్దాల మధ్య నిర్మించారని చోళ రాజుల శాసనాలు చెపుతున్నాయి. తిరువణ్ణామలై పల్లవులు, చోళులు, విజయనగరరాజులు, కన్నడ రాజులు, టిప్పుసుల్తాన్‌ ఆ తర్వాత బ్రిటిష్‌ పాలకుల ఏలుబడిలో వుంది.. ఈ ఆలయానికి ఉండే ఒక్కో రాజగోపురం చూడటానికి రెండు నేత్రాలు చాలవు. వీటిని పోటీపడి మరీ నిర్మించారా అనిపిస్తుంది. నాలుగు దిక్కులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి. ఈ దేవాలయం మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దక్షిణ భారతంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఇది ఒకటి.

పంచభూత క్షేత్రాల్లో ఒకటి
పురాణాల్లో పేర్కొన్నట్టుగా పంచభూతాలను సూచించే పంచభూతస్థలాల్లో అరుణాచలం ఒకటి. అన్నామలేశ్వరుడు(అగ్ని) కనుక దీనిని తేజోక్షేత్రంగా పిలుస్తారు. మిగిలిన పంచభూత క్షేత్రాల్లో ఏకాంబరేశ్వర ఆలయం (పృథ్వీలింగం - భూమి), జంబుకేశ్వరుడు (జలలింగం - నీరు), కాళహస్తీర్వుడు (వాయులింగం - గాలి), చిదంబరేశ్వరుడు (ఆకాశలింగం - ఆకాశం). దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో దీన్ని అగ్నిభూతమునకు ప్రతీకగా పేర్కొంటారు.

గిరిప్రదక్షిణం కాదు.. సాక్షాత్‌ శివప్రదక్షిణం
ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్‌ జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే ఈ ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణం చేస్తే సాక్షాత్‌ ఆ శివునికి ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల నమ్మకం. రమణ మహర్షి ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. పాదచారులై శివనామ స్మరణ చేస్తూ గిరిప్రదక్షిణం చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుకే గిరిప్రదక్షిణంలో నిత్యం వందలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ కొండలపై ఉండే మహాఔషధ మొక్కల ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల మేరకు సాగుతుంది. దీన్నే గిరివాలం అని కూడా అంటారు. ఈ గిరివాలం వల్ల భక్తులు పాపవిముక్తులవుతారని, కోరిన కోర్కెలు తీరడమే కాకుండా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాచలాన్ని తలచుకుంటే అన్ని బంధనాలు తెంచుకుని స్వేచ్ఛాజీవులమవుతామని కూడా భక్తులు భావిస్తారు. అందుకే రమణ మహర్షి ఈ ప్రాంతాన్ని హార్ట్‌ ఆఫ్‌ ఎర్త్‌ (భూహృదయం)గా అభివర్ణించారు. స్కందపురాణంలో అన్నికంటే గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని పేర్కొన్నారు.

అగ్నిలింగాకారంలో పరమేశ్వరుడు..
అరుణాచలేశ్వరుడితో పాటు ఎన్నో ఆశ్రమాలకు నెలవైన తిరువణ్ణామలై శాశ్వతమైన శాంతినొసగే ప్రశాంతభూమిగా పేరు గడించింది. ఇక్కడ శివుడిని దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడు అగ్నిలింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. అరుణాచలేశ్వరుడు కొలువైవున్న కొండ ఎత్తు 2669 అడుగులు. పచ్చటి చెట్లతో చుట్టూత కొండలతో అణువణువునా ప్రకృతి అందాలు కనిపిస్తుంటాయి. ఈ అరుణాచలం కొండకు కృతయుగంలో అగ్ని కొండ అని, త్రేతాయుగంలో బంగారు కొండ అని, ద్వాపర యుగంలో తామ్ర కొండ అని, కలియుగంలో రాతి కొండ అనే పేర్లు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ కొండని తేజో లింగం లేదా జ్యోతిర్లింగం అని కూడా పేర్కొంటారు. కొండ చుట్టూ ఎనిమిది లింగాలు, ఎనిమిది నందులు, 350కి పైగా చెరువులు, మరెన్నో మండపాలు ఉన్నాయి. ఎనిమిది లింగాలు అంటే ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం (ఈ లింగంపై ప్రజలు నాణేలు వేస్తారు), ఈశాన్య లింగం అనే పేర్లు ఉన్నాయి.

యేడాదిలో 4 బ్రహ్మోత్సవాలు
ఈ క్షేత్రంలో ఒక యేడాదిలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీక మాసం (నవంబరు, డిసెంబరు)లో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవంతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం అన్నామలై కొండపై మూడు టన్నుల నెయ్యితో జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అలాగే, ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయానికి వందలాది మంది భక్తులు వస్తుంటారు. తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చిత్రపౌర్ణమి రోజున కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు.

ఎలా వెళ్ళాలి...
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి రోడ్డు, రైలు మార్గంలో ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరల్లో వసతి దొరుకుతుంది. అలాగే, రమణాశ్రమంలో కూడా గదులు అద్దెకు ఇస్తారు. అయితే, ఇక్కడ గదులను ముందుగానే రిజర్వు చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు.





Sunday, 13 May 2018

బైద్యనాథ్ దేవాలయం






బైద్యనాథ్ దేవాలయం
భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం

ఆమె మనసు ఉద్విగ్నంగా ఉంది.
యుద్ధానికి వెళ్లిన భర్త క్షేమసమాచారం లేదు.
ఏమయ్యాడో తెలియదు. పది రోజుల క్రింద ఉత్తరం వచ్చింది. ఆ తరువాత నుంచి అజా అయిపూ లేదు.
గుర్రంపై స్వారీ చేస్తూ తెలియకుండానే కొండపైకి ఎక్కుతోంది ఆమె.
“మార్టిన్. ఐ మిస్ యూ మార్టిన్. ఐ మిస్ యూ సో మచ్ డియర్”
కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
కడిగేసినంత స్పష్టంగా కల్నల్ మార్టిన్ బొమ్మ ఆమె కళ్లముందు కట్టింది.
సాయంత్రం.
సూర్యుడు పడమర ఒడిలో పడుకుండిపోతున్నాడు.
కొండమీద కాషాయ కాంతి విరజిమ్ముతోంది.
వింత నిశ్శబ్దం అంతా పరుచుకుపోయింది.
ఉన్నట్టుండి.
గణ గణ గణ గణ …..
గణ గణ గణ గణ……
గంటల శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది.
ఆ శబ్దం వచ్చిన వైపు చూపింది ఆమె.

దూరంగా ఒక శిధిల దేవాలయం.
అందులో నుంచి హారతి దీపాల వెలుగు.
ధూపాల పొగ. ఘంటారావం.
అప్రయత్నంగానే ఆమె ఆ గుడిపైపు వెళ్లింది.
గుడిముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్లింది.
లోపల వైద్యనాథ మహాదేవ శివుడు.
లింగాకారంలో విచిత్ర కాంతులు వెదజల్లుతూ.
అర్థనిమీలిత నేత్రాలతో పూజారి అర్చన చేస్తున్నాడు.
ఆయన నోటి నుంచి మంత్రాలు అలవోకగా వెలువడుతున్నాయి.

ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది.
కళ్లనుండి ధారగా నీరు కారుతూనే ఉంది.
పూజ పూర్తికాగానే పూజారి ఆమె వైపు చూశాడు.
“మేమ్ సాబ్ తీర్థం తీసుకొండి.”
“ఏమిటమ్మా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు.”

ఆమె తన భర్త కల్నల్ మార్టిన్ అఫ్గన్ యుద్ధానికి వెళ్లిన సంగతి, ఆయన క్షేమ సమాచారం లేని విషయమూ చెప్పింది. చెప్పిందన్న మాటే కానీ కన్నీళ్ల వర్షం కురుస్తూనే ఉంది.
“మేమ్ సాబ్ కంగారు పడకండి. బైద్యనాథ్ మహాదేవుడు అందరినీ కాపాడతాడు. ఆయన దయ ఉంటే మృత్యువేమీ చేయదు. అంతఃకరణశుద్ధిగా బైద్యనాధుడిని అర్చించండి. ఓం నమశ్శివాయ అన్న మంత్రాన్ని పదకొండు రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి. అంతా మంచే జరుగుతుంది.” అన్నాడు.

ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు నుంచే అన్నపానాలు మానేసింది. అన్ని పనులూ మానేసింది. తన గదిలోనే కూచుంది. “ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.” మంత్రం జపించసాగింది. మరొక ధ్యాస లేదు. ఇంకో ధ్యానం లేదు. ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.

ఒకటి … రెండు …. మూడు ….. నాలుగు …. అయిదు …..
రోజులు గడిచిపోతున్నాయి.
“ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.”

పదకొండో రోజు. రోజు రోజంతా పంచాక్షరిని జపించింది
సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకడు “మేమ్ సాబ్ … మేమ్ సాబ్… సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై… సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై…” అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఆమె ఆ లేఖను తెరిచి చూసింది.
తన ప్రియాతిప్రియమైన మార్టిన్ సంతకం చూసింది. కట్టలు తెంచుకుంటున్న భావోద్వేగాన్ని ఎలాగోలా ఆపుకుంటూ లేఖను చదవసాగింది.

“డియర్. గతంలో నీకు లేఖ వ్రాసిన మరుసటి రోజు నుంచే అఫ్గన్లు మా పటాలాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచి భీకరమైన దాడి చేశారు. మేమెవరమూ బతికిబట్టకట్టి బయటపడే పరిస్థితి లేదు. మా దగ్గర ఆయుధాలూ తక్కువే. ఆహారమూ తక్కువే. వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇక మా పని అయిపోయిందనుకున్నాను. ఒక అఫ్గన్ పొడవాటి ఖడ్గంతో నాపై దూకాడు. నేను భయంతో కళ్లు మూసుకున్నాను. ఆ క్షణంలో నువ్వు తప్ప నాకింకెవరూ గుర్తుకురాలేదు. అంతలో అద్భుతం జరిగిపోయింది. ఎవరో ఒక మనిషి అఫ్గన్లపైకి దూకాడు… ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు….ఒళ్లంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు. సింహం చర్మం మొలకి కట్టుకున్నాడు. చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది. ఆ శూలం కొన మూడుగా చీలి ఉంది. ఆయన ధాటికి అఫ్గన్లు కకావికలమైపోయారు. కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు. వాళ్లు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు. ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడికి కాదు డియర్.”.

1880 అఫ్గన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండ మీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు పదిహేనువేల రూపాయలు సమర్పించుకున్నారు. మహాదేవ్ మందిరానికి కొత్త శోభ వచ్చింది.
కొన్నాళ్లకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడవరకూ ఆయన్నే అర్చించారు.
మందిరం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు. ఆ మందిరం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది.






Indian Temple Built by a British Man

Interesting Story..
In 1879, when the British were ruling India, Lt. Col. Martin of Agar Malva was leading the army in the war against Afghanistan.

Col. Martin used to regularly send messages of his well-being to his wife. The war continued for long & Lady Martin stopped getting messages. She was very upset.

Once riding on her horse, she passed by the temple of Baijnath Mahadev. She was attracted by the sound of Conch & Mantra. She went inside and came to know that the Brahmanas were worshipping Lord Shiva. They saw her sad face and asked her problem. She explained everything to them. They told her that Lord Shiva listens to the prayers of devotees and takes them out of difficult situations in no time. With the advice of the Brahmanas she started the ‘Laghurudri Anushtthan’ of the Mantra:

‘Om Namah Shivaya’ for 11 days. She prayed to Lord Shiva that if her husband reaches home safely, then she would get the temple renovated.

On the last of the ‘Laghurudri’ a messenger came and gave a letter to her. Her husband had written: ‘I was regularly sending messages to you from the battle grounds but suddenly the Pathans surrounded us from all sides. We were entrapped in a situation where there was no scope of escaping death. Suddenly I saw a Yogi of India with long hair, carrying a weapon with three pointers (Trishul). His personality was amazing and he was maneuvering his weapon with a magnificent style. Seeing this great man, the Pathans started running back. With his grace our bad times turned into moments of victory. This was possible only because of that man of India wearing a lion skin & carrying a three-pointer weapon (Trishul). That great Yogi told me that I should not worry and that he had come to rescue me because he was very pleased with my wife’s prayers.’

Tears of joy were falling down Lady Martin’s eyes while reading the letter. Her heart was overwhelmed. She fell into the feet of Lord Shiva’s statue and burst in tears.

After a few weeks Col. Martin returned. Lady Martin narrated the whole incident to him. Now both husband & wife became devotees of Lord Shiva. In 1883 they donated Rs. 15,000 for renovating the temple. The information engraved slab for the same is still there in the Baijnath Mahadev Temple of Agar Malva. This is the only Hindu temple built by a Britisher.

Analysis:The message talks about the Baijnath Mahadev (Shiva) Temple in Agar Malwa of Madhya Pradesh state in India, that it is the only temple made by a Britisher in India, and that it happened after the Colonel Martin was miraculously saved by an avatar of Lord Shiva – post prayers from his wife, Lady Martin. Many people could not believe these supernatural claims, but there are documented records suggesting such an incident could have possibly happened. There is some misinformation in the story though.

History of Baijnath Temple 

This famous Baijnath Mahadev Temple is located in southern banks of Banganga river in Agar Malwa of Madhya Pradesh, India. The Shiv Ling (the sacred stone form of Lord Shiva) in the Baijnath temple is believed to belong to 13th century, while some legends say it is probably more than thousand years old. As written in the foundation stone of the temple (shown in a Hindi documentary video of the temple in reference section below, at timeline 5:32), at the end of 16th century, the local inhabitants built a small mutt like mandhir and mandap (a type of small temple structure). Then after 300 years, in 1883, with the inspiration from British army Hindu officials, and financial help of British Commander Lt. Colonel C. Martin and other local people, 11000 rupees was donated for the renovation of the temple, making it large, and also building few other temples around it.

There is also another piece of writing on one of the pillars in middle of the temple suggesting that it was built (renovated) with the orders of C. Martin in 1883. The official website of Shajapur district in Madhya Pradesh (shajapur.nic.in), where this temple is located, also mentions about this story. It is said that when the British Commander Martin was in a war, his wife went to Baijnath mahadev temple and made a request for his returning. Then Martin successfully came back from the war, and thereafter a beautiful temple was constructed.

Our verification says that Agar is an ancient archaeological site, located 66 KMs from Ujjain, and was a Camp (Chhavani) in English period. And Lt. Colonel C. Martin was indeed the Commander of Central India Horse British regiment during the second Anglo-Afghan war between 1878-1880:

Commanded by Lt. Colonel C. Martin. The men of the Central India Horse (a wing each of the 1st and 2nd Regiments) crossed the frontier at Jamrud in February 1880 where they were then employed on the Khyber line of communications. In May a portion of the force was involved with the expedition against Mullah Khalil in the Besud Valley, before they were called to Kabul to join General Roberts’ force that was to march on Kandahar. They fought at the battle of Kandahar, including the pursuit of the retreating Afghans, and then returned to India in October.

The Baijnath Mahadev Temple is known to be powerful – for the Lord Shiva residing there shall fulfill the sincere wishes of all the people who pray and worship him. Not just thousands of Indians, many people from other countries also visit the temple quite often.

Conclusion 

Considering the aforementioned documented records and the beliefs about the power of the temple, we can conclude that such an incident could have possibly happened. So the Baijnath Mahadev Temple is the only Indian temple made by a Britisher during their rule in India.

There is this popular belief among Indians, especially Hindus, that God sometimes comes in human form (avatar or incarnation) to rescue his sincere devotees who are in trouble. One such example is the story of Bhadrachala Ramadasu (Kancherla Gopanna) who has been very keen and devoted towards Lord Rama that when he was jailed for using tax money to renovate the holy Rama temple at Bhadrachalam, both Rama and Lakshmana, in the guise of two youngsters paid up his dues to release him. Apart from the numerous songs of praise written by Ramadasu, the golden coins paid by Rama, known as Ram Tanka coins can be seen even today. You can read the detailed story from reference section below.






Saturday, 14 April 2018

విలక్షణ రాముడు - విశిష్ట దేవుడు...






విలక్షణ రాముడు - విశిష్ట దేవుడు...

‘‘పదికొంపలు లేని పల్లెనైనను రామభజన మందిరమొండు వరలుగాత!’’ అనేది కవి వాక్యం.
మన దేశంలో గ్రామాలు ఎన్ని ఉన్నాయో దాదాపు అన్ని రామాలయాలున్నాయి. అయితే వీటిలో కొన్ని తమదైన విలక్షణతతో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. అలాంటి రామాలయాల్లో కొన్ని.


మారుతి లేని రాముడు... మీసాల దేవుడు

‘‘యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం!’’
ఎక్కడ శ్రీరామ భజన, కీర్తన జరుగుతాయో అక్కడ హనుమంతుడు తన్మయంగా చేతులు జోడించి నిలబడతాడట! రామాలయాల్లో రాముని పాదాల దగ్గర ముక్త హస్తాలతో మారుతి విగ్రహం కనిపించడం సర్వసాధారణం. కానీ ఈ ఆలయంలో ఆంజనేయుడు కనిపించడు! తెలంగాణలోని మెదక్‌ జిల్లా గుమ్మడిదలలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్‌ నగరానికి సుమారు 48 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కేంద్రానికి హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలనుంచి బస్సులున్నాయి. అక్కడినుంచి దాదాపు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ప్రత్యేకత ఏంటంటే.... 

హనుమంతుడు లేని రామాలయం ఇది. ఇక్కడి రాముడిని ‘కల్యాణ రాముడ’ని కూడా పిలుస్తారు. శ్రీరామ కల్యాణ సమయానికి ఆంజనేయునితో రాముడికి పరిచయం లేదు కనుక, హనుమ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఉండకపోవచ్చనీ ఆలయ వర్గాల మాట.
ఈ ఆలయం ప్రత్యేకత ఇదొక్కటే కాదు... 

సీతాసమేతుడైన శ్రీరామునితోపాటు లక్ష్మణుడు - ఊర్మిళ, భరతుడు - మాండవి, శత్రుఘ్నుడు - శ్రుతకీర్తి దంపతుల విగ్రహాలు కూడా గర్భగుడిలో దర్శనమిస్తాయి. ఇలాంటి అరుదైన దర్శనం మరెక్కడా దొరకదు. 
మరో విశేషం ఏమిటంటే.... 
ఇక్కడ శ్రీరాముడు మీసాలతో కనిపిస్తాడు. ఇది సుమారు 900 ఏళ్ళనాటి ఆలయం. శ్రీరామనవమి రోజున ఇక్కడ నిర్వహించే సీతారామ కల్యాణంలో పాల్గొనే అవివాహితులకు త్వరలోనే పెళ్ళి అవుతుందని భక్తుల విశ్వాసం.

యోగ రామప్రభో!
చిన్ముద్రతో, చిదానందంగా భక్తులను అలరిస్తూ, నమ్మినబంటు హనుమంతుడికి గురుస్థానంలో నిలిచిన ప్రత్యేకమైన రాముడిని ఆ గుడిలో చూడవచ్చు. అక్కడి శ్రీరామచంద్రుడు రణశూరుడైన విజయ రాఘవుడు. తమిళనాడులోని నెడుంగుణమ్‌ (లేదా నెడుంగుండ్రమ్‌)లో ఉందీ విశిష్ట ఆలయం. తమిళనాడులోని అరణికి 20 కిలోమీటర్లు, తిరువణ్ణామలై (అరుణాచలం)కి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో, వందవాసి పట్టణానికి దాదాపు 26 కిలోమీటర్ల దూరంలో నెడుంగుణమ్‌ ఉంది. చెన్నై నుంచి నేరుగా బస్సులున్నాయి.

ప్రత్యేకతలేమిటంటే.... 

కడప దగ్గరి పద్మాసన రాముడి మాదిరిగా ఇక్కడ కూడా శ్రీరాముడు యోగముద్రలో కనిపిస్తాడు. తమిళనాడులోని అతి పెద్ద రామాలయాల్లో ఇదొకటి. రాముడు యోగముద్రతో దర్శనమిచ్చే ఆలయాల్లో ప్రఖ్యాతమైనది కూడా ఇదే. రాముడు చిన్ముద్రతో - గురుస్థానంలో బోధిస్తున్నట్టు, హనుమంతుడు శిష్యుడి స్థానంలో వేదాధ్యయనం చేస్తూ, స్వామి చెబుతున్నది ఆలకిస్తున్నట్టూ ఉంటారు. లక్ష్మణుడు ధనుర్ధారిగా కనిపిస్తాడు. సీతమ్మ కుడిచేత్తో తామరపువ్వు పట్టుకొని, ఎడమచేతిని రాముని పాదాలవైపు చూపిస్తూ ఆయన పక్కన ఆసీనురాలై ఉంటుంది. రావణ సంహారం తరువాత తిరిగి వస్తూ, శ్రీరాముడు ఇక్కడ విడిది చేశారనీ, శుక మహర్షిని దర్శించుకున్నారనీ స్థలపురాణాలు చెబుతున్నాయి. విజయం సాధించి తిరిగి వచ్చిన వాడు కాబట్టి ఇక్కడి రాముడిని ‘విజయరాఘవన్‌’ అని కూడా పిలుస్తారు.

కుడివైపు జానకమ్మ!
‘‘వామాంక స్థిత జానకీ పరిలసత్‌ కోదండదండం కరే!’’ అని ప్రార్థనాశ్లోకంలో మాట.
ఏ రామాలయంలోనైనా రామునికి ఎడమవైపున సీతమ్మ కనిపిస్తుంది. భద్రాచలంలో రామాంకం మీద కొలువుతీరుతుంది. కానీ తిరుపతిలోని కోదండ రామాలయంలో మాత్రం ఆయనకు కుడివైపున సీతమ్మ ఉంటుంది.


ప్రత్యేకత ఏమిటంటే... 

తిరుపతి నగరం మధ్యలో ఉండే ఈ ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. రావణ సంహారం తరువాత అయోధ్యకు వెళ్తూ, ఈ ప్రాంతంలో శ్రీరాముడు విశ్రమించాడని ఐతిహ్యం. దానికి గుర్తుగా ఈ ఆలయం నిర్మితం అయిందని అంటారు. తరువాత కలియుగంలో జనమేజయ చక్రవర్తి దీన్ని అభివృద్ధి పరిచారనీ కథనాలు ఉన్నాయి. నిర్మాణ శైలిలో ఈ గుడి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడి కుడివైపున సీతమ్మ, ఎడమవైపున లక్ష్మణుడు ఉండడం విశేషం. అయితే అసలు వైఖానస ఆగమ నియమాల ప్రకారం అమ్మవారు దక్షిణంగా అంటే కుడివైపునే ఉండాలట! ఆ ప్రకారమే ఈ విగ్రహాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇలా కుడి పక్కన ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం మోక్షదాయకమని పెద్దల మాట, నమ్మకం.

పద్మాసనంలో పరంధాముడు
ధనుర్బాణాలు ధరించి, నిలబడి ఉన్న శ్రీరాముడు! భక్తుల స్మరణలో, మననంలో ముద్రపడిన రూపం ఇదే!! కానీ శ్రీరాముడు పద్మాసనంలో కూర్చొని ఉండడం ఎప్పుడైనా చూశారా? పద్మాసనాసీనుడైన రాముడిని కడప జిల్లా పెద్దపుత్త గ్రామంలోని ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. కడప నుంచి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దపుత్తకు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ప్రత్యేకతలేమిటంటే.... 

ఇక్కడ సీతారాములు పద్మాసనాల్లో కూర్చొని దర్శనమిస్తారు. స్వామికి కుడివైపు లక్ష్మణుడు నిలబడి ఉంటాడు. రాముడి కుడి చెయ్యి యోగముద్రతో, ఎడమ చెయ్యి స్పర్శముద్రతో-(నేలను చూపిస్తూ) ఉంటాయి. ఆయన చేతుల్లో ధనుర్బాణాలుండవు. లక్ష్మణుడు మాత్రం వాటిని ధరించి ఉంటాడు. వారికి ముందు హనుమంతుడు కూర్చొని, బ్రహ్మసూత్రాలు చదువుతున్నట్టు కనిపించడం మరో విశేషం.

ముగ్గురయ్యల ముచ్చటైన స్వరూపం!
ఆ ఆలయంలో శ్రీరాముడు విష్ణుమూర్తిలా కనిపిస్తాడు. అంతేకాదు, వేరే ఏ రామాలయంలోనూ కానరాని అనేక విశేషాల నెలవు ఈ శ్రీరాముడి కొలువు! కేరళలోని త్రిస్సూర్‌ (త్రిచ్చూర్‌) జిల్లా త్రిప్రాయర్‌లో ఉందీ గుడి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచీ త్రిస్సూర్‌కు నేరుగా రైళ్ళున్నాయి. అక్కడినుంచి 25 కిలోమీటర్ల దూరంలోని త్రిప్రాయర్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ప్రత్యేకత ఏమిటంటే... 

‘త్రిప్రాయరప్పన్‌’, ‘త్రిప్రా దేవర్‌’గా ప్రసిద్ధుడైన త్రిప్రాయర్‌ శ్రీరాముడు చతుర్భుజుడు. ఒక చేతిలో పాంచజన్యం (శంఖం), మరో చేతిలో సుదర్శన చక్రం, ఇంకో చేతిలో కోదండం (విల్లు), నాలుగో చేతిలో జపమాల ఉంటాయి. వీటిలో జపమాల బ్రహ్మకు సంకేతం అంటారు. అలాగే శివుడికి సంబంధించిన లక్షణాలు కూడా కొన్ని కనిపిస్తాయి. సర్వసాధారణంగా ఏ వైష్ణవ ఆలయంలోనూ ఉండని విధంగా ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహం ఉండడం విశేషం. హనుమంతుడు, గోశాల కృష్ణమూర్తితోపాటు ఉపదేవతలుగా గణపతి, అయ్యప్ప కూడా ఇక్కడ కొలువు తీరారు. అందుకే దీన్ని త్రిమూర్తి స్వరూపమైన ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయంలోని శ్రీరామ విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించాడనీ, ఆయన అవతార సమాప్తి తరువాత విగ్రహం ద్వారకతో పాటు సముద్రంలో మునిగిపోయిందనీ క్షేత్ర పురాణం చెబుతోంది. తరువాత బెస్తవారికి సముద్రంలో దొరికిన విగ్రహానికి ప్రతిష్ఠ జరిపారు. ఈ ఆలయం ‘తీవ్ర’ నది ఒడ్డున ఉంది.

పట్టాభి రాముడు
శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం చూసే ఉంటారుగా! అలాంటి భంగిమలో, విభీషణ వరదుడైన రాముడు కనిపించే ఇలాంటి అపూర్వ ఆలయం మరెక్కడా ఉండదేమో! తమినాడులోని అయోధ్యాపట్నంలో ఈ ఆలయం ఉంది. తమిళనాడులోని సేలం నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో అయోధ్యాపట్నం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల నుంచీ సేలం వెళ్ళే రైళ్ళున్నాయి. అక్కడినుంచి రోడ్డు మార్గంలో అయోధ్యాపట్నం చేరుకోవచ్చు. 


ప్రత్యేకత ఏమిటంటే... 
ఇక్కడి ఆలయంలో రాముడు పట్టాభిషేక భంగిమలో కనిపిస్తాడు. ఎడమ కాలిని కుడి తొడ మీద వేసుకొని, వరద హస్తంతో దర్శనమిస్తాడు. ఆయన ఎడమవైపు సీతాదేవి కూర్చొని ఉంటుంది. దీని వెనక ఒక పురాణ గాథ ఉంది. రావణ సంహారం తరువాత తిరిగి వస్తూ, ఈ ప్రాంతంలో విశ్రమించిన రాముడిని- తదనంతరం జరగబోయే పట్టాభిషేకంలో కూర్చొనే భంగిమలో దర్శనం ఇవ్వాలని విభీషణుడు కోరాడు. ఆ కోరికను రాముడు నెరవేర్చాడు. దానికి తార్కాణం అన్నట్టు ఈ ఆలయంలో విభీషణుడి విగ్రహం సీతారాముల ముందు నిలబడి ఉంటుంది. విభీషణుడు ప్రార్థిస్తూ ఉంటే, వారిద్దరూ అతన్ని ఆశీర్వదిస్తున్నట్టు కనిపిస్తుంది.





రామతీర్థం రామస్వామి దేవస్థానం






అక్కడ రెండుసార్లు పెళ్ళి!


భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా శ్రీరాముడికి ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కల్యాణం నిర్వహిస్తారు. అది కూడా శ్రీరాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమి (శ్రీరామ నవమి) నాడే చేయడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థం రామస్వామి దేవస్థానంలో మాత్రం శ్రీరాముడికి ఏడాదికి రెండుసార్లు కల్యాణం జరుపుతారు. ఈ దేవస్థానం ఏర్పాటైన 16వ శతాబ్దం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.

ఇక్కడ శ్రీరామ నవమి రోజునే కాదు, మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి)నాడు కూడా సీతారాముల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. దీనినే తిరుకల్యాణ మహోత్సవమనీ, ‘దేవుని పెళ్లి’ అని పిలుస్తారు. శ్రీరామ నవమి రోజున కల్యాణోత్సవం పగటి పూట, తిరుకల్యాణ మహోత్సవం రాత్రి పూట జరుగుతాయి. మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, ‘దేవుని పెళి’్ల జరిగాకే ఈ ప్రాంతంలో సాధారణ వివాహాలకు ముహూర్తం పెట్టుకోవడం ఆచారం! రామతీర్థం సీతారాముల తొలి కల్యాణ మహోత్సవం ఈ ఏడాది జనవరి 27న జరిగింది. రెండో కల్యాణోత్సవం శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన జరుగనుంది.

తిరుకల్యాణం కథ ఇదీ!
16వ శతాబ్ద కాలంలో ఇదంతా అటవీ ప్రాంతంగా ఉండేది. సమీపంలోని కుంబిళాపురం (ప్రస్తుతం కుమిలి) గ్రామానికి చెందిన పుట్టు మూగ అయిన వృద్ధురాలు కట్టెల కోసం వచ్చిందట. ఆమెకు శ్రీరాముడు ప్రత్యక్షమై, ఆమె నాలుకపై ‘శ్రీరామ’ అనే బీజాక్షరాలు రాశాడట! ఈ విషయాన్ని వెంటనే ఆమె కుంబిళాపురాన్ని పరిపాలిస్తున్న పూసపాటి వంశీయులకు తెలిపింది. అలాగే శ్రీరాముడు కుంబిళాపురం రాజుకు కూడా కలలో కనిపించి ఈ ప్రాంతంలో సీతా, రామలక్ష్మణ రాతి విగ్రహాలు ఉన్నాయని, వాటిని సేకరించి వెంటనే ప్రతిష్ఠించాలని కోరాడట. చక్రవర్తి, వృద్ధురాలు కలిసి వెతకగా నీటి మడుగులో ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహాలు లభించాయనీ, తీర్థంలో రాముడి విగ్రహం లభించినందున ‘రామతీర్థం’ అని ఈ ప్రాంతానికి నామకరణం చేశారట. అలాగే మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా ఆ భీష్మ ఏకాదశి నాడు సీతారాములకు బ్రహ్మాండంగా ‘తిరుకల్యాణ మహోత్స’వాన్ని నిర్వహించడం ఆనవాయితీ!

ఏకుల వంశీయులే ఆడపెళ్లి వారు
రామతీర్థంలో ఏటా జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో వరుడు శ్రీరామచంద్రుడు తరపున విజయనగరం పూసపాటి రాజ వంశీకులు లేదావారి తరపున దేవస్థానం అధికారులు వ్యవహరిస్తారు. వధువు సీతమ్మ తరపున పూసపాటిరేగకు చెందిన ఏకుల రామారావు కుటుంబీకులు హాజరవుతారు. వీరు సీతమ్మ తల్లికి బంగారు మంగళసూత్రాలతో పాటు ఇతర సామగ్రి తీసుకొస్తారు. నాలుగు శతాబ్దాల కాలం నుంచి ఏకుల వంశీయులే ఆడ పెళ్లివారు! వీరు రాముడి విగ్రహాలను కనుగొన్న మూగ వృద్ధురాలి వంశీయులని చెబుతారు. కేవలం పూసపాటి రాజ వంశీయుల వశిష్ట గోత్రంతోనే వివాహం ఆద్యంతం నిర్వహిస్తామని దేవస్థానం ప్రధాన అర్చకుడు ఖండవిల్లి సాయి రామాచార్యులు తెలిపారు. వివాహ మహోత్సవానికి ముందు రామతీర్థం ప్రధాన వీధిలో హంస, అశ్వ, గరుడ వాహనాలపై సీతారామలక్ష్మణ విగ్రహాలను ఉంచి, అర్చకులు నిర్వహించే ఎదురుసన్నాహ కార్యక్రమం కనులవిందుగా సాగుతుంది.

ఐదు రోజుల పెళ్ళి... ఆరుదైన పెళ్ళి!
రామ తీర్థంలో శ్రీరామ నవమి రోజున నిర్వహించే సీతారాముల కల్యాణోత్సవం ఒక్కరోజులో ముగుస్తుంది. తిరుకల్యాణ మహోత్సవం మాత్రం ఏటా ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. దానికి ముందు వచ్చే రథసప్తమి నాడు పందిరి రాట వేస్తారు. నూతన వధూవరులకు ఈ రోజే నూతన వస్ర్తాలు, బంగారం కొనుగోలు చేస్తారు. కల్యాణోత్సవం జరిగే భీష్మ ఏకాదశి నాటి ఉదయం ధ్వజ స్తంభంపె ధ్వజారోహణం చేస్తారు. కల్యాణోత్సవం జరిగిన నుంచి ఐదు రోజుల పాటు అర్చకులు ప్రత్యేక హోమాలు, గ్రామ బహిష్కరణ, సుందరకాండ పారాయణం, ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. నాలుగో రోజున సదస్యం అనే పేరుతో పండితులకు సత్కారం, పండిత పరిషత్‌ పేరుతో సాహిత్య కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రధానంగా నాలుగో రోజు రాత్రి పూలతోనూ, విద్యుత్‌ వెలుగులతోనూ అలంకరించిన ప్రత్యేక రథంపై నవ వధూవరులు సీతారామచంద్రులను, లక్ష్మణ స్వామిని రామతీర్థం ప్రధాన వీధుల్లో ఊరేగిస్తారు. ఈ రథాన్ని పక్క గ్రామమైన సీతారామునిపేట గ్రామస్థులు మాత్రమే లాగుతారు. ఐదో రోజున శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించి, ఆ రోజు రాత్రి గరుడ పటాన్ని అవరోహణం చేస్తారు. పూర్ణాహుతి అనంతరం కల్యాణోత్సవాలకు ముగింపు ప్రకటిస్తారు.
పతివాడ రమణ, నెల్లిమర్ల, విజయనగరం

ఒంటిమిట్ట కోదండరామాలయం






కల్యాణ వైభోగమే.. వెన్నెల్లో కల్యాణం
కమలాక్షు నర్చించు కరములు కరములు; శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ;
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు...

అంటాడు పోతన.


రామయ్య పెండ్లిని వీక్షించు జన్మ జన్మ అంటారు భక్తులు. ఆంధ్ర రాష్ట్రంలో ఆ చివర ఉత్తరాంధ్ర నుంచి ఈ చివర రాయల సీమ వరకూ జరిగే సీతారామ కల్యాణాల్లో విశేషాలెన్నెన్నో!

రామాలయాలన్నింటా కల్యాణాన్ని మధ్యాహ్న సమయంలో అభిజిత్‌ లగ్నంలో జరిపించడం ఆనవాయితీ. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో, ఆంధ్రా భద్రాద్రిగా వాసికెక్కిన ఒంటిమిట్ట కోదండరామాలయంలో మాత్రం చంద్రుని వెలుగుల్లో రాత్రి వేళ కల్యాణం నిర్వహిస్తారు. దీని వెనుక ఒక పురాణగాథ వుంది. క్షీరసాగర మథనం తరువాత లక్ష్మీదేవిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని స్వామి వరమిచ్చాడు. దాని ప్రకారమే చైత్ర శుద్ధ చతుర్దశి నాటి రాత్రి ఇక్కడ స్వామివారికి కల్యాణం జరుపుతారు.

పురాణ ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ రామాలయం కడప-చెన్నై ప్రధాన రహదారిలో కడప నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని ఒంటిమిట్టలో ఉంది. ఒక రాతి గుట్టపై మూడు గోపురాలతో 32 అద్భుత శిల్పమయ స్తంభాలతో రంగ మండపం, కల్యాణ మండపం ఉన్నాయి. సీతారామలక్ష్మణులు ఒకే శిలపై వెలసి ఉన్నందున ఒంటిమిట్ట ఏకశిలా నగరంగా వినుతికెక్కింది. దేశంలో హనుమ లేని రామాలయాలు చాలా అరుదు. హనుమంతుడు లేకుండా నిర్మించిన ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఒంటిమిట్టను ప్రభుత్వం టీటీడీ ఆధీనంలోని ఆలయాల్లో విలీనం చేసింది. ఈ నెల 24 నుంచి ఒంటిమిట్టలో 11 రోజుల పాటు తిరుమల తరహాలో కోదండరాముని బ్రహ్మోత్సవాలను జరిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 30న ఉత్సవంలో ప్రధానమైన సీతారాముల కల్యాణోత్సవం జరుగుతుంది.

రామాలయ ఆవిర్భావం
మట్లి పాలకుల్లో ఒకరైన సదాశివరాయుల కాలం నాటి శిలాశాసనాలను బట్టి చూస్తే ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని 1350లో ఉదయగిరిని పాలించిన కంపరాయలు నిర్మించినట్లు తెలుస్తోంది. 1356లో ఉదయగిరి సింహాసనాన్ని అధిష్ఠించిన కంప సోదరుడైన బుక్కరాయలు ఒంటిమిట్ట కోదండరామాలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. మట్లిరాజుల్లో ఒకడైన అనంతరాజు రామాలయ గుడిని విస్తరించారు. ఉత్తర, దక్షిణ గోపుర నిర్మాణాలు మొదలు పెట్టగా అనంతరాజు కుమారుడైన తిరువెంగళనాఽథ రాజు మనుమడు కుమార అనంతరాజు పూర్తి చేశాడు.

ఇతిహాసాలెన్నో...
రామడు అరణ్యవాసం చేస్తూ ఒంటిమిట్టకు వచ్చినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ తపస్సు చేసుకొనే మునుల కోరికపై రామలక్ష్మణులు రాక్షస సంహారం చేసినట్లు చెబుతారు. అనంతరం మునుల యజ్ఞయాగాదులకు ఇబ్బందులు కలగకుండా ఒకే శిలలో నిర్మితమైన సీతారామలక్ష్మణ విగ్రహాలను మునులకు ప్రదానం చేసినందున, దీనికి ‘ఏకశిలా నగరం’గా పేరువచ్చింది. శ్రీరాముడు అంబులపొది, పిడిబాకు, కోదండం చేతపట్టి రావడంతో ‘కోదండరాముడు’ అనే నామం వచ్చింది. కాగా, దండకారణ్యంలో పర్యటించిన సీతారామలక్ష్మణులు అలసి ఒక చెట్టునీడన చేరారట! ఆ సమయంలో సీతాదేవికి దాహంగా ఉండటంతో రాముడు బాణాన్ని భూమిలోకి సంధించగా గంగ పెల్లుబికింది. దీంతో వారు దాహం తీర్చుకున్నారు. అదే సమయంలో లక్ష్మణుడు కూడా భూమిలోకి బాణం సంధించగా గంగ ఉద్భవించింది. అప్పటి నుంచి ఇవి శ్రీరామలక్ష్మణ తీర్థాలుగా ప్రసిద్ధి చెందాయి.

జాంబవంత ప్రతిష్ఠ
త్రేతాయుగంలో ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చిన జాంబవంతుడు ఒక నాటి రాత్రి విశ్రమించగా స్వప్నంలో సీతారామలక్ష్మణులు దర్శనమిచ్చారట. జాంబవంతుడు ఉదయమే లేచి పరిసరాలను వెతకగా గుబురు పొదల్లో ఈ మూర్తులు కనిపించాయి. జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అందువల్లే ‘జాంబవంత ప్రతిష్ఠ’ అని పేరు వచ్చింది.

ఒంటిమిట్ట పేరు ఎలా వచ్చిందంటే..
ఒంటెడు-మిట్టడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ ప్రాంతంలో వేట సాగించేవారు. కంపరాయలు, ఆయన పరివారం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వీరు శ్రీరాముడు సృష్టించిన బుగ్గనీటితో దప్పిక తీర్చారట. ఈ అన్నదమ్ముల కోరికపై జాంబవంతుడు ప్రతిష్టించిన ఏకశిలా దేవతామూర్తులకు కంపరాయలు గర్భాలయం నిర్మించారు. తరువాత వీరి పేరు మీద ఒంటిమిట్ట గ్రామాన్ని, చెరువును కట్టించారు.

ఇమాంబేగ్‌ పిలుపు.. రామయ్య పలుకు
క్రీ.శ.1640 ప్రాంతంలో కడపను పాలించిన అబ్దుల్‌ నభీఖాన్‌ ప్రతినిధి ఇమాంబేగ్‌ ఒంటిమిట్ట కోదండరాముని మహిమను పరీక్షించేందుకు వచ్చాడట. గుడి లోపలికి వెళ్లి ‘‘ఓ రామ..! ఒంటిమిట్ట రఘురామ..!’’ అని మూడు మార్లు పిలువగా గుడిలోంచి ‘‘ఓ.ఓ.ఓ...’’ అనే సమాధానం వినబడిందట. ఇమాంబేగ్‌ ఆనందంతో మోకరిల్లి రాముని భక్తునిగా మారాడు. రాముని కైంకర్యం కోసం బావిని తవ్వించాడు. ఆ బావి నేటికి ఉంది. ఇప్పటికీ ప్రతి శుక్రవారం ఒంటిమిట్ట మండలం మంటపంపల్లె దర్గాకు వెళ్ళే ముస్లింలు కోదండరామున్ని దర్శించుకొంటారు.

భాగ్యనగరంలో అయోధ్యరాముడు






భాగ్యనగరంలో అయోధ్యరాముడు
ఎనిమిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు

అయోధ్య మినహా దేశంలో మరెక్కడా కానరాని పట్టాభిషిక్త శ్రీరాముడు భాగ్యనగరంలో కొలువుదీరి ఉన్నాడు. 186 ఏళ్ల క్రితం ఆస్‌ఫజాహీల పాలనలో నగరం నడిబొడ్డున శ్రీ సీతారామ మందిరం నిర్మితమైంది. ఈ ఆలయం సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. ఐదు ప్రధాన దేవాలయాలు, ఆరు ప్రధాన ద్వారాలు, ఏడు మెట్ల బావులు.. వెరసి మల్లేపల్లి, సీతారాం బాగ్‌లోని ‘శ్రీ సీతారాం మహరాజ్‌ సంస్థాన్‌’గా  వెలుగొందుతున్న రామాలయ విశేషాలు...

శ్రీరామచంద్ర మూర్తి, సీతా సమేత.. లక్ష్మణ, హనుమ, భరత, శత్రుజ్ఞ సహిత పట్టాభిషేక మహోత్సవ విగ్రహ మూర్తి కొలువుదీరిన దేవాలయం అయోధ్య మినహా భాగ్యనగరంలో మాత్రమే కొలువుదీరడం విశేషం. నగరం నడిబొడ్డునున్న మల్లేపల్లి, సీతారాంబాగ్‌లోని దాదాపు 25 ఎకరాల స్థలంలో పచ్చని చెట్లు, పూలు, పండ్ల తోటల నడుమ 1832, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పునర్వసు నక్షత్ర యుక్త లగ్నంలో శ్రీరామ మందిరం నిర్మితమైందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఈ ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవానికి కంచిలోని ప్రతివాది భయంకర మఠాధిపతి ‘అనంతాచార్యులు’ విచ్చేసినట్లు ఆలయ నిర్మాతల లిఖిత గ్రంథాల ద్వారా వెల్లడైంది. నాల్గో నిజాం ప్రభువు ఫర్కుందా అలీఖాన్‌ పరిపాలనలో సీతారామ మందిరం నిర్మితమైంది. రాజస్థాన్‌లోని లక్ష్మణ్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన పురాన్‌మల్‌ గనేరివాల్‌ ఈ ఆలయాన్ని కట్టించారు. ఆయన కుటుంబానికి చెందిన ఆరోతరం వారసులు అనంత్‌ప్రసాద్‌ గనేరివాలా, అరవింద్‌ కుమార్‌ గనేరివాలా ప్రస్తుతం ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు.

పట్టాభిషేక ఘట్టం

రామాలయం ప్రధాన ద్వారం ఉత్తర భారతీయ సంస్కృతిని తలపిస్తూ, బద్రీనాథ్‌ ఆలయ శైలిని తలపిస్తోంది. ఆ ముఖద్వారం గోడలపై వివిధ రంగుల్లో లతలు, పుష్పాలు, కొమ్మల డిజైన్లతో స్టకో వర్క్‌ కనపడుతుంది. గర్భగుడిలో సీతాసమేత శ్రీరాముడు, లక్ష్మణ, హనుమ, భరత, శత్రుజ్ఞలు సహితంగా శ్రీరాముని పట్టాభిషేక ఘట్టాన్ని తలపించే పాలరాతి విగ్రహ మూర్తులు కొలువై ఉన్నారు. అయోధ్యలోని రామమందిరంలో నెలవైన విగ్రహ మూర్తుల పోలికతో జైపూర్‌లో రూపొందించిన మూలవిరాట్‌ మూర్తులను ఇక్కడ ప్రతిష్ఠించారు. స్వామి వారి కైంకర్యాలు, పూజా విధానం ‘పాంచ రాత్ర ఆగమ’ పద్ధతిలో జరుగుతుంది. ‘ఆలయ ప్రాంగణంలో కొలువైవున్న ఆంజనేయస్వామి దేవాలయం పురాతనమైందని’ పండితులు అన్నంగరాచార్యులు వివరిస్తున్నారు. మొదట శైవ ఆరాధకులైన గనేరివాలా కుటుంబీకులు రామ మందిరానికి పూర్వమే అదే ప్రాంగణంలో నిర్మించిన శివాలయానికి వెనుకభాగంలో దర్శనమిస్తోంది.

కల్యాణ వైభోగమే..!
సీతారాం బాగ్‌ ఆలయంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు ఎనిమిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. భద్రాచలంలో పగటిపూట రాములవారి కల్యాణం జరిగితే, ఇక్కడ మాత్రం రాత్రివేళ కల్యాణ మహోత్సవం జరుగుతుంది. నవమి నాలుగోరోజు రథోత్సవంలో సీతారాముల ఊరేగింపు సంబురాన్ని తలపిస్తుంది. ‘గతంలోరధోత్సవాన్ని తిలకించేందుకు నిజాం ప్రభుత్వాధికారులు కొందరు ఆలయాన్ని సందర్శించేవారని’ అన్నంగరాచార్యులు తెలిపారు.

ఆలయ నిర్మాణానికి అనుమతి

రెండు శతాబ్దాల క్రితం జైపూర్‌కి చెందిన పురాన్‌మల్‌ గనేరివాలా కుటుంబం వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌ రాజ్యానికి విచ్చేశారు. వర్తకంలో నిలదొక్కుకున్న వీరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అనతికాలంలోనే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్న గనేరివాలా కుటుంబీకులు నిజాం ప్రభువు అభిమానాన్ని చూరగొన్నారు. అలా పురాన్‌మల్‌ కుమారుడు ప్రేమ్‌సుఖ్‌దాస్‌ మరాట్వాడా (ఇప్పటి మహారాష్ట్ర)లోని ‘అమరావతి’ ప్రదేశానికి పన్ను వసూలుచేసే అధికారిగా నియమితుడయ్యాడు. సుఖ్‌దాస్‌ ఆ బాధ్యతను స్వీకరించిన కొద్దికాలానికే, ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన మొత్తం 200 ఎడ్ల బండ్లకి సరిపోయేంత సొమ్మును నాల్గో నిజాంకు అప్పగించాడు. అదే సమయంలో కంచిలోని ప్రతివాద భయంకర మఠం పీఠాధిపతి అనంతాచార్యులు బోధనలతో ప్రభావితుడైన పురాన్‌మల్‌ వైష్ణవ మతాన్ని స్వీకరించాడు. ఆ స్వామీజీ ఆదేశానుసారం ధార్మిక సేవాకార్యక్రమాల్లో భాగంగా తన కొడుకు సుఖ్‌దా్‌సతో కలిసి రామాలయ నిర్మాణం తలపెట్టాడు. అందుకు మొదటగా నిజాం ప్రభుత్వానికి కొంత కప్పం చెల్లించి అనుమతి పొందాడు. 1820వ దశకంలో ఆలయ నిర్మాణ పనుల్ని ప్రారంభించారు. 1832లో ఆలయంలోని మూల విరాట్‌ను ప్రతిష్ఠించారు.

విభిన్న సంస్కృతుల మేళవింపు

ఆలయం నిర్మాణంలో ఎక్కువ భాగం గ్రైనేట్‌, సున్నం రాయిని వినియోగించినట్లు చారిత్రక అధ్యయనకారులు అనూరాధా రెడ్డి చెబుతున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశ సంప్రదాయాలతోపాటు, మొగలాయి, కుతుబ్‌షాహీలు, యూరోపియన్‌ నిర్మాణ శైలి ఆలయ కట్టడాల్లో కనిపిస్తుంది. కోట తలుపులను తలపించేలా ఆ దర్వాజాలు 20 అడుగుల ఎత్తులో ఉంటాయి. రెండో ప్రవేశ ద్వారం పూర్తిగా హిందూ సంప్రదాయ శైలిలో నిర్మించారు. ఆ గోపురంపై దశావతార మూర్తులు, కోతి బొమ్మలు, తామర మొగ్గలు వంటి డిజైన్లు కనిపిస్తాయి. మూడో ప్రవేశ ద్వారం పూర్తిగా ఉత్తర భారతీయ నిర్మాణశైలికి అద్దంపడుతోంది. ఆలయం లోపలికి ప్రవేశించగానే, అక్కడ గుమ్మటాలు, ద్వారాలు, విశ్రాంతి గదుల కిటికీలు వంటివి మొగలాయి సంస్కృతిని పోలి ఉంటాయని అనురాధారెడ్డి వివరిస్తున్నారు. అనంతాచార్యులు ఆదేశం ప్రకారం దక్షిణ భారతదేశ శైలితో వరదరాజస్వామి, లక్ష్మీదేవి ఆలయాలు నిర్మించారు. ఆ మందిరాల గోపురంపై ఆళ్వారుస్వామి ప్రతిమలు దర్శనమిస్తాయి.

సౌభ్రాతృత్వానికి ప్రతీక
గంగా జమున తెహజీబ్‌ సంస్కృతికి హైదరాబాద్‌ ఆలవాలం. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచే సర్వమత సౌభ్రాతృత్వం నెలకొందనడానికి సీతారాంబాగ్‌ మందిరం కూడా నిదర్శనం. రామ మందిరం ప్రాంగణంలోనే మసీదు నెలవైంది. మందిరం, మసీదు మధ్య కేవలం ఒకే ప్రాకారం నిర్మితమైంది. ‘హిందూ, ముస్లిం ఐకమత్యానికి ఈ మందిరం ప్రతీక. నిత్యం ఎంతో మంది ముస్లిం కుటుంబాలవారు ఆలయ ప్రధాన ద్వారం వరకు విచ్చేసి, అర్చనలు చేయించుకుంటారు. పండుగలు, పర్వదినాల్లో కానుకలు సమర్పించుకుంటారు’ అని అన్నంగరాచార్యులు చెబుతున్నారు.

మెట్ల బావులు.. మండపాలు
ఆలయ ప్రాంగణంలో మొత్తం ఏడు బావులుండేవి. అందులో ప్రస్తుతం నాలుగు మెట్ల బావులు మాత్రమే కనిపిస్తాయి. అవి కూడా శిథిలావస్థకు చేరాయి. ఆలయ ప్రధాన ద్వారం వద్ద నెలవైన మెట్లబావిని సుదర్శన కోనేరుగా పిలుస్తారు. ఒకప్పుడు ఈ బావి నీటిని స్వామి అభిషేకానికి ఉపయోగించేవారు. ఆలయ ప్రవేశ ద్వారం దాటిన తర్వాత ఎడమవైపున నెలవైన కోనేరును రామానుజ పుష్కరిణిగా పిలుస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే యతీశ్వరులు స్నానం చేసేందుకు బావిని నిర్మించారు. ఆ పక్కనే విశ్రాంతి మండపం కనిపిస్తుంది. దక్షిణాన గజేంద్ర మోక్ష మండపం, కోనేరు కనిపిస్తాయి.

రాతితో అత్యంత అరుదైన శైలిలో నిర్మించిన మెట్ల బావులన్నీ శుద్ధి చేయక నిరుపయోగంగా ఉన్నాయి. ఆలయంలో శుక్రవారం మండపం, కల్యాణమండపం, తులసీ కల్యాణ మండపం, ధనుర్మాస ఉత్సవాల మండపం వంటి పలు గ్రైనేట్‌ రాతి నిర్మాణాలు గుడి లోపల, బయట దర్శనమిస్తాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు, అర్చకులు, మేళగాళ్లు, కైంకర్యాల నిర్వాహకులు, పూలదండలు కట్టే కుటుంబాలు తదితరులు నివసించేందుకు ఆలయ ప్రాంగణంలోనే గృహసముదాయాన్ని నిర్మించారు. ఈ దేవాలయానికి 2010 ఇంట్యాక్‌ అవార్డు దక్కింది. ‘దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ మరమ్మతు పనులు త్వరలో ప్రారంభమవుతాయి. అందుకు ఒక కమిటీ కూడా ఏర్పడిందని’ అరవింద్‌కుమార్‌ గనేరివాల్‌ తెలిపారు.





విజయదశమి - విజయిూభవ






విజయిూభవ

విజయదశమి’... విజయాల పండుగ.
జగన్మాత దుర్గాదేవి మహిషాసురమర్దినిగా పూజలందుకున్న వేళ...
అర్జునుడు జమ్మిచెట్టు మీద నుంచి ఆయుధాలు తీసిన రోజు...
శరన్నవరాత్రుల్లో అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంతో భక్తులను అలరించే ఘడియ...
లక్ష్మీపూజ... సరస్వతీపూజ... ఆయుధ పూజ... శమీపూజ... అన్నీ శుభాలే.
మది నిండా సంతోషాలతో...
దసరా సరదాలతో...
తెలుగింటి ‘నవదుర్గల’ ఆశీస్సులతో...
విజయీభవ!

దేవీ జ్ఞానప్రసూనాంబికే!
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని వాయులింగేశ్వరుని ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వరుని దేవేరి జ్ఞానప్రసూనాంబ ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో దర్శన భాగ్యం కల్పిస్తారు. మొదటి రోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో, 2వ రోజు బ్రహ్మచారిణీ దేవి, 3వ రోజు చంద్రఘంటాదేవి, 4వ రోజు కూష్మాండదేవి, 5వ రోజు స్కంధమాతాదేవి, 6వ రోజు కాత్యాయనీదేవి, 7వ రోజు కాళరాత్రీ దేవి, 8వ రోజు మహాగౌరీదేవి, 9వ రోజు సిద్ధిధాత్రి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. 10వ రోజున విజయదశమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.

కరుణా సముద్ర.. కనకమహాలక్ష్మి
విశాఖలో కొలువుదీరిన శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారు ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్నారు. శ్రీకనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ దేవస్థానం 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏ సమయంలోనైనా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. విజయదశమి పర్వదినం సందర్భంగా స్వర్ణాభరణ అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన నిర్వహిస్తారు.

భక్తిముక్తిదాయిని భ్రమరాంబిక
ద్వాదశ జ్యోతిర్లంగాల్లో ఒకటిగా మల్లికార్జునుడు, అష్ఠాదశ శక్తుల్లో ఒకరిగా భ్రమరాంబాదేవి వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఏటా శ్రీశైల దేవస్థానం మల్లికార్జునస్వామివారికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, భ్రమరాంబదేవికి దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. భ్రమరాంబదేవి అమ్మవారి గర్భాలయం స్వామివారి ఆలయానికి వెనకభాగాన కొంత ఎత్తులో ఉంటుంది. తొమ్మిదిరోజులపాటు నవదుర్గ అలంకారాల్లో విశేషపూజలు అందుకునే భ్రమరాంబదేవి పదవ రోజు విజయదశమి పర్వదినం నాడు నిజాలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది.

శ్రీచక్రంపై మాణిక్యాంబ
అష్టాదశ శక్తి పీఠాలలో ద్వాదశ శక్తి పీఠం ద్రాక్షారామ మాణిక్యాంబ అమ్మవారు. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారిని దక్షిణాభి ముఖంగా, సాలగ్రామ శిలతో నిర్మితమైన శ్రీచక్రం బిందువుపై ఆదిశంకారాచార్యులు పున:ప్రతిష్ఠించారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఎక్కడా జరుగని విధంగా అమ్మవారికీ, శ్రీచక్రానికీ అర్చన ఏకకాలంలో జరగడం ఇక్కడి విశేషం. దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో మాణిక్యాంబ అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. నిత్య చండీహోమం జరుగుతుంది. విజయ దశమి రోజున శమీపూజ అనంతరం గజ వాహనంతో నగరోత్సవం జరుగుతుంది.

శుభాల దేవి!
జయశంకర్‌ జిల్లాలోని కాళేశ్వరం త్రివేణీసంగమ క్షేత్రం. ఇక్కడి శ్రీకాళేశ్వర ముక్తీశ్వర దేవాలయంలో అష్టతీర్థాలు ఉన్నాయి. ఒకే పానవట్టంపై కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు అరు రెండు లింగాలు ఉండడం ఈ ఆలయ విశిష్టత. పైగా ముక్తీశ్వరుడు ఉన్న చోట శుభానందదేవికి, సరస్వతీదేవికి ప్రత్యేక ఆలయాలు ఉండడం విశేషం. శుభాలను కలిగించేటువంటి ఈ అమ్మవారిని శుభానందదేవిగా పిలుస్తున్నారు. ఈ ఆలయంలో దసరా ముందు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.

ఉజ్జయినీ మహాకాళి!
నగరాన్ని కలరా వ్యాధి నుండి కాపాడిన మహిమాన్విత సికింద్రాబాద్‌లో వెలిసిన శ్రీ ఉజ్జయినీ మహాకాళి. 1813లో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌ వాస్తవ్యుడైన సురిటి అప్పయ్య ఆర్మీ డోలీ బేరర్‌గా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యారు. బదిలీ అయిన కొన్ని రోజులకు ఉజ్జయినిలో కలరా వ్యాధి సోకి వేలాదిమంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో అప్పయ్య, ఆయన అనుచరులు ఉజ్జయినిలోని శ్రీ మహాకాళి దేవిని దర్శించి, కలరా వ్యాధి నుండి కాపాడవలసిందిగా ప్రార్థించారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత సికింద్రాబాద్‌లోనే అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయించారు.

భక్తుల కొంగు బంగారం
వరంగల్‌ జిల్లాలోని భద్రకాళి అమ్మవారు స్వయం వ్యక్తం. ఈ జగన్మాత మహా దుర్గాష్టమి వేళ భూ మండలం మీద భద్రకాళిగా అవతరించిన ప్రదేశం ఓరుగల్లు మహానగరమని ప్రతీతి. మహాష్టమి అని పిలిచే దుర్గాష్టమి వేళ జనగ్మాత కోటి యోగిని గణాలతో భద్రకాళి రూపంలో ఆవిర్భవించినదని దేవీ భాగవతం చెబుతోంది. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే శరన్నవరాత్రి వేడుకల్లో అమ్మవారి జన్మ నక్షత్రమైన దుర్గాష్టమినాడు తెలంగాణ నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ప్రతి రోజు వివిధ ఆకారాల్లో అమ్మవారిని అలంకరించి, వాహన సేవలు నిర్వహించే ఈ వేడుకలు అమ్మవారి కల్యాణోత్సవంతో ముగుస్తాయి.

అన్నపూర్ణకు ప్రతిరూపం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ దివ్యక్షేత్రం అతిపెద్ద శైవక్షేత్రాల్లో ఒకటి. శ్రీరాజరాజేశ్వరస్వామివారు ఈ క్షేత్రంలో ప్రధాన దేవతామూర్తి. ప్రధాన ఆలయంలో శ్రీస్వామివారికి కుడివైపున శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారు, ఎడమవైపున శ్రీలక్ష్మీగణపతిస్వామివారు కొలువై ఉంటారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారు నవదుర్గల రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దుర్గాష్టమి రోజున మహిషాసురమర్దినిగా అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు. కాశీ క్షేత్రంలోని అన్నపూర్ణదేవి ప్రతిరూపం వేములవాడ క్షేత్రంలో ఉందనీ, అదే కారణంగా ఈ క్షేత్రానికి దక్షిణ కాశిగా పేరువచ్చిందని ప్రతీతి.

మహా ‘శక్తి’ స్వరూపిణి
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉత్తర వాహిని తుంగభద్రానదీ తీరంలో కొలువైంది జోగులాంబ అమ్మవారు. 18 శక్తిపీఠాల్లో జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌లో ఉన్న ఐదవ శక్తిపీఠం జోగులాంబదేవి. క్రీ.శ 17వ శతాబ్దంలో ఆదిశంకరుడు శ్రీచక్రప్రతిష్ఠ చేసి జోగులాంబదేవిని ప్రతిష్ఠించారని చెబుతారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుంది. జోగులాంబ దేవాలయంలో శరన్నవరాత్రుల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరణ చేస్తారు. 9వ రోజున తుంగభద్రా నదిలో హంసతూలిక పడవలో అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి భక్తులకు కనువిందు చేస్తారు.






Sunday, 18 March 2018

కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామి





అక్కడ ముస్లింలకూ పండగే!

ఉగాది... అంటే హిందువుల పండగ అని అందరికీ తెలిసిందే. ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... కడప జిల్లాలో ఎంతోమంది ముస్లింలకూ ఈ పండగ ప్రత్యేకమైందే. ఆ రోజున వందల మంది ముస్లింలు స్థానికంగా కొలువైన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని కానుకలు సమర్పించడం అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.

తిరుమల తొలి గడప దేవుని కడప. పూర్వం తిరుమల వెళ్లే భక్తులు కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునే వెళ్లేవారట. అందుకే తాళ్లపాక అన్నమయ్య ‘కాదనకు నామాట కడపరాయ నీకు - గాదె బోసెవలపులు కడపరాయా...’ అంటూ కీర్తించాడు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న ఆ మొలకనవ్వుల కడప రాయడిని దర్శించుకునేందుకు కేవలం హిందూ భక్తులే కాదు, ముస్లింలు కూడా రావడం ఈ ఆలయానికున్న విశిష్టత. శ్రీనివాసుడు తమ ఇంటి ఆడపడుచు బీబీ నాంచారమ్మను మనువాడాడు కాబట్టి ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు స్థానిక ముస్లింలు. అందుకే, ఏటా తెలుగు సంవత్సరాది రోజున ఉపవాసం ఉండి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. బియ్యం, గారెలు, కొబ్బరికాయలూ తెచ్చి స్వామివారికి సమర్పిస్తారు. వెంకన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాక సాయంత్రం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా ఏటా ఉగాదినాడు ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు స్వామి దర్శనానికి వచ్చే ముస్లింల సంఖ్య వందల్లో ఉంటుంది. హిందూ భక్తులతోపాటే వాళ్లూ తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఈ సంప్రదాయం ఎన్నో వందల ఏళ్ల నుంచీ ఆ ఆలయంలో కొనసాగుతోంది. ఆ రోజున కడప రాయడిని దర్శించి కానుకలు సమర్పిస్తే ఏడాదంతా తమకు మంచే జరుగుతుందని అక్కడి ముస్లిం భక్తుల నమ్మకం.

రమణీయ శిల్పవైభవం
కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిల్ప సౌందర్యం రమణీయం. స్వామి సన్నిధిలో ఉన్న మంటపం విజయనగర రాజుల కాలంలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి తాండవ గణపతి రూపం అతిమనోహరం. స్థానిక రాజులే కాక నవాబులు, ఆంగ్లేయుడైన సర్‌ థామస్‌ మన్రో సైతం ఆలయ పునర్నిర్మాణానికీ మరమ్మతులకూ సహకరించినట్లు ఆధారాలున్నాయి. స్వామి గర్భగుడి వెనుక ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమాభిముఖమై ఉంటుంది. తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి కాగా ఇక్కడి క్షేత్ర పాలకుడు హనుమంతుడు. స్వామి వక్షస్థలంపై కుడివైపున శ్రీవత్స చిహ్నంతో మహాలక్ష్మీమూర్తి ఉండడం విశేషం. మూల విరాట్టు విగ్రహంపైన సుందరంగా చెక్కిన యజ్ఞోపవీతాలూ నాలుగు కంఠాభరణాలూ కనిపిస్తాయి. విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర, బుక్కరాయలూ సాళువ వంశీయుడైన నరసింహరాయలూ ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలూ స్వామికి మడిమాన్యాలూ ఆభరణాలూ సమర్పించినట్లు ఆలయ కుడ్య శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయానికి ఎడమ వైపున అమ్మవారి మందిరం ఉంది. విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, వినాయకుడు, ఆండాళ్లమ్మ మందిరం, శమీవృక్షం, ధనుర్మాసాది మంటపాలే కాక వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి మందిరం సైతం ఉండడం ఈ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికున్న ప్రత్యేకతగా చెబుతారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేరుని పుష్కరిణిగా పిలుస్తారు. కృష్ణా కాలువలోంచి దీన్లోకి వచ్చే నీరు తూర్పు వైపున ఉన్న చిన్న కాలువద్వారా బయటకు వెళుతుంది. కాబట్టి, నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పుష్కరిణిలోనే స్వామివారి తెప్పోత్సవం, చక్రస్నానాది కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక, ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఎంతో కన్నుల పండగగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాగే స్వామి రథోత్సవాన్ని అన్నమయ్య కీర్తించిన తీరే అందుకు ఉదాహరణ.

కన్నుల పండుగలాయ కడప రాయని తేరు
మిన్నునేల శృంగారము మితిమీరినట్లు
కాంతతో శ్రీవేంకటేశ కడప తేరెక్కి
యింత నన్ను గూడి వీధులేగితివి నీవు

అంటూ కప్పురపు నవ్వుల కడప రాయని కీర్తించి తరించాడు అన్నమయ్య. వేంకటేశుడి రథోత్సవం సమయంలో కూడా కులమతాలకు అతీతంగా వేలమంది భక్తులు తేరును లాగి దేవేరీ సహితుడైన కడపరాయడిని దర్శించి పరవశిస్తారు.





Friday, 16 March 2018

శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి





శివలింగంపై కొప్పు
శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉన్న శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామివారి క్షేత్రం బహు పురాతనమైనది. ఈ గ్రామం రావులపాలెం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అనుకోకుండా మొన్నీమధ్య మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడికి చేరుకున్నాను. ఆ సమయంలో దేవాలయం తెరిచి ఉంటుందా అన్న అనుమానంతో దేవాలయంలోకి ప్రవేశించాను. ఏవో కారణాలవల్ల తెరిచే ఉన్నది. అలా మనకి రాసున్నదన్నమాట. ఈ దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం. రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. శ్రీ పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం ఇక్కడే ఉన్నది. మూడవది – నిజానికి శివలింగంపై కొప్పు మొదటినుండీ ఉండినది కాదు; కాలాంతరంలో పుట్టుకొచ్చినది.

శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామిగుడి వెలుపల, ఇటీవలే అమర్చిన ఒక శిలా ఫలకంపై ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలియజేస్తున్న వివరాలను యథాతదంగా ఇక్కడ ఫొటోలతో సహా పొందుపరుస్తున్నాను. కానీ వింధ్య పర్వతం, అగస్త్య మహాముని వివరాలు కౢప్తంగా తెలుసుకుంటే కింద ఉన్న మాహాత్మ్య వర్ణనం పూర్తిగా అర్థమవుతుంది.

అగస్త్యుడు: ఒకానొక సమయంలో వింధ్య పర్వతానికి మేరు పర్వతం పై అసూయ కలిగి, తానదే పనిగా పెరిగిపోతూ గ్రహనక్షత్రమండల గమనానికి అవరోధం కలిగించసాగింది. అందుకు సూర్యుడు తన చుట్టూ తిరుగక మేరువు చుట్టూ తిరగడమే ప్రధాన కారణం. అలా వింధ్య పర్వతం పెరిగిపోవడంతో లోక వ్యవహారం దెబ్బ తిన్నది. దేవతలు వింధ్య పర్వతాన్ని ప్రార్థించారు. ఆయన వినలేదు; తగ్గ లేదు. చేసేదేమీలేక దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అంత బ్రహ్మ ఈ ఉపద్రవము నుండి మిమ్ము రక్షించువాడు అగస్త్యుడు తప్ప మరెవరూ లేరని సెలవిచ్చారు. దేవతలు తిన్నగా అగస్త్యుని చేరి విషయం విశదపరిచారు. విన్న అగస్త్యుడు భయము వలదని వారికి అభయమిచ్చి తాను వింధ్య పర్వత ప్రాంతాన్ని సమీపించాడు.

అంత దూరాన అగస్త్యుని చూచిన వింధ్య, పూర్వం వలె ఒదిగిపోయింది. గ్రహ గమనము మరలా ప్రారంభమైనది. వింధ్య పురుషాకృతి దాల్చి అగస్త్యునకు సాష్ఠాంగదండ ప్రణామం చేసి ఆయన రాకకు కారణం వినగోరాడు. అందుకు సమాధానంగా ఆ మహా ముని “నేను దక్షిణాపథమందలి తీర్థములను చూడ బయలుదేరితిని. తిరిగి వచ్చునంత వరకూ నీవు ఇటులనే ఉండవలెను” అని ఆదేశించగా వినమ్రంగా వింధ్య అంగీకరించి అలాగే ఉండి పోయింది. అప్పటి నుండి ఆయన దక్షిణ భారతంలోనే స్థిర పడి పోయారు. ఆయనకిచ్చిన మాట మేర వింధ్య పర్వతం కూడా అలాగే ఉండి పోయింది.

అగస్త్యుని మాట వింధ్య పర్వతం విన్నది అంటే, ఆయన ఎంతటి పుణ్య పురుషుడో అర్థమవుతుంది. శ్రీమద్రామాయణం, అరణ్య కాండము సర్గలు 10, 11 లలో ఆయన ఎంతటి గొప్పవాడో స్వయంగా శ్రీరాముడే తెలియజేస్తాడు. నిజానికి ‘అగమ్ స్థంభయతీతి అగస్త్యః’ అనగా అగమును (పర్వతమును) స్థంబింపజేసిన వాడు కాబట్టి ఆయన ‘అగస్త్యుడు’ అను పేరుతో విఖ్యాతి కెక్కారు.

ఇక శిలా ఫలకంపై ఉన్న క్షేత్ర మాహాత్మ్య వివరాలు…

శ్రీ స్వామివారి పూర్వ చరిత్ర:పూర్వము అగస్త్య మహాముని కౌశికానది తీరామున పల్వలపుర ప్రాంతంలో తపస్సు చేసుకొనుచుండగా హిమవత్ పర్వతమున లోక కల్యాణార్థమై పార్వతీ పరమేశ్వరుల కల్యాణము అతి వైభవముగా జరుగుచుండెను. ఆ కల్యాణమును చూచి తరించవలెనని అగస్త్య మహాముని సంకల్పించెను. అగస్త్యుడు బయలుదేరి వెళ్ళినచో వింధ్య పర్వతము యెప్పటియెట్లే తన ఉగ్రరూపమును చూపి సంభోంతరాశమునకు ఎదిగి, గ్రహభ్రమణమునకు తీవ్ర ఆఘాతము కలుగజేయును. అట్టి ఉపద్రవం జరుగునని భయపడి ఇంద్రాది దేవతలు అగస్త్యుని ప్రయాణమును విరమింపజేయుటకై విశ్వబ్రహ్మను పంపిరి. అగస్త్యుడు విశ్వబ్రహ్మ ద్వారా కల్యాణ మహోత్సవ వైభవమును శ్రవణానందముగా విని, తన దివ్యదృష్టిచే కనులారా గాంచి పార్వతీపరమేశ్వరులను కల్యాణ పసుపు వస్త్రములతో దర్శనమీయవలసినదిగా ప్రార్ధించెను. వారట్లే దర్శనమిచ్చిరి. కల్యాణపీఠముపై దివ్యమంగళ స్వరూపులుగా విరాజిల్లుచున్న పార్వతీ పరమేశ్వరులను ఏకపీఠముపై పల్వలపుర దివ్యక్షేత్రమున భక్త వాంచితమును తీర్చుటకై లోక కల్యాణార్ధం ప్రతిష్ఠ గావించెను. అగస్త్యునిచే ఈ క్షేత్రమునకు “అగస్త్యేశ్వర క్షేత్రము” అని పేరు ఈ లింగము ప్రతిష్ఠింపబడుటచే వచ్చెను. ఇట్లుండ…

శ్రీ అగస్త్యేశ్వరుడు కొప్పులింగేశ్వరుడైన చరిత్ర:పల్వలపురంలో అగస్త్య మహాముని వలన ప్రతిష్ఠ గావింపబడిన అగస్త్యేశ్వరుని వెలనాటి వంశమునకు చెందిన యొక విప్రుడు పరమ నిష్టాగరిష్టుడై విశేష భక్తితో పూజించుచుండేను. పౌరులాతని వేశ్యాలోలతను సహింపజాలక రాజ్యపాలకునకు ఫిర్యాదు చేసిరి. మహారాజు ఫిర్యాదులను వినయు నిర్లక్ష్యము చేసెను. కాని నానాటికి ఫిర్యాదులు హెచ్చుచుండుటచే ఒకానొక రోజున ఆకస్మికంగా పూజారిని పరీక్షింపనెంచి మహారాజు పల్వలపురమునకు వచ్చెను. ఆ సమయమున పూజారి వేశ్య యొద్ద నుండెను. మహారాజు రాక విని రివాజు ప్రకారము నిర్మాల్య మాలికను రాజు గారికి ప్రసాదముగా ఇచ్చుటకుగాను ఆ సమయములో మరియొక పూలమాల లేదు కదాయని గ్రహించి, తన వేశ్య కొప్పులో అంతకుముందే యుంచిన స్వామి పూలమాలను తీసి రహస్యముగా ఆలయములోనికి తెచ్చి నిర్మాల్య మాలికగా రాజుగారికి ఇచ్చెను. మహారాజు ఆ నిర్మాల్య మాలికయందు నిగనిగలాడుచున్న పొడవైన కేశమును గాంచి శంకించి పూజారిని ప్రశ్నింపగా నాతను “పరమశివుడు జటాఝూటధారి” గాన పూలమాలికను అగస్త్యేశ్వరుని కేశము చుట్టుకొని యుండేనని బదులు పలికెను. లింగమునకు జటాఝూటముండుటయా అని రాజు ఆశ్చర్యపడి – అయినచో ఈశ్వరలింగమునకు కేశములు చూపమనెను. దానికి పూజారి నిర్మల హృదయుడై ధైర్యమును బూని, మహారాజా, యిది మాధ్యాహ్నిక సమయము, స్వామివారికి అభిషేక పూజా విధులు నిర్వర్తించి మహానివేదనమొనర్చి నాగాభరణాలు అలంకరించి యుంటిని, రేపటి ఉదయం వరకు అలంకరణాదులను తొలగించరాదు. మీరు ప్రాతః కాలము వరకు యుండిన స్వామి జటాఝూటమును చూపగలననేను.

మహారాజు దానికంగీకరించి జటాఝూటములు చూపనిచో నీకు శిరచ్ఛేదము తప్పదని పలిక ఆ రేయి పల్వలపురం లోనే విడిదిచేసి యుండెను. అంతట పూజారి తనకు శిరచ్ఛేదము తప్పదని యెంచి అవసానకాలంబున చేసికొనినచో మోక్షం లభించునని యెంచి ఆ రాత్రంతయు శ్రీ స్వామి గర్భాలయమునందే యుండి పరమ శివుని పలురీతులు వేడుకొనుచూ స్వామీ! నీ భక్త పరమాణువును నా పూర్వ జన్మ ఫలంబుచే నేనీ పాపాలు చేసి యుంటిని. నా తప్పును మన్నించి ఇప్పటి నుండి మీరు కొప్పును ధరించవలెను. మీ కొప్పును మహారాజుగారికి చూపనిచో నాకు శిరచ్ఛేదము తప్పదు. మీరు కొప్పును ధరించరేని నా శిరస్సును ఈ లింగమునకు బాదుకొని ప్రాణములు విడిచెదను. అని దీనముగా పలికి మూర్ఛిల్లెను. అంతట నీలకంఠుడు పూజారి మొరాలకించి లింగోద్భవ కాలమున (అర్ధరాత్రి) కొప్పును ధరించెను. స్వామి కొప్పును ధరించుట పూజారి చేసిన కృత్రిమ చర్య అని ప్రజలు ఏక కంఠముతో పలికిరి. అంతట మహారాజు “ఏది శిరోజమును పెకిలించి తీసుకొని రమ్ము” అని ఆజ్ఞాపించగా పూజారి అట్లే చేసెను. రాజునకు శిరోజము మొదట రక్తము కనిపించెను. వెంటనే రాజునకు నేత్ర అవరోధము కలిగెను. అప్పుడు మహారాజు పరమేశ్వరునకు అపచారము జరిగెనని తలంచి, దోషమును మన్నించి దృష్టిని ప్రసాదించమని వేనోళ్ళ పరమేశ్వరుని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు శాంతించి రాజునకు దృష్టిని ప్రసాదించెను. మహారాజునకు పరమేశ్వరుడు దృష్టిని ప్రసాదించినందుకు దానికి గుర్తుగా రాజుగారు జుత్తుగపాడు గ్రామానికి చెందిన భూమిని స్వామికి కానుకగా సమర్పించెను.

జుత్తుగపాడు అను గ్రామం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామమునకు రెండు ఫర్లాంగుల దూరంలో కలదు.

కావున అగస్త్యేశ్వరుడు తన పూజారి ప్రాణములను కాపాడుటకుగాను కొప్పును ధరించుటవలన నాటి నుండి శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామిగా నామాంతరము చెంది అప్పటి లగాయతు శోభాయమానంగా విరాజిల్లు చున్నది.

ఆనాటి పల్వలపురమే నేటి పలివెల గ్రామము.





బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...