Showing posts with label Bihar. Show all posts
Showing posts with label Bihar. Show all posts

Sunday, 7 May 2017

సీతామడి









సీతామడి
(ఇప్పుడు బీహార్‌లో ఉంది)



రామాయణం ప్రకారం ఈ ప్రాంతం జనకుడి పాలనలో ఉండేది. పునౌరా (ఇప్పుడు పునరాధాం)లో జనకుడి నేలను దున్నుతుంటే తనకు సీత దొరికింది. దేవుడిచ్చిన బిడ్డగా తీసుకెళ్లి పెంచుకుంటాడు. జనకుడి నివాసంగా పేర్కొనే జనక్‌పూర్ ఇప్పుడు నేపాల్‌లో ఉంటుంది. అది ఈ సీతామడికి దాదాపు 60 కిలోమీటర్ల దూరం. ఈ సీతామడి జిల్లా సరిహద్దులు కూడా నేపాల్‌తో కలిసే ఉంటాయి. సీత దొరికిన స్థలంలో చాలామంది భక్తులు పూజలు చేస్తుంటారు.

ఉత్తరప్రదేశ్‌లోనూ వారణాసి, అలహాబాద్ మధ్యలోనూ ఓ సీతామడి ఉంది. అయితే అది కొత్తగా వెలిసిన ప్రాంతంలా కనిపిస్తుంది. దాన్ని సీత స్వచ్ఛందంగా భూమాత ఒడిలోకి వెళ్లిపోయిన స్థలంగా భక్తుల నమ్మకం. ఇదీ కథ.



సీతామడి
లవకుశుల జననం తరువాత సీతామహాసాధ్వి పిల్లలను శ్రీరామునకు అప్పగించి తాను తన తల్లి అయిన భూమాతను చేరుతుంది. ఆ క్రమములో సీతాదేవి భూమాతను ప్రార్ధించి భూప్రవేశము చేసిన స్థలమే ఈ సీతామడి. అలహబాద్ - వారణాసి రహదారిలో అలహాబాద్ నుండి సుమారు 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత, రహదారి నుండి 12 కిలోమీటర్లు లోపలికి వెళ్తే సీతామడి వస్తుంది. వారణాసి నుండి ప్రయాగ వెళ్ళే దారిలో 20 కిలోమీటర్లు లోపలికి ఈ ప్రదేశము కలదు. ఆ ప్రాంతములో వాల్మీకి ఆశ్రమము ఉండేదిగా చెబుతారు. అక్కడ 108 అడుగుల హనుమంతుని విగ్రహము, దాని కింద పవనపుత్రుని ఆలయము సీతాదేవి ఆలయమునకు రక్షణగానా అన్నట్లు ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆలయం సొరంగమార్గాలతో వైవిధ్యంగా ఉంటుంది. దాని ఎదురుగా సీతాదేవి ఆలయం ఒక నదిపాయ మధ్యలో ఎంతో సుందరముగా ఉంటుంది. అక్కడగల సీతాదేవి విగ్రహము చూస్తూ ఉంటే భక్తిభావముతో చూపు మరల్చుకోలేము. ఇక్కడ ఏర్పాటు చేసిన సీతాదేవి విగ్రహం అత్యంత సహజసిద్ధంగా ఉండి, చూపరులను కట్టి పడేస్తుంది. సీతమ్మ అవతార పరిసమాప్తి కావించిన ఈ స్థానంలో గుండె బరువెక్కిపోతుంది.



బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...