Showing posts with label Madhya Pradesh. Show all posts
Showing posts with label Madhya Pradesh. Show all posts

Tuesday, 11 December 2018

నర్మద జన్మస్థలి








నర్మద జన్మస్థలి



యమునా నదిలో ఏడుసార్లు, సరస్వతిలో మూడుసార్లు, గంగానదిలో ఒక్కసారి స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి పవిత్రులవుతారని ఓ నమ్మకం. అత్యంత పవిత్రమైన నర్మదానదిని చూస్తేనే.. అశ్వమేధయాగం చేసినంత పుణ్యం వస్తుందని అంటారు. అలాంటి పవిత్ర నదీమతల్లి నర్మద జన్మస్థానమే అమర్‌ కంటక్‌. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ ప్రదేశం.. అపురూపమైన జలపాతాలు.. శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అలరారుతోంది. ప్రకృతి అందాలతో, ఆధ్యాత్మిక భావాలను ఒలికిస్తున్న అమర్‌ కంటక్‌ విశేషాలు..

ఎటుచూసినా.. దేవదారు, సాల్, టేకు, దుగ్గిలం, కెండు లాంటి పెద్ద పెద్ద వృక్ష సంపద. పేర్లు కూడా సరిగా తెలియని పచ్చని తీగలతో అల్లుకున్న పొదలు. కటిక చీకటిగా, మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టించే ఆ ప్రాంతం నుండి ధైర్యం చేసి అలా అలా ముందుకు సాగితే... కనుచూపు మేరలో ఎత్తౖన కొండలతో కనిపించే పచ్చటి అరణ్య సౌందర్యం మీ ముందు కదలాడుతుంది. ఇంకేముంది మీరు పడ్డ శ్రమనంతా.. అతి తేలిగ్గా మరిచిపోతారు. ఇంతటి అందాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే అమర్ కంటక్. ఇది మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఉంది. నర్మదానది జన్మస్థలంగా పేరుగాంచిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే... దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అమర్ కంటక్ సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంది.

పురూరవుడి తపోఫలితంగా...
పాపపరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే.. శివుడు ప్రత్యక్షమై 'నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను. మరి నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవర'ని ప్రశ్నిస్తాడట. వింధ్య పర్వత రాజు తన కుమారుడైన అమర్ కంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీమతల్లి దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ.

నర్మదా నది స్థానిక మైకల్ కొండల్లో పుట్టి వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి, అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంటుంది. పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా, తపతి నదులు పేరెన్నికగన్నవిగా చెప్పవచ్చు.

పుట్టినచోటే గుడి
నర్మదానది పుట్టిన చోటనే నర్మదామాత గుడి వెలసింది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతరలు జరుగుతుంటాయి. అన్నింటికంటే, శివరాత్రికి ఇక్కడ జరిగే జాతరే చాలా పెద్దది.

అమర్ కంటక్ మూడు జిల్లాల కూడలిగా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది భక్తులు జాతరలు సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది భక్తులు వంటలు చేస్తూ రాత్రంతా ఇక్కడే గడుపుతుంటారు. శివరాత్రినాడు నర్మదానదిలో స్నానం చేసి, ముందుగా శివుడిని దర్శించుకుని తరువాత నర్మదామాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతా రాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.

ఎలా వెళ్లాలంటే...
విజయనగరం నుంచి కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో బిలా స్‌పూర్ చేరుకోవాలి. అక్కడి నుంచి మరో రైల్లో పిండ్రా వరకు వెళ్లి అద్దె వాహనాల్లో అమర్ కం టక్ వెళ్లవచ్చు. లేదా బిలాస్‌పూర్ నుంచే నేరుగా ట్యాక్సీలలో 120 కిలోమీటర్ల దూరం లోని అమర్ కంటక్ వెళ్ళవచ్చు.

కపిలధార
అమర్ కంటక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కపిల ధార అనే ప్రాంతం ముఖ్యమైనది. నర్మదానది కపిల ధార వద్ద ఒక లోయగుండా ప్రవహిస్తుంటుంది. నూరు అడుగుల ఎత్తు నుంచి దూకే కపిల ధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతుంటుందని, ఆ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.

ఏనుగు కాళ్ళ నుండి దూరితే పుణ్యం..!
నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలోని ఒక మీటరు కంటే తక్కువ ఎత్తులో చెక్కిన రాతి ఏనుగుబొమ్మ ఉంటుం ది. ఆ ఏనుగుబొమ్మ కాళ్ల మధ్యనుంచి దూరి ఒక వైపు నుండి మరో వైపునకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదే ఏనుగుపైన అంబారీ ఎక్కిన ఓ స్త్రీ విగ్రహం తలలేకుండా మొండెం మాత్రమే ఉంటుంది. బహుశా ఔరంగజేబు జరిపిన దాడిలో తల ధ్వంసం అయి ఉండవచ్చుననే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది.

నర్మదామాత ఆలయానికి దగ్గర్లో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్ఫానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం, మాయికీ బగియా గా వ్యవహరించే దేవతావనం, యంత్ర మందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించ వచ్చు. యంత్ర మందిరానికి దగ్గర్లోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతా లనూ వీక్షించవచ్చు.

నర్మద పుట్టుకపై ఎన్నో పురాణాలు
నర్మదామాత ఆలయం గురించి అనేక పురాణ కథలు వినిపిస్తుంటాయి. క్రీ॥శ॥ 1042-1122 మధ్యకాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చంద్రవంశరాజైన పురూరవ చక్రవర్తి తన పాపపరిహారం నిమిత్తం మార్గం చెప్పమని బ్రాహ్మణులను కోరితే, దివినున్న నర్మదా నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట. ఆయన తపస్సు ఫలితంగా దివినుంచి భువికి దిగివచ్చింది నర్మద. అలా అమర్ కంటక్ లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసిన పురూరవుడు స్వర్గప్రాప్తి పొందాడట...!



Sunday, 13 May 2018

బైద్యనాథ్ దేవాలయం






బైద్యనాథ్ దేవాలయం
భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం

ఆమె మనసు ఉద్విగ్నంగా ఉంది.
యుద్ధానికి వెళ్లిన భర్త క్షేమసమాచారం లేదు.
ఏమయ్యాడో తెలియదు. పది రోజుల క్రింద ఉత్తరం వచ్చింది. ఆ తరువాత నుంచి అజా అయిపూ లేదు.
గుర్రంపై స్వారీ చేస్తూ తెలియకుండానే కొండపైకి ఎక్కుతోంది ఆమె.
“మార్టిన్. ఐ మిస్ యూ మార్టిన్. ఐ మిస్ యూ సో మచ్ డియర్”
కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
కడిగేసినంత స్పష్టంగా కల్నల్ మార్టిన్ బొమ్మ ఆమె కళ్లముందు కట్టింది.
సాయంత్రం.
సూర్యుడు పడమర ఒడిలో పడుకుండిపోతున్నాడు.
కొండమీద కాషాయ కాంతి విరజిమ్ముతోంది.
వింత నిశ్శబ్దం అంతా పరుచుకుపోయింది.
ఉన్నట్టుండి.
గణ గణ గణ గణ …..
గణ గణ గణ గణ……
గంటల శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది.
ఆ శబ్దం వచ్చిన వైపు చూపింది ఆమె.

దూరంగా ఒక శిధిల దేవాలయం.
అందులో నుంచి హారతి దీపాల వెలుగు.
ధూపాల పొగ. ఘంటారావం.
అప్రయత్నంగానే ఆమె ఆ గుడిపైపు వెళ్లింది.
గుడిముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్లింది.
లోపల వైద్యనాథ మహాదేవ శివుడు.
లింగాకారంలో విచిత్ర కాంతులు వెదజల్లుతూ.
అర్థనిమీలిత నేత్రాలతో పూజారి అర్చన చేస్తున్నాడు.
ఆయన నోటి నుంచి మంత్రాలు అలవోకగా వెలువడుతున్నాయి.

ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది.
కళ్లనుండి ధారగా నీరు కారుతూనే ఉంది.
పూజ పూర్తికాగానే పూజారి ఆమె వైపు చూశాడు.
“మేమ్ సాబ్ తీర్థం తీసుకొండి.”
“ఏమిటమ్మా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు.”

ఆమె తన భర్త కల్నల్ మార్టిన్ అఫ్గన్ యుద్ధానికి వెళ్లిన సంగతి, ఆయన క్షేమ సమాచారం లేని విషయమూ చెప్పింది. చెప్పిందన్న మాటే కానీ కన్నీళ్ల వర్షం కురుస్తూనే ఉంది.
“మేమ్ సాబ్ కంగారు పడకండి. బైద్యనాథ్ మహాదేవుడు అందరినీ కాపాడతాడు. ఆయన దయ ఉంటే మృత్యువేమీ చేయదు. అంతఃకరణశుద్ధిగా బైద్యనాధుడిని అర్చించండి. ఓం నమశ్శివాయ అన్న మంత్రాన్ని పదకొండు రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి. అంతా మంచే జరుగుతుంది.” అన్నాడు.

ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు నుంచే అన్నపానాలు మానేసింది. అన్ని పనులూ మానేసింది. తన గదిలోనే కూచుంది. “ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.” మంత్రం జపించసాగింది. మరొక ధ్యాస లేదు. ఇంకో ధ్యానం లేదు. ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.

ఒకటి … రెండు …. మూడు ….. నాలుగు …. అయిదు …..
రోజులు గడిచిపోతున్నాయి.
“ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.”

పదకొండో రోజు. రోజు రోజంతా పంచాక్షరిని జపించింది
సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకడు “మేమ్ సాబ్ … మేమ్ సాబ్… సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై… సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై…” అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఆమె ఆ లేఖను తెరిచి చూసింది.
తన ప్రియాతిప్రియమైన మార్టిన్ సంతకం చూసింది. కట్టలు తెంచుకుంటున్న భావోద్వేగాన్ని ఎలాగోలా ఆపుకుంటూ లేఖను చదవసాగింది.

“డియర్. గతంలో నీకు లేఖ వ్రాసిన మరుసటి రోజు నుంచే అఫ్గన్లు మా పటాలాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచి భీకరమైన దాడి చేశారు. మేమెవరమూ బతికిబట్టకట్టి బయటపడే పరిస్థితి లేదు. మా దగ్గర ఆయుధాలూ తక్కువే. ఆహారమూ తక్కువే. వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇక మా పని అయిపోయిందనుకున్నాను. ఒక అఫ్గన్ పొడవాటి ఖడ్గంతో నాపై దూకాడు. నేను భయంతో కళ్లు మూసుకున్నాను. ఆ క్షణంలో నువ్వు తప్ప నాకింకెవరూ గుర్తుకురాలేదు. అంతలో అద్భుతం జరిగిపోయింది. ఎవరో ఒక మనిషి అఫ్గన్లపైకి దూకాడు… ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు….ఒళ్లంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు. సింహం చర్మం మొలకి కట్టుకున్నాడు. చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది. ఆ శూలం కొన మూడుగా చీలి ఉంది. ఆయన ధాటికి అఫ్గన్లు కకావికలమైపోయారు. కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు. వాళ్లు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు. ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడికి కాదు డియర్.”.

1880 అఫ్గన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండ మీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు పదిహేనువేల రూపాయలు సమర్పించుకున్నారు. మహాదేవ్ మందిరానికి కొత్త శోభ వచ్చింది.
కొన్నాళ్లకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడవరకూ ఆయన్నే అర్చించారు.
మందిరం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు. ఆ మందిరం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది.






Indian Temple Built by a British Man

Interesting Story..
In 1879, when the British were ruling India, Lt. Col. Martin of Agar Malva was leading the army in the war against Afghanistan.

Col. Martin used to regularly send messages of his well-being to his wife. The war continued for long & Lady Martin stopped getting messages. She was very upset.

Once riding on her horse, she passed by the temple of Baijnath Mahadev. She was attracted by the sound of Conch & Mantra. She went inside and came to know that the Brahmanas were worshipping Lord Shiva. They saw her sad face and asked her problem. She explained everything to them. They told her that Lord Shiva listens to the prayers of devotees and takes them out of difficult situations in no time. With the advice of the Brahmanas she started the ‘Laghurudri Anushtthan’ of the Mantra:

‘Om Namah Shivaya’ for 11 days. She prayed to Lord Shiva that if her husband reaches home safely, then she would get the temple renovated.

On the last of the ‘Laghurudri’ a messenger came and gave a letter to her. Her husband had written: ‘I was regularly sending messages to you from the battle grounds but suddenly the Pathans surrounded us from all sides. We were entrapped in a situation where there was no scope of escaping death. Suddenly I saw a Yogi of India with long hair, carrying a weapon with three pointers (Trishul). His personality was amazing and he was maneuvering his weapon with a magnificent style. Seeing this great man, the Pathans started running back. With his grace our bad times turned into moments of victory. This was possible only because of that man of India wearing a lion skin & carrying a three-pointer weapon (Trishul). That great Yogi told me that I should not worry and that he had come to rescue me because he was very pleased with my wife’s prayers.’

Tears of joy were falling down Lady Martin’s eyes while reading the letter. Her heart was overwhelmed. She fell into the feet of Lord Shiva’s statue and burst in tears.

After a few weeks Col. Martin returned. Lady Martin narrated the whole incident to him. Now both husband & wife became devotees of Lord Shiva. In 1883 they donated Rs. 15,000 for renovating the temple. The information engraved slab for the same is still there in the Baijnath Mahadev Temple of Agar Malva. This is the only Hindu temple built by a Britisher.

Analysis:The message talks about the Baijnath Mahadev (Shiva) Temple in Agar Malwa of Madhya Pradesh state in India, that it is the only temple made by a Britisher in India, and that it happened after the Colonel Martin was miraculously saved by an avatar of Lord Shiva – post prayers from his wife, Lady Martin. Many people could not believe these supernatural claims, but there are documented records suggesting such an incident could have possibly happened. There is some misinformation in the story though.

History of Baijnath Temple 

This famous Baijnath Mahadev Temple is located in southern banks of Banganga river in Agar Malwa of Madhya Pradesh, India. The Shiv Ling (the sacred stone form of Lord Shiva) in the Baijnath temple is believed to belong to 13th century, while some legends say it is probably more than thousand years old. As written in the foundation stone of the temple (shown in a Hindi documentary video of the temple in reference section below, at timeline 5:32), at the end of 16th century, the local inhabitants built a small mutt like mandhir and mandap (a type of small temple structure). Then after 300 years, in 1883, with the inspiration from British army Hindu officials, and financial help of British Commander Lt. Colonel C. Martin and other local people, 11000 rupees was donated for the renovation of the temple, making it large, and also building few other temples around it.

There is also another piece of writing on one of the pillars in middle of the temple suggesting that it was built (renovated) with the orders of C. Martin in 1883. The official website of Shajapur district in Madhya Pradesh (shajapur.nic.in), where this temple is located, also mentions about this story. It is said that when the British Commander Martin was in a war, his wife went to Baijnath mahadev temple and made a request for his returning. Then Martin successfully came back from the war, and thereafter a beautiful temple was constructed.

Our verification says that Agar is an ancient archaeological site, located 66 KMs from Ujjain, and was a Camp (Chhavani) in English period. And Lt. Colonel C. Martin was indeed the Commander of Central India Horse British regiment during the second Anglo-Afghan war between 1878-1880:

Commanded by Lt. Colonel C. Martin. The men of the Central India Horse (a wing each of the 1st and 2nd Regiments) crossed the frontier at Jamrud in February 1880 where they were then employed on the Khyber line of communications. In May a portion of the force was involved with the expedition against Mullah Khalil in the Besud Valley, before they were called to Kabul to join General Roberts’ force that was to march on Kandahar. They fought at the battle of Kandahar, including the pursuit of the retreating Afghans, and then returned to India in October.

The Baijnath Mahadev Temple is known to be powerful – for the Lord Shiva residing there shall fulfill the sincere wishes of all the people who pray and worship him. Not just thousands of Indians, many people from other countries also visit the temple quite often.

Conclusion 

Considering the aforementioned documented records and the beliefs about the power of the temple, we can conclude that such an incident could have possibly happened. So the Baijnath Mahadev Temple is the only Indian temple made by a Britisher during their rule in India.

There is this popular belief among Indians, especially Hindus, that God sometimes comes in human form (avatar or incarnation) to rescue his sincere devotees who are in trouble. One such example is the story of Bhadrachala Ramadasu (Kancherla Gopanna) who has been very keen and devoted towards Lord Rama that when he was jailed for using tax money to renovate the holy Rama temple at Bhadrachalam, both Rama and Lakshmana, in the guise of two youngsters paid up his dues to release him. Apart from the numerous songs of praise written by Ramadasu, the golden coins paid by Rama, known as Ram Tanka coins can be seen even today. You can read the detailed story from reference section below.






Saturday, 31 March 2018

పచ్‌మఢీ





చల్లటి ఒడి.. పచ్‌మఢీ

జగన్మోహినిని కట్టిపడేసిన జలపాతాలు.. పాండవులకు నీడనిచ్చిన గుహలు.. ఆంగ్లేయులను సైతం ఆహ్లాదపరచిన పచ్చదనం.. వేసవిలో చల్లదనాన్ని అందించే నెలవు.. మధ్యప్రదేశ్‌లోని పచ్‌మఢీ. సాత్పురా-వింధ్య పర్వత సానువుల్లో.. దట్టమైన అరణ్యంలో.. ఉన్న పచ్‌మఢీలో గుహలు.. జలపాతాలు.. కొండలు.. లోయలు.. ఎన్నెన్నో అందాలు.  వేసవి విడిదిగా పేరొందిన పచ్‌మఢీ విశేషాలివే...

బ్రిటిష్‌ పాలకులు పాలిస్తున్న రోజులవి. సెంట్రల్‌ ఇండియా ప్రావిన్స్‌లో అధికారిగా చేరాడు జేమ్స్‌ ఫార్సిథ్‌. సహజంగా ప్రకృతి ప్రేమికుడైన జేమ్స్‌ సాత్పుర-వింధ్య పర్వత పంక్తుల్లోని పచ్చదనం చూసి మైమరచిపోయాడు. రోజూ పరివారం సహా అడవుల బాట పట్టడం అతని పని. కొండలు, కోనలు విహరించేవాడు. అలా తిరుగుతుండగా.. ఒకరోజు ఆయనకు ఐదు గుహలు కనిపించాయి. వనవాస కాలంలో పంచ పాండవులు ఈ గుహల్లో నివసించారని అంటారు. పాంచ్‌ అంటే ఐదు అనీ, మఢీ అంటే గుహ అని అర్థం. వెరసి ఈ ప్రాంతానికి పాంచ్‌మఢీ అని పిలిచేవారు. కాలక్రమంలో ఆ పేరు కాస్తా పచ్‌మఢీగా స్థిరపడింది. పచ్‌మఢీలో పంచ పాండవుల గుహలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. గుహల్లోని బండలపై రంగులతో వేసిన చిత్తరువులు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ గుహలకు సమీపంలోనే పాంచాలి సరస్సు కూడా ఉంది. అయితే ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధారామంగా విలసిల్లిందని చెప్పేవాళ్లూ ఉన్నారు.

మహాదేవ శంకర..
పాండవ గుహలకు సమీపంలోని మరో గుహలో శివాలయం ఉంటుంది. దీనిని జటాశంకర గుహ అని పిలుస్తారు. భస్మాసురుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పరమ శివుడు ఈ గుహలోకి వచ్చి దాక్కున్నాడని స్థల పురాణం. గర్భాలయంలో సహజ సిద్ధంగా ఏర్పడిన 108 శివలింగాలు కనిపిస్తాయి. గుహలో గుప్త గంగ అనే కుండం కూడా ఉంది. అతి పురాతమైన ఈ ఆలయంలో ఏటా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. పాండవ గుహలకు కొంత దూరంలో మహాదేవ కొండ ఉంటుంది. కొండపై అరవై అడుగుల పొడవున్న గుహ ఉంది. దీనిని బడే మహదేవ్‌ గుహ అని పిలుస్తారు. విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి భస్మాసురుణ్ణి ఇక్కడే సంహరించారని చెబుతారు. గుహలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు దర్శనమిస్తాయి. మధ్యలో జలకుండం ఉంది. ఇందులోని జలాలు శివలింగాన్ని నిరంతరం అభిషేకిస్తుంటాయి.

రాజేంద్రగిరి
పచ్‌మఢీలో ఉన్న ప్రముఖ వ్యూపాయింట్లలో రాజేంద్రగిరి ఒకటి. ఇది సముద్రమట్టానికి మూడున్నరవేల అడుగుల ఎత్తులో ఉంటుంది. సూర్యాస్తమయాన్ని చూసేందుకు ఈ కొండపైకి వస్తుంటారు. ఇక్కడే అందమైన ఉద్యానవనం కూడా ఉంది. భారతదేశ తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ దీనిని సందర్శించడంతో.. ఈ కొండకు రాజేంద్రగిరి అని పేరు పెట్టారు. ఆనాడు రాష్ట్రపతి నాటిన మొక్క ఇప్పుడు మహావృక్షమై చరిత్రకు సాక్షిగా కనిపిస్తుంది. ఈ గిరిపైనే విడిది కేంద్రమైన రవిశంకర్‌ భవనం ఉంటుంది.

దూప్‌గఢ్‌
సాత్పుర పర్వత శ్రేణుల్లో అత్యంత ఎత్తయిన ప్రదేశం దూప్‌గఢ్‌ వ్యూ పాయింట్‌. 4,430 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతమంతా కనిపిస్తుంది. ఈ వ్యూ పాయింట్‌ నుంచి సూర్యోదయంతో పాటు సూర్యాస్తమయం కూడా చూడవచ్చు. పచ్‌మఢీలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇదీ ఒకటి.

వెండి జిలుగులు

పచ్‌మఢీ చుట్టుపక్కల సుందరమైన జలపాతాలు ఉన్నాయి. అందులో రజత్‌ ప్రతాప్‌ జలపాతం ప్రధానమైనది. 351 అడుగుల ఎత్తు నుంచి వేగంగా కిందికి దూకుతుంది. ఈ జలపాతంలో నీళ్లు వెండి వెలుగులు జిలుగుతాయి. దీనిని సిల్వర్‌ ఫాల్‌ అని కూడా అంటారు. జలపాతం కింద ప్రవాహం తక్కువే! పిల్లలు, పెద్దలు జలకాలాడేందుకు అనుకూలంగా ఉంటుంది. పచ్‌మఢీ అరణ్యంలో సాల వృక్షాలు, రావి, జువ్వి, వెదురు చెట్లు విస్తారంగా ఉన్నాయి. ఈ అడవి గుండా ప్రవహించే రజిత జలపాతం నీళ్లు ఎంతో స్వచ్ఛంగా, మరెన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
ఎప్పుడు అనుకూలం

దట్టమైన అడవిలో ఉన్న పచ్‌మఢీకి వేసవి విడిదిగా పేరుంది. ఈ సమయంలో ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 33-35 డిగ్రీల మధ్య నమోదవుతుంటాయి. వేసవిలో (ఏప్రిల్‌- జూన్‌) పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. నవంబర్‌-ఫిబ్రవరి వరకు శీతాకాల విహార కేంద్రంగానూ దీనికి మంచి పేరుంది.

బస: పచ్‌మఢీలో రెస్టారెంట్లు చాలానే ఉన్నాయి. బడ్జెట్‌ హోటల్స్‌ మొదలు రిసార్ట్స్‌ వరకు అన్ని రకాల ఆతిథ్యం లభిస్తుందిక్కడ. గదుల అద్దె రూ.1,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. దక్షిణాది ఆహారం దొరకడం కష్టమే. ఉత్తరాది వంటకాలు, చైనీస్‌ రుచులు అన్ని రెస్టారెంట్లలో లభిస్తాయి.
సాత్పురా కీ రాణి

పచ్‌మఢీని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలోనూ బ్రిటిష్‌ అధికారి ఫార్సిథ్‌ జేమ్స్‌ కీలక పాత్ర పోషించాడు. ఉన్నతాధికారులను ఒప్పించి పచ్‌మఢీని వేసవి విడిదిగా తీర్చిదిద్దాడు. సాత్పురా పర్వత శ్రేణుల్లోని కొండలు, జలపాతాలు, అడవుల వివరాలతో ‘ద హైల్యాండ్స్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఇండియా’ అనే పుస్తకం కూడా రాశాడు జేమ్స్‌. అందులో పచ్‌మఢీని ‘క్వీన్‌ ఆఫ్‌ సాత్పురా’ (సాత్పురా కీ రాణి) అని అభివర్ణించాడు. పచ్‌మఢీని ఆయన తొలిసారిగా గుర్తించిన ప్రదేశాన్ని ఫార్సిథ్‌ పాయింట్‌గా పిలుస్తారు. 1964లో ఇందిరాగాంధీ ఈ ప్రదేశానికి విచ్చేశారు. అప్పటి నుంచి దీనిని ‘ప్రియదర్శిని వ్యూ పాయింట్‌’ అని కూడా పిలుస్తున్నారు.
అప్సర విహార్‌

అప్సర విహార్‌ జలపాతంలో కేరింతలు కొట్టకుండా పచ్‌మఢీ విహారం పూర్తవ్వదు. దాదాపు 35 అడుగుల ఎత్తు నుంచి జలధారలు పడుతుంటాయి. రజిత జలపాతం నుంచి ప్రవహించే నీరే అప్సర విహార్‌లో కనువిందు చేస్తాయి. పాండవ గుహలకు ఈ జలపాతం కూత వేటు దూరంలో ఉంటుంది. భస్మాసురుణ్ని సంహరించిన తర్వాత మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఈ జలపాతంలో స్నానం చేశాడట. అందుకే అప్సర విహార్‌ను మోహినీ జలపాతం అని కూడా పిలుస్తారు. జలపాతం అందాలే కాదు.. చుట్టూ ప్రకృతి కూడా సమ్మోహనపరిచే విధంగా ఉంటుంది.
బీ ఫాల్‌

పచ్‌మఢీలో అందరినీ ఆకట్టుకునే మరో జలపాతం బీ ఫాల్‌. దీనిని జమునా ప్రతాప్‌ జలపాతం అంటారు. 150 అడుగుల ఎత్తు నుంచి ఏటవాలు కొండ మీదుగా జలప్రవాహం కొనసాగుతుంది. పర్యాటకులు జలకాలాడేందుకు వీలుగా ఉంటుంది బీ ఫాల్‌. ఈ జలపాతం నుంచే పచ్‌మఢీవాసులకు తాగునీరు సరఫరా అవుతుంది.
ఎలా వెళ్లాలి?

విమానయానం
* భోపాల్‌ నుంచి పచ్‌మఢీకి 195 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్‌ ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి భోపాల్‌కు సింగిల్‌ స్టాప్‌ విమాన సర్వీసులు ఉన్నాయి.
రైలు మార్గం
* హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నుంచి భోపాల్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. భోపాల్‌ నుంచి పచ్‌మఢీకి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది.
* పచ్‌మఢీకి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్‌ పిపరియా. ఇక్కడి నుంచి పచ్‌మఢీకి 55 కిలోమీటర్లు.
* సికింద్రాబాద్‌, విజయవాడ నుంచి పిపరియాకు రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి పచ్‌మఢీకి బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లాలి.

Sunday, 21 May 2017

మాహిష్మతి









మాహిష్మతి సామ్రాజ్యం భారత్‌లో ఎక్కడుంది?



బాహుబలి సామ్రాజ్యం మాహిష్మతి. బాహుబలి సినిమా చూసిన చాలా మందికి అది ఓ కల్పిత రాజ్యం. కానీ, ఆ రాజ్యం నిజంగానే ఉందన్న విషయం తెలుసా? అది నిజమైన రాజ్యం అని తెలిసిన వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారేమో. భారత్‌లో ఒకప్పుడు మాహిష్మతి అనే సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు ఆ మాహిష్మతి సామ్రాజ్యమే మహేశ్వర్ అనే పట్టణంగా రూపాంతరం చెందింది. మరి, ఆ పట్టణం ఎక్కడుంది? అసలు మాహిష్మతి సామ్రాజ్యాన్ని స్థాపించిందెవరు..?

మధ్య భారతంలో..
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే జిల్లాలో ఉంది ఆనాటి మాహిష్మతి..నేటి మహేశ్వర్. ఇండోర్ నుంచి 91 కిలోమీటర్లు, ఆగ్రా-ముంబై హైవేకి తూర్పున 13 కిలోమీటర్ల దూరంలో ఉంది మహేశ్వర్. నర్మదా నది ఒడ్డును కొలువుదీరింది మహేశ్వర్ నగరం. మరాఠా హోల్కర్ సంస్థానంలో 1818 జనవరి 6 వరకు మాల్వాకు రాజధానిగా కొనసాగింది. మాహిష్మతి నగరాన్ని కార్తవీర్య అర్జున ఈ నగరాన్ని నిర్మించాడని, దానినే రాజధానిగా చేసుకుని పాలించాడని ప్రతీతి. రామాయణ, మహాభారతాల్లోనూ మాహిష్మతి ప్రస్తావనకు రావడం విశేషం. ఓ సారి కార్తవీర్య అర్జున తన 500 మంది భార్యలతో నర్మదా నదీ తీరానికి వెళతాడట. అప్పుడు అతడి ఆ 500 మంది భార్యలు తమకు చాలా పెద్ద ప్లే గ్రౌండ్ కావాలని అడగడంతో.. కార్తవీర్య అర్జున తన 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటాడట. అప్పుడే అటుగా పుష్పక విమానంలో వెళుతున్న రావణుడు.. శివలింగార్చనకు అదే అనువైన ప్రదేశం అనుకుని అక్కడ దిగుతాడట. ఆంధ్ర మహాభారతం, సభాపర్వంలోనూ మాహిష్మతికి సంబంధించిన ప్రస్తావన వస్తుందట.

రాజమాత
ఇక, 18వ శతాబ్దంలో రాజమాత అహల్య భాయ్ హోల్కర్ తన భర్త మరణానంతరం నర్మదా నదీ తీరాన గల మాహిష్మతి సామ్రాజ్యాన్ని రాజధానిగా చేసుకుని మాల్వా దేశాన్ని పరిపాలించిందని చెబుతారు. ఇక, శివభక్తురాలైన అహల్యాదేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించిందని ప్రతీతి. ఆమె పాలనాకాలంలో నిర్మించిన, ఆమె నివసించిన కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా పదిలంగా ఉంది. ఇక, బాహుబలిలోని కోటలు.. అచ్చంగా మహేశ్వర్‌లోని కోటల తరహాలోనే ఉండడం విశేషమే మరి. అంతేకాదు.. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్‌నూ మహేశ్వర్ కోటల్లో తీయడం విశేషం.



Saturday, 18 March 2017

మహేశ్వర్









మహేశ్వర్
మహాశివుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం





మహేశ్వర్.. మహాశివుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఆయన వెలిసిన ప్రాంతం కాబట్టే దీనికి ‘మహేశ్వర్’ అనే పేరు వచ్చింది. ఎంతో పురాతనమైన ఈ ప్రదేశం.. ప్రాచీనకాలం నుంచి ప్రజలకు తీర్థయాత్రా ప్రదేశంగా వుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున వున్న ఈ అందమైన ప్రదేశం.. పూర్వ సంస్కృతికి ప్రతిబింబం. ప్రస్తుతం ప్రముఖ పర్యాటక నగరంగా పేర్కొనబడుతున్న ఈ ప్రదేశం.. చేనేత వస్త్రాలకు చాలా ప్రసిద్ధి చెందింది.

మహేశ్వర్ లో వున్న నర్మదా నదిలో స్నానం ఆచరిస్తే.. శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పురాతన కాలం నుంచి ఇలా స్నానం చేయడం ఆచారంగా వుంది. ఈ ప్రాంతంలో ఎన్నో ఆలయాలు వున్నాయి. ఇక్కడున్న ఈ ఆలయాలన్నింటినీ హోల్కర్‌ వంశ రాణి రాజమాత అహల్యా దేవిబాయి నిర్మించింది. అంతేకాదు.. మహేశ్వర్‌ లో కోటలతోపాటు భవంతులు, ధర్మసత్రాలను కూడా కట్టించింది. నర్మదా నది ఒడ్డున భక్తులు స్నానం చేసేందుకు వీలుగా పీష్వా, ఫాన్సే, అహల్యా ఘాట్లను రాణి అహల్యా ఏర్పాటుచేసింది. ఈ ప్రదేశంలో వున్న కొన్ని సుప్రసిద్ధ స్థలాల గురించి మాట్లాడుకుంటే..

అహల్యా కోట : దీనినే ‘హోల్కర్ కోట’ లేదా మహేశ్వర్ కోట అని పిలుస్తారు. ఈ కోటను 18వ శతాబ్ధంలో నర్మదా నది ఒడ్డున వున్న కొండపై రాణి అహల్యా దేవి కాలంలో నిర్మించారు. ఈ పురాతన కోటలో శివుడి అవతారాలకు అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి. వాస్తు పరంగా భిన్నంగా వుండే ఈ కోటలోని శిల్పాలు చాలా అందమైనవి.

జలేశ్వర్ దేవాలయం : పరమశివుడికి అంకితమైన ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయంలోని దేవతకు ‘నీటి దేవుడు’గా పూజలు జరుపుతారు. ఈ ఆలయంలోని శివలింగాలు కూడా చాలా కాలం నుంచి పూజలు అందుకుంటున్నాయి. ఈ ఆలయ నిర్మాణకళ మహోన్నత స్తంభాలతో నిస్సందేహంగా ఆదర్శప్రాయంగా నిలిచింది.

కాశీ విశ్వనాధ్ ఆలయం : జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడింది. ఇక్కడున్న జ్యోతిర్లింగాలని భక్తులు పూజించి, ప్రార్థనలు జరిపితే, వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోని జ్యోతిర్లింగ దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. వందల కొద్ది ప్రజలు ప్రతిరోజూ దర్శిస్తుంటారు.

మహేశ్వర్ ఘాట్స్ : నర్మదా నది తీరాన ఉన్న మహేశ్వర్ ఘాట్స్ ఎన్నడూ ఖాళీగా ఉండవు. ఈ ఘాట్స్ ఒడ్డున, అనేక శివాలయాలు ఉండటం వలన, ఇక్కడి వాతావరణం భక్తితో నిండి ఉంటుంది. ఈ ఘాట్స్ అనేక స్మారక చిహ్నాలను వర్ణిస్తున్న కొన్ని అసాధారణ రాతి శిల్పాలను కలిగి ఉన్నాయి.


Wednesday, 22 February 2017

జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్‌!







జ్యోతిర్లింగాల క్షేత్రం ఓంకారేశ్వర్‌!



నర్మదానది నీటి పరవళ్లలో అల్లనల్లన తేలియాడుతూ వచ్చే చల్లని గాలి ఓంకార నాదం చేస్తూ హృదయంలో భక్తిరసాన్ని తట్టిలేపుతుంది. వింధ్య పర్వత సోయగాల వీక్షణతోనే మనసు శివపంచాక్షరి స్తోత్రాన్ని జపించడంలో మునిగిపోతుంది.

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై న కారాయ నమఃశివాయ...
అంటూ స్వామిని స్తుతిస్తూ ఓంకారేశ్వరుని ఆలయానికి చేరుకుందాం.

నర్మద, కావేరీ సంగమ క్షేత్రం ఓంకారేశ్వర్‌. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమాన్వితమైన రెండు జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వర్‌లోనే ఉండటం ఈ ప్రాంత విశిష్టత. మన దేశంలోని మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌ పట్టణానికి 77 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్‌. కాషాయ దుస్తులు ధరించిన సాధువులు, గంభీరంగా సాగే నర్మదానది, అక్కడి ఘాట్లలో భక్తుల సందడి.. చూడగానే మనసుకు కాశీ క్షేత్రం తలపుకు రాకుండా ఉండదు. అందుకే ఈ పట్టణాన్ని చిన్న కాశీ అని కూడా అంటారు. నర్మదానది ఒడ్డునే ఓంకార రూపంలో వింధ్యపర్వతం ఉంది. ఈ పర్వతం ఓంకార రూపంలో ఉండటంతో స్వామికి ఓంకారేశ్వరుడు అని, స్వామి పేరుమీదుగానే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర్‌ అని పేరు వచ్చింది.

గిరి పరిక్రమ ఫలితం ఎంతెంతో!
ఇక్కడ నర్మదా నది స్వామి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉండటం విశేషం. అందుకే భక్తులు కూడా నదికి, స్వామికి పరిక్రమను పూర్తి చేసి, స్వామి కృపకు పాత్రులవుతారు. ఓంకారగిరి ప్రదక్షిణ కైలాసపర్వతాన్ని చుట్టి వచ్చిన ఫలితం ఇస్తుందని, జన్మజన్మల సుకృతంగా భావిస్తారు భక్తులు. ఏడు కిలోమీటర్ల ఈ గిరి పరిక్రమకు మొత్తం నాల్గు గంటల సమయం పడుతుంది. ఈ పరిక్రమలో ముందుగా ‘పంచముఖ గణనా«థుడి’ని దర్శించుకుంటాం. ఈ గణనాథుడిని మాంధాత మహర్షి ప్రతిష్టించాడని ఐతిహ్యం. ఇక్కడ నుంచి మార్గమధ్యంలో అతిపురాతనమైన ‘ఖేరాపతి హనుమాన్‌’ ఆలయం చేరుకుంటాం.

దీనికి సమీపంలోనే కేదారేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ స్వామి లింగరూపంలో కొలువై పూజలు అందుకుంటున్నాడు. ఈ ప్రదేశంలోనే నర్మదా నదిలో రాళ్ల మీద రాళ్లు అంతస్తులుగా పేర్చి కనిపిస్తాయి. సొంతంటి ఇల్లు కల నెరవేరాలని భక్తులు ఈ రాళ్లు పేర్చి మొక్కుకుంటారు. అక్కడ నుంచి మరికొంత ముందుకు వెళితే ‘రుణముక్తేశ్వర స్వామి’ని ఆలయాన్ని చేరుకుంటాం. ఇక్కడ స్వామి వారికి శనగలు సమర్పిస్తే రుణ విముక్తులు అవుతారని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే సుందర రాధాకృష్ణుల మందిరం, గౌరీ సోమనాథుల ఆలయాలు ఉన్నాయి. ‘లాలాహనుమాన్‌ దేవాలయం’లో స్వామి శయనరూపంలో కనిపించడం విశేషం.

అనంతరం భక్తులు ఆశాదేవి ఆలయం చేరుకుంటారు. ఈ మార్గంలోనే ఆఖరుగా గౌరీనా«ద్‌ ఆలయం దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి అత్యంత సమీపంలో ఓంకారేశ్వర్‌ మందిరం ఉంటుంది. గిరి ప్రదక్షిణ పూర్తిచేసిన భక్తులు స్వామి ఆలయానికి చేరుకుంటారు. దర్శనమాత్రం చేతనే భక్తులకు అషై్టర్యాలను ప్రసాదించే పరమేశ్వరుడు నాగాభరణ ధారిగా దర్శనమిస్తాడు. ఈ ప్రధాన ఆలయంలోనే త్రిశుద్ధనాథ్, వైద్యనాథ్, మహాకాలేశ్వర్, కేదారినాథ్, గుప్తనాథ్‌ అనే ఐదు ఉప ఆలయాలూ ఉన్నాయి. ఈ ఐదు ఆలయాలను పంచలింగ ధామాలుగా వ్యవహరిస్తారు.

వింధ్య తపస్సు మెచ్చిన ఈశ్వరుడు
దేశంలోని పర్వతాలలో మేరు పర్వతం, వింధ్య పర్వతం అత్యంత ఎల్తైనవిగా పేరుపొందాయి. కలహభోజనుడైన నారదుడు ఒక రోజు వింధ్య పర్వతం వద్దకు వచ్చి మేరు పర్వతాన్ని విశేషంగా ప్రశింసించాడట. దీంతో వింధ్యకు కోపం, అసూయ కలిగి తాను మేరు పర్వతం కంటే మించి పోవాలనే సంకల్పంతో శివుని ప్రార్థిస్తూ తపస్సు చేసిందట. శివుడు ప్రత్యక్షమై, నీ మనసులోని కోరిక సిద్ధిస్తుందని పలికాడట. శివుడు వింధ్యకు దర్శనం ఇచ్చినప్పుడు పలువురు మహర్షులు అక్కడికి వచ్చి శివుని దర్శించి, అతడు ఇదే స్థలంలో నిలిచిపోవాలని కోరారట. దీంతో శివుడు వింధ్య పర్వతం మీదనే కొలువుదీరాడట.

శివుని వరంతో వింధ్య రెచ్చిపోయి విపరీతంగా పెరగసాగిందట. వింధ్య ఎత్తు సూర్యచంద్రులకు కూడా ఆటంకం కలిగించిందట. వింధ్య ఎత్తు వల్ల కలిగిన ఉపద్రవాన్ని అరికట్టాలని దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు దేవతల మొర విని వింధ్య సమస్య పరిష్కారానికి అగస్త్యమునిని ప్రార్థించమని సూచించాడట. కాశీలో ఉన్న అగస్త్యుని దేవతలు కలుసుకొని వింధ్య వల్ల ఎదురవుతున్న సమస్యను వివరించి కాపాడమని అర్థించడంతో అగస్త్యుడు వింధ్య పర్వతం సమీపించి తాను దక్షిణాదికి వెడుతున్నానని,

నీ ఎత్తు ఎక్కువగా ఉన్నందున ఎక్కజాలనని, ఇదివరకటి ఎత్తుకు చేరుకోమని కోరడంతో మహర్షి మాట కాదనడానికి వీలులేదు కనుక వింధ్య సాధారణ ఎత్తుకు తగ్గిపోయిందట. అగస్త్యుడు పర్వతం దాటి వెడుతూ తాను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండాలని కోరి ముందుకు వెళ్లాడట. అయితే అతడు తిరిగి ఉత్తరాదికి రాకుండా శ్రీశైలంలో నిలిచిపోయాడట. మహర్షులు దేవతల ప్రార్థనపై వెలసిన శివలింగాన్ని రెండు భాగాలుగా విభజించగా వాటిలో ఒక భాగం ఓంకారేశ్వరుడుగా మరో భాగం అమలేశ్వరుడిగా వెలిశారు. ఈ రెండు జ్యోతిర్లింగాలను దర్శించినంతనే తమ జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు.

అలంకారంగా శయనహారతి
ఓంకారేశ్వర్‌లో స్వామికి నిత్యం అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ప్రతిరోజూ శయన అలంకార హారతి కనులారా వీక్షించాల్సిందే. శ్రావణమాసంలో తిరునాళ్లు, కార్తికమాసంలో ప్రత్యేక ఉత్సవాలు, మాఘమాసంలో మహా శివరాత్రి వేడుకలు ఇక్కడ ఘనంగా జరుగు తాయి. ఇక శ్రావణమాసంలో జరిగే శ్రావణ మేళా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకో దగింది. ఒక పడవలో ఓంకారేశ్వరుడు, మరో పడవలో మమలేశ్వరుడు నర్మదానదిలో మేళ తాళాల నడుమన జలవిహారం చేస్తారు. నది మధ్యలో ఒక చోట కలిసి, ఒకరి చుట్టూ ఒకరు ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తారు. శ్రావణ మాసంలో ఆఖరి సోమవారం జరిగే ఈ వేడుకను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.

ఆధునికత అంటని వాతావరణం
ఓంకారేశ్వర్‌లో పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ స్థానిక సంస్కృతికి ఏమాత్రం విఘాతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. ఇక్కడి గిరిపుత్రుల అమాయకత్వం, ప్రశాంత వాతావరణం, ప్రజల సామాన్య జీవనస్థితిగతులను చూస్తే నాగరికత ఇక్కడి మనిషినీ, ప్రకృతిని ఇంకా స్పృశించలేదని స్పష్టం అవుతుంది. ఎంతో కళాత్మకంగా ఉండే ఈ పట్టణంలో మహిళలు కొండల మీద పూచే పువ్వులను కోసుకొచ్చి శివారాధనకు తెచ్చి అమ్ముతుంటారు. విభిన్నరకాలుగా ఉండే ఆ పువ్వుల పరిమళం మన మనసులో ఆధ్యాత్మిక పరమళాలను వెదజల్లుతుంది. హనుమాన్‌ మూర్తి రంగు వస్త్రధారణలో సాధువులు కనిపిస్తారు. నిలువ నీడలేని భిక్షకులు దేశం అంతటా కనిపిస్తారు. అయితే, ఇక్కడ మాత్రం దారికి అడ్డం పడకుండా ఒక సేవకు ఎదురుచూపులా కనిపిస్తారు భిక్షకులు. మౌనంగా అతిథులు ఇచ్చిన దానిని కళ్లకు అద్దుకుని భగవద్‌కృపగా తీసుకుంటారు. తీర్థయాత్రలు చేయడం అంటే ఆపన్నులకు సాయం చేయడమే అనేది ఇక్కడ చూసి నేర్చుకోవచ్చు.

స్వామి దర్శనం
ప్రతి రోజు ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామిని దర్శించుకోవచ్చు. ఈ పట్టణంలో బస చేయడానికి ధర్మశాలలు, సత్రాలు, వివిధ ట్రస్ట్‌ల గెస్ట్‌ హౌస్‌లు ఉన్నాయి.

ఓంకారేశ్వర్‌కు దారి
ఇండోర్‌ నుంచి ఓంకారేశ్వర్‌ 77 కిలోమీటర్లు. ఇండోర్‌లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఉజ్జయిని నుంచి 133, హైదరాబాద్‌ నుంచి 772 కిలోమీటర్ల దూరంలో ఉంది ఓంకారేశ్వర్‌. హైదరాబాద్‌ నుంచి ఓంకారేశ్వర్‌కు నేరుగా రైలు మార్గం లేదు. భోపాల్‌ లేదా ఇండోర్‌ వెళ్లి అక్కడ నుంచి ఓంకారేశ్వర్‌ చేరుకోవాలి.

– నిర్మలారెడ్డి చిల్కమర్రి



Tuesday, 27 December 2016

మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌... మహిష్మతి








మహిష్మతి
మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌


మహిష్మతి రాజ్యాన్ని ‘బాహుబలి’ సినిమాలో చూసి ఉంటారు. ఆ పేరున్న పట్టణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కి వెళ్లాలి. నగిషీలు చెక్కిన ప్రాకారాలు, ఠీవీగా నిల్చున్న కోటగోడలు చుట్టూ ఉండగా మధ్యన నందీశ్వరుడితో సహా కొలువుదీరాడు మహేశ్వరుడు. నిత్యం శివార్చనతో ప్రశాంతమైన నర్మదానది ప్రణమిల్లగా మన అంతఃచేతనంలో పరవశాలను నింపుతూ దర్శనమిస్తాడు మహేశ్వరుడు. ఆయన పేరు మీదుగానే ‘మహేశ్వర్‌’ అని పట్టణ నామం స్థిరపడింది. అలా అక్కడ భక్తులకు అనంతమైన ఆశీస్సులను మహేశ్వరుడు అందిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖార్గోన్‌ జిల్లాలో ఉందీ మహేశ్వర్‌ పట్టణం. ఆగ్రా–ముంబై వెళ్లే 3వ నెంబర్‌ జాతీయ రహదారికి కేవలం 13 కిలోమీటర్లు, ఇండోర్‌ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణానికి లెక్కలకందని విశిష్టతలెన్నో ఉన్నాయి.

శరీరానికి హృదయం దేవాలయం ఎలాగో సుసంపన్నమైన మహేశ్వర్‌ కోటకు హృదయం మహేశ్వరుడి మందిరం. ఈ కోట అహిల్యాబాయి హోల్కర్‌ కోటగా కూడా ప్రసిద్ధి. 18వ శతాబ్దిలో మరాఠా రాణి, రాజమాత అహిల్యా బాయి హోల్కర్‌ తన భర్త మరణా నంతరం మహేశ్వర్‌ ఆలయాన్ని నడిబొడ్డుగా చేసుకొని దుర్భేద్యమైన కోటను నిర్మించారు. ఇక్కడ నుంచే మాళవ (మాల్వా) దేశాన్ని ఆమె పరిపాలించారు. శివ భక్తురాలైన అహిల్యా దేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు. వాటిలో గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్, కాశీ విశ్వనాథ్‌ మందిరం, ఉజ్జయిని, నాసిక్, విష్ణుపాద మందిర్, గయ.. ఆలయాల లాంటివి ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు నర్మదానది ఒడ్డున ఎన్నో దేవాలయాలు, ఘాట్లను నిర్మింపజేశారు. నర్మదానది ఒడ్డున నిల్చుని అహిల్యాబాయి కోట ఘాట్లను వీక్షిస్తుంటే ప్రసిద్ధ చిత్రకారుడు కాన్వాస్‌ మీద అందమైన చిత్రాలను తీర్చిదిద్దినట్టుగా దర్శనమిస్తుంది ఈ ప్రాంతం.

రామాయణ కాలం నాటి సామ్రాజ్యం
మహేశ్వర్‌ ప్రాచీన నామం మహిష్మతి. రామాయణ, మహాభారతాలలో ఈ మహిష్మతి సామ్రాజ్య ప్రస్తావన ఉంది. అంటే, రామాయణ కాలం నాటి కన్నా ముందే ఈ రాజ్యం ఉందన్నమాట. నర్మదా నదికి సమీపంలో ఉన్న సహస్రార్జున మందిరాన్ని సందర్శిస్తే అలనాటి విశేషాలు కళ్లకు కడతాయి. గోపురాలు నాటి కథలు చెబుతాయి. ఈ ప్రాచీన పట్టణాన్ని సోమవంశ సహస్రార్జున క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకొని, పరిపాలించేవాడు. ఇతడినే శ్రీ సహస్రార్జున అనేవారు. ఇతని గురించి మన ఇతిహాసాలలో గొప్ప ప్రస్తావన ఉంది.

ఒక రోజు సహస్రార్జునుడు తన 500 మంది భార్యలతో నదీ తీరానికి వాహ్యాళికి వెళ్లాడట. అయితే, 500 మంది భార్యలు ఉల్లాసంగా ఆడుకోవడానికి అనువైన ప్రాంతం కనిపించక, ప్రవహించే పవిత్ర నర్మదానదిని తన వెయ్యి బాహువులతో నిలువరించాడట. విశాలమైన ఆ నర్మదానదీ మైదానంలో అందరూ ఆనందంగా విహరిస్తున్న సమయంలో రావణాసురుడు ఆకాశమార్గాన పుష్పకవిమానంలో వెళుతూ, ఈ ప్రాంతంలో దిగాడట. నదీ మైదానం విశాలంగా కనిపించడంతో ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి, పూజలు ప్రారంభించాడట. సహస్రార్జునుడి భార్యలు ఆటలు ముగించి, నది ఒడ్డుకు చేరుకోవడంతో అతను నెమ్మదిగా నీటిని విడుదల చేశాడట.

ఇప్పటికీ అవే 11 అఖండ దీపాలు
దీంతో రావణుడు ప్రతిష్ఠించిన ఇసుక శివలింగాన్ని నర్మదానది నీరు తుడిచిపెట్టేసుకుంటూ వెళ్ళింది. రావణుడు ఆగ్రహించాడు. సహస్రార్జునుడితో యుద్ధానికి దిగాడట. çసహస్రార్జునుడు తన వెయ్యి బాహువులతో రావణుడిని ఓడించి, అతడిని కట్టేసి, పది తలల మీద పది దీపాలు, కట్టేసిన రెండు చేతుల మధ్య మరో దీపం ఉంచి తన ఇంటికి బందీగా తీసుకెళ్లాడు. తన కొడుకు ఊయలను రావణాసురుడితో ఊపించి, ఆ తర్వాత వదిలేశాడట. ఇప్పటికీ మహేశ్వర్‌లోని సహస్రార్జున దేవాలయంలో 11 అఖండ దీపాలు నాటి నుంచి నేటి వరకు వెలుగుతూనే ఉండటం విశేషం.

అలాగే, అగ్నిదేవుని కృప ఈ పట్టణానికి రక్షగా ఉందని ఎన్నో కథనాలున్నాయి. సహస్రార్జునుడి తదనంతరం నిషాద రాజ్యం రాజు నిల మహిష్మతి రాజ్యాన్ని చేజిక్కించుకుని పరిపాలించాడు. కురుక్షేత్రయుద్ధం ముగిశాక ధర్మరాజు రాజయ్యాడు. భూమినంతా జయించడానికి యాగాన్ని ప్రారంభించాడు. అంతా ఆక్రమించుకున్నా, మహిష్మతి మాత్రం వీరి హస్తగతం కాలేదు. ధర్మరాజు తమ్ముడు సహదేవుడు అగ్నిదేవుడి రక్షణ వల్లే మహిష్మతి తమ హస్తగతం కావడం లేదని గుర్తించాడు. అగ్నిని ప్రసన్నం చేసుకుని, మహిష్మతిని తమ రాజ్యంలో కలిపేసుకున్నారు పాండవులు. అలా ఆర్యావర్తంలో మహిష్మతి ఈశ్వరుడి నామంతో మహేశ్వర్‌గా రూపుమార్చుకుంది.

దేవాలయాల రాజ్యం
సహస్రార్జునుడి మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. కాగా ఈ ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వర మందిరం, కాశీ విశ్వనాథ, చతుర్భుజి నారాయణ, అహిల్యామాత, చింతామణి గణపతి, పండరినాథ్, భవానీ మాత, గోబర్‌ గణేశ్, అనంత్‌నారాయణ, ఖేడాపతి హనుమాన్, రామ– కృష్ణ, నర్సింగ్, కాళేశ్వర, జ్వాలేశ్వర మందిరాలున్నాయి. బాణేశ్వర్‌ శివ మందిరం నర్మదానది మధ్యలో ఉంటుంది. దీని వల్ల ఈ మందిరం ఓ ద్వీపంలో ఉన్నట్టు గోచరిస్తుంది.

వింధ్యవాసినీ శక్తిపీఠం
మహేశ్వర్‌లోని వింధ్యవాసినీ భవాని శక్తిపీఠాలలో ఒకటి అంటారు. ఏక్‌ ముఖి దత్త మందిరాన్ని ఇక్కడ కొత్తగా నిర్మించారు. దీన్ని శివదత్త ధామంగా పిలుస్తారు. 30 ఎకరాలలో సువిశాలంగా నిర్మించారు. జగద్గురు కృపాళూజీ మహారాజ్‌ వేవేల విధాలుగా మహేశ్వర్‌ దేవాలయాన్ని కీర్తిస్తూ అఖండ సంకీర్తనల్ని వెలువరించారు. జీవితమంతా మహేశ్వర్‌లోనే ఉన్నారు.

ఉత్సవాల కోలాహలం
అహిల్యాబాయి కోటలో కొంత భాగాన్ని ప్రాచీన హోటల్‌గా మార్చారు. మహేశ్వర్‌లో నాగపంచమి, గుడి పడవా, తీజ్, శ్రావణమాసంలో అన్ని సోమవారాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. చివరి సోమవారం మాత్రం కాశీవిశ్వనాథుని పూజ జరిపి భంగు (గంజాయి) ప్రసాదంగా పంచుతారు. మహాశివరాత్రి, సమోటి అమావాస్య, ఇతర అన్ని పండగలు విశేషంగా జరుపుతారు. ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం మహేశ్వర్‌లోని స్వాధ్యాయ భవన్‌ ఆశ్రమం మహా మృత్యుంజయ రథయాత్రను ప్రారంభిస్తుంది.

సినిమాలలో మహేశ్వర్‌!
నర్మద నదీ తీరప్రాంతమంతటా ఎన్నో ప్రకృతి అందాలు కొలువుదీరాయి. వీటిలో మహేశ్వర్‌లోని కోట ఘాట్లు, ప్రాకారాలు ప్రత్యేకమైనవి. ఈ కోట లోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలో తరచూ హిందీ, తమిళ, కన్నడ సినిమాల చిత్రీకరణ జరుగుతుంటుంది. వీటిలో ప్రముఖంగా ఎ.ఆర్‌.రెహ్మాన్‌ మ్యూజిక్‌ వీడియో, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘నీర్జా’ సినిమాలు, చారిత్రక టీవీ సీరియల్స్‌ ఇక్కడే చిత్రీకరించారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడి వాతావరణం చలిగా, పొడిగా సందర్శనకు అనుకూలంగా ఉంటుంది.

దేశీయ చేనేత... మహేశ్వరి చీరలు
మహేశ్వర్‌ 5వ శతాబ్ది నుంచి చేనేతకు ప్రసిద్ధి గాంచింది. దేశంలోని చేనేతలలో ఉత్తమమైన వస్త్రంగా పేరొందింది. మహేశ్వర్‌ దేవాలయాన్ని సందర్శించి, విశేషాలు తెలుసుకోవడం ఒక ఎల్తైతే, ఆ పట్టణానికి మరో ప్రత్యేకత – రంగురంగుల మహేశ్వరి చీరలు. ఇవి కాటన్, పట్టులో లభిస్తాయి. చారలు, పువ్వుల అంచులతో చూడగానే ఆకట్టుకుంటాయి ఈ చీరలు.

మధ్యప్రదేశ్‌ టూరిజమ్‌ హనుమాంతియాలోని నర్మదానది డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌లో ‘జల్‌ మహోత్సవ్‌’ పేరుతో రెండేళ్లుగా డిసెంబర్‌–జనవరి నెలల్లో ఉత్సవాలు జరుపుతోంది. ఈ సందర్భంగా హనుమాంతియాలోని టూరిస్ట్‌ కాంప్లెక్స్, మహేశ్వర్, ఓంకారేశ్వర్‌ల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది.

వివరాలకు: మధ్యప్రదేశ్‌ టూరిజమ్, టూరిస్ట్‌ ప్లాజా, బేగంపేట, హైదరాబాద్‌. 9866069000 / 9951080605లలో సంప్రతించవచ్చు.

ఇలా వెళ్లచ్చు!
హైదరాబాద్‌ నాంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్‌ల నుంచి మ«ధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు రైలు సదుపాయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కు 120 కిలోమీటర్లు. రోడ్డుమార్గంలో వెళ్లడానికి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
ఇండోర్‌లో దేవీ అహిల్యాబాయి హోల్కర్‌ పేరున అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కి 95 కిలోమీటర్లు.

–  నిర్మల చిల్కమర్రి



Monday, 29 August 2016

ఐదు ద్వారకలు








ఐదు ద్వారకలు



‘‘మధ్యప్రదేశ్‌ నర్మదాతీరంలోని ఓంకారేశ్వరుణ్ణీ ఉజ్జయినీ మహంకాళేశ్వరుణ్నీ రాజస్థాన్‌లోని చారిత్రక కోటల్నీ గుజరాత్‌లో కృష్ణభగవానుడు నడయాడిన ప్రదేశాలనూ ముఖ్యంగా పంచద్వారకలుగా చెప్పే ఐదు శ్రీకృష్ణ మందిరాల్నీ ఏకకాలంలో చూసొచ్చా’మంటూ ఆయా విశేషాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన మాఢభూషి అరవిందవల్లి.



పంచద్వారకలైన మూల ద్వారక, బెట్‌ద్వారక, శ్రీనాథ్‌ద్వారక, కాంక్రోలి ద్వారక, డాకోర్‌ ద్వారకలకు వెళ్లాలని ఆలోచన. ఒకరోజు ఓ ప్రకటనలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాల ఇరవై రోజుల యాత్ర గురించి చదివి వెంటనే టిక్కెట్లు తీసుకున్నాం. బెంగళూరు నుంచి దిల్లీ Sampark Kranti Expressలో బయలుదేరి రాత్రి 11.30కి భోపాల్‌కి చేరుకున్నాం. ఒకే కుటుంబానికి చెందిన 25 మంది మాతోపాటు వచ్చారు. మా టూర్‌ ఆపరేటరు మరో 8 మందితోనూ వంటవాళ్లతోనూ సామాన్లతో ముందే భోపాల్‌ చేరుకుని మా అందర్నీ బస్సులో ఉజ్జయినీకి తీసుకెళ్లారు. తెల్లవారుజామున 4 గంటలకు ఉజ్జయినీకి చేరుకున్నాం.

భస్మ దర్శనం!
ఉదయం ఎనిమిది గంటలకే స్నానపానాదులూ కాఫీటిఫిన్లూ కానిచ్చి మర్నాడు మహాకాళేశ్వరుని భూరిదర్శనంకోసం మా గుర్తింపుకార్డులతో గుడిదగ్గర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. రోజుకి 300 మందిని మాత్రమే ఆ దర్శనానికి అనుమతిస్తారు. అక్కణ్ణించి ఓంకారేశ్వరుణ్ణి చూడ్డానికి బస్సులో ఇండోర్‌ మీదుగా వెళ్లాం. ఘాట్‌రోడ్డు ప్రయాణం ఆహ్లాదకరంగా అనిపించింది. సాయంత్రం నాలుగుగంటలకు ఓంకారేశ్వరుడి దర్శనానికి వెళ్లాం. అభిషేకాలు చేయించుకుని తిరిగి బస్సులో ఉజ్జయినీకి ప్రయాణమయ్యాం. రాత్రి పదకొండు గంటలకు ఉజ్జయినీకి వెళ్లాం. కానీ రెండు గంటలకే లేచి మహాకాళేశ్వరుని దర్శనం కోసం క్యూలో నిలబడ్డాం. అప్పటికే చాలామంది ఉన్నారు. నాలుగు గంటలకు దర్శనం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ శివలింగాన్ని అభిషేకించవచ్చు. జలాభిషేకం తరవాత అందర్నీ మూలవిగ్రహానికి ఎదురుగా పెద్ద హాలులో కూర్చోబెట్టి పంచామృత అభిషేకం చేసి తిరిగి నీటితో శుద్ధి చేసి లింగాన్ని వెన్నా పూలూ పండ్లతో అలంకరించి భూరి (కొన్ని గంటల ముందు కాల్చిన శవం తాలూకూ భస్మం)తో అభిషేకం చేస్తారు. ఈ సేవను స్త్రీలు చూడకూడదని ముఖంమీద కొంగు కప్పుకోమని చెబుతారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ చప్పట్లూ వాద్యాలూ తాళాలూ ఢమరుక ధ్వనులూ హరహరమహాదేవ అనే నినాదాలతో దద్దరిల్లిపోతుంది. ఆ అనుభూతిని వర్ణించలేం.

రాజస్థాన్‌లో...
తరవాత ఉజ్జయినీలో ఉండే మహంకాళి, భైరవస్వామి, విష్ణాలయాలు అన్నీ చూసుకుని ఆ రోజు రాత్రి అక్కడ జైపూరుకి వెళ్లే రైలు ఎక్కి ఉదయానికి చేరుకున్నాం. అక్కడ భవంతులూ ఆఫీసులూ అన్నీ గులాబీరంగులోనే ఉన్నాయి. ముందుగా జంతర్‌మంతర్‌కు వెళ్లాం. ఇది ఖగోళశాస్త్రం, జ్యోతిషం నేర్చుకునేవాళ్లకి పాఠశాల లాంటిది. సూర్యుడి వెలుతురూ నీడలతోనే సమయమూ దినమూ తిథీ వారమూ నక్షత్రమూ రాశీ వంటివన్నీ తెలుసుకునేందుకు వీలుగా కట్టిన సిమెంట్‌ కట్టడాలను అక్కడ చూడవచ్చు. పక్కనే ఉన్న సిటీప్యాలెస్‌లో రాజామాన్‌సింగ్‌ వాడిన వస్తువుల రాజకుటుంబీకుల ఫొటోలూ ఉన్నాయి. సిటీప్యాలెస్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని ప్రాచీన జైపూర్‌ కోటను చూసి జలమహల్‌ చూడ్డానికి వెళ్లేటప్పటికి రాత్రి ఏడున్నర అయిపోయింది. చుట్టూ నీళ్లూ మధ్యలో దీపాలతో అది అందంగా ఉంది.

మర్నాడు ఉదయం మూడు గంటలకు జైపూరు నుంచి బికనీరుకి ప్రయాణమయ్యాం. సాయంత్రం నాలుగు గంటలకు బికనీరు చేరుకున్నాం. కనకమహల్‌, మేఘమహల్‌ చూశాక సభామండపంమీద చిత్రపటాలనూ పాలరాతి శిల్పాలనూ వీక్షించాం. అవన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. అక్కణ్ణుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశ్‌నాక్‌ గ్రామంలోని మూషికాలయంలోని ప్రాంగణమంతా ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. కాళ్లతో ఎక్కడ వాటిని తొక్కేస్తామేమోనని భయం కలుగుతుంది. గుడిలోపల వేలకొద్దీ ఎలుకలు ఉన్నాయి. గుడి బయట ఒక్క ఎలుకా లేదు. ఎలుక విగ్రహానికి రోజూ సాయంత్రం హారతినిస్తారట. తిరిగి బికనీరుకి చేరుకున్నాం. ఉదయాన్నే బస్సులో జైసల్మేరు వెళ్లాం. జనవరి నెల కావడంతో చలి బాగా ఉంది. దారంతా పొగమంచు... డ్రైవరు జాగ్రత్తగా నడిపాడు. మధ్యాహ్నం 12 గంటలకు రామ్‌దేవ్‌ బాబా సమాధి ఉన్న వూరు చేరుకున్నాం. రాజస్థానీలకు ఆరాధ్యదైవం రామ్‌దేవ్‌ బాబా. ప్రజలు తమ కోరికలను బాబాకు చెప్పుకుని అవి తీరాక బట్టతో తయారుచేసిన గుర్రపు బొమ్మలూ, తీపి వంటకాలను మేళతాళాలతో తీసుకొచ్చి బాబాకు నివేదన చేస్తారు.

అది చూశాక మూడు గంటలకు జై సల్మేర్‌ చేరుకున్నాం. ఆ వూళ్లొ అన్ని ఇళ్లూ ఆఫీసులూ బంగారురంగులో ఉన్నాయి. దీన్ని గోల్డెన్‌ సిటీ అంటారు. ఇక్కణ్ణించి గోబీ ఎడారి, థార్‌ ఎడారులకు వెళ్లొచ్చు. మమ్మల్ని సాయంత్రం నాలుగు గంటలకల్లా గోబీ ఎడారిలో వదిలారు. అక్కడ ఒంటెలమీద ఇద్దరం చొప్పున కూర్చుని ఎడారిలో ఐదు కిలోమీటర్ల మేర ప్రయాణించాం. ఎడారిలో కూర్చుని సూర్యాస్తమయం దృశ్యాన్ని వీక్షించడం మరచిపోలేని అనుభవం. ఉదయాన్నే కోట చూడ్డానికి వెళ్లాం. ఇందులో రెండు గుడులు ఉన్నాయి. ఒకటి శీతలామాత ఆలయం, రెండోది జైనమందిరం. దీన్నే శ్వేత మందిరం అని కూడా అంటారు. రాజస్థాన్‌లోని ప్రతీ కోటా చూడదగ్గదే. మధ్యాహ్నం భోజనం చేశాక రాత్రి పది గంటలకు బయలుదేరి జోధ్‌పూర్‌కి చేరుకున్నాం. జోథ్‌పూర్‌ను సన్‌సిటీ అంటారు. ఈ కోటను ముగ్గురు చక్రవర్తుల హయాంలో కట్టించారు. ఇది పూర్తయ్యేసరికి మూడువందల సంవత్సరాలు పట్టింది. యుద్ధాల్లో శిథిలమైన కోటను పునర్నిర్మించడానికి 150 సంవత్సరాలు పట్టిందనీ ఇది సుమారు 600 ఏళ్ల నాటిదనీ గైడు చెప్పాడు. కోట పైకి చేరుకుని చూస్తే వూరంతా కనిపిస్తుంది. నీలం రంగు ఇళ్లు ఎక్కువగా కనిపించాయి. ఎండ నుంచి రక్షిస్తుందన్న కారణంతో నీలిరంగు వేస్తారనీ అందుకే దీన్ని నీలినగరం అంటారనీ గైడు చెప్పాడు. అక్కణ్ణుంచి పుష్కర్‌లోని బ్రహ్మ ఆలయాన్నీ ఆ తరవాత చిత్తౌడ్‌గఢ్‌లోని కోటల్నీ చూసి పంచద్వారకల్లో ఒకటైన శ్రీనాథ్‌ ద్వారకకు చేరుకున్నాం.

నాథ్‌ ద్వారక!
నాథ్‌ద్వారానే శ్రీనాథ్‌ ద్వారక అంటారు. ఇక్కడ కృష్ణుడు ఏడేళ్ల పిల్లాడిగా దర్శనమిస్తాడు. ప్రస్తుతం ఇక్కడున్న విగ్రహాన్ని 17వ శతాబ్దంలో మధుర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఉదయాన్నే హారతి ఇస్తూ స్వామిని మేలుకొలుపుతారు. తరవాత కాసేపు గుడి మూసి స్వామిని అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. దీన్నే శింగార్‌ సేవ అని పిలుస్తారు. ఇక్కడ అభిషేకానికి భక్తులు పాలే కొని ఇస్తారు. తరవాత అక్కణ్ణుంచి కాంక్రోలి ద్వారకకు వెళ్లాం. ఉదయ్‌పూర్‌ సమీపంలోని రాజసమండ్‌ సరస్సు ఒడ్డున ఉన్న ఈ ఆలయంలోని కృష్ణుణ్ణి ద్వారకాధీశ్‌గా కొలుస్తారు. ఇక్కడి విగ్రహం కూడా మధుర నుంచే వచ్చిందట. ఈ ఆలయాన్ని దర్శిస్తే చింతలన్నీ తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇవన్నీ ఆయన నడయాడిన స్థలాలే. అక్కణ్ణుంచి ఉదయపూర్‌కి చేరుకుని కోట చూడ్డానికి వెళ్లాం. అది చాలా అందంగా ఉంది. ఆ రాత్రికి అక్కడే ఉండి మౌంట్‌ అబూకి చేరుకున్నాం. అక్కడ బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయానికి వెళ్లాం. అది చాలా పెద్దది. హాల్లో 2000 మంది కూర్చునే స్థలం ఉంది. ఇక్కడకు వెళ్లినవాళ్లంతా రెండు నిమిషాలైనా ధ్యానం చేస్తారు. తరవాత ఆబ్రూ దేవాలయానికి వెళ్లాం. 500 మెట్లు ఎక్కి పెదవి ఆకారంలో ఉన్న గుహలోని దేవీమాతను దర్శించుకున్నాం. రాజస్థానీ భాషలో ఆబ్రూ అంటే పెదవి అని అర్థం. ఇది క్రమేణా ఆబూగా మారింది. ఎర్రచలువరాతితో కట్టిన దిల్‌వారా మందిరాలను చూసి ఎవరైనా నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. మధ్యాహ్నం భోజనం చేసి రాజస్థాన్‌ సరిహద్దుల్లో నుంచి గుజరాత్‌లోకి ప్రయాణించాం.

బంగారు ద్వారక!
దారిలో గబ్బర్‌ అనే వూరిలో అంజేమాత గుడికి వెళ్లాం. ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి. ఇక్కడే సతీదేవి గుండె పడిందని చెబుతారు. అది చాలా పెద్ద గుడి. రాత్రికి సిద్ధాపూరులో విశ్రమించి ఉదయాన్నే మాతృగయకు వెళ్లాం. అక్కడ తల్లికి పిండప్రదానాలు చేసేవాళ్లు చేసుకున్నారు. ఎందుకంటే తల్లికి పిండప్రదానం చేసే చోటు ఇదొక్కటేనట. ఇక్కడి బిందుసరోవరంలో స్నానం చేసి పిండప్రదానం చేస్తే మంచిదని భాగవతంలో ఉన్నట్లు పూజారులు చెప్పారు. తరవాత మూల ద్వారకకు చేరుకున్నాం. అరేబియా సముద్రతీరంలోని ఈ నగరాన్ని ఒకప్పుడు గోల్డెన్‌సిటీగా పిలిచేవారు. క్రీ.పూ. 1500నాటి పురాతన నగరమే ద్వారక. తప్పక చూడాల్సిన సప్త పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. ప్రధాన ఆలయంలో సాయంత్రం హారతి దర్శనం చేసుకుని మళ్లీ ఉదయాన్నే గోమతీనదిలో స్నానం చేసి కృష్ణుణ్ణి దర్శించుకుని వెన్న ప్రసాదాలు స్వీకరించాం. తరవాత సముద్రంలో ఉన్న బెట్‌ ద్వారకకు మరబోటులో వెళ్లాం. సముద్రపు పక్షులు మా తలమీదుగా ఎగురుతూ మేం వేసే మరమరాలు తింటూ ఆలయం వరకూ వచ్చి మళ్లీ మాతో ద్వారకకు వచ్చాయి. బెట్‌ద్వారకలో కృష్ణుడి పరివారం ఉండేదట. అక్కడి స్వామిని దర్శించుకుని నాగేశం చేరుకున్నాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ పార్వతీపరమేశ్వరులు నాగ్‌, నాగిని రూపాల్లో ఉంటారు. పిల్లలు లేనివాళ్లు ఇక్కడ అమ్మే జంటపాముల బొమ్మలు పెట్టి ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.

డాకోర్‌ రణ్‌ఛోడ్‌రాయ్‌!
తరవాత సోమనాథ్‌ ఆలయాన్నీ కృష్ణుడు నిర్యాణం పొందిన స్థలాన్నీ బోయవాడు బాణం వేసిన చోటునీ చూసి భావనగర్‌కు బయలుదేరాం. అక్కడ సముద్రం ఒడ్డు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో చిన్న రాయి మీద పాండవులు శివలింగాలు పెట్టి పూజ చేశారట. సముద్రంలో నీళ్లు వెనక్కి వెళ్లినప్పుడు అక్కడ ఐదు శివలింగాలు కనిపిస్తాయి. సాధారణంగా ఉదయం పదిగంటలలోపే ఇది సాధ్యం. ఆ తరవాత నీళ్లు వచ్చి ఏమీ కనిపించవు. కానీ మేం ధైర్యం చేసి బురదలో నడుచుకుంటూ వెళ్లి దర్శించుకుని గంటన్నరలో వెనక్కి వచ్చాం. సాయంత్రానికి డాకోర్‌ ద్వారకకు చేరుకున్నాం. ఇక్కడ కృష్ణుణ్ని రణ్‌ఛోడ్‌రాయ్‌జీగా కొలుస్తారు. బోడన అనే భక్తుడి కోరిక మేరకు నిండుపౌర్ణమినాడు కృష్ణుడు ఇక్కడకు వచ్చాడట. అందుకే పున్నమినాడే ఇక్కడకు భక్తులు ఎక్కువగా వస్తారు. ఇక్కడి ఆలయనిర్మాణం ఎంతో బాగుంది. అక్కడ కృష్ణుణ్ణి దర్శించుకున్నాక రుక్మిణీదేవి ఆలయాన్నీ చూసొచ్చాం. ఇక్కడితో మా పంచద్వారకలు పూర్తయ్యాయి. మర్నాడు గాంధీనగర్‌, అహ్మదాబాద్‌లో చూడదగ్గ ప్రదేశాలన్నీ చూసి వెనుతిరిగాం.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...