Showing posts with label కర్నూలు జిల్లా. Show all posts
Showing posts with label కర్నూలు జిల్లా. Show all posts

Saturday, 28 July 2018

కొలనుభారతి సరస్వతీదేవి ఆలయం









కొలనుభారతి సరస్వతీదేవి ఆలయం



సరస్వతీదేవికి ఆలయాలు ఎక్కడున్నాయని అడిగితే భాసర, వర్గల్‌... ఇంకా ఎక్కువ పేర్లు చెప్పాలంటే ఎంతటివారైనా కాస్తంత తడబడతారు. అయితే, కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని దట్టమైన అడవీ ప్రాంతంలో ఎల్తైన కొండల నడుమ, చారుఘోషిణీ నది ఒడ్డున అమ్మవారికి ఆలయం ఉంది. కొలనుభారతి అనే పేరుతో వెలసిన ఈ అమ్మవారికి 11వ శతాబ్దికి చెందిన మల్లభూపతి అనే చాళుక్యరాజు నిర్మించినట్లు శిలాశాసనాలను బట్టి తెలుస్తోంది. భారతీదేవి సన్నిధిలో విద్యాభ్యాసం ప్రారంభిస్తే, అత్యున్నత స్థాయికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం.

ఎలా వెళ్లాలంటే..
కొలనుభారతి క్షేత్రానికి వెళ్లాలంటే ముందు శ్రీశైలం లేదా కర్నూలుకు చేరుకోవాలి. ఆత్మకూరుకు చేరినా దగ్గరే. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తపల్లివ మీదుగా సుమారు 15 కిలోమీటర్లు వెళ్తే శివపురం గ్రామం వస్తుంది. అక్కడి నుంచి మరో 5 కిలోమీటర్లు మెటల్‌ రోడ్డుగుండా ప్రయాణించి కొలనుభారతి ఆలయాన్ని చేరుకోవచ్చు.



Monday, 5 February 2018

నవనందులు





నవనందులు

ఎవరు సదాశివ నామస్మరణ చేస్తారో అలాంటి వారి వెంటే శివుడుంటాడు. అలాంటి తన నిజమైన భక్తుల్నే శివుడు వెన్నంటి కాపాడుతాడు. ఆ స్వామి తన భక్తులకోసం వెలసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి. ఆ పరంపరలోని మరో విశిష్ఠ శైవ క్షేత్రమే నంది మండలం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. నంద్యాల చుట్టూ నవ నందులుండడంవల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్న ఒక విశిష్టమైన పట్టణం. చారిత్రక విశేష గాథలతో ముడిపడి ఉన్న ఈ పట్టణానికి ఆ పేరు రావడానికి కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కుందూ నదీ తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారు. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఈ మండలం చుట్టూ నవ నందులను నిర్మించడంవల్ల దీనికి నంది మండలమని పేర్కొచ్చిందని చెబుతారు. ఇదే కాలాంతరంలో నంద్యాలగా రూపాంతరం చెందింది. మంచి వాణిజ్య కేంద్రంగా ఉన్న నంద్యాల ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా పేర్గాంచింది. మండలంలో ఉన్న నవ నందులలో మూడు నందులు ఇక్కడే ఉండడం విశేషం.

ప్రథమ నంది:- నవ నందులలో ప్రథమమైన ప్రథమ నందీశ్వరాలయం ఇక్కడే ఈ పట్టణంలోనే ఉంది. నంద్యాల పట్టణంలో శ్యామ్ కాల్వ గట్టున ఈ ఆలయం అలరారుతోంది. విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతంవిశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి ప్రశాంత వాతావరణం మైమరపిస్తుంది. గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది. తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శనం, కేదారనాథ్‌లో కేదారేశ్వర లింగ దర్శన ఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇక్కడే మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం.

నాగనంది:- నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్టాండుకు సమీపంలోఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువుదీరాడు. కోదండ రామాలయంగా ఖ్యాతికెక్కిన ఈ ఆలయం కూడా అతి పురాతనమైనదే.ఈ ఆలయం కొన్ని ఆలయాల కూడికగా కానవస్తుంది. ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయస్వామి మూర్తి చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. విశాల శిల్ప మూర్తిగా ఉన్న ఈ ఆంజనేయస్వామి దర్శనం సర్వ మంగళకరం. ఆంజనేయస్వామి గర్భాలయానికి సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగ నందీశ్వరుడు కొలువుదీరాడు. నవ నందులలో నాగ నందీశ్వరుడు రెండవ వాడు.

సోమనంది:- నంద్యాల పట్టణంలోనే ఆత్మకూరు బస్టాండుకు సమీపంలో ఉన్న మరో ఆలయం శ్రీ సోమ నందీశ్వరాలయం. చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడంవల్ల ఈ లింగానికి సోమ నందీశ్వర లింగమనే పేరొచ్చింది. ఈ ఆలయం ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ ప్రాశస్త్యం రీత్యా ఇక్కడ స్వామివారి మహిమ గొప్పది. గర్భాలయంలో సోమ నందీశ్వరుడు దర్శనమిస్తాడు.

శివనంది:- నంద్యాలకు సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే శివనందీశ్వరాలయం. శివనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవ నందులలో విశేషమైన నందిగా ఖ్యాతి గాంచింది. ఈ ఆలయం బండి ఆత్మకూరు మండలం కడమల కాల్వ గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం అక్కడనుంచి ఏదైనా వాహనంలో గాని, బస్సులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి దృశ్యాలు ఆభరణాలుగా అలరారుతున్న ఈ ఆలయ శోభ అనన్య సామాన్యం... విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనో కట్టడాలన్నీ చాళుక్యుల కాలం నాటివిగా ఇక్కడి ఆధారాల ద్వారా అవగతమవుతోంది.

14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్టించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణావస్థకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో భక్తులు, వధాన్యుల సహకారంతో ఈ ఆలయాన్ని పనర్నిర్మించారు. గర్భాలయంలో శివనందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న మహాదేవ లింగం భక్తులకు దర్శనమిస్తుంది.

తేజో విరాజమానమవుతున్న పరమేశ్వర లింగ దర్శనం, అమోఘమైన పుణ్యఫలాన్నిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ముఖ మండపంలో మరోపక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వ మంగళకరం. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో వైపు భాగంలో వీరభద్రస్వామి కూడా కొలువుదీరాడు. విష్ణునంది లేక కృష్ణ నంది, శివనందీశ్వరస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్లు దూరంలో తెలుగు గంగ కాల్వకు సమీపంలో విష్ణు నందీశ్వరుడు కొలువుదీరాడు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయ శోభ వర్ణనాతీతం..

ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడి ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. చుట్టూ పరచుకున్న నల్లమల అడవీ ప్రాంతం, ఇంకో పక్క కొండలు, గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విష్ణునంది లేక కృష్ణనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా చెబుతున్నాయ. ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగ రూపంలో ఉన్న విష్ణు నీదంశ్వరుడి దర్శనం పూర్వజన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడ్కొనిపోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలంనాటి కోనేరు, నవగ్రహాలు, వినాయక, విష్ణు, లక్ష్మి మందిరాలున్నాయి. ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే భక్తితో స్నానాలు చేసి విష్ణునందీశ్వరుడ్ని దర్శించుకుంటారు.

సూర్యనంది:- నంద్యాలకు సుమారు 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న మహిమాన్విత క్షేత్రమే సూర్య నందీశ్వరాలయం. సూర్యనందిగా పేర్గాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది. సూర్యుడు ఇక్కడ శివుడి గురించి తపస్సు చేసి ఆ స్వామి లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది. పూర్వకాలం నాటి ఆనవాళ్ళతో అలరారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తులు, వధాన్యుల సహకారంతో నిర్మించారు. ఈ ఆలయం యు.బొల్లవరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్లె గ్రామంలో ఉంది. అతి పురాతన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. అనంతరం నంద్యాలనుంచి మహానంది మార్గంలో ఏడు కిలోమీటర్లు ప్రయాణించి యు.బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి. అక్కడనుంచి కుడి చేతివైపుగా కిలోమీటరు దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. తమ్మడపల్లె ఓ చిన్ని గ్రామం. ఇక్కడ ఉన్న సూర్య నందీశ్వరాలయంవల్ల ఈ గ్రామ ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. 14వ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయంలో సూర్య నందీశ్వరుడిగా కొలువులందుకుంటున్న ఆలయంలో మరో పక్క పార్వతి మాత కొలువుదీరి ఉంది.

గరుడ నంది:- సూర్య నందీశ్వరస్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్లు దూరంలో మహానంది దివ్య క్షేత్ర నడిబొడ్డున గరుడ నందీశ్వరుడు కొలువుదీరాడు. మహానంది క్షేతానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వరాలయం అతి పురాతనమైనది. ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో దీనిని తిరిగి పునరుద్ధరిస్తున్నారు. గరుడ నందిగా పేర్గాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడో భవ్య లింగాన్ని ప్రతిష్టించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరొచ్చింది. గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు.

వినాయక నంది:- మహానందిలో ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది. మహానందీశ్వరస్వామి వారి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్యాలయం లో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్టించడానికి ఇక్కడి స్థల పురాణాలు చెబుతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. నాగ ఫణాఫణి ఛత్రంగా ఇక్కడ స్వామివారు అలరారుతున్నారు. వినాయక నందీశ్వరస్వామి వారి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.

మహానంది:- నవ నందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది. ఇది కర్నూలు జిల్లాలో నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉంది. ఇది ఆహ్లాదకరమైన యాత్రా స్థలం. గుడి చుట్టు ప్రవహించే నీటి బుగ్గల చల్లదనం, చుట్టు అల్లుకున్న నల్లమల అరణ్యపు ప్రకృతి సౌందర్యం, అన్ని కాలాల్లోను భక్తులను ఆకర్షిస్తూనే ఉంటుంది. పూర్వం శాలంకాయనుడు రాళ్ళను తింటూ అతి విచిత్రమైన తపస్సు చేసి శంకరుని మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ, శివభక్తుడై, జీవించసాగాడు. అతడొక రోజున పొలాన్ని దున్నుకుంటుంటే, ఓ బాలుడు దొరికాడు. వృషభ రూపంలోనున్న ధర్ముడే ఇలా పుట్టాడని, అతనికి ‘‘నంది’’ అని పేరు పెట్టి పెంచాడు. అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకొమ్మన్నాడు.


సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది. శివుడు అనుగ్రహించి అతనిని పుత్రుడుగా స్వీకరించాడు. ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి, వాహనంగా తన చెంతనే ఉండమన్నాడు. ‘‘సుయశ’’ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు. తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం. ఇక్కడ ఉన్న ఈశ్వరుని నంది ప్రతిష్టించాడని, అందువల్లనే ఇది నందీశ్వరాలయమైందని స్థల పురాణం. ఈ క్షేత్రంలో వెలసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభూలింగంగా ఖ్యాతికెక్కింది. గర్భాలయంలో ఉన్న శివలింగంపై భాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి. శ్రీ మహానందీశ్వర స్వామి రజత కవచాలంకృతుడై నయన మనోహరంగా దర్శనమిస్తారు. పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటోంది.

కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవ నందుల దర్శనంవల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. నవ నందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం.




Saturday, 18 March 2017

సంగమేశ్వర ఆలయం






సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుని ఆలయం

అది వేలసంవత్సరాల చరిత్ర కలిగి వున్న ఆధ్యాత్మిక స్థలం.. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఏకంగా ఏడు నదులు (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి) కలిసే అద్భుతమైన ప్రదేశం.. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం. ఎన్నో శైవాలయాలకు కొలువైన కర్నూలు జిల్లాలో సంగమేశ్వర ఆలయం ఒక్కటే ప్రత్యేక విశిష్టత కలిగి వుంది. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది.

స్థలపురాణం :
పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని పురాణ గాధ. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. మరొక కథనం ఏమిటంటే.. పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు.. ప్రతిష్ట సమయానికి రాలేదు. దీంతో.. రుషుల సూచన మేరకు ధర్మరాజు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న భీముడు.. తీవ్ర ఆగ్రహంతో తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థలపురాణం చెబుతోంది.

ఆలయ విశేషాలు :

  • ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతోపాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.
  • ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు. అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం.
  • ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడింది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.









భక్తవల్లభుడు.. సంగమేశ్వరుడు

ఆత్మకూరు గ్రామీణ, న్యూస్‌టుడే: భక్తవల్లభుడైన సంగమేశ్వరుడిని ఇంటి నుంచే భక్తితో కొలిస్తే పలుకుతాడని ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. సోమవారం సాయంత్రానికి ఆలయం గోపురం సగానికి పైగా కృష్ణమ్మ ఒడిలోకి చేరింది. క్షేత్రంలో ఎగువ ఉమా మహేశ్వరాలంలో ఎగువ ఘాట్‌లో మెట్ల పూజలు, గంగా పూజ. లలితా సంగమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులచే మెట్లోత్సవ పూజలు నర్విహించారు. ఎగువ ఉమామహేశ్వరాలయం వద్ద సాక్షిసంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోటులో నదిలోని క్షేత్రానికి చేరుకుని అక్కడ గంగా పూజ, కృష్ణమ్మకు పూజలు శిఖర పూజలు, సత్యనారాయణుడు, సూర్యనారాయణులకు పూజలు నిర్వహించారు. రైతులంతా ఉత్తరం చూసి ఎత్తురగంప అనే సామెత ఉంది. అందుకు తగ్గట్టే ఉత్తర కార్తి రైతులను రాష్ట్ర ప్రజలను ఆదుకుందన్నారు. పూజకార్యక్రమంలో తహసీల్దారు రామకృష్ణ, పలువురు భక్తులు పాల్గొన్నారు.


5 February 2018

కృష్ణమ్మ ఒడినుంచి బయటపడుతున్న సంగమేశ్వరుడు

శ్రీశైలం జలాశయంలోని కృష్ణాజలాల నుంచి సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. సోమవారం ఆలయ శిఖరం బయటపడి భక్తులను ఆనందంలో ముంచెత్తింది. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన పూర్తిస్థాయిలో గంగ ఒడికి చేరిన సంగమేశ్వరుడు క్రమేణా మళ్లీ భక్తుల దర్శనం కోసం సిద్ధమవుతున్నాడు. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని పురాతన సంగమేశ్వర ఆలయం వేసవికాలం మినహా సుమారు ఎనిమిది నెలలు కృష్ణాజలాల్లో మునిగిపోయే విషయం విదితమే. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తక్కువగా ఉండటంతో ఆలస్యంగా బయటపడుతోంది. గత ఏడాది మహాశివరాత్రికి పూజలందుకున్న సంగమేశ్వరుడు ఈ ఏడాది మాత్రం కేవలం శిఖర దర్శనానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మహా శివరాత్రి పర్వదినాన ఆలయ శిఖరానికి పూజలు నిర్వహించడానికి ఆలయ పూజారి తెలకపల్లి రఘురామశర్మ సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 857.30 అడుగులుగా నమోదైంది. దీంతో ఈ ఏడాది ఆలయం పూర్తిగా బయటపడి భక్తుల పూజలు అందుకోవాలంటే ఏప్రిల్ మాసాంతం వరకు ఆగాల్సి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.



కృష్ణమ్మ గలగల : మునిగిన సంగమేశ్వరుడు

కర్నూలు జిల్లా ఆత్మకూర్ సమీపంలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం సంగమేశ్వర ఆలయం కృష్ణా నదిలో మునిగింది. రాష్ట్రానికి పై భాగంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పోటెత్తింది. తెలంగాణాలోని నారాయణాపుర్‌, జూరాల మీదుగా కర్నూలు జిల్లాకు భారీగా వచ్చి చేరింది వరదనీరు. సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు కృష్ణా జలాల ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలో బ్యాక్‌ వాటర్‌ పెరుగుతుండటంతో సప్త నదుల సంగమేశ్వరం గర్భాలయం పూర్తిగా మునిగిపోయింది.

భారీ వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ ఉట్టిపడుతుంది. శ్రీశైలం జాలశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. కృష్ణా నది పరవళ్లకు తోడు ఉపనది తుంగభద్ర నుంచి వచ్చే నీరు కూడా వచ్చి చేరుతుండడంతో ఇవాళ ఉదయానికి 1,12,694 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. శ్రీశైలం జలాశయం వైపు కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. రిజర్వాయర్‌లోకి నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో-1.48 లక్షల క్యూసెక్కులు ఉన్నది. ఔట్‌ఫ్లో- 1,813 క్యూసెక్కులుగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 17.5 టీఎంసీల నీరు జలాశయానికి వచ్చి చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 849.6 అడుగులకు నీరు ఉంది. వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 


12 February 2017

కనిపించి కన్నీరొలికించే ఆలయం...

మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ లో పుట్టి కృష్ణాజిల్లా లోని హంసలదీవి దగ్గర సాగరసంగమం జరిగే కృష్ణవేణీ నది మార్గంలో ఎన్నెన్నో అపురూప ఆలయాలు. ఈ నది ప్రతి మలుపు దగ్గరా ఒక ఆలయం. ఇక ఉపనదులు కలిసే కొన్ని సంగమప్రదేశాలను సంగమేశ్వరంగా వ్యవహరిస్తారు. కర్నాటకలో బాదామి చాళుక్యుల తొలిరాజధాని ఐహోళె సమీపంలో ఘటప్రభ, మలప్రభల నదులు సంగమించే ప్రదేశాన్ని కూడలి సంగమ అంటారు. ఇక్కడ చాళుక్యుల కాలం నాటి ఆలయంతో పాటూ వీరశైవ మతస్థాపకుడు, సంఘసంస్కర్త బసవన్న సమాధి మందిరమూ ఉంది.

దక్షిణాదిలో శాతవాహనుల తర్వాత వర్ధిల్లిన రాజ్యం చాళుక్యులది. వీరికాలం నాటికి బౌద్ధ, జైన మతాలు విస్తారంగా వ్యాప్తిలో ఉన్నా వీరు మాత్రం వైదిక మతావలంబులు. వీరి తొలిరాజధాని ఐహోళె, పట్టాభిషేకాలు జరుపుకున్న పట్టాడకల్ లలో ఎన్నో అపురూప ఆలయాలను, బాదామిలో గుహాలయాలను నిర్మించారు. ఆ తర్వాత రాజ్యవిస్తరణలో భాగంగా మొలకసీమ, ఏరువసీమ, రెండేరులసీమగా పిలువబడే ప్రస్తుత మహబూబ్ నగర్, కర్నూల్ జిల్లాలలోని భూభాగాన్ని తమ ఏలుబడి కిందకు తెచ్చుకున్నారు. ఈసీమలో తుంగభద్ర, కృష్ణల సంగమ ప్రదేశమైన కూడలి, కూడవెల్లిగా వ్యవహరించే ప్రదేశంలో తాము పట్టాడకల్ లో నిర్మించిన ఆలయాల నమూనాతో కూడవెల్లి సంగమేశ్వరాలయాన్ని నిర్మించారు.

ఈ ఆలయ నిర్మాణానంతరం మరిన్ని ఆలయాలను నిర్మించాలనుకున్నా వరద సమయాల్లో గర్భాలయాల్లోకి ఒండ్రుమట్టి చేరుతున్నందున మరో ప్రాంతాన్ని అన్వేశించగా తుంగభద్ర ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్న అలంపురం కనిపించింది. ఇది అదివరకే జోగుళాంబ శక్తి పీఠమైనందున, పరుశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమ ప్రాంతమైనందున ఇక్కడ నవబ్రహ్మాలయాలను నిర్మించారు.

కాలక్రమేణా చాళుక్యుల ప్రాభవం తగ్గింది. రాష్ట్రకూటుల ప్రాభవం హెచ్చింది. వీరికి పల్లవులతో సంబంధ బాంధవ్యాలున్నందున చాళుక్యులను జయించారు. వీరూ ఆలయాలు నిర్మించాలనుకున్నారు.

నల్లమలలో భవనాశి అనే సెలయేరుగా పుట్టి కృష్ణలో కలిసే ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఈ సంగమానికి నివృత్తి సంగమం అని పేరు. పాపులను పునీతులుగా మారుస్తూ గంగా నదికి కాకి రూపం వచ్చిందని, ఆ రూపం పోగొట్టుకోవడానికి సంస్థ తీర్తాల్లో జలకమాడుతూ తిరుగుతున్న ఆవిడ ఇక్కడ హంస రూపం పొందిందని కథనం. ఆవిడ పాప నివృత్తి అయినందున నివృత్తి సంగమేశ్వరంగా వ్యవహరించేవారు. ఇక్కడ నది ఒడ్డున ఒక పురాతన శివాలయం ఉంటుంది. పాండవులు అరణ్యవాస సమయాన ఇక్కడికి వచ్చారని. శివలింగం తేవడానికి భీమూన్ని కాశీకి పంపగా అతను ముహూర్త సమయానికి రానందున ధర్మరాజు ఒక వేపమొద్దును శివలింగంగా ప్రతిష్టించాడని కథనం. తల మీద, రెండు బాహువుల్లో రెండు చొప్పున మొత్తంగా ఐదు లింగాలు తెచ్చిన భీముడు ఆగ్రహంతో వాటిని విసిరెయ్యగా అక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేరుతో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని కథనం.

ఇక రాష్ట్రకూటులు ఈ ప్రదేశంలో చాళుక్య, పల్లవుల వాస్తు రీతులను మేళవించి ఆలయాలు నిర్మించారు. వీరి ఆలయం ఒక పెద్ద రాతిరధాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయాలున్న ప్రదేశంలో ధ్యానం చేస్తే రూపాయలు కురుస్తాయనే నమ్మకంతో దీన్ని రూపాల సంగమం అనేవారని ప్రజల్లో ఒక కథ ప్రచారంలో ఉంది.

కాలచక్ర గమనంలో రాజులు,రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వచ్చాయి.మన తొలి ప్రధాని నెహ్రూ "ఆధునిక ఆలయాలు" గా అభివర్ణించిన బహుళార్ధసాధక ప్రాజెక్టులు మొదలయ్యాయి.కృష్ణా నది మీద శ్రీశైలం లో ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైంది.మహబూబ్ నగర్,కర్నూలు జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగాయి,ఎందరో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

క్రీ.పూ 1250 ప్రాంతంలో ఈజిప్ట్ లో నాటి పాలకుడు రామ్‌సెస్ 2 తన విజయచిహ్నంగా ఒక కొండను తొలచి భవ్య ఆలయం నిర్మించాడు. దాన్ని అబు సింబెల్ ఆలయంగా వ్యవహరిస్తారు.1960 ల్లో అస్వాన్ హై డామ్ నిర్మాణంలో ఈ ఆలయం మునుగుతుందని అనేక దేశాలు, UNO సహకారంతో ఆ కొండను, శిల్పాలను ఒక్కొక్కటిగా విడదీసి కాస్త ఎగువ ప్రదేశంలో పునర్ణిర్మించారు. ఈ ఆలయ ప్రేరణతో పురావస్తు శాఖ వారు సంగమేశ్వర ఆలయాలనూ ఊకో రాయికి ఒక నంబర్ ను ఇచ్చి విడదీసారు.

కూడవెల్లి లోని ఆలయాన్ని అలంపురంలో నిర్మించగా...రాష్ట్రకూటుల రూపాల సంగమేశ్వరాన్ని కర్నూలు శివారులో ఉన్న జగన్నాధ గట్టు పైన పునర్ణిర్మించారు. ఇక పాత నివృత్తి సంగమేశ్వరంలో గొప్ప శిల్పసంపద లేనందున వదిలివేసారు.

ఈ నివృత్తి సంగమం నదిలోనే ఉండిపోయేది. కానీ 1996 లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బాంక్ అప్పు కోసం G.O-69 తీసుకు వచ్చాడు. అంతదాకా 854 అడుగుల కనీస నీటిమట్టం ఉండాల్సిన శ్రీశైలం రిజర్వాయర్లోని నీళ్లను 836 అడుగుల వరకు కిందున్న నాగార్జునసాగర్, కృష్ణా డేల్టాకు తరలించే ఏర్పాటు చేసాడు.(నీళ్లు దిగువకు వదులుతూ విద్యుదుత్పాదనను, డెల్టాలోని పంటలనూ బ్యాంక్ వారికి చూపాడు)...ఇక ప్రతి ఏటా ఈ ఆలయం నదీ గర్భం నుంచి బయట పడటం మొదలైంది. ఇలా 4,5 నెలలు వెలుపల ఉండి తుంగభద్ర, కృష్ణలకు వరదలొచ్చినప్పుడు తిరిగి నదీ గర్భంలోకి చేరేది. 2015-16 లో సుమారు 8 నెలలు బయటే ఉండిపోయింది.

ఈ లోగా ఈ శిధిలాలయం మహిమ ప్రచారం చేస్తూ కొందరు దిగిపోయారు. ఆలయ సందర్శనకు యాత్రికుల తాకిడి మొదలైంది. ఈ ఆలయం బయట పడిందంటేనే రాయలసీమ కు కన్నీరొస్తుంది.కారణం రాయలసీమకు కృష్ణా జలాలను అందిచే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 841 అడుగుల దగ్గర ఉంటుంది. ఇక ఆలయం బయట పడిందంటే బ్రహ్మాండమైన వరదలొస్తే తప్ప ఈ పోతిరెడ్డిపాడుకు నీళ్లు చేరవు. కానీ ఆ విషయం విస్మరించిన జనం ఆలయ సందర్శనకు వెళుతూనే ఉంటారు. రైతులు మాత్రం ఎప్పుడు ఈ ఆలయం మునుగుతుందా అని ఆలోచిస్తూ కార్తెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.

పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లందిస్తున్నామనే కబుర్లు కాదు...చిత్తశుద్ది ఉండి నిజంగా రాయలసీమకు నీళ్లు పారాలంటే ఈ కనీసనీటి మట్టాన్ని 854 కు పెంచాలని,ఆ పట్టిసీమ వల్ల మిగులుతున్నాయని చెప్పే 45 టి.యం.సి నీళ్లు రాయలసీమకు నికర జలాలుగా కేటాయించగలరా అని సీమ రైతాంగం ప్రశ్నిస్తుంది.

మొత్తానికి కనిపించి రాయలసీమ రైతులను ఏడిపిస్తున్న ఆలయం ఈ సంగమేశ్వరం.





14-09-2015

జలాధివాసానికి చేరువలో సంగమేశ్వరుడు

కర్నూలు జిల్లా సప్తనదీ సంగమక్షేత్రంలో వెలసిన శ్రీలలితా సంగమేశ్వరుడు జలాధివాసానికి చేరువవుతున్నాడు. శ్రీశైల జలాశయ నీటిమట్టం 840 అడుగులకు చేరితే గర్భాలయంలోకి నీరు ప్రవేశిస్తుంది. పూర్తిస్థాయికి (885అడుగులు) చేరితే క్షేత్రం సంపూర్ణంగా సప్తనదీజల గర్భంలోకి చేరుతుంది.



February 09, 2018

బయిట పడుతున్న సంగమేశ్వరుడు

శ్రీ శైలం జలాశయంలోని కృష్ణాజలాల నుంచి సంగమేశ్వరుడు బయటపడుతున్నాడు. ఆలయ శిఖరం బయటపడి భక్తులను ఆనందంలో ముంచెత్తింది. గత ఏడాది సెప్టెంబర్ 16వ తేదీన పూర్తిస్థాయిలో గంగ ఒడికి చేరిన సంగమేశ్వరుడు క్రమేణా మళ్లీ భక్తుల దర్శనం కోసం సిద్ధమవుతున్నాడు. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండలంలోని పురాతన సంగమేశ్వర ఆలయం వేసవికాలం మినహా సుమారు ఎనిమిది నెలలు కృష్ణాజలాల్లో మునిగిపోయే విషయం విదితమే. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల తక్కువగా ఉండటంతో ఆలస్యంగా బయటపడుతోంది. గత ఏడాది మహాశివరాత్రికి పూజలందుకున్న సంగమేశ్వరుడు ఈ ఏడాది మాత్రం కేవలం శిఖర దర్శనానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. మహా శివరాత్రి పర్వదినాన ఆలయ శిఖరానికి పూజలు నిర్వహించడానికి ఆలయ పూజారి తెలకపల్లి రఘురామశర్మ సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నీటిమట్టం 857.30 అడుగులుగా నమోదైంది. దీంతో ఈ ఏడాది ఆలయం పూర్తిగా బయటపడి భక్తుల పూజలు అందుకోవాలంటే ఏప్రిల్ మాసాంతం వరకు ఆగాల్సి ఉంటుందని జల వనరులశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.



Saturday, 14 June 2014

అహోబిలం - నవ నారసింహక్షేత్రం


అహోబిలం - నవ నారసింహక్షేత్రం

ఆంధ్రదేశంలోని అత్యంత ప్రాచీనమైన నారసింహ క్షేత్రాల్లో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందిన నవ నారసింహ క్షేత్రం అహోబిలం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుండి 25 కి.మీ ల దూరంలోను, నంద్యాల నుండి 65కి.మీ, దూరంలోను నల్లమల అడవుల్లో ప్రకృతి రామణీయకత మధ్య వెలసిన నరసింహుని దివ్య ధామమిది.

స్థలపురాణం :
“ఇందుగల డందు లేడని సందేహము వలదని,హితవు పలికి – చక్రి సర్వోప గతుండని ప్రకటించిన ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిజం చేసి, ఆస్తికత్వాన్ని సజీవంగా ఉంచడానకి, స్ధంభం నుండి ఆవిర్భవించి హిరణ్య కశిపుని మట్టుపెట్టిన ఉగ్ర నరసింహుడు కొలువు దీరిన ప్రదేశమిది.

ఇచ్చట హిరణ్యకశిపుని గోళ్లతో చీల్చిసంహరించిన సమయంలో స్వామిని దర్శించిన ఇంద్రాది దేవతలు ---- अहोवीर्यं अहोशौर्यं अहोबाहुपराक्रमं नारसिंहं परं दैवम् अहोबिलं अहोबलं!  అని కీర్తించారట.

అప్పటి నుంచి ఈక్షేత్రం అహోబలం అని పిలువబడుతోందని స్ధల పురాణం. ఎగువ అహోబిలంలోని గుహలో స్వయంభువుగా వెలసిన ఉగ్ర నరసింహుని ఆరాధించి సాక్షాత్కరింపజేసుకొని దివ్యానుభూతికి లోనైన గరుడుడు స్వామి కొలువు తీరిన గుహను చూసి అహో!బిలం అన్నాడట. ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రాన్ని అహోబిలమని పిలుస్తున్నారని ఒక ఐతిహ్యం.

హిరణ్య కశిపుని సంహరించిన అనంతరం ఇంకా చల్లారని ప్రతాపంతో నరసింహుడు అరణ్యంలోగర్జిస్తూ, క్ష్వేళిస్తూ, పలు ప్రదేశాల్లో సంచరించాడని, అలా సంచరిస్తున్నప్పుడు ఆయనలో విరిసిన వివిధ భావాలకు రూపాలే నవనారసింహ రూపాలని భావించబడుతోంది.

వీర రసావతార రూపుడైన తన నాధుని శాంతింప జేయడానికి శ్రీ మహాలక్ష్మి చెంచు లక్ష్మిగా అవతరించి స్వామిని ప్రసన్నుని చేసుకోవడానికి చాల శ్రమించవలసి వచ్చింది. ఆ సమయంలో ఆ చెంచెతను స్వామి నవరూపాల్లో దర్శనమిచ్చి, అలరించారని, ఆరూపాలే నవ నారసింహులు గా వెలసి స్వామి ఇప్పుడు భక్తులను అను గ్రహిస్తున్నాడని భక్తులు సంతోష పారవశ్యంతో చెంచులక్ష్మీ నరసింహుల కథలను చెప్పుకుంటుంటారు. జానపద గీతాలు పాడుకుంటుంటారు. ఇచ్చటి గిరిజనులు చెంచెతను మహాలక్ష్మిగా పూజిస్తూ, లక్ష్మీనరసింహ కళ్యాణాన్ని చాల గొప్పగా జరిపిస్తారు.

నరసింహుడు హిరణ్యకశిపుని సంహరణానంతరంఅరణ్యం లో సంచరిస్తూ భక్తులను అనుగ్రహించడానకే స్వామి నవరూపాల్లోదర్శనమిచ్చాడు. మరొక కథ ను అనుసరించి గరుత్మంతుడు విష్ణువు నునరసింహ రూపుని గాదర్శన మీయ వేడుకున్నాడు.ఆనాడుగరుడునికి స్వామిసాక్షాత్కరించిన తొమ్మిది రూపాలే నవ నారసింహ రూపాలు. అందుకే ఈ పర్వతాన్ని గరుడాద్రి అని,గరుడాచలం అని, గరుడశైలం అని కూడ పిలుస్తారట.

“ ज्वालाङोबिल मालोल क्रोड करंज भार्गव योगानंद छत्रवट पावन नवमूर्तय: !!

జ్వాల, అహోబిల,మాలోల, క్రోడ,కరంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావననార సింహఅనుతొమ్మిది రూపాలు గా స్వామి అహోబిలం మీదకొలువు తీరి ఉన్నాడు. ఎగువ అహోబిలం లో ఉగ్రనరసింహుడు కొలువు తీరగా. దిగువ అహోబిలం లోలక్ష్మీనరసింహుడు శాంత మూర్తి యైభక్తులను అనుగ్రహిస్తున్నారు. చుట్టూ 5 కి.మీ పరిధి లో మిగిలిన ఆలయాలను కూడ మనం దర్శించవచ్చు.

నవరూపులుగా వెలసిన ఈ దివ్య మూర్తులను దర్శించడం వలన వాని ఫలితాలు కూడవేరు వేరుగా ఉంటాయని స్థలపురాణం చెపుతోంది. అంటే భక్తులు ఏ ఫలితాన్నికోరుకుంటున్నారో ఆ స్వామి రూపాన్ని ప్రత్యేకంగా ఆరాథించుకొని, సఫలీకృత మనోరధులు కావచ్చునన్నమాట. ఇది నారసింహ తత్త్వము. ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గురించి కూర్మ పురాణం, పద్మపురాణం, విష్ణుపురాణా లలో ఫ్రస్తావించబడింది. హిరణ్యకశిపుని వృత్తాంతం బ్రహ్మండ పురాణం లో కన్పిస్తుంది.

ఆలయాల ప్రత్యేకత:

శ్రీ భార్గవనరసింహ స్వామిదిగువ అహోబిలానికి 2.5 కి మీ దూరంలో కొండపై ఈ స్వామి దర్శనమిస్తాడు. ఇక్కడే ”అక్షయ తీర్థం” ఉంది. ఈ అక్షయ తీర్థం లో స్నానం చేస్తే అనంత సంపదలు ప్రాప్తిస్తాయని ఛెప్పబడుతోంది. .పరశు రాముడు ఈ ప్రదేశం లోనే తపస్సు చేశాడు.అందువలన ఈ అక్షయ తీర్థాన్నే”భార్గవ తీర్థమని”కూడ పిలుస్తారు.

శ్రీ యోగానంద నరసింహ స్వామివీరు దిగువ అహోబిలానికితూర్పు దక్షిణం గా 2 కి.మీ దూరం లో వేంచేసియున్నారు.స్వామిప్రహ్లాదునకు ఇక్కడ ఎన్నోయోగ శాస్త్ర మెళకువ లనునేర్పారని. అందువలన స్వామి కి ఆపేరు వచ్చిందని చెపుతారు. ఈ ప్రదేశం తపస్సునకు అత్యంత అనువైన ప్రదేశంగా పేరెన్నిక కన్నది.కష్టాల్లో ఉన్న భక్తులు ఈ స్వామి ని సేవిస్తేస్వామి కష్టాలను కడతేర్చి, సౌ భాగ్యాన్ని కల్గిస్తాడని ప్రహ్లాదుడు చెప్పాడు.

శ్రీ ఛత్రవట నరసింహస్వామిఈ స్వామి దిగువ అహోబిలానికి 3కి.మీ దూరం లోవట వృక్షచ్ఛాయ లో కొలువుతీరి ఉంటాడు. ఈ స్వామిని సేవిస్తే కేతుగ్రహ బాధలు నశిస్తా యని చెపుతారు. లలితకళలనుఅభ్యసించేవారు ఈ స్వామిని సేవిస్తే సత్ఫలితాలను పొంద గలుగుతారు .

శ్రీ అహోబిల నరసింహస్వామినవ నరసింహులలో ఈయన ప్రధాన దైవం. ఈయననే ఉగ్ర నరసింహమని కూడ పిలుస్తారు. ఎగువ అహోబిలం లో చెంచులక్ష్మీ సమేతుడై ఈ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శతృభయాలు. గ్రహపీడలుమతిమాంద్యాలు, ఈ స్వామిని సేవించడం వలన పటాపంచలౌతాయి.

శ్రీ వరాహ నరసింహస్వామిఎగువ అహోబిలానికి 1 కి .మీ పైన లక్ష్మీ దేవి తో కొలువు తీరి ఉన్నాడు. ఈ స్వామిని సేవిస్తే ఆటంకాలు తొలగి,కార్య సాఫల్యత కల్గుతుంది. ఈయన నేక్రోడ నరసింహ స్వామిఅని కూడ పిలుస్తారు.

శ్రీ మాలోల నరసింహస్వామి:ఈస్వామి ఎగువ అహోబిలానికి 2.కి మీ ఎగువున ఉన్నాడు.ఈఆలయం ఉన్న ప్రాంతాన్ని లక్ష్మీపర్వతం గా పిలుస్తారు. మా- అనగా లక్ష్మిమా –లోలుడు అనగా లక్ష్మీప్రియుడు అని అర్థము. ఆయనే లక్ష్మీ సమేత నరసింహుడు. ఈయనను సేవిస్తే ఇహ,పరలోకాలలో సైతం బ్రహ్మానందం లభిస్తుంది.

శ్రీ జ్వాలా నరసింహస్వామిఈ స్వామి ఎగువ అహోబిలానికి 4 కి.మీ దూరంలో దర్శన మిస్తాడు. ఈ పర్వతాన్ని“అచలాచయ మేరు” అని కూడ పిలుస్తారు. హిరణ్యకశిపుని తనవాడియైన గోళ్లతో చీల్చి చెండాడిన నరసింహస్వామి ఇక్కడ కన్పిస్తాడు. ఈస్వామిని సేవిస్తే సకల ప్రయత్నాలు సఫలమౌతాయి. పెళ్లిళ్లు కుదురుతాయి. కార్తీకమాసంలో నేతి దీపాన్ని స్వామి సన్నిథిలో వెలిగించి ఆరాథిస్తే, సమస్త పాపాలు తొలగి, కీర్తిప్రతిష్టలు లబిస్తాయి. మిగిలిన ఎనిమిది ఆలయాల కన్నా ఈ ఆలయాన్ని చేరు కోవడమే మిక్కిలి శ్రమతో కూడిన పని. ఇక్కడ “రక్తకుండం“ అనే అరుణ వర్ణ పుష్కరిణి ఉంది. ఇందులో నీరు ఎల్లప్పుడూ ఎఱ్ఱగానే ఉంటాయి. కారణం నరసింహస్వామి హిరణ్య కశిపుని సంహరించిన తరువాత రక్తసిక్తమైన తన చేతులను ఈ పుష్కరిణిలోనే కడుక్కున్నాడట. అందువల్ల ఆ నీరు ఎఱ్ఱగా ఉండిపోయింది.

శ్రీ పావన నరసింహస్వామిఎగువ అహోబిలానికి 6 కిమీ దూరం లో పావన నదీ తీరాన ఈ స్వామి కొలువు తీరిఉన్నాడు. నవ ఆలయాల్లోఈ ప్రదేశం అత్యంత ప్రశాంతమైంది. అందుకే ఈ ప్రదేశాన్ని క్షేత్రరత్నమని పిలుస్తారు. ఈయనకే పాములేటి నరసింహస్వామి అని కూడ పేరు. ఈయనను సేవిస్తే ఈ జన్మలోను, పూర్వజన్మల్లోను తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీతొలగి పోతాయని చెపుతారు. ఈస్వామి భక్తులు ఇచ్చిన నివేదనను ఖచ్చితంగా సగం స్వీకరించి మిగతా సగం ప్రసాదంగా ఇచ్చివేస్తాడని ప్రతీతి.

శ్రీకరంజ నరసింహస్వామి: ఎగువ అహోబిలానికి 1 కిమీ దూరంలో ఈ స్వామి కొలువై ఉన్నాడు. కరంజ వృక్షం క్రింద కొలువు తీరిన స్వామి కాబట్టి ఈయన కరంజ నరసింహస్వామి అయ్యారు. ఈ స్వామిని మనసా వాచా కర్మణా త్రికరణ శుధ్ధి గా సేవిస్తే జీవితంలో అభివృధ్ధిని సాధిస్తారని, కోరిన కోరికలన్నీ తీరుతాయనిచెపుతారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి;;--ఈ తొమ్మిది రూపాలు కాక దిగువ అహోబిలం లో ప్రహ్లాదవరదుడైన లక్ష్మీనరసింహుడు శాంతరూపుడై, భక్తులను రక్షిస్తున్నాడు . ఇది మూడు ప్రాకారాలు కలిగిన దివ్యాలయము. శ్రీరాజ్యలక్ష్మీ దేవి, శ్రీఆండాళ్. ఆళ్వారుల సన్నిథికూడ ఉపాలయాలుగా మనకు దర్శనమిస్తాయి. నవ గ్రహాలకు ఈ నవ నారసింహ రూపాలకుగల సంబంధాన్ని కూడ భక్తులువిశ్లేషించుకుంటున్నారు.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామిదిగువ అహోబిలం లోని శ్రీ లక్ష్మీనృసింహ ఆలయ మంతా విజయనగర శిల్ప సంప్రదాయంతో అలరారుతుంటుంది. ముఖ మండపం, రంగ మండపాలు చిత్ర విచిత్ర శిల్పాకృతుల తోనయన మనోహరంగా కన్పిస్తాయి. ఎక్కువ స్థంభాల మీద చెంచులక్ష్మీ నరసింహుల విలాసాలు మనకు కన్పిస్తాయి. పట్టాభి రాముడు, దశావతారాలు, వివిథ దేవతాకృతులు, నర్తకీమణుల నాట్యభంగిమలు ఆలయమండప స్థంభాలపై కొలువు తీరికనువిందు చేస్తాయి. ఈ శిల్పాకృతులను చూస్తుంటే అహోబిలం! అనడమేకాదు అహోశిల్పం! అనాలనిపిస్తుంది. ఆలయానికి బైటకూడ చాలా మండపాలు మనకు కన్పిస్తాయి. ప్రథాన ఆలయానికి వెలుపల విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దిగ్విజయ యాత్రా చిహ్నంగా వేయించిన జయస్థంభాన్ని మనం గర్వంగా దర్శించవచ్చు. కాకతి శ్రీ ప్రతాపరుద్ర చక్రవర్తి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు నిధులిచ్చినట్లు, మాలోల నరసింహునకు బంగారు ఉత్సవిగ్రహాన్ని బహూకరించినట్లు చెప్పబడుతోంది. కాలజ్ఞానవేత్త శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు ఈ ఆలయంలో కూడ కూర్చొని కాలజ్ఞానం వ్రాసినట్లు చెపుతారు. సంకీర్తనాచార్య శ్రీ అన్నమయ్య స్వామి సన్నిధిలోఎన్నో కీర్తనలను ఆలాపించి, స్వామికి సమర్పించాడు.

తిరుమల శ్రీ శ్రీనివాసుడు పద్మావతీ దేవితో తన కళ్యాణానికి ముందులక్ష్మీనరసింహుని ఆశీస్సుల కోసం అహోబిలం వచ్చినట్లు ఒక ఐతిహ్యం. ఎగువ అహోబిలంలో స్వామి ఉగ్రరూపుడై ఉండటంతో దిగువ అహోబిలంలో ప్రహ్లాద వరదుడైన లక్ష్మీనరసింహుని శాంతమూర్తిగా ఆయనే ప్రతిష్టించినట్లు చెపుతారు. దీనికి సాక్ష్యంగా ప్రధాన ఆలయానికి దక్షిణంగా శ్రీ వేంకటేశ్వరాలయం మనకు దర్శనమిస్తుంది.

ఉగ్ర స్థంభం:
ఎగువ అహోబిలానికి ఎగువన 8.కిమీ దూరంలో ఈ ఉగ్రస్థంభం ఉంది. దీని నుండే నృసింహ ఆవిర్భావం జరిగి హిరణ్యకశిపుని సంహరించాడని చెపుతారు. దీని దర్శనం, స్పర్శనం సర్వపాపహరమని భక్తుల నమ్మకం. ఈ ఉగ్రస్థంభమే ప్రజల వాడుకలో కెక్కి ఉక్కు స్థంభమై పోయింది. స్థంభోద్భవ నారసింహుని భక్తులు దీనిలో దర్శిస్తారు.

उग्रं वीरं महाविष्णुं ज्वलंतं सर्वतोमुखं नृसिंहं भीषणं भद्रंमृत्युर्मृत्युं नमाम्यहम्.!!
అని ఉగ్రనరసింహునికి చేతులెత్తి జోతలు సమర్పిస్తారు.
ఉగ్ర స్థంభం


ప్రహ్లాదమెట్టు: 
ఎగువ అహోబిలానికి ,ఉగ్రస్థంభానికిమధ్య లోని ఒక గుహలో ప్రహ్లాదుని రూపందర్శన మిస్తుంది. ప్రహ్లాద నారద పరాశర పుణ్డరీక అని భక్తగ్రణ్యుడుగా కొనియాడబడుతున్న ప్రహ్లాదుని సేవించడం సకల కల్మష హరం గా భక్తులు భావిస్తారు.

అహోబిల మఠం:

ఆథ్యాత్మిక వికాసం కోసం, వైష్ణవ సంప్రదాయ పరిరక్షణ కోసం, ప్రాచీన మంత్ర శాస్త్ర సముద్ధరణ కోసం ఇచ్చట శ్రీ వైష్ణవ సంప్రదాయజ్ఞులచే ఒక మఠం స్థాపించబడింది. ఈ మఠాథిపతుల్ని జియ్యరులంటారు. ఈ మఠం చాల పురాతనమైంది. క్రీ.శ 1319లో కేశవాచార్యులకు ఒక కుమారుడు జన్మించాడు. అతనే శ్రీనివాసాచార్యులు. ఇతను ప్రహ్లాదునివలెనే, పసితనము నుండి శ్రీహరి ధ్యానమే చేస్తుండేవాడు. ఈయన పుట్టిన ఊరు తిరునారాయణ పురం. ఈ బాలుని భక్తికి ముగ్ధుడైన స్వామి అతనికి ప్రత్యక్షమై, అహోబిలానికి రమ్మని ఆదేశించాడు. అహోబిలం చేరిన ఆ బాలుని భక్తి ప్రపత్తులను, దీక్షా దక్షతను చూసి సంతోషించిన ఆనాటి అధికారి ముకుందరాయలు ఆ బాలుని శిష్యునిగా స్వీకరించాడు.

చెంచులక్ష్మీ నరసింహుల స్థంభ శిల్పం


ఈ బాలునికి సాక్షాత్తు స్వామియే యోగిరూపంలో వచ్చి, అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. శిష్యునిగా స్వీకరించారు. ఆనాటి నుండి జియ్యరులు శఠగోపయతిగా ప్రసిద్ధులయ్యారు. వీరి ఆధ్వర్యంలో వివిధ సేవా, అభివృద్ధి మత ప్రచార, సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచ వ్వాప్తంగా ఈ మఠానికి పేరు ప్రఖ్యాతులున్నాయి.

ఇచ్చటి గిరిజనులు ఛెంచులక్ష్మిని తమ ఆడపడుచుగా భావించి చెంచులక్ష్మీ నరసింహుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సమయంలోవారి సంప్రదాయాలే కొనసాగటం చూడముచ్చట గా ఉంటుంది.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...