Showing posts with label Road Trip. Show all posts
Showing posts with label Road Trip. Show all posts

Monday, 23 January 2017

2017 చూడాలని ఉంది

ఎన్ని చూసినా ఇంకా చూడవలసినవి, ఎంత చెప్పినా ఇంకా తెలియాల్సినవి మన దేశంలో ఎన్నో అద్భుత ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో నాటి రాజులు కట్టించినవి కొన్నయితే, ఆధ్యాత్మికతకు దారులు చూపేవి మరికొన్ని. ప్రకృతి ప్రేమికుల దాహార్తిని తీర్చేవి ఇంకొన్ని. 2017లో ఈ అద్భుతమైన 17 ప్రదేశాల గురించి తెలుసుకుంటే ‘చూడాలని ఉంది’ అనకుండా ఉండలేరు.

  • 1 ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ప్రముఖమైనది వెయ్యేళ్లనాటి కేదార్‌నాథ్‌ మందిరం. పాండవులు నిర్మించిన ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు పునర్నిర్మించిడినట్టు కథనాలున్నాయి. కురుక్షేత్ర యుద్ధానంతరం పాండవులు శివుని కోపం తపస్సు చేసి, ఇక్కడ కొలువుదీరమని కోరినట్టు కథనాలున్నాయి. కేదార్‌నాథ్‌ను దర్శిస్తే జన్మచక్రంలో బంధీలుకారని, మోక్షప్రాప్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. మందిరంతో పాటు హిమాలయా ల్లోని గర్హాల్‌ వద్ద మందాకిని నది సోయగాలను చూడటానికి రెండు కళ్లు సరిపోవు. ఈ ప్రాంతాన్ని పరమేశ్వరుడు రక్షిస్తున్నట్టు చెబుతారు. మంచు కొండలలో కొలువుదీరిన కేదార్‌నాథ్‌ చార్‌ధామ్‌ యాత్రలలో రారాజు. సత్యయుగానికి చెందిన ఈ దేవాలయం గురించే కాదు, ఈ ప్రాంతం గురించి ఎన్నో కథనాలున్నాయి.
    కేదార్‌నాథ్‌ చేరుకోవాలంటే..
    విమానమార్గంలో డెహ్రడూన్‌ (ఉత్తరాఖండ్‌) ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలి. అక్కడనుంచి బదరినా«ద్‌∙315, కేదార్‌నాథ్‌ 240, గంగోత్రి 298, యమునోత్రి 177 కిలోమీటర్లు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు విమాన సదుపాయాలున్నాయి. రైల్వేస్టేషన్‌ రిషీకేష్‌లో ఉంది. ఇక్కడ నుంచే బదరినాథ్, కేదార్‌నాథ్, గంగోంత్రి, యమునోత్రిలకు హరిద్వార్‌ మీదుగా చేరుకోవాలి. హరిద్వార్‌కు అన్ని నగరాల నుంచి రైలుమార్గాలున్నాయి. రిషికేష్‌ నుంచి కేదార్‌నాథ్‌ మీదుగా రుద్రప్రయాగ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు: బదరినాథ్‌తో పాటు సూర్యకుండ్, నీల్‌కం, సతోపంత్‌ సరస్సు సందర్శనీయ స్థలాలు. మరిన్ని వివరాలకు: http://uttarakhandtourism.gov.in// లాగిన్‌ అయి తెలుసుకోవచ్చు.

  • మనోహరమైన ప్రదేశాలు, చారిత్రక కట్టడాలకు ఆలవాలం అల్వార్‌. రాజస్థాన్‌లో గల ఈ ప్రాంతానికి  ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 163 కిలోమీటర్లు. అల్వార్‌కు సమీప పట్టణాల నుంచి బస్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రైలుమార్గం గుండా అల్వార్‌ వెళ్ళే పర్యటన జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉంటుంది. సరిస్కా టైగర్‌ రిజర్వ్‌లో హోటల్‌ సదుపాయాలున్నాయి. ఇక్కడి అడవిలో బస ఓ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. రాజస్థాన్‌ ప్రాంతీయ వంటకాలను ఇక్కడ రుచి చూడవచ్చు. ఢిల్లీ వాసులకు ఇది వీకెండ్‌ స్పాట్‌ అని చెప్పవచ్చు. బంధుమిత్రులతో కలిపి వినోద విహారానికి ‘సరిస్కా’ ఒక అద్భుతమైన ప్లేస్‌ అని చెప్పవచ్చు. ఢిల్లీ నుంచి 200 కిలోమీటర్లు, జైపూర్‌ నుంచి 107 కిలోమీటర్లు. 1955లో అభయారణ్యంగా ప్రకటించిన ప్రభుత్వం 1979లో నేషనల్‌ పార్క్‌గా ప్రకటించింది.
    http://rtdc.tourism.rajasthan.gov.in


  • 3 ఏడవ మనువు ఈ ప్రాంతాన్ని సృష్టించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అతని పేరు మీదుగానే మనాలీ వచ్చిందని ప్రతీతి. ఎల్తైన పర్వత ప్రాంతాలు వాటి మీదుగా పచ్చని వనాలు, చల్లటి మలయమారుతం, పువ్వుల సోయగాలు ఎంతసేపయినా అలసటేరాని ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది మనాలీ అని చెప్పుకోవచ్చు. భుంటార్‌లో విమానాశ్రయం నుంచి మనాలి 50 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీ– షిమ్లా నుంచి మనాలీ చేరుకోవచ్చు.  చలికాలంలో గడ్డకట్టపోయేట్టుగా ఉండే ఇక్కడి వాతావరణం వేసవికి అనుకూలంగా ఉంటుంది.
    ఆకర్షణీయ ప్రదేశాలు: అత్యంత నిర్మాణ కౌశలంతో ఆకట్టుకునే హిడింబా, మనై దేవాలయాలు. అలాగే వశిష్ట మహర్షి ప్రాచీన ఆలయం. టిబెటన్‌ల ఆశ్రమాలు, శివ, గాయత్రి, అర్జున ప్రాచీన మందిరాలను సందర్శించవచ్చు. సైట్‌ సీయింగ్‌ టూర్స్‌కి హిమాచల్‌ ప్రదేశ్‌ టూరిజమ్‌ ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తోంది. వివరాలకు ఉఝ్చజీ Email: manali@hptdc.in

  • 4 ఆరావళి పర్వతప్రాంతంలో ఉన్న ఉదయపూర్‌ (రాజస్థాన్‌)కు దేశంలో అత్యంత రొమాంటిక్‌ పట్టణాలలో ఒకటిగా పేరుంది. చుట్టూ నాలుగు సరస్సులతో అలరారుతున్న ఈ పట్టణం ఎన్నో విశేషాలకు నెలవు. ‘జెవెల్‌ ఆఫ్‌ మేవార్‌’, ‘వెనీస్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌’ అనే పేర్లు దీనికి సొంతం. అద్భుతమైన సరస్సులు ఉండటం ఒక విశేషమైన అత్యద్భుతమైన చారిత్రక సౌరభాలు ఉండటం మరో విశేషం. మొఘలుల కోటలు, ప్యాలెస్‌లు, దేవాలయాలు, హిల్స్‌ ఈప్రాంత సొంతం. ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నధ్వారా దేవాలయం. పిచోలా సరస్సు చుట్టూ స్నాన ఘట్టాలు, దేవాలయాలు, ప్యాలెస్‌లు ఉండటంతో ఇది కమలంలా భాసిల్లుతుంది. ఫతేసాగర్‌ లేక్, ఉదయ్‌సాగర్‌ లేక్, జైస్మండ్‌ లేక్‌లు ఇక్కడ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. ప్రాచీన ఉద్యానవనం సహేలియో కి బరి ఫతేసాగర్‌ సరస్సు ప్రాంతంలో ఉంది. ఇక్కడ శిల్ప్‌గ్రామ్‌ కళాకృతులకు నెలవు. ఇక్కడ ఉన్న 26 ఇండ్లు అత్యంత సంప్రదాయ నిర్మాణ కౌశలంతో భాసిల్లుతాయి. ఇది ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది.
    http://rtdc.tourism.rajasthan.gov.in/

  • 5 ప్రకృతి ప్రేమికులను అయస్కాంతంలా ఆకర్షించే శక్తి నుబ్రావ్యాలీ సొంతం. మాటల్లో చెప్పలేని ప్రకృతి అందాలను ఇక్కడ వీక్షించవచ్చు. సమీప ఎయిర్‌పోర్ట్‌ లేహ్‌లో ఉంది. ఇక్కడి ‘కౌశక్‌ బకులా రిన్‌పోచే’ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నుబ్రావ్యాలీకి 120 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి జీప్‌లో వ్యాలీకి వెళ్లేమార్గం అత్యద్భుతంగా ఉంటుంది. రైలుమార్గంలో వెళ్లాలంటే జమ్మూలోని ‘టవి’కి వెళ్లాలి. ఇక్కడ నుంచి నుబ్రా 620 కిలోమీటర్లు.

    నుబ్రావ్యాలీ మంచు ప్రదేశం. బస్సు సదుపాయాలు తక్కువ. జీపుల్లోనే ఈ వ్యాలీలో ప్రయాణించాల్సి ఉంటుంది. ట్రక్స్, మిలటరీ వాహనాల వల్ల బస్సులు చాలా చోట్ల ఆగిపోయే అవకాశం ఉంది.నుబ్రావ్యాలీ చేరుకున్న పర్యాటకులు ఖర్దుంగా వద్ద మిలిటరీ పాసులు తీసుకొని, ఫొటోల కోసం అనుమతి పొందాలి. ఈ ప్రాంతంలో కాశ్మీర్‌ శాలువాలు, బాదంపప్పులు, ఆప్రికాట్‌లను కొనుగోలు చేయవచ్చు. కుంకుమపువ్వు తోటల పెంపకాన్ని దగ్గరగా పరిశీలించవచ్చు.

    32 మీటర్ల పొడవున్న మైత్రేయ బుద్ధను ఇక్కడ వీక్షించవచ్చు. దలైలామా ఈ ప్రాంతాన్ని సందర్శించడంతో ప్రపంచశాంతి ప్రదేశంగా పేరొచ్చింది. ఒంటెల మీద సవారీ ఈ ప్రాంత ప్రత్యేకత. ఒంటెలు ఎడారులలో కదా నడిచేది అనే అనుమానం కలగవచ్చు. కానీ, ఇక్కడ దానికి విరుద్ధంగా సిల్క్‌ రూట్‌లో ఒంటెల మీద ప్రయాణం అత్యద్భుతంగా ఉంటుంది. లేహ్‌కి 140 కిలోమీటర్ల దూరంలో పనామిక్‌ గ్రామం ఓవర్‌వ్యూ అత్యద్భుతంగా ఉంటుంది.

  • గుజరాత్‌లో సోలంకియుల కాలాన్ని స్వర్ణయుగంగా చెప్ప వచ్చు. వీరి కాలంలో రూపుదిద్దుకున్న అనేక కట్టడాలు గుజరాత్‌ లోని మొధెరాలో సందర్శించవచ్చు. పుష్పవతి నది బ్యాక్‌డ్రాప్‌లో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కల టెర్రా–ఫార్మడ్‌ గార్డెన్‌లో నింగిని తాకుతున్నట్టుగా ఉండే వృక్షాలను వీక్షించవచ్చు. ఇక్కడి సన్‌ టెంపుల్‌ తప్పక సందర్శించదగినది. మొ««ధెరాలో చక్రవర్తుల కథనాలెన్నింటినో తెలుసుకోవచ్చు. విశాలమైదానాలు, స్వాగతం పలికే దేవాలయ కాంప్లెక్స్‌ చెప్పుకో దగినవి. పురాణాలలో ఈ ప్రాంతం పేరు ‘మొధెరక్‌’ అని ఉంది. అంటే మర ణించిన పుట్టలు అని అర్థం. జైనుల అచ్చుప్రతులు, బ్రహ్మపురాణం, స్కందపురాణాలు ఈ ప్రాంతంలోనే పుట్టాయి. ధర్మవన్యక్షేత్ర అనే పేరు కూడా ఈ ప్రాంతానికి ఉంది. మొధెరా సన్‌ టెంపుల్‌ నాటి నిర్మాణ చాతుర్యాన్ని కళ్లకు కడుతుంది. కమలంలా ఉండే ఈ టెంపుల్‌ శిఖరభాగం ఇక్కడి నీటిలో అద్దంలో చూసినట్టు దర్శించవచ్చు. ద్వారం గుండా బయల్దేరితే సభామండపం, అంతరల్, గర్భగృహాలను చేరుకుంటాం.

    ఈ ప్రాంతానికి అన్ని ప్రధాన పట్టణాల నుంచి రోడ్డు మార్గం గుండా చేరుకోవచ్చు. అహ్మదాబాద్‌లో ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్‌లు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి మొధెరాకు 101 కిలోమీటర్లు. సమీప రైల్వేస్టేషన్‌ మెహసనాలో ఉంది.  Mail: info@gujarattourism.com

  • ఇది దేశంలోనే అతి పెద్ద జైన్‌ టెంపుల్‌. భావనగర్‌కు (గుజరాత్‌) 51 కిలోమీటర్ల దూరంలో ఉంది పలిటన. ఇది 863 దేవాలయాల సముదాయం. శత్రుంజయ హిల్‌పైన పలిటన దేవాలయం కొలువుదీరి ఉంది. మొత్తం 3950 మెట్లు 3.5 కిలోమీటర్లు అధిరోహిస్తే ఈ మందిరాలను చేరుకోవచ్చు. క్రీ.శ. 900 ఏళ్ల కాలంలో రెండుదశలుగా నిర్మించారు. 16వ శతాబ్దిలో ఈ దేవాలయ నిర్మాణ పునరుద్ధరణ చేపట్టారు.
    రోడ్డుమార్గం గుండా భావనగర్‌కి చేరుకోవాలంటే ముంబై వయా అహ్మదాబాద్‌ వెళ్లే జాతీయరహదారి మీదుగా 200 కిలోమీటర్లు ప్రయాణించాలి. అహ్మదాబాద్‌లో రైల్వేస్టేషన్‌ ఉంది. ముంబై, అహ్మదాబాద్‌ల నుంచి భావనగర్‌కు డొమెస్టిక్‌ ఎయిర్‌లైన్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాలకు: టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోకు 9493350099 ఫోన్‌ చేసి కనుక్కోవచ్చు. E-mail: tibhyderabad@gujarattourism.com

  • 8 స్నేహ బృందంతో కలిసి ట్రెక్కింగ్‌ వెళ్లాలంటే మధేఘాట్‌ సరైన ప్లేస్‌. పశ్చిమపూణె (మహారాష్ట్ర) రాయగడ్‌ జిల్లా సరిహద్దు నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది మధేఘాట్‌. భటఘర్‌ డ్యామ్‌ బ్యాక్‌ వాటర్‌ సమీపంలో టోర్నా కోట, రాజ్‌గడ్, రాయ్‌గడ్‌ కోటలు ఉన్నాయి. సముద్రమట్టం నుంచి 850 మీటర్ల ఎత్తున టోర్నఫోర్ట్‌ ఉంటుంది. రాయగడ్‌ ఫోర్ట్, లింగాన, వరంధా ఘాట్, శివథార్‌ ఘాట్‌ ఉన్నాయి. అత్యంత చల్లగా ఉండే హిల్‌ స్టేషన్‌ ఇది. ఇక్కడ గల లింగన ఫోర్ట్‌ను ఛత్రపతి శివాజీ ఉపయోగించారు. నాటి గుర్తులను ఇక్కడ వీక్షించవచ్చు. బిర్వాడి నుంచి మధేఘాట్‌కు నడకదారి గుండా చేరుకోవచ్చు. మధేఘాట్‌ కింద చిన్న శివ మందిరం ఉంటుంది. ఈ స్వామిని‘దేవ్‌ టేక్‌’ అంటారు. ట్రెక్కర్స్‌కి ఇది మంచి ట్రెక్కింగ్‌ స్పాట్‌. వీటితోపాటు కెంజాల్‌గడ్, రాయిరేశ్వర్, రాయ్‌గడ్, లింగన ఫోర్ట్, శివతార్‌ ఘల్‌ కి మహాబలేశ్వర్‌ రోడ్‌ మీదుగా వెళితే ముంబయ్‌–గోవా హైవే మీదుగా బిర్వాడి చేరుకోవచ్చు.

  • పశ్చిమ బెంగాల్‌లో టెర్రకోట టెంపుల్స్‌ సముదాయాలు ఎక్కువ. వీటిలో బిష్ణుపూర్‌ ఆలయంలో ప్రఖ్యాతిగాంచినది. గుప్తుల కాలంలో నిర్మించిన ఈ టెర్రకోట మందిరాలు అలనాటి సాంస్కృతిక కళావైభవంతో అలరారు తున్నాయి. బిష్ణుపూర్‌ టెంపుల్‌ ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. ఈ ప్రాంతం కళల కాణాచి, విశ్వవిద్యాలయాలకు, ప్రాచీన సాంస్కృతిక  విద్యాలయాలకు పెట్టింది పేరు.

    బిష్ణుపూర్‌ నుంచి అరమ్‌బాగ్, దుర్గాపూర్, అసన్‌సోల్, కోల్‌కత్తాకు రోడ్డుమార్గాలున్నాయి. బిష్ణుపూర్‌కు కలకత్తా నుంచి రైలు సదుపాయాలున్నాయి. బిష్ణుపూర్‌ మందిరానికి చేరుకోవాలంటే పట్నం నుంచి ఆటో–రిక్షాలలో బయల్దేరవచ్చు. కాలుష్యరహితంగా ఉంచాలనే ధ్యేయంతో ఇక్కడకు మోటార్‌వాహనాలను అనుమతించడం లేదు. సమీప ఎయిర్‌పోర్ట్‌ కోల్‌కతా. ఇక్కడ నుంచి బిష్ణుపుర్‌ 140 కిలోమీటర్లు. ఆకర్షణీయప్రదేశాలు:  రస్‌మంచా, పంచరత్న టెంపుల్, పతార్‌ దర్వాజ, గడ్‌ దర్వాజ, దాల్‌మండల్‌ కమాన్, స్టోన్‌ చారియట్, నూతన్‌ మహల్, చిన్నమస్త టెంపుల్‌.

  • 10 మధ్యప్రదేశ్‌లోని ఓర్చా కట్టడాన్ని బుందేల్‌ ఛీఫ్తాన్‌ రుద్రప్రతాప్‌ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ కట్టడం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అక్టోబర్, మార్చిలలో సందర్శించదగినదిగా పేరొందిన ఈ ప్రాంతానికి సమీప ఎయిర్‌పోర్ట్‌ ఖజురహో. రైల్వేస్టేషన్‌ ఝాన్సీలో ఉంది. ఓర్చాకు ఇది 19 కిలోమీటర్లు. ఝాన్సీ–ఖజరహోకు రోడ్డు మార్గం ఉంది. గ్వాలియర్‌కు 120 కిలోమీటర్లు, ఖజరహోకు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. జహంగీర్‌ మహల్, రాయ్‌ప్రవీణ్‌మహల్, రాజ్‌మహల్, చతుర్భుజి టెంపుల్, లక్ష్మీనారాయణ టెంపుల్, జానకి, హనుమాన్‌ మందిర్, షాహిద్‌స్మారక్‌ ప్రదేశాలు సందర్శించదగినవి. ఇక్కడ నుంచి 139 కిలోమీటర్ల దూరంలో డియోగడ్‌ ఉంది.
    www.mptourism.com-----

  • 11 తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో ఉంది ఎమరాల్డ్‌ లేక్‌. ఊటీ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ సరస్సులో విభిన్నరకాల చేపలు ఆకట్టుకోగా, చుట్టుపక్కల పక్షుల సందడి మనల్ని మరోలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఉషోదయ, సూర్యస్తమయాలు అందమైన పెయింటింగ్‌లా దర్శనమిస్తాయి. చుట్టుపక్కల తేయాకు తోటలు, వాటిమీదగా పరమళించే తేనీటి ఘుమఘుమలు, టీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి ప్రత్యేకం.  కోయంబత్తూర్‌కి హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సదుపాయాలున్నాయి. సమీప రైల్వేస్టేషన్‌ కోయంబత్తూరులో ఉంది. కోయంబత్తూర్‌ నుంచి ఎమరాల్డ్‌ లేక్‌కి ట్యాక్సీ కారులో, బస్సులలో బయల్దేరవచ్చు.  ఆకర్షణీయ ప్రదేశాలు: బొటానికల్‌ గార్డెన్, ఊటీ, రోజ్‌ గార్డెన్, లేక్‌ పార్ట్, ఊటీ లేక్, డీర్‌ పార్క్‌.

  • 12 దేవుడి సృష్టిగా అభివర్ణించే ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గ్యాంగ్‌టక్‌. సిక్కిమ్‌ వాసులు ఇక్కడ ‘పాంగ్‌ లహ్‌బ్సోల్‌’ పండగ ప్రతి యేటా అత్యంత ఘనంగా జరుపుతారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై గడ్డకట్టే చలి ఉంటుంది. మే నుంచి సెప్టెంబర్‌ వరకు వేసవి. జూన్, జూలై, ఆగస్టు నెలలు వర్షాకాలం. సిక్కిమ్‌లో బాగ్దోగ్రా ఎయిర్‌పోర్ట్‌ ఉంది. గ్యాంగ్‌టక్‌కి 124 కిలోమీటర్లు. సిక్కిమ్‌ టూరిజమ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ హెలీకాప్టర్‌ సర్వీసులను నడుపుతోంది. ఇక్కడ నుంచి గ్యాంగ్‌టక్‌కి 20 నిమిషాలలో చేరుకోవచ్చు. జల్‌పైగురి, సిల్‌గురిలలో రెండు రైల్లే స్టేషన్లు ఉన్నాయి. బాగ్దోగ్రా, డార్జిలింగ్, పెమయంగ్‌స్టే, ట్సూంగో, యమ్‌తంగ్‌లకు గ్యాంగ్‌టక్‌ నుంచి రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ ప్రాంతాలన్నీ 20 నుంచి 120 కిలోమీటర్ల లోపు పరిధిలో ఉన్నాయి. గ్యాంగ్‌టక్‌లో మార్చ్‌ నుంచి మే వరకు సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు బడ్జెట్‌ హోటల్స్‌ సదుపాయాలను పొందవచ్చు.
    మరిన్ని వివరాలకోసం... http://www.sikkimtourism.gov.in లాగిన్‌ అవ్వచ్చు.

  • 13 ఇలా తలం పై దేవుడి స్వర్గం ఏదైనా ఉందంటే అది కేరళ. నీలగిరి పర్వత శ్రేణులలో కొలువుదీరిన ఈ పర్యాటక ప్రాతం ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం. పచ్చని చెట్లు, స్వచ్ఛమైన నీళ్లు, ఆకట్టుకునే విశాల అటవీ ప్రాంతాలు... కేరళను ఒక్కసారైనా సందర్శించాల్సిందే అనుకోకుండా ఉండరు పర్యాటకులు. కేరళ ఆయుర్వేద చికిత్సలకు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. ఈ పర్వత శ్రేణులలో 19వ శతాబ్దిలో తేయాకుతోటల పెంపకం విరివిగా చేపట్టారు. ఎర్వికులమ్‌ నేషనల్‌ పార్క్‌ లక్కమ్‌ జలపాతాలు, 2,695 మీటర్ల ఎత్తులో ఉండే అనముడి శిఖరం ఇక్కడ తప్పక దర్శించాల్సినవి.

    కొచ్చిలో అంతర్జాతీయ విమానాశ్రమం ఉంది. ఇక్కడనుంచి 130 కిలోమీటర్లు మున్నార్‌. హైదరాబాద్‌ నుంచి కొచ్చికి విమానాలున్నాయి. కొచ్చిలో రైల్వేస్టేషన్‌ ఉంది. హైదరాబాద్‌ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో కొచ్చికి చేరుకోవచ్చు. ఇక్కడ నుంచి క్యాబ్స్, బస్సులలో మున్నార్‌ చేరుకోవచ్చు. ఆకర్షణీయ ప్రదేశాలు:  పోతమేడు, దేవికులమ్, పల్లివాసల్, అట్టుకల్, న్యాయమకడ్, చిత్తిరపురం, లోకల్‌ హార్ట్‌ గ్యాప్, రాజమల. ఇవన్నీ 15 కిలోమీటర్లలోపు పరిధిలో ఉన్నాయి.

















Wednesday, 18 January 2017

తీపిగుర్తుగా హాలిడే ట్రిప్‌

హాలిడే ట్రిప్‌ తీపిగుర్తుగా మిగిలిపోవాలంటే ఈ టిప్స్‌ను ఫాలో అయిపోండి.
  • నాణ్యమైన అండర్‌ గార్మెంట్స్‌ను ఎంచుకోండి. మీరు నమ్మినా, నమ్మకపోయినా నాణ్యమైన లోదుస్తులు హాలిడే ట్రిప్‌లో చాలా అవసరం. ఎందుకంటే చాలా దూరం వాకింగ్‌ చేయాల్సి వస్తుంది. సైట్‌ సీయింగ్‌ కోసం నడవాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్‌, సయాకింగ్‌ వంటివి చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే యాంటీ బ్యాక్టీరియల్‌ అండర్‌ గార్మెంట్స్‌ను ఎంచుకోండి.
  • మందులు తీసుకెళ్లండి. ఫస్ట్‌ ఎయిడ్‌కిట్‌, నొప్పి నివారణ మాత్రలు తప్పనిసరి. దగ్గు మందు, జ్వరానికి పారాసెటమాల్‌ వంటి జనరల్‌ మందులు వెంట ఉంచుకోండి.
  • ఇంటర్నేషనల్‌ ట్రిప్స్‌కు వెళుతున్నట్లయితే కూపన్స్‌ కోసం ప్రయత్నించండి. డబ్బు ఆదా విషయంలో కూపన్స్‌ బాగా ఉపకరిస్తాయి.
  • టాబ్లెట్‌లో మీకు నచ్చిన వీడియోలు, పాటలు డౌన్‌లోడ్‌ చేసి పెట్టుకోండి. లాంగ్‌ ట్రిప్‌లో బోర్‌డమ్‌ను పోగొట్టడానికి ఇవి బాగా పనికొస్తాయి.
  • కొంచెం ఖర్చు ఎక్కువైనా లగ్జరీకే ప్రాధాన్యం ఇవ్వండి. ఎందుకంటే ట్రిప్‌ మెమొరబుల్‌గా నిలిచిపోవాలంటే ఆ మాత్రం చేయక తప్పదు.
  • ఇయర్‌ప్లగ్స్‌ను బ్యాగులో ఉంచుకోండి. నాయిస్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ఇయర్‌ ప్లగ్స్‌ బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే టూర్‌ మెమొరబుల్‌గా చిరకాలం నిలిచిపోతుంది.

Thursday, 31 March 2016

బెంగుళూరు - నంది హిల్స్ - లేపాక్షి

Bangalore - Nandi Hills - Lepakshi - One Day Road Trip!

రోజువారి జీవితంతో విసిగి పోయారా? 
ఒక్క రోజు రిలాక్స్ అయి ఆనందించాలని అనుకుంటున్నారా? 
మీ విలువైన సమయమును స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో ప్రయాణం చేస్తూ గడపాలని అనుకుంటున్నారా?
ఈ ప్రశ్నలకు మీ సమాధానం 'అవును' అయితే, ఈ రోడ్ ట్రిప్ మీకు మీరు కోరినవన్నీ అందిస్తుంది.

ప్రయాణం అనేటప్పటికి అందులో వినోదం తప్పక చూస్తారు. బెంగుళూరు నుండి లేపాక్షికి వయా నంది హిల్స్ రోడ్డు ప్రయాణం వినోదం కంటే కూడా సౌకర్యం కూడుకొన్నది. ఈ ప్రయాణంలో మీరు ప్రకృతిని దాని సహజ అందాలలో చూడవచ్చు. 

సుమారు 137KM. కల దూర ప్రయాణం చేయాలంటే, మీరు ఉదయం వేళ కొంచెం పెందలకడే జర్నీ మొదలు పెట్టాలి. సూర్యోదయానికి ముందు బెంగుళూరు రోడ్లు ఖాళీగా వుంటాయి. ప్రశాంతం మరియు ఎల్లపుడూ ఆహ్లాదంగా వుండే బెంగుళూరు వాతావరణం మీ ఈ రోడ్ జర్నీకు మరింత సహకరిస్తుంది. మరి బెంగుళూరు నుండి లేపాక్షి కి నంది హిల్స్ మార్గం ద్వారా ఎలా వెళ్ళాలి అనేది చూడండి

బెంగుళూరు - నంది హిల్స్ - లేపాక్షి - ఒక్క రోజు రోడ్డు ప్రయాణం!

ప్రయాణం మొదలు పెట్టండి
రోడ్డుకు ఇరు పక్కలా సుందరమైన దృశ్యాలు కనపడతాయి. పచ్చటి భూమి, సగం నిద్ర కళ్ళతో వీదులలో తిరిగే పిల్లలు, సగం సగం నిద్ర లేచిన పశువులు రోడ్డు పై నడవటం వంటివి మీరు ఒక గ్రామీణ ప్రాంతంలో వున్నామా అనే ఫీలింగ్ కలిగిస్తాయి. ప్రకృతి ఒక్క పెట్టున చల్ల గాలితో మిమ్ములను స్పర్శించి, తాజా గాలి అందిస్తుంది. మీరు మీ కారు లేదా ఇతర వాహనం నుండి దిగి వచ్చి ఆనందించాలని ప్రయత్నిస్తారు. కాని మీరు వెళ్ళవలసిన దూరం గుర్తుకు వచ్చి జర్నీ కొనసాగిస్తారు.

మేఘాల్లోకి ప్రయాణం ....
సూర్యోదయానికి పూర్వం నంది హిల్స్ వాతావరణం సన్నని ఉదయపు వేళ మంచు పొరలు, మేఘాలు చల్లటి గాలులు, అన్నీ కలిపి మీరు ఒక స్వర్గంలో వున్నామా అనిపించేలా చేస్తుంది.
మబ్బుల మధ్య నడక...
నంది హిల్స్ శిఖరం చేరాలంటే, కొండ చేరి నప్పటి నుండి కొంత దూరం నడవాలి. రాజకుమారుడి కథలలో వలే, అందమైన వాతావరణంలో చిన్న నడక సాగించండి.
ఒక్కటే ధ్యానం
అక్కడ ఏర్పడే సూర్యోదయం చూస్తూ మీరు నడుస్తూంటే, అసలు మీరు ఎక్కడ వున్నామనేది మరచి ప్రకృతిని ఆనందిస్తారు. అసలైన ధ్యానం అనే మాటకు అర్ధం మీకు అక్కడ లభిస్తుంది. ఇక్కడ మీకు లభించే అనుభూతి మాటలలో చెప్పనలవి కాదు.
భూమి పై స్వర్గం
అక్కడ మీకు లభించే సూర్యోదయం దృశ్యం చూడకపోతే, మీరు నంది హిల్స్ కు వెళ్ళినా వృధా అని చెప్పవచ్చు. అంత అందమైన సూర్యోదయం మీకు అక్కడ లభిస్తుంది. ఇక ఆ ప్రదేశం ఆ సమయంలో భూమిపై గల స్వర్గం అన్నామంటే, మరి ప్రకృతి చేసే మాజిక్ మీరు గ్రహించండి.

శిఖర దృశ్యం
మీరు శిఖరం పై చేరిన వెంటనే, అక్కడ నుండి చూసే నగర దృశ్యం మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఏనాటికైనా ప్రకృతి, మానవుడి కంటే కూడా బలమైనడనే మెసేజ్ ఇస్తుంది.

భోగ నందీశ్వర టెంపుల్
కొండకు కింది భాగంలో, లేపాక్షి కి వెళ్ళే మార్గంలో భోగ నందీశ్వర టెంపుల్ కలదు. ఈ టెంపుల్ పూర్తిగా అందమైన ద్రావిడ శిల్ప శైలి లో నిర్మించబడినది. ప్రయాణంలో ముందుకు సాగే ముందు ఈ టెంపుల్ తప్పక దర్శించండి.

లేపాక్షి
చివరకు మీరు హైదరాబాద్ హై వే పైకి చేరుతారు. లేపాక్షి , హిందూపూర్ కు సమీపంగా వుంటుంది. లేపాక్షి లో మీరు వీరభద్ర స్వామి టెంపుల్ చూడవచ్చు. ఈ ప్రదేశం మత పరంగానే కాక, పర్యాటక ప్రాధాన్యత కూడా కలిగి వుంది. బెంగుళూరు కు ఇది 123 కి. మీ. ల దూరం. నంది హిల్స్ నుండి 79 కి. మీ. ల దూరం.
ప్రపంచం మరచి పొండి
ఈ దేవాలయంలోని వీరభద్రుడు మరియు అక్కడే కల అతి పెద్ద ఏక శిలలో చెక్కిన నంది విగ్రహం, మరొక అతి పెద్ద నాగలింగం మొదలైనవి, ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఈ ప్రదేశంలో, చరిత్ర, ప్రకృతి, కళలు, శిల్ప సంపద అన్నీ కలవు. ఈ ప్రదేశం అసలు మీరు ఎక్కడ నుండి వచ్చారనేది కూడా మరపింప చేస్తుంది.
ఎన్నో చెక్కడాలు
లేపాక్షి లోని వీరభద్ర స్వామీ టెంపుల్, కూర్మ శైల అని పిలువబడే తాబేలు ఆకారం కల కొండపై కలదు. టెంపుల్ గోడలపై, అనేక కుడ్య చిత్రాలు చెక్కబడి కలవు. వాటిని చూడటంలో మీరు సమయం కూడా మరచి పోయే అవకాశం వుంది.
చారిత్రక ప్రాధాన్యత
ఇక్కడ కల అద్భుత శిల్ప సంపద విజయనగర సామ్రాజ్యం నాటిది. దీని గురించి మనం చరిత్రలో కూడా చదువుకొని ఉంటాము. ఈ టెంపుల్ నిర్మాణంలో ప్రసిద్ధ శిల్పి విశ్వకర్మ ప్రధాన పాత్ర వహించాడని చెపుతారు.
ప్రయాణం పూర్తి
టెంపుల్ చుట్టూ కల అవశేషాల మధ్య నడచి, నేటికి ఆనాటి శిల్ప కళల వైభవం గమనించవచ్చు. వింత అయిన స్తంభాలు, మరచి పోయిన నవ్వులు, గత కాల వైభవం, రాజ దర్పాలూ, అన్నీ కలిపి మీరు చేసిన ప్రయానికి సార్ధకత కలిగిస్తాయి. మధుర స్మృతులను మూట కట్టి మిమ్మల్ని వెనక్కు పంపుతాయి.

బెంగళూరు నుండి తిరుపతి కి రోడ్ ట్రిప్ జర్నీ !!

బెంగళూరులో చాలా వరకు ఎక్కువ సంఖ్యలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఏదైన వారాంతంలో చాలా మంది తరచూ తిరుపతి వెళ్ళి అలా వస్తుంటారు అవునా ..! 
బెంగళూరు ప్రజలైతే మరీను ..! 
దగ్గరలో ఉంది కాబట్టి ఒక్క రోజులో వెళ్ళి వస్తుంటారు. 
బెంగళూరు నుండి తిరుపతికి మీరు ఎప్పుడైనా బైక్ లేదా సొంత వాహనాల వెళ్ళరా ..?? 
ఒకవేళ అలా వెళితే ఏ ఏ ప్రదేశాలు మీకు కనిపించాయి ...?? 
అక్కడ ఏమేమి చూడాలి..?? 
ఎప్పుడైనా ఆలోచించారా ..!! 
అయితే ఈ దిగువ పేర్కొనబడిన సారాంశం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

బెంగళూరు తిరుపతి మార్గం
బెంగళూరు నుండి తిరుపతి 260 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రయాణ సమయం సుమారుగా 5 గంటలు పడుతుంది. బెంగళూరు నుండి తిరుపతికి గల జాతీయరహదారి నెంబర్ 4. మీరు ఈ రహదారి గుండానే తిరుపతికి వెళ్ళాలి.

కోలార్
కోలార్ తిరుపతికి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ ప్రదేశం బంగారు గనులకి ప్రసిద్ధి. అలాగే అద్భుతమైన దేవాలయాలను, చారిత్రక కోటలను కలిగి ఉంది.

కోలారమ్మ గుడి
కోలార్ లో తప్పక చూడవలసినది కోలారమ్మ గుడి. ఇక్కడి ప్రధాన దైవం పార్వతి దేవి. 'ఎల్' ఆకారం లో కనిపించే ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించినారు. ఇక్కడ గ్రానైట్ రాళ్లతో చెక్కిన నమూనాలు, విగ్రహాలు అబ్బురపరుస్తాయి.

సోమేశ్వర ఆలయం
కోలార్ జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయం ఈ సోమేశ్వర ఆలయం. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఊరికి మధ్యలో ఉండే ఈ ఆలయాన్ని 14 వ శతాబ్దంలో విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించినారు. లోపల ఉండే కళ్యాణ మండపంలోని స్థంబాలపై గల చెక్కుడు లు చైనీస్, థాయి, యూరోపియన్ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి.

ఆది నారాయణ స్వామి 
కోలార్ లో ఎల్లొడు కొండల మీద ఉన్న ఆదినారాయణ స్వామి ఆలయం ప్రముఖంగా చూడవలసినది. ఈ ఆలయానికి చేరుకోవడానికి 618 మెట్లు ఉన్నాయి. చివరికి మెట్లు ఎక్కుకుంటూ గుడి దగ్గరివరకి వెళితే అక్కడ మరో రెండు మెట్లు ఎత్తులో ఉంటాయి. ఈ రెండు మెట్లను కేవలం తాడు సహాయంతో మాత్రమే ఎక్కడానికి వీలుంటుంది.

కోలార్ పర్వతాలు
కోలార్ పర్వతాలను కోలార్ బెట్ట అనికూడా పిలుస్తారు. ఈ ప్రదేశం చేరుకోవాలంటే వందల మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అలా పైకి ఎక్కిన తరువాత మీకు ఒక విశాలమైన మైదానం కనపడుతుంది. అలాగే తూర్పు దిక్కున అంతర గంగ కూడా చూడవచ్చు.

అవని
అవని ఇతిహాస నేపధ్యం ఉన్న గ్రామం. ఇక్కడనే సీతాదేవికి లవకుశలు జన్మించినారు మరియు ఈ గ్రామంలోనే రాముడికి, వారి కుమారులైన లవకుశ లకు యుద్ధం జరిగింది. ఇక్కడ వాల్మీకి ఆశ్రమంతో పాటుగా, సీతాదేవి అరుదైన ఆలయాన్ని, రామలింగేశ్వర దేవాలయ సముహాన్ని చూడవచ్చు.

విదురాశ్వత ఆలయం
కోలార్ మీదుగా తిరుపతి వెళ్లే పర్యాటకులు విదురాశ్వత ఆలయాన్ని తప్పక సందర్శించాలి. ఇక్కడ పవిత్రమైన ద్వాపరయుగం నాటి అశోక చెట్టు ఉన్నది. కృష్ణ భగవానుని అనుచరుడు విదురుడి ఈ గుడిలో పూజలు చేయటం వల్ల ఈ గుండికి ఆ పేరొచ్చింది. ఇక్కడ ఉండే ఈ ఆలయ విగ్రహాన్ని భక్తులు రథోత్సవ సమయంలో అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.

కోటిలింగేశ్వర
తిరుపతికి వెళ్లే మార్గంలో ప్రపంచంలో కెల్లా పెద్ద లింగంగా చెప్పబడే 108 అడుగుల ఎత్తున్న శివలింగాన్ని చూడకుండా వెళ్ళిపోతారా ?? అవును కొల్లర్ లోని కమ్మసాన్ద్ర గ్రామంలో ఈ మహా విగ్రహం ఉన్నది. ఉదయం, సాయంత్రం 6 గంటలకు 10 మంది పూజారులు వాయిద్యాల నడుమ మంత్రోచ్చారన చేస్తూ నీళ్ళు పోసి అభిషేకం చేస్తారు.

మార్కండేయ కొండ
మార్కండేయ కొండ అన్వేషణలను ఇష్టపడే వారికి బాగుంటుంది. ఈ కొండ దట్టమైన అడవుల మధ్యలో నెలకొని ఉంది కాబట్టి పర్యాటకులకు అసలు సమయమే తెలీదు. పూర్వం ఇక్కడే మార్కండేయులు కొండమీద తపస్సు చేసాడని భక్తుల నమ్మకం. ఇక్కడ మార్కండేయులు పేరుతో గల ఆలయం మరియు జలాశయం చూడవలసినది.

అంతరగంగ
కోలార్ సమీపంలో గల అంతరగంగ అందాలు దాని రాతి నిర్మాణాలలోను, గుహలలోను ఉన్నాయి. సాహసం ఇష్టపడేవారికి, అంటే పర్వతా రోహణ, ట్రెక్కింగ్ వంటివి చేసేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులనిస్తుంది. ఇక్కడి గుహలు కూడా అన్వేషించదగినవే. ట్రెక్కింగ్ కనీసం ఒకటి రెండు గంటలు పడుతుంది. అయితే, కొండనుండి కిందకు వేగంగాను, తేలికగాను రావచ్చు.

పలమనేరు చెరువు
పలమనేరు ప్రదేశంలో కాసింత ఆగి నీరు తాగవచ్చు. నీరంటే అదేదో మినరల్ వాటర్ బాటిల్ లో నీళ్ళు తెచ్చుకొని తాగేరు ..! వద్దు ఇక్కడ చెరువులో లభ్యమయ్యే నీరు తియ్యగా ఉంటుంది కనుక చెరువుల వద్దకి వెళ్ళి నీళ్ళు తాగండి వీలు దొరికితే ఇక్కడే భోజనం చేయండి.

బంగారుపాళ్యం
బంగారుపాళ్యం తిరుపతి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ ప్రదేశం మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఈ ప్రదేశంలో పురాతన మొగిలీశ్వరాలయం ఉంది. ఇక్కడ మామిడి పండ్ల గుజ్జును తయారుచేసి ఎగుమతి చేసే చిన్నా చితక పరిశ్రమలు, దారాల పరిశ్రమలు ఉన్నాయి.

కాణిపాక గణపతి
చిత్తూర్ కి 10 కి. మీ. దూరంలో కాణిపాక గణపతి ఆలయం ఉన్నది. ఇక్కడికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు కూడా ఆర్టీసీ వారు నడుపుతున్నారు. ఈ ఆలయంలో ఆసత్య ప్రమాణాలు చేయరు అసలు చేయటానికే భయపడతారు భక్తులు. ఆలయంలో స్వామి వారు దినదినం పెరుగుతూపోతుంటారు.

అర్ధగిరి వీరాంజనేయస్వామి
అర్ధగిరి వీరాంజనేయస్వామి అరగొండ గ్రామంలో చిత్తూర్ కి 20 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ గల పుష్కరిణి కి విశేష ప్రాచూర్యం ఉన్నది. తటాకములో నీరు ఎన్నటికీ చెడిపోదని అలాగే ఇప్పటివరకు చెడిపోలేదని భక్తుల విశ్వాసం. మండలం పాటు ఇక్కడి మట్టిని శరీరానికి రాసుకుంటే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్మకం. అలాగే పున్నమి నాడు "ఓంకార" శబ్ధం వినపడుతుందని భక్తులు చెబుతుంటారు.

చంద్రగిరి
చంద్రగిరి లో ప్రధానంగా చూడవలసినది రాజమందిరం. పూర్వం శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతి దర్శనానికి వచ్చేటప్పుడు ఈ మహల్ ను విడిదిగా ఉపయోగించేవాడు. ఇక్కడ మహల్ రెండు భాగాలుగా ఉన్నది. ఒకటేమో రాణి మహల్, మరొకటేమో రాజా మహల్. రాణి మహల్ రెండు అంతస్తులుగా, రాజమాహల్ మూడు అంతస్తులుగా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ మరియు సౌండ్ సిస్టం తో ప్రదర్శనలు సైతం చేస్తారు.

తిరుమల కొండ
తిరుపతిలో ప్రధానంగా చూడవలసినది తిరుమల కొండ. ఇది సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తుకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ ఏడు శిఖరాలు ఉన్నాయి. వాటిలో వేంకటాద్రి కొండ మీద శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు.

వెంకటేశ్వర ఆలయం
శ్రీ వెంకటేశ్వర ఆలయం చాలా పురాతనమైన క్షేత్రం. ఇది తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని జాతి రాళ్లతో అలంకరించి ఉంటారు.

ఆలమేలు మంగమ్మ లేదా పద్మావతి దేవి ఆలయం
అలమేలు మంగమ్మ ఆలయం తిరుపతి సమీపంలో ఉంది. దీనిని తిరుచానూరు అనికూడా పిలుస్తారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి భార్య అలమేలు మంగమ్మ లేదా శ్రీ పద్మావతి దేవి విగ్రహం ఉంది. పుష్కరిణి నదిలో ఈ దేవత పుట్టిందని నమ్మకం.

గోవిందరాజస్వామి దేవాలయం
తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. దక్షిణం వైపు గుడిలో పార్ధసారధి స్వామి విగ్రహం వుండగా ఉత్తరం వైపు గోవింద రాజ స్వామి గుడి వుంది.

హనుమాన్ ఆలయం
హనుమాన్ ఆలయం తిరుపతికి దగ్గరలో ఉంది. రాముడు, సీతా, లక్ష్మణుడితో పాటు హనుమంతుడు ఇక్కడ ఉన్నాడని నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో రామ కుండ౦ అని పిలువబడే చెరువు కూడా ఉంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారంలో వినాయకుని ఆకారంలో ఉన్న విగ్రహాన్ని చెట్టు మొదట్లో చూడవచ్చు.

ఇస్కాన్ ఆలయం
తిరుపతిలోని ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తెలుపు, బంగారు రంగు స్తంభాల శైలితో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగిఉంటుంది. ఈ ఆలయ గోడలపై నరసింహ స్వామీ, కృష్ణుడు, కృష్ణ లీలలు, వరాహ స్వామీ విగ్రహాల అద్భుతమైన చేక్కుళ్ళు ఉన్నాయి.

కపిల తీర్ధం
తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకే ఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది' ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.

కోదండ రామస్వామి ఆలయం
కోదండ రామస్వామి ఆలయం చోళ రాజులచే 10 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ రాముని విగ్రహం ఉంది, రామునితో పాటు సీత, లక్ష్మణ విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. రాముడు, సీత, లక్ష్మణునితో పాటు లంక నుండి వచ్చిన తరువాత ఇక్కడే ఉండేవారని పురాణాల కధనం.

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం
అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమలలో తన నౌకాయన సమయంలో వెంకటేశ్వర స్వామి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఇక్కడ శ్రీ సిద్దేశ్వర, ఇతర ఋషులను ఆశీర్వదించాడు.

పరశురామేశ్వర ఆలయం
గుడిమల్లం లోని పరశురామేశ్వర ఆలయం తిరుపతి నుండి షుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ గర్భగృహ౦లో ఉన్న శివలింగం ప్రసిద్ది చెందింది. ఇప్పటికీ మొదటిసారిగా కనుగొనబడ్డ శివలింగంగా భావిస్తారు. ఇది 1 లేదా 2 వ శతాబ్దానికి చెందినదిగా నమ్ముతారు.

శ్రీ పద్మావతీ దేవి దేవాలయం
తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు.

Saturday, 5 March 2016

ROAD TRIP - హైదరాబాద్ - వయా గోవా - మున్నార్.









హైదరాబాద్ - వయా గోవా - మున్నార్
ROAD TRIP


ఆగష్ట నెల మూడో తేది సోమవారం ఉదయం 5:30కు జడ్చర్ల లో మా రోడ్ ట్రిప్ మొదలయింది. కర్నూలు నుండి వచ్చిన మధు అనే నా కాలేజి క్లాస్‌మేట్‌ని పికప్ చేసుకొని అక్కడ నుండి బాదామికి మద్యాహ్నానికి చేరాము.



మరసటి రోజు ఉదయం పదుకొండు గంటల వరకు అక్కడ చూడాలసిన ప్రదేశాలు చూసి అక్కడ నుండి గోవాకు ప్రయాణం..

ఒక పక్కన వర్షం, మంచు.. కొండల మీదుగా...మేఘాల మద్యన పచ్చని ప్రకృతిలొ ఒక పక్కన పాత పాటలు వింటూ ప్రయాణం. మాటల్లో వర్ణించలేని అనుభూతి..!

రాత్రికి గోవా చేరుకొని అక్కడే గెస్ట్ హౌస్‌లో బస.. మరసటి రోజు సమయాలనుకూలతను బట్టి కొన్ని ప్రదేశాలు చూసేసి ఆ మరసటి రోజు ఉదయం మద్యాహ్నంగా ప్రయాణం.... బీచ్ వెంబడీ రోడ్ ప్రయాణం...మరో వైపు పచ్చదనం.

కార్వార్ మీదుగా గోకర్ణ చేరి.. అక్కడ నైట్ హాల్ట్. మరసటి ఉదయం అక్కడ నుండి మురుడేశ్వర్.



అక్కడ నుండి జోగ్ ఫాల్స్ అవి చూసుకొని సాగర్ మీదుగా షిమొగా చేరి అక్కడ నైట్ హాల్ట్.



మరసటి రోజు ఉదయం అక్కడ నుండి ఇక్కేరి అనే కేలడి రాజుల చారిత్రక ప్రాంతం సంధర్శన..

"ఇక్కేరి" - అఘోరేశ్వర దేవాలయం 

నా రోడ్ ట్రిప్‌లో భాగంగా ఆరవ రోజు.. హోటల్ రూమ్‌లో పొద్దున్నే ల్యాప్ టాప్ ముందర కూర్చోని చుట్టు పక్కల ఏమేమ్ వున్నాయో చూడదగ్గ ప్రదేశాలంటూ వెదుకుతూ కుర్చున్నాను. మా టూర్ ఫ్రోగ్రామర్ మాత్రం ఇక్కడ దగ్గరలో ఏవి లేవు అన్ని వంద కిలోమీటర్ల్ దాటి వెళ్లాలి దానికన్నా "ఆగుంబే" వెళ్లిపోవడం మంచిదంటూ కూర్చున్నాడు. నాకేమో చుట్టూ వున్న చూడదగ్గ ప్రదేశాలను చూడకుండా వెళ్లడం ఇష్టం లేదు. గూగుల్ సెర్చ్‌లో మంచి ఆర్కిటెక్చర్ వున్న దేవాలయం ఫోటొ కనపడ్డది. ఆ ఫోటో పట్టుకొని అదెక్కడ... అని వెదికితే.. మేముంటున్న షిమొగా వూరుకు 90 కిలోమీటర్ల దూరంలో వున్నదని చూపిస్తున్నది. మా టూర్ ఫోగ్రామర్ మాత్రం మళ్లీ వెనక్కు 90 కిలోమీటర్ల్ వెళ్లడం ఎందుకు "ఆగుంబే" దారిలొ ఏవైనా వుంటే చూసుకొంటూ వెళ్లిపోదాం అని చెబుతున్నాడు. నేను ససేమిరా అంటు పట్టు బట్టి బయలు దేరాం.

వాస్తవంగా జోగ్ ఫాల్స్ నుండి షిమొగాకు వచ్చే దారిలొ "సాగర్" అనే వూరు వున్నది. మేము ఆ వూరు మీద నుండే వచ్చి షిమోగాలో నైట్ హాల్ట్ చేసాం. ఇప్పుడు మేము వెళ్తున్న ఆ దేవాలయం సాగర్ వద్ద నుండి ఓ మూడు కిలోమీటర్ల్ లోనకు ప్రయాణించాలి. తిరిగి వెనక్కు వెళ్లి చూడటం అంత అవసరమా అని మిత్రుల ఆలోచన.. ! ఫోటోలో ఆ ఆర్కిటెక్చర్ చూడగానే ఆకట్టుకొంది...!


సాగర్ నుండి మూడు కిలోమీటర్లు దూరంలో ఎడమ వైపుకు వెళ్లాక ఈ "ఇక్కేరి" దేవాలయం కనపడ్డది. అప్పటి వరకు అయిష్టంగా వచ్చిన ఇద్దరు మిత్రులు..ఆ దేవాలయం ముఖ ద్వారం చూడగానే మొహాలు విప్పారాయి.ఆ ఆర్కిటెక్చర్....ఆ పచ్చని ప్రదేశం మద్యలో ఆ కొత్త రకమైన రూపురేఖలతో కనపడుతున్న దేవాలయం చూడగానే వీరి మొహాల్లో ఆశ్చర్యంతో కూడిన మైమరుపు... హమ్మయ్య అనుకొన్నాను నాలోపల...! అది గాని అతి సాదారణంగా వుండుంటేనా...?? అంతే " చెబితే విన్నావా.. చూడు ఏవైనా బాగున్నదా.. ఇలాంటివి మనూళ్లో లేవా ఏంటి.. వీటి కోసం అన్నేసి గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావాలా" అంటు నామీద దాడి చేసేవాళ్లు.


లోపలి వెళ్లగానే ఆ శిల్పాలను.. వాటిని మలిచిన తీరును చూస్తూ అబ్బరపడిపోతున్నాం. ఫోటోస్ తీసుకోవడానికే సత్తాను చేతుల్లోకి తెచ్చుకొంటూ ఉత్సాహ పడిపోతున్నాం అందరం. అదో రకమైన శైలి అవి. దేవాలయం పైన మాత్రం ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కనపడుతున్నది. మండపాలు మరో శైలి.. ఇలా చాలా రకాలు కనపడుతున్నాయి. గుర్తించడం నాబోటి అఙ్ఞానికి చాలా కష్టం.


మరో వైపున శిల్పం మొత్తం ఆనవాలే లేకుండా కేవలం పాదాలు మాత్రమే మిగిలి వున్న శిల్పం గుడికి దూరంగా అదే ప్రహరి మద్యలో ఒక మండపం మీద వున్నది దాని చుట్టు మరి కొన్ని ద్వంసమైన కళారూపాలు వున్నాయి.

లోపల గర్భ గుడికు ముందు శిల్పాలతో చెక్కిన పదుల సంఖ్యలో స్థంభాలతో కూడిన పెద్ద హాల్ వున్నది. అక్కడ ఫోటోస్ తీయడానికి తగినంత వెలుగు లేకపోవడంటొ ఫోటోస్ సరిగ్గా తీయలేకపోయాను. లోపలికి కెమెరా ట్రైపాడ్ అనుమతి లేదట.


దాదాపుగా ఓ గంటన్నర సమయం ఫోటోస్ తీయడానికే గడిచిపోయింది. అక్కడ నుండి తిరిగు ప్రయాణానికి కారులొ సిద్దమవుతూ.. అక్కడే వున్న ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ చిరుద్యోగిని కలిసి చుట్టూ వున్న మరిన్ని చూడతగ్గ ప్రదేశాల వివరాలు తెలుసుకొందామని కారులో నుండి అతని వద్దకు వెళ్లాను. అలా వెళ్లడం వలన నాకు మరింత చరిత్ర తెలుసుకొవడానికి దోహద పడింది. ఒక రకంగా నా బుర్రకు మేత దొరికింది. నిజంగా ఆ క్షణం అలా సమాచారం సేకరించాలనే తలంపు రావడమన్నది లక్కీనే అనుకోవాలి.


ఆ చిరుద్యోగిని కాస్త కదపగానే మెల్లి మెల్లగా చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు. బయలు దేరాలనుకొన్న ఇద్దరు మిత్రులు కూడ వచ్చి చేరి మళ్లీ తిరిగి ఆయనతో పాటు ఆ చరిత్ర వింటూ ఆశ్చర్యపోతూ మళ్లీ మరికొన్ని మేము చూడ కుండా మిస్ అయినా శిల్పాల ఫోటోస్ తీసుకోవడం మొదలు పెట్టాం.


ఆ టెంపుల్ గురించి ముద్రిత సమాచారం అక్కడ హింధీలో వుండటం వలన కేవలం ఆ ఆర్కియాలజీ డిపార్ట్‌మెట్ం చిరుద్యోగి చెప్పిన చరిత్ర విశేషాలనే నేనిక్కడ ఇస్తున్నాను. ఇవి ఎంత వరకు అథింటికేట్ అన్నది నేను కూడ చెప్పలేను గానీ.. .. ఆయన మాటల్లోనే....

కేలడీ నాయకులు అని పిలువ బడుతున్న చౌడప్ప నాయక, సదాశివ నాయక, చిక్కశంకర నాయక ( చిన్న శంకర ), దొడ్డ శంకర నాయక ( పెద్ద శంకర ),శివప్ప నాయక, అక్కవ, కెలడి చెన్నమ్మ అనే ఏడుగురు రాజులు ( విక్కీలో మాత్రం మొత్తం 17 మంది రాజుల పేర్లు చెబుతున్నది ). కెలడీ రాజ్యంలొ బంగారు విరివిగా దొరుకుతుంది. వీరి బంగారను అక్కడుకు, విజయనగరం సామ్రాజ్యపు వజ్రాలు వైఢూర్యాలు వీరికి ఇచ్చిపుచ్చుకొనే ప్రాతిపదికన వీళ్లు విజయనగర రాజులకు సామంతులుగా కెలడీని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించే వారట. అలా 24 క్యారెట్స్ బంగారం అనే కొలతను వీరి నుండే ప్రారంభమైందట. వీరి పాలన దాదాపుగా 250 సవంత్సారల పైనా సాగింది. (1540 - 1760 )

వీరి పాలనలో బంగారు నాణేలు అర్థ చంద్రుడు, పూర్తి చంద్రుడు ఆకారంతో చలా మనిలో వుండేవట. వీరి హయాంలోనే 15 వ శతాబ్దంలో ఈ ఇక్కేరిని రాజధానిగా చేసుకొన్నాక ఈ అఘోరేశ్వర దేవాలయం నిర్మించారు. ఇది పూర్తిగా నాలుగు రకాల శైలితో నిర్మించారు. ద్రవిడ శైలి, హోయసల శైలి, చాళుక్య శైలితో పాటు గుడి పైన వుండే గోడలు "ఇస్లామిక్" శైలితో వుంటాయి. అదే ఇక్కడి ప్రాముఖ్యత. మరొక విషయం భారతదేశంలొ దేవాలయాలన్నీనూ తూర్పు దిక్కుకు ముఖ ద్వారం వుండేలా నిర్మిస్తారు. కాని ఈ ఇక్కేరి దేవాలయం మాత్రం ఉత్తర దిక్కకు ముఖ ద్వారం వుంటుంది.


అంతే కాకుండా దేవాలయానికి ముఖ ద్వారం వద్దనే "నంధీశ్వరుడి" మండపం వుంటుంది ఇదొక కొత్త శైలి. అందునా గర్భ గుడిలోని ప్రధాన విగ్రహానికి చాలా దూరంలో (58 అడుగులు) వున్నది. మళ్లీ గర్భ గుడిలొ మరొక అమృత శిలగా పిలవబడుతున్న ట్రాన్స్‌పరెంట్ నంధీ విగ్రహం వున్నది. చీకటిలో టార్చి లైట్ వెలిగించినా ఆ వెలుగు ఆ విగ్రహం గుండా మరో వైపుకు ప్రవహిస్తుందట.



ఇక ఈ అఘోరేశ్వరుడి విగ్రహం 32 చేతులలొ 32 ఆయుధాలు ధరించి వుంటుదట...! ఇక్కడ ఈశ్వర పార్వతీల విగ్రహాలతో వుండే పీఠం పాద, జగతి,పట్టి, పద్మ,కళా, పట్టి,వేదకి అనే ఏడు పీఠాలతో నిర్మించారట. ఏడవ పీఠం మీద 32 మందిని స్త్రీ దేవతా మూర్తుల శిల్పాలను మొలిచారట. వాటిని "శక్తి పీఠం" గా పిలువ బడుతున్నారు.



ఇక అన్ని గుళ్లల్లోను వుండే "రతి భంగిమల" విగ్రహాలు ఇక్కడా చెక్కబడి వున్నాయి. నేనిప్పటి వరకు చూసిన ప్రతి హిందూ దేవాలయాలలో ఈ వాత్సాయనుడి రతిభంగమలు చూస్తూనే వున్నాను. బహుశ ప్రపంచానికి ఈ దేశం నుండే సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభమైందేమో అని అనిపిస్తూ వుంటుంది నాకు. మద్యలో ఏర్పడిన నాగరికత పౌర సమాజం నుండి వచ్చిన మత పెద్దలు వీటిని సమాజ హితం కోసమంటూ కొన్ని అంక్షలు పెట్టడం వలన అయితేనేమి..? సెక్స్ అన్నది కేవలం "మగవాడి" సామర్థ్యానికి, గొప్పదనానికి ప్రతీక అనే ఒక భావజాలంలో వుండడం వలన అది నలుగురిలో ఒక సబ్జెక్ట్ లాగ మాట్లాడుకొనే దశను కోల్పోయి అదొక అశ్లీలత, బూతు వ్యవహారంగా భౌతిక ప్రపంచంలో చలామని కావడం మొదలయ్యింది.

మేము అక్కడున్నప్పుడే కొందరు కాలేజీ యువతీయువకులు అక్కడికొచ్చారు. అందులొ ఉత్తర, దక్షణ భారతదేశీయులు వున్నారు. అందరిలాగ ఒకరిద్దరు యువకులు ఈ భంగిమలు చూడగానే మొహం విప్పారి తోటి వారికి చెప్పాలనే ఉత్సాహంతో వెర్రికేక పెట్టి చూపుతుండగా మరి కొందరు తమతో వున్న అమ్మాయిలకు కూడ చూపి వాళ్లెలా ఫీల్ అవుతారో అని గమనించసాగారు. దానికా ఒకరిద్దరు అమ్మాయిలు "హ్మ్..దానిదేమున్నది అవన్ని సహజం అప్పట్లో.. దేవాలయాల్లో అదొక అంశం" అంటూ అదొక సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లా మరొక సబ్జెక్ట్ అనే భావంతో ఎటువంటి వికారాలు, అసభ్యమైన కోణాలు లేకుండా చర్చించుకోవడం మొదలు పెట్టారు.

ఇక్కడ ప్రభుత్వాలు వెబ్‌సైట్స్ మీద బ్యాన్ విదిస్తే విదించొచ్చు కాని ఇలాంటి దేవాలయాలలొ బహిరంగంగా వున్న ఈ భంగిమలను చూడకుండా ఎవరు ఆప లేరు కదా..?



ఇక దేవాలయం విషయానికొస్తే..

ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే చాలా చాలా సాంకేతికమైన విషయాలు బాగా తెలుస్తాయి. అంత టెక్నికల్‌గా నిర్మించారు ఈ దేవాలయాన్ని.

ఇక్కడికి చేరాలనుకొనే దారి. కర్నాటకలోని జోగ్ ఫాల్స్ నుండి షిమోగా వెళ్లే దారి మద్యలో "సాగర్" అనే తాలుకా ఎదురవుతుంది. ఆ వూరి నుండి లోపలికి ఓ మూడు కిలోమీటర్ల్ ప్రయాణిస్తే ఈ "ఇక్కేరి" టెంపుల్‌కు వెళ్లొచ్చు. షిమోగా నుండి 90 కిలోమీటర్ల్ సాగర్ వైపు ప్రయాణించినా ఇక్కడికి చేరుకోవచ్చు.

వీటి చుట్టు పక్కల ఇంకా చూడాలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. మాకున్న సమయభావం వలన అవన్నీ చూల్లేకపోయాం. కేలడి వూరు అందులోని టెంపుల్, అక్కడే వున్న కేలడీ రాజుల కోటలు నాలుగు వున్నాయి. ఇవే కాక చాలా చాలా పచ్చని లాండ్ స్కేప్స్ చాలా వున్నాయి. ఇక్కడ నుండి ఆగుంబే వెళ్లే దారిలొ "తీర్థ హల్లి" అనే మరొక వూరు వొస్తుంది. అబ్బో ఆ వూరు చుట్టు కొన్ని కిలోమీటర్ల్ ప్రయాణిస్తే చాలు ఎన్నో జలపాతాలు, పచ్చని ల్యాండ్ స్కేప్స్, సరస్సులు బోలెడు చూడొచ్చు. మొత్తం పచ్చదనమే..ఎక్కడ చూసినా కనుచూపు మేర పచ్చదనమే కనపడుతుంది. ప్రకృతి ఆరాధకులకు పండగే పండగ.........!!

ఈ ఇక్కేరి రాజధాని గురించి మరింత క్షుణ్నంగా సమాచారం కోసం గూగుల్‌, విక్కీలో చాలా దొరుకుతుంది. అక్కడ మరింత సమాచారం తెలుసుకోవచ్చు.


అప్పట్లో ఎన్నేసి రకాల స్త్రీలకు జడ కుచ్చులు వేసారో ఈ శిల్పంలో చూడొచ్చు.....



అప్పటి అంతపుర స్త్రీలు ధరించిన "వ్యానిటీ బ్యాగ్" ఈ చిత్రంలో..!!



ఇస్లామిక్ పరిపాలనలో సింహాలకు ముస్లీమ్ రాజుల్లా వుండే వారి గడ్డాలనే ఇక్కడున్న సింహాలకు ముస్లీమ్ సింహాల్లాగా శిల్పాలను అక్కడక్కడ చెక్కించారు.

























తర్వాత తీర్థ హల్లి మీదుగా ఆగుంబే. మద్యలో కుంభవృష్టితో వర్షం. ఆ వర్షంలోనే మేఘాల మద్యన ఘాట్ రోడ్ లో ఎత్తైన కొండ మీద కుండాద్రి బెట్టను చేరుకొన్నాం అదొక అడ్వేంచర్ మాకు. కింద ఏమున్నదో కూడ కనపడనంతగా మేఘాలలో వుండిపోయాము. అక్కడ నుండి సాయింత్రం ఆగుంబే చేరాము. కాని చుట్టు పక్కల చూట్టానికి వాతావరణం అనుకూలించలేదు. చాలా జలపాతాలు, ల్యాండ్ స్కేప్స్ మరియూ కుద్రేముఖ్ లాంటి సీనరీ కలిగిన ప్రదేశాన్ని చూడలేకపోయాము.. కుంభవృష్టితో ఒక్కటే వాన. అక్కడ నుండి బయలు దేరి రాత్రి తొమ్మిదికి ఉడిపికి చేరుకొని అక్కడే నైట్ హాల్ట్.. దర్శనాలు..అన్నీను.

పొద్దున్నే సేయింట్ మేరీ ఐల్యాండ్ చూడాలనుకొని వెళ్లాం.. ఊహు. సముద్రంలో తుఫాన్ కదిలకలతో ఐల్యాండ్ కూడ క్యాన్సిల్.. అక్కడ నుండి మడికెరకు ప్రయాణం.... మద్యలో...!!

కార్కాల అనే వూరికి చేరాం. ఇదే వూరికి నేను ఓ 15 ఏళ్ల క్రితం నేషనల్ గేమ్స్ నిర్వహించినప్పుడు ఒక ముఖ్యమంత్రి సొంత వారు కావడం చేత ఇక్కడకు వెళ్లాను. తిరిగి ఇప్పుడు గుర్తు పెట్టుకొని వెళ్లాను. ఇక్కడొక విశేషమున్నది..! అక్కడ నుండి మూడబిదిరి లోని జైన్ దేవాలయాన్ని చూసుకొని సాయింత్రం మడికెరి (కూర్గ్) చేరుకొన్నాం. కాని కూర్గ్‌కు వెళ్లే మార్గ మద్యలో వున్న ఘాట్ రోడ్ మాత్రం భలే వున్నది, ఎన్నెన్ని వొంపులు..ఎన్నెన్ని మెలికలో.. స్టీరింగ్‌ను తిప్పుతూ కూర్చోవాల్సిందే.. అదీను ఆకు పచ్చని కొండల నడుమ.. ప్చ్ ఆ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ చేయడమన్నది ఒక అడ్వేంచరే..! ఫుల్ ఆఫ్ జాయ్ అంటే ఏమిటో అర్థమవుతుంది.

మరసటి రోజు ఉదయం వర్షంలోనే "అబ్బి ఫాల్స్" చూసుకొన్నాం.. అక్కడకు దగ్గరలోనే "మండద పట్టి" అనే కొన్ని ల్యాండ్ స్కేప్స్ వున్న ప్రాంతాలు వున్నాయి. కాని నా ఫ్రెండ్స్ అనాసక్తితో చూడకుండానే వెనుతిరగాల్సి వొచ్చింది. అక్కడ నుండి కోస్‌కోడె అనే కేరళ ప్రాంతానికి ప్రయాణం అయ్యాం. ఇక ఆ ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు గానీ.. చాలా రద్దీగల రహదారి అది. మద్యలో "తలసరి" అనే వూరులో భోజనం. అక్కడే వున్న ఒక చిన్న పాటి కోటను సందర్శించి తిరిగి అక్కడ నుండి "కోజ్‌కోడె" కు సాయింత్రానికి చేరుకొన్నాం. వర్షాకాలం వలన అక్కడ బ్యాక్ వాటర్ బోట్ హోమ్‌లో బస చేయడానికి అవకాశం లేకపోవడం వలన అక్కడ నుండి గురువాయర్‌కు వెల్దామని ఫ్రెండ్స్ ప్రప్ఫొజల్‌తో.. ఇంత వరకు చూడలేదాయన్ని.. సరే నేను చూసినట్లుంటుంది.. అలాగే ఒక పలకరింపు పలకరిస్తే ఓ పనైపోతుంది కదా రాత్రికి గురువాయర్ చేరుకొన్నాం.

తెల్లారు జామున్నే గురువాయిర్‌ని పలకరించేసాను, పాపం అక్కడికొచ్చే ప్రతి భక్తుడు ఏదో కోరిక కోరడం.. అందుకోసమే ఆయన్ని దర్శించుకోవడం చేస్తున్నారు, ఒక్కరు కూడ ఆయన క్షేమ సమాచారాలు విచారించ లేదు..!! బహుశ నేనొక్కడీనే అనుకొంటాను.. "ఎలా వున్నావయ్యా, అంతా క్షేమమే కదా.. కుశలమేనా!" అని కుశలోపరి ప్రశ్నలతో పలకరించి... అక్కడ నుండి మున్నార్‌కు బయలు దేరాం. మున్నారు పచ్చని ప్రకృతి అందాలతో అలరారుతుంది.








ఓ రెండు మూడు రోజులు గడిపేసి మూడో రోజున తెల్లారు జామునే హైదరాబాద్‌కు బయలు దేరాం. మద్యలో మధురై మీదుగా ప్రయాణం చేసి మరసటి తెల్లారు జామున రెండు గంటలకు ఒక ఫ్రెండ్‌ని కర్నూల్‌లో అతని ఇంటి వద్ద దింపేసాము. బాగా డ్రైవ్ చేసే మూడ్‌లో వుండటం మూలాన అక్కడే నిద్రకు ఉపక్రమించకుండా.. అలానే హైదారాబాద్‌కు బయలు దేరి తెల్లారు జామున ఆరుగంటలకు నా గమ్య స్థానం చేరుకొన్నాం. దాదాపు 24 గంటలు నిర్విరామంగా డ్రైవ్ చేయడం.. అందునా వర్షంలో.... అదొక అడ్వేంచర్.. అనుభూతినిచ్చింది. నా స్టామినా మీద నేనే ఒక ప్రయోగం చేసుకొన్నాను.

మొత్తం పదిహేను రోజుల పాటు 3,600 కిలోమీటర్ల పచ్చని ప్రకృతిలో ప్రయాణం చేసి.. చేసి పచ్చగా మారిపోయాను.... నేనొక్కడినే డ్రైవ్ చేయడం.... ఒక ఆనందం. ఫ్యూచర్‌లో దేనికి పనికిరాకుండా పోయినా "డ్రైవర్" ఉద్యోగం చేసుకోనైనా బతకొచ్చనే ధైర్యం వచ్చిందబ్బా..!

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మొత్తం ఈ ట్రిప్ అంతా నాకు కొత్తే.. ఏ దారులు తెలీవు, కాని "గూగుల్" మ్యాప్ ద్వారా మొత్తం తిరిగాను. గోవాలొ గల్లీ గల్లీ తిరిగాను. అస్సల్ ఎటుపోతే ఏది వొస్తుందో..! ఎక్కడికి చేరుతామో కూడ తెలియని నేను. పుర్తిగా గూగుల్ మ్యాప్ మీద ఆదార పడ్డాను.

ఎక్కడ.. ఎన్ని కిలోమీటర్ల్ వద్ద.. ఎన్ని మీటర్ల వద్ద ఎటువైపు మలుపు తిరగాలో కూడ ప్రతీది చెబుతూ వచ్చింది ఆ గూగులమ్మాయ్.. గొంతు మాత్రం యమ స్వీట్. ఒకో సారి దగ్గరి దారిలో తీసుకెళ్లి గమ్యం చేరుస్తుండేది..! ఒక వేళ దారి తప్పోయినా ..? తప్పోయిన దారి నుండి మళ్లీ డైరెక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది పాపం ఆ గూగుల్ అమ్మాయి... ఎంత మంచిదో. ? జై గూగులమ్మాయ్..!!


బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...