Showing posts with label శివాలయం. Show all posts
Showing posts with label శివాలయం. Show all posts

Tuesday, 11 December 2018

బృహదీశ్వరాలయం B









అణువణువూ అద్భుతం
బృహదీశ్వరాలయం


‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరులోని బృహదీశ్వరాలయం. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటైన ఆ ఆలయం గురించి ఎంత చెప్పినా తక్కువే’’ అంటూ అక్కడి విశేషాలను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మల్లాది కృష్ణానంద్‌.

బృహదీశ్వరాలయం గురించి ఎప్పటి నుంచో విని ఉండటంతో ఆ ఆలయాన్ని సందర్శించేందుకు తంజావూరు బయలుదేరాం. చెన్నై నుంచి మదురై వెళ్లే మార్గంలో ఉంది తంజావూరు. తిరుచిరాపల్లి నుంచీ వెళ్లొచ్చు. చోళుల రాజధాని నగరమే తంజావూరు. ఒకప్పుడు ఈ ప్రాంతం తంజా అనే రాక్షసుడి చేతిలో ఉండేదనీ అతను విష్ణుమూర్తి చేతిలో మరణిస్తూ ఈ నగరానికి తన పేరు పెట్టాలని కోరడంతో ఆ పేరు వచ్చిందనేది ఓ కథనం. మొదటి చోళరాజైన రాజరాజ చోళుడు క్రీ.శ.985-1012 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆయన గొప్ప పరాక్రమవంతుడే కాదు, కళాభిమాని కూడా. మదురై నుంచి శ్రీలంక వరకూ రాజ్యాన్ని విస్తరింపజేశాడు. తన విజయానికి గుర్తుగా తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని కట్టించాడు. అదీ క్రీ.శ.1004లో ప్రారంభించి 1009కల్లా అంటే కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో కట్టించాడు. ఆలయ నిర్వహణకు ప్రత్యేక భూములు కేటాయించి, దేవాలయ నిధిని ఒకదాన్ని ఏర్పాటుచేసిన ఘనత కూడా చోళరాజులదే. దేవాలయాలను విద్యా సాంస్కృతిక కేంద్రాలుగానూ ప్రజా సమావేశ మందిరాలుగానూ తీర్చిదిద్దడం వీళ్ల నుంచే ప్రారంభమైందట.

ముందుగా తంజావూరులో దిగగానే బృహదీశ్వరాలయానికి బయలుదేరాం. సుమారు 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనే చెప్పాలి. బృహ అంటే పెద్ద అని అర్థం. ద్రవిడ వాస్తుశైలిలో నిర్మించిన ఈ ఆలయం మనదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి. చోళరాజులు శైవభక్తులు. వీరి కాలంలో తమిళనాట శైవ మతం చక్కగా విలసిల్లింది. ఆలయంలోకి వెళ్లగానే గర్భగుడిలో 13.5 అడుగుల ఎత్తున్న ఏకశిలా శివలింగం దర్శనమిస్తుంది. ఏకశిలతో అంత పెద్ద శివలింగాన్ని రూపొందించడం అరుదు. అర్చకస్వాములు రెండు అంతస్తుల్లో నిర్మించిన మచ్చుపై నుంచి స్వామికి అభిషేకం, ఇతర పూజలు నిర్వహిస్తారు. శివలింగానికి ఎదురుగా పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న అతి పెద్ద నందీశ్వరుడు దర్శనమిస్తాడు. 20 టన్నుల నల్లని గ్రానైట్‌ రాయితో- అంటే ఏకశిలతోనే ఈ నందిని కూడా నిర్మించడం విశేషం. ఇది దేశంలోని రెండో అతిపెద్ద ఏకశిలా నంది. మొదటిది అనంతపురం జిల్లాలోని లేపాక్షి బసవేశ్వరుడు అన్నది తెలిసిందే.

ఆలయం... అద్భుతనిలయం!
క్రేనుల్లాంటి భారీ మెషీన్ల సాయం లేకుండా ఆ రోజుల్లో 13 అంతస్తుల్లో నిర్మించిన ఆలయం అద్భుతంగా అనిపిస్తుంది. నేలమీద నుంచి 216 అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం నుంచి జారిపడిన వానచినుకులన్నీ భూగర్భంలో ఇంకేలా చేయడం మరో అద్భుతం. ఇంత ఎత్తైన నిర్మాణానికి పునాది కేవలం ఒకట్రెండు అడుగులు మాత్రమేనని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది ఆనాటి నిర్మాణకౌశలానికి ప్రత్యక్షసాక్ష్యం. ఈ ఆలయం మొత్తాన్నీ గ్రానైట్‌ రాయితోనే కట్టారు. కానీ తంజావూరు కావేరీ డెల్టా ప్రాంతంలో ఉంది. దీనికి 100 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా గ్రానైట్‌ రాయి లభించే కొండలు లేవు. మదురై నుంచి రాళ్లను తెప్పించి ఆలయ నిర్మాణం చేపట్టారట. అప్పట్లో ఇనుము లేదు. సిమెంట్‌ తెలీదు. కేవలం కొండలను తొలిచి తీసుకొచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను అద్భుత శిల్పాలుగా రూపొందించి ఈ ఆలయాన్ని నిర్మించారంటే ఓ పట్టాన నమ్మశక్యం కాదు. ఆలయం అంతా లేత ఎరుపురంగు గ్రానైట్‌ రాళ్లతో ఉంది. పై భాగంలో 80 టన్నుల ఏకశిలతో చేసిన గోపుర కలశం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మండే ఎండాకాలంలో కూడా ఈ కలశం నీడ ప్రాంగణంలో ఎక్కడా పడకపోవడం ఈ నిర్మాణం వెనకున్న మరో విశేషం. విశాలమైన గర్భాలయ ప్రాంగణంలో మాట్లాడిన మాటలేవీ ప్రతిధ్వనించకుండా కట్టడం నాటి సాంకేతిక విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. ఆగమ, వాస్తు శాస్త్రాలను అనుసరించి కట్టిన ఈ ఆలయానికి వెయ్యేళ్లు దాటుతున్నా ఇంకా నిత్యనూతనంగానే కనిపిస్తుంటుంది. ఆనాటి రాజధానిగా వెలుగొందిన తంజావూరు నేడు ఓ చిన్న పట్టణమే కావచ్చు. కానీ నేటికీ ఆలయంలోని నిత్యపూజల్లో మార్పు లేదు. శిల్పాలు చెక్కు చెదరలేదు. మహాశివరాత్రినాడు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఆలయంలోని కళారూపాలు నాటి చోళుల శిల్పకళా రీతికి దర్పణాలు అనే చెప్పాలి. రాజరాజచోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్న శిల్పం, భూదేవీసహిత విష్ణుమూర్తి, పార్వతీ సమేత శివుడు, మార్కండేయ చరిత్రను తెలిపేవీ... ఇలా పలు శిల్పాలూ చిత్రాలూ ఆలయ శోభను మరింత ఇనుమడింపజేస్తాయి. ముస్లిం రాజుల దండయాత్రలో బృహదీశ్వరాలయం కొంత దెబ్బతిన్నా పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. పై అంతస్తు బయటిగోడమీద భరత నాట్యంలోని 81 నృత్య భంగిమలు చెక్కి ఉన్నాయి.

వ్యవసాయ క్షేత్రం!
తంజావూరు నగరం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుంది. చోళరాజుల సమయంలోనే వ్యవసాయ సాగుబడికోసం ఏర్పాటుచేసిన పంటకాల్వల వ్యవస్థ నేటికీ చెక్కు చెదరలేదు. అందుకే ఇక్కడ అన్నిరకాల పంటలూ పుష్కలంగా పండుతాయి. ఈ ఆలయం తరవాత తంజావూరులో రాజభవనం, సరస్వతి మహల్‌, స్థానిక మ్యూజియం, ఆర్ట్‌ గ్యాలరీ తప్పక చూడాల్సినవి. అందులో భాగంగా రాయల్‌ ప్యాలెస్‌ చూడ్డానికి వెళ్లాం. తంజావూరు చరిత్రకో ప్రత్యేకత ఉంది. మరాఠా, తమిళ సంస్కృతులు రెండూ ఇక్కడ ప్రతిబింబిస్తాయనడానికి ఈ ప్యాలెస్‌ చక్కని ఉదాహరణ. ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవంతిని మొదట విజయనగర చక్రవర్తులు నియమించిన నాయక్‌లు నిర్మించగా తరవాత మరాఠాలు అభివృద్ధి చేశారట. దీని వాస్తుశైలి, చిత్రకళ చూసి తీరాల్సిందే. లోపల కంచుతో చేసిన విగ్రహాలు అనేకం ఉన్నాయి. అనేక చిన్నా పెద్దా భవంతులు కలగలిసినట్లుగా ఉన్న ఈ భవంతిలోని కొన్ని హాళ్లను మ్యూజియంగానూ ఆర్ట్‌ గ్యాలరీగానూ మార్చి అందులో నాటి వస్తువులనూ కళారూపాలనూ ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఒక భాగమే సరస్వతీ మహల్‌ గ్రంథాలయం. ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన లైబ్రరీల్లో ఇది ప్రధానమైనది. 1535 నుంచీ సేకరించిన అరుదైన తాళపత్ర గ్రంథాలూ తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లిషు తదితర భాషా గ్రంథాలూ ఇక్కడ అనేకం ఉన్నాయి. ఆనాటి తాళపత్రగంథాల్లోని అంశాలనూ కంప్యూటరీకరణ చేస్తున్నారిక్కడ. ఇక్కడ ఉన్న ఫూంపుహార్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కంచు బొమ్మలూ నృత్యభంగిమల్లోని తంజావూరు బొమ్మలూ కృష్ణుడి చిత్రాలూ వాద్యపరికరాలూ కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఈ పట్టణం ఆలయాలకే కాదు, వీటన్నింటి తయారీకీ పెట్టింది పేరు.

త్యాగరాజ సమాధి!
అక్కడినుంచి శివగంగై పూంగ అనే అమ్యూజ్‌మెంట్‌ పార్కుకి వెళ్లాం. అందులో పిల్లలకోసం టాయ్‌ రైలు, మోటారుబోటు షికారు వంటివన్నీ ఉన్నాయి. ఇక్కడి నీటి కొలనును చోళ చక్రవర్తులే ఏర్పాటుచేశారట. కొలను మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లేందుకు బోటు సదుపాయం ఉంది.తరవాత సంగీతమహల్‌కి వెళ్లాం. మదురైలోని తిరుమల నాయక్‌ కోటని పోలినట్లుగా ఉండేలా దీన్ని రాజా సర్ఫోజి నిర్మించాడట. అక్కడికి రెండు కి.మీ. దూరంలోని కరుంతిట్టంగడి ఆలయంలో త్రిపురసుందరి సమేత వశిష్ఠేశ్వరుణ్ణి దర్శించుకున్నాం. బృహదీశ్వరాలయానికి ఓ శతాబ్దం ముందే దీన్ని నిర్మించారట.

సరిగ్గా తంజావూరుకి 13 కి.మీ. దూరంలో ఉంది తిరువయ్యారు... అంటే ఐదు నదుల మధ్యలోని ప్రదేశం అని అర్థం. కర్ణాటక సంగీత ప్రముఖులైన త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్‌ వంటి ప్రముఖ సంగీత విద్వాంసులంతా తమ గానామృతంతో ఈ ప్రాంతాన్ని పరవశింపజేశారు. ఇక్కడి కావేరి నది ఒడ్డున ప్రముఖ సంగీత విద్వాంసుడైన త్యాగరాజు సమాధి ఉంది. ఆయన గౌరవార్థం ఏటా జనవరి నెలలో ఆయన పుట్టినరోజున అక్కడ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడే ఓ ప్రాచీన శివాలయం కూడా ఉంది. కావేరీ నది ఒడ్డున ఉన్న ఆరు శివాలయాలూ కాశీ అంతటి పవిత్రమైనవనీ అందులో ఇదీ ఒకటనీ చెబుతారు. దీన్నే దక్షిణ కైలాసం అనీ అంటారు. పరమశివుడు పంచనటేశ్వర రూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో అడుగడుగునా శిల్పకళ తాండవిస్తుంటుంది. ఆ తరవాత తిరువరూరులోని త్యాగరాజస్వామి(సోమస్కందుడు) ఆలయానికి వెళ్లాం. ఇక్కడి స్వామిని విష్ణుమూర్తే స్వయంగా ఆరాధించాడనేది పురాణ కథనం. దేశంలోకెల్లా అతిపెద్ద రథాన్నీ ఇక్కడ చూడొచ్చు. వేడుకల సమయంలో అనేక వేలమంది ఈ రథాన్ని లాగుతారట. తరవాత దగ్గరలోని పూవనూర్‌ చాముండేశ్వరీ ఆలయం, తిరు కందియార్‌లోని సుబ్రహ్మణ్య దేవస్థానాలు చూసి తిరుగుప్రయాణమయ్యాం.

Thursday, 22 November 2018

అరుణాచ‌లం









అరుణాచ‌లం
అగ్ని రూపం నిశ్చల దీపం
నేడు అరుణాచ‌లంలో కార్తీక దీపం


గిరులపై ఆలయాలు ఉంటాయి.. కానీ ఆ పర్వతమే ఓ మహాలయం... అదే పరమ పావనం, దివ్యశోభితమైన అరుణగిరి. భక్తులు మహాదేవుడిగా భావించినా, రమణులు ఆత్మ స్వరూపంగా దర్శించినా ఈ గిరి ఔన్నత్యం అనంతం. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహా క్షేత్రం కార్తిక పౌర్ణమినాడు దేదీప్యమానంగా వెలుగుతుంది.

అరుణాచలం శక్తి సంపన్న క్షేత్రం.
‘నమఃశివాయ’ అనేది యోగ పంచాక్షరి.
‘అరుణాచలం’ జ్ఞానపంచాక్షరి.
‘శ్రీరమణులు’ ధ్యాన పంచాక్షరి. 
అరుణాద్రిపై వెలిగే అఖండ దీప తేజస్సు.. నిరుపమాన ఆధ్యాత్మిక దివ్య యశస్సు.


ఏమిటీ అరుణాచలం...
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాల్లో ఒకటి. అగ్ని లింగేశ్వరుడుగా ఆదిదేవుడు ఇక్కడ పూజలందుకుంటున్నాడు. ‘స్మరణాత్‌ అరుణాచలే’ అంటారు. అరుణాచలం అనే పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు. వైష్ణవులు పరమపావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భువిపై సాకారమైందని విష్ణు భక్తుల నమ్మకం. తిరువణ్ణామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం. అరుణగిరి రుణానుబంధాల్ని హరించివేస్తుందని అరుణాచల మహాత్మ్యం పేర్కొంది. స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యం ఈ క్షేత్ర ప్రశస్తిని, గిరి వైభవాన్ని విశేషంగా వర్ణించింది. మహేశ్వరపురాణంలో వేద వ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు. ముక్తిగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. ‘సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరతాయని నానుడి. ఇక్కడ రుణాలు తీరడమంటే బంధనాల నుంచి విడివడి ముక్తిమార్గం వైపు పయనించడం. కైలాసంలో ఉన్న శివమహాదేవుడు నిరంతరం తపోదీక్షలో కొనసాగుతుంటాడు. ఆయన ధ్యానానంతరం కళ్లు తెరవగానే శివుని చూపులు అరుణగిరిపై ప్రసరిస్తాయంటారు. సదాశివుని శుభమంగళ వీక్షణాలతో అరుణాచలం సదా పులకితయామినిగా పరిమళిస్తుంది. అగ్ని లింగమై పరంజ్యోతి స్వరూపుడిగా దర్శనమిచ్చే శివుడు ఈ గిరి రూపంలో విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ‘ఎవరెన్ని మార్గాల్లో సంచరించినా చివరికి అందరి గమ్యం అరుణాచలమే’ అనేది తమిళనాట జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సందేశం.

అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడూ...
అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని అగ్ని పర్వతమని, త్రేతాయుగంలో స్వర్ణగిరి అని, ద్వాపరంలో తామ్ర శైలమని వ్యవహరించారు. కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది. అరుణాచలం 260 కోట్ల సంవత్సరాలనాటిదని ప్రఖ్యాత పురాతత్త్వ శాస్త్రవేత్త బీర్బల్‌్ సహాని నిర్థరించారు. ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని, ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీగుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్థరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని శోణాచలమన్నారు. 43 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రత్తాళ్వార్‌కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు.

మహా దీపం
అగ్ని నక్షత్రం కృత్తిక సమ్మిళితమైన రోజు కార్తిక పౌర్ణమి. ఆ ముందు రోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం పేరుతో చిరుదివ్వెను వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమి రోజున అరుణగిరిపై శాంతిప్రదాయక జ్యోతి పేరిట మహాదీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. ఈ భరణి దీపంతోనే..పౌర్ణమినాటి బ్రహ్మాండ దీపాన్ని వెలిగిస్తారు. ‘కార్తిగై దీపం’గా వ్యవహరించే మహా దీపోత్సవంలో మూడుటన్నుల ఆవు నేతిని వినియోగిస్తారు. ఈ దీపం పది రోజుల పాటు  వెలుగుతూనే ఉంటుంది. ఈ దివ్య దీపం కొన్ని మైళ్ల వరకు కనిపిస్తుంది. ఈ దీపాన్ని దర్శించుకోవాలనీ,  గిరి ప్రదక్షిణ చేయాలనీ లక్షల మంది భక్తులు కార్తిక పౌర్ణమి నాడు అరుణాచలం చేరుకుంటారు. ఆ రోజు అరుణాచలేశ్వరుడి ఉత్సవమూర్తి అయిన పెరియనాయగర్‌ స్వర్గమయ వృషభ వాహనంపై, అపీత కుచలాంబ, సుబ్రహ్మణ్య సహితంగా ఊరేగుతూ.. గిరి ప్రదర్శన చేస్తాడు.

రమణ సందేశం...
తమిళంలో ‘గిరి వలం’ అని వ్యవహరించే అరుణాచల ప్రదక్షిణ పూర్వక విధికి ఎంతో వైశిష్ట్యం ఉంది. అరుణాచలం స్వయంగా జ్యోతిర్మయ మహాలింగం కావడంతో.. కార్తిక పౌర్ణమినాడు చేసే మహాదేవ అగ్నిలింగ ప్రదక్షిణకు ఇక్కడ ఎంతో ప్రాధాన్యం ఉంది. 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో గిరి చుట్టూ అనేక ఆలయాలు, ఆశ్రమాలు, బృందావనాలు దర్శనమిస్తాయి. గిరి ప్రదక్షిణకు ఇంతటి వైభవం ఏర్పడటానికి కారణమైన అద్వైత గురువు.. భగవాన్‌ రమణమహర్షి. అరుణాచల ప్రదక్షిణం సాక్షాత్తు కైలాసాన కొలువైన శివపార్వతులకు చేసే ప్రదక్షిణతో సమానమైన ఫలితం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. 53 సంవత్సరాల పాటు అరుణాచలాన్నే తన ఆవాసంగా చేసుకున్న మహర్షి.. ఈ క్షేత్రాన్ని ఇలకైలాసంగా అభివర్ణించారు. ‘అక్షరమణమలై’ పేరిట అరుణాచల ఘన యశస్సును కీర్తిస్తూ రమణులు శతకాన్ని రచించారు. గిరిప్రదక్షిణ చేసే సందర్భంలో తన మనోభావాలను ‘అరుణాచల అష్టకం’ ద్వారా అవిష్కరించారు. బాల్యంలో అరుణాచలాన్ని దర్శించిన రమణులకు ఈ కొండ ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందించింది. ఈ గిరిని స్థిరమైన అనుగ్రహ స్వరూపంగా భావన చేశారాయన. రమణ ఆశ్రమం సమీపంలోని వినాయక మందిరం నుంచి వీక్షిస్తే.. అరుణాచలం ఆసీనుడైన నంది రూపంలో కనిపించడం మరో విశేషం. గిరి ప్రదక్షిణ మార్గంలో యమ లింగం, సూర్య లింగం, వరుణ లింగం, వాయు లింగం.. ఇలా అష్టలింగాలు దర్శనమిస్తాయి. అగస్త్య తీర్థం, ఉన్నామలై తీర్థం వంటి పవిత్ర తీర్థాలకు ఈ గిరి నెలవు.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌పటేల్‌




Wednesday, 21 November 2018

అరుణాచలం!









సర్వపాపహరం
అరుణాచలం!


ఆ పేరు తలిస్తేనే పాపరాశి దగ్ధమవుతుందని అంటారు. సాక్షాత్తు పరమేశ్వర జ్యోతిర్లింగమే అరుణాచలమని విశ్వాసం. అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా కొలువుదీరి ఉన్నాడు. అరుణేశ్వరి, అరుణేశ్వరుల సాన్నిధ్యం సర్వసిద్ధులను ప్రసాదిస్తుందని విశ్వాసం. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడ ఉన్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానంలో ఉంటాడన్నది నమ్మకం.

అరుణాచలాన్నే అణామలై అనీ తిరువణ్ణామలై అనీ అంటారు. ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది. అణామలై అంటే తమిళంలో పెద్దకొండ. ఈ కొండ సాక్షాత్తూ పరమేశ్వర లింగమేనని పెద్దలు చెబుతారు. కార్తిక పౌర్ణమినాడు ఇక్కడ విశేషంగా దీపోత్సవం జరుగుతుంది. ఒక పక్క నుంచి చూస్తే... కొండ నందీశ్వరుడిలా కనిపిస్తుంది. అరుణాచలం మీదనే రమణ మహర్షిలాంటి సిద్దులు తపస్సు చేశారు. గిరిప్రదక్షిణ కోసం రమణాశ్రమం దగ్గరున్న వినాయకుడి గుడి ముందునుంచీ నడక ప్రారంభిస్తారు. ఆ మార్గంలో ఎన్నో తీర్థాలూ, క్షేత్రాలూ. ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. ప్రతి మాసంలోనూ పౌర్ణమినాటి రాత్రి వేలాది భక్తులు గిరిప్రదక్షిణలు చేస్తారు.

అగ్నిలింగ ఆవిర్భావం
అరుణాచలంలో పరమేశ్వరుడు అగ్నిలింగంగా అవతరించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. పూర్వం బ్రహ్మవిష్ణులకు తమలో ఎవరు గొప్ప అనే వాదం జరిగింది. అది ఏనాటికీ తేలలేదు. ఓ రోజున ఒక పెద్ద జ్యోతి స్తంభం రూపంలో వారిముందు అవతరించింది. ఆ జ్యోతి అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మరొకరు చూసి.. ఎవరు ముందుగా వస్తే వారే గొప్ప అని అశరీరవాణి పలికింది. అప్పుడు విష్ణువు వరాహమూర్తిగా జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని చూడటానికి వెళ్లాడు. బ్రహ్మదేవుడు హంస వాహనం ఎక్కి ఆ వెలుగు స్తంభం పైభాగాన్ని దర్శించడానికి బయలుదేరాడు. ఆ స్తంభం తుదీ మొదలూ అటు బ్రహ్మకు కానీ, ఇటు విష్ణుమూర్తికి కానీ అంతుపట్టలేదు. ఇద్దరూ బయలుదేరిన చోటికే వచ్చారు. తామిద్దరిలో ఎవరూ గొప్ప కాదనీ, తేజోమయమైన అగ్నిస్తంభమే గొప్ప అనీ ఆమోదించారు. తమ అహంకారాన్ని నశింప చేసినవాడు తేజోలింగ రూపుడైన శివుడేనని అర్థమైంది. అరుణాచలం శివతేజోమయం. ఆ పర్వతం లోపల ఓ గుహ ఉందని చెబుతారు. అక్కడున్న మర్రిచెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు ధ్యానముద్రలో ఉంటాడన్నది నమ్మకం.

ఎన్నెన్నో అద్భుతాలు
అరుణాచలం అద్భుతాలకు నిలయం. పరమశివుడి గణాలలో భృంగి ప్రధాన సేవకుడు. భృంగికి శివుడి మీద మాత్రమే భక్తి. అందుకే ఆయనకు మాత్రమే ప్రదక్షిణలు చేస్తుండేవాడు. ఓ రోజున భృంగి ప్రదక్షిణ చేసే సమయానికి అమ్మవారు, శివుడి ఎడమవైపు అతుక్కొని అర్ధనారీశ్వరిగా ఉన్నారు. భృంగి తేనెటీగ రూపాన్ని ధరించి అమ్మవారికి, అయ్యవారికి మధ్యన దూరిపోయి శివ ప్రదక్షిణను పూర్తి చేశాడు. అందుకు మెచ్చుకున్న శివుడు భృంగికి మోక్షం ఇవ్వబోయాడు.. అమ్మవారు వద్దని వారించారు. ఈ ప్రణయ కలహాన్ని అర్చక స్వాములు ఓ ఉత్సవంగా జరుపుతారు. అరుణాచల గోపురాల నిర్మాణానికి సంబంధించి ఎన్నో కథలు. ఇక్కడున్న ఓ గోపురానికి కిరిగోపురం అని పేరు. దీన్ని భళ్లాల మహారాజు కట్టించినట్లు చెబుతారు. భళ్లాలుడు శివభక్తుడు. గొప్పదాత. ఆయనకు ఇద్దరు భార్యలు. సంతానం కలగలేదు.

ఆ రాజును పరీక్షించేందుకు శివుడే స్వయంగా బయల్దేరాడు. కొంతమంది జంగమ దేవరలను వెంటపెట్టుకొని తాను కూడా జంగమయ్య వేషం వేసుకుని రాజు దగ్గరకు వచ్చాడు. తమకు సేవ చేసేందుకు కొందరు దేవదాసీలు కావాలని రాజును కోరాడు జంగమయ్య. రాజు అలాగే పంపాడు. ఆ జంగమ దేవరలలో మిగిలిన వారికి రాజు పంపిన దాసీలందరూ సరిపోయారు. పెద్ద జంగమయ్యకు మాత్రం ఒక్కరూ మిగల్లేదు. దాంతో రాజు రెండో భార్య తానే దాసీగా వెళ్లింది. ఆమె వెళ్లేసరికి పెద్ద జంగమయ్య నిద్రపోతున్నాడు. ఆయనకు ఫలాలను సమర్పించే ఉద్దేశంతో తాకి లేపింది. రాణి ఆయనను తాకగానే పెద్ద జంగమయ్య పసిబాలుడిలాగా మారిపోయాడు. అప్పుడామె ఆ బిడ్డను ఎత్తుకొని భర్త దగ్గరకు వచ్చింది. రాజు బిడ్డను తాకగానే బిడ్డ అంతర్థానమై పోయింది. రాజు, రాణి ఆశ్చర్యపోయారు. అప్పుడు శివుడు "ఓ రాజా నీవు బాధపడవద్దు. నేను నీకు కుమారుడిని. నీ మరణానంతరం నీకు అగ్ని సంస్కారాన్ని కూడా నేనే చేస్తాను' అని వరమిచ్చాడు. భళాల రాజు మరణానంతరం శివుడు తన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ నాటికి కూడా, రాజు పరమపదించిన రోజున అరుణాచలేశ్వరుడికి ఆ దుర్వార్తను వినిపిస్తారు. ఆ తర్వాత, ఆలయం తలుపులు మూసివేస్తారు. అనంతరం స్వామి భళ్లాల రాజు పాలించిన పళ్లి కొండపట్టు వెళతాడు. అక్కడ ఉత్సవమూర్తికి స్నానం చేయించి, భళ్లాల రాజుకు ఆబ్దికం పెట్టిస్తారు. ఆ తర్వాత, ఉత్సవమూర్తి తిరిగి ఆలయానికి చేరుకుంటాడు. ఇవన్నీ అయ్యాకే భక్తులకు దర్శన భాగ్యం. ఇలాంటి స్థల పురాణ గాథలు భక్తలోకంలో విశేష ప్రచారంలో ఉన్నాయి.

- శ్రీమల్లి, 7382927069




Friday, 31 August 2018

సలేశ్వర మల్లిఖార్జున స్వామి









సలేశ్వర మల్లిఖార్జున స్వామి



సలేశ్వర మల్లికార్జున స్వామి వారి ఆలయ చరిత్ర:
అక్కడి ప్రతి చెట్టు నిత్యం స్మరిస్తూనే ఉంటుంది. ఎత్తయిన కొండల నుంచి జాలువారే ప్రతి నీటి బొట్టు లింగాన్ని తాకాలని తపిస్తూనే ఉంటుంది. ప్రకృతి ఒడిలో కొలువైనట్లుగా కనిపించే సలేశ్వరుడు యాత్ర నాగర్ కర్నూల్ లోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది.

తెలుగు రాష్ట్రాల అమరనాధ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వరం యాత్ర:
ఉగాది వెళ్లిన తొలి పౌర్ణమి సమయంలో కేవలం 5 రోజులు మాత్రమే భక్తులు దర్శించుటకు వీలు కలిగే సలేశ్వర యాత్ర:

శివుడు మల్లిఖార్జున స్వామి రూపంలో కీకారణ్యంలో వేలసంవత్సరాల క్రితం వెలసిన క్షేత్రం సలేశ్వరం.

హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా ,లింగాల మండలం మన్ననూరు, అచ్చంపేట గ్రామాల అటవీ ప్రాంతంలో సలేశ్వర మల్లిఖార్జున స్వామి వెలిసారు. చుట్టూ కొండలు ఉండటం వలన శైలాలు(కొండలు) పేరు మీదుగా మొదట శైలేశ్వరం అని కాలక్రమేణా వాడుక భాషలో ప్రజలు సలేశ్వరంగా ఈ ప్రాంతాన్ని పిలవటం మొదలయింది. సలేశ్వర యాత్ర అతి కఠిన తరమైనది కావున తెలుగు రాష్ట్రాల అమర్ నాధ్ యాత్రగా పేరుపొందింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గ మధ్యలో మన్ననూర్ అటవీ ప్రాంతంలో 150 వ మైలు రాయి వద్ద నుండి అటవీ మార్గం ద్వారా 20 కిలోమీటర్లు వాహనాలు పై ప్రయాణిస్తే సలేశ్వరం కు వెళ్లే మార్గంకు చేరుకుంటాము. ఈ 20 కిలో మీటర్లు కూడా క్లిష్టమైన అటవీ ప్రాంతం,మట్టిరోడ్డు కావటం మరియు సింగిల్ రోడ్డు వల్ల 20 కిలోమీటర్లు చేరుకోవటానికి 4 నుంచి 5గంటల సమయం పడుతుంది,శ్రీశైలం నుండి తిరిగి హైదరాబాదు వెళ్లే మార్గం లో సరిగ్గా 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే మన్ననూరు వస్తుంది.

ఇది దట్టమైన కీకారణ్య ప్రాంతం కావున అటవీ శాఖ అధీనంలో ఉంటుంది.కేవలం చైత్ర శుధ్ధ త్రయోదశి నుండి చైత్ర బహుళ విదియ వరకు మాత్రమే 5 రోజులు స్వామి వారి వార్షిక ఉత్సవాల సమయంలో మాత్రమే భక్తులను ఆలయం వరకు అనుమతిస్తారు.మిగిలిన రోజుల్లో ఈ ఆలయం కు వెళ్లటం అసాధ్యం. ఈ జాతరలో పాల్గొనటానికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జంగమయ్యను అయిన దర్శించుకొని పరవశిస్తారు. అంతేకాదు తరతరాలుగా స్థానిక చెంచులే ఈ జాతరను నిర్వహించడం విశేషం.

అద్బుత మైన ప్రకృతి,ఆకాశం తాకే కొండలు,వాటి కిందనుండి పై వరకు పచ్చని చెట్లు,గుహలు,జలపాతాలు ఈ ప్రాంతం సొంతం,అందుకే 17 వ శతాబ్దం లో అలనాటి నిజాం నవాబ్ అటవీ సంచారానికి వచ్చి ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యానికి ముగ్దుడు అయ్యి ఆ రోజుల్లోనే ఈ ప్రాంతంలో వేసవి విడిది పర్హాబాద్ పేరుతో భవనం నిర్మించుకున్నారు. అనగా అందమైన ప్రదేశం అని అర్థం, అంతకు ముందు దాని పేరు’ పుల్ల చెలమల’. 1973 లో ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పలుల సరక్షణా కేంద్రం.అడవిలో 20 కిలోమీటర్లు వాహనాలపై ప్రయాణించాక వాహనాలు అక్కడ నిలిపి తమకు అవసరమైన దుస్తులు, ఆహార పదార్దాల వంటివి మాత్రమే తీసుకుని కాలి నడకన 5 కిలోమీటర్లు నడవాలి.

ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది కనుక కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. ఈ మార్గం కొండలు, ఇరుకైన ప్రాంతాలు, అతి క్లిష్టమైన సన్నని రోడ్లు కలిగి ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక రెండు కొండల మధ్య ఒక వాగు ప్రవాహం కలిగి ఉంటుంది. ఆ కొండలను పట్టుకుని అతి జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ ఆ వాగు దాటాలి. ఏ మాత్రం కాలు జారినా వాగు ప్రవాహంలో పడిపోతారు.

ఈ ఆలయంలో చైత్ర శుద్ధ పౌర్ణమి  రోజున చంద్రకిరణాలు నేరుగా స్వామి వారి పై ప్రసరించి తేజోమూర్తి అయిన లింగమూర్తిగా స్వామి దర్శనమిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజున మాత్రమే ఇలా జరుగుతుంది.  కనుకనే ఈ రోజున లక్షలాది భక్తులు స్వామి వారిని దర్శించి కృపపొందుతారు. ఈ ఆలయానికి దగ్గరలో దాదాపు 1000 అడుగుల పై నుండి జాలు వారే తెల్లని స్వచ్చమైన పాలధార లాంటి జలపాతం పడుతుంది. ఈ జలపాతం క్రింద స్నానమాచరించి స్వామిని దర్శిస్తారు. ఈ జలపాతం కింద స్నానమాచరిస్తే దీర్ఘకాలిక రోగాలు మాయం అవుతాయని భక్తుల నమ్మకం.

దట్టమైన అరణ్యం లో ఎన్నో ఔషధ మొక్కలు, ఆకులును తాకుతూ పై నుండి జాలు వారే జలం లో అనేక గుణాలు ఉండి రోగాలు నయం చేస్తాయని చెపుతారు. ఈ ప్రవాహం భక్తులు కొద్ది సంఖ్యలో వెళ్తే తక్కువ ధారతో ఎక్కువ సంఖ్యలో వెళ్తే పెద్ద ధారతో పై నుండి పడడం స్వామి లీల అని చెపుతారు. పుట్టకు దారాలు కట్టి పూజ చేస్తే సంతానం లేని వారికి సంతాన ఫలం,తిరుగు ప్రయాణంలో కోరిన కోర్కెలు త్వరగా నెరవేరాలని వివాహం కాని వాళ్లు చలువపందిళ్లు వేస్తారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లు రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చి మరోసారి ఆ లింగమయ్యకు మొక్కుకుంటారు. ఈ క్షేత్రానికి వచ్చి శివయ్యను దర్శించుకుంటే ఏడాదంతా పంటలు బాగా పండుతాయన్నది రైతుల విశ్వాసం. కష్టమైనా ఈ నడక ప్రయాణాన్ని సాగిస్తున్న భక్తులు “వస్తున్నాo  వస్తున్నా లింగమయ్య” అంటూ దర్శనానంతరం తిరిగి వెళ్తూ “వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం లింగమయ్య” అంటూ చేసే పనుల వల్ల ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది.

చారిత్రక ఆధారాలు:
నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలో చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరిపై అనాడు శ్రీలంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులు కొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరినే ఈ సలేశ్వరమేనని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు ఉన్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16″/10″/3″ గా ఉన్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . “సుళ” తెలుగులో “సుల” అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరంగా చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల క్రీ.శ.. 360-370 కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10"/10″/3″. దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం ఉంది.

స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్ది అనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బి.ఎన్ శాస్త్రి నిరూపించారు.

13వ శతాబ్దంలో పండితారాధ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రం రాసిన ప్రముఖ శివ భక్త పండితుడు పాల్కురి సోమనాధుడు తన గ్రంధాలలో సలేశ్వర ఆలయ విశేషాలు తెలిపారు,దీనిని బట్టి ఎంత ప్రాసస్త్యం ఉన్న ఆలయమో మనం గ్రహించవచ్చు. 17వ శతాబ్దంలో శ్రీశైలం దర్శించిన చత్రపతి శివాజీ అడవుల గుండా ప్రయాణించి సలేశ్వరం చేరుకుని స్వామి వారికి ఆరాధించినట్లు చారిత్రక కధనాలు ఉన్నాయి.   సలేశ్వర ఆలయానికి దగ్గరలో అటవీ ప్రాంతంలో అధ్బుతమైన మల్లెల తీర్దం అనే చారిత్రక జలపాతం ఉంటుంది.

భక్తుల సౌకార్యార్థం కోసం కొందరు స్వచ్ఛంద సంస్థల వారు ఉచితంగా భోజనం, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతారని వారికి ఐటీడీఏ, అటవీశాఖ, ఇతర శాఖల అధికారుల సహకారం అందిస్తారు. జాతరకు వచ్చే భక్తులు విలువైన ఆభరణాలు ధరించరాదని సూచించారు. ఆర్టీసీ బస్సులు కూడా రాంపూర్‌పెంట వరకే వెళ్తాయని అక్కడ నుంచి 2KM ఆటొ ప్రయాణం తరువాత కాలినడుకన భక్తులు సలేశ్వరం చేరుకోవాలి. లింగమయ్యను దర్శించుకోవడానికి, వాహనాలను లోపలికి అనుమతి కోసం వసూలు చేసే టోల్‌గేట్ ద్వారా వచ్చె డబ్బులను సలేశ్వరం చుట్టున్న 12 పెంటల అభివృద్ధికి ఖర్చు చేస్తారు.

నల్లమల అడవిలో మొత్తం పంచ లింగాలున్నాయి అంటారు:
శ్రీశైల మల్లికార్జునస్వామి (జ్యోతిర్లింగం), సలేశ్వరం లింగమయ్యస్వామి, లొద్దిమల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలిసినవి. తెలియని ఐదో లింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ ఐదో లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే!

లింగాలలో జరిగే కోదండరాముడి బ్రహ్మోత్సవాల సమయంలోనే ఈ క్షేత్రాన్ని భక్తుల దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రత్యేక బస్సులు భక్తుల సౌకర్యార్థం నాగర్ కర్నూల్, అచ్చంపేట నుండి RTC బస్సులు నడుపుతున్నారు. లింగాల మండలం అప్పాయిపల్లిలో RTC క్యాంపులు ఏర్పాటు, లింగాల నుండి కాలినడకన సలేశ్వరం వెళ్ళే భక్తులకు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ నుండి లింగాల, అప్పాయిపల్లి వరకూ ప్రతి 20 నిమిషాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.

సలేశ్వరం చేరుకోవడానికి మార్గాలు:
1. హైదరాబాద్ వైపు నుండి సలేశ్వరం వచ్చే భక్తులు నేరుగా శ్రీశైలం బస్సు ఎక్కి ఫర్హాబాద్ చౌరస్తా దగ్గర దిగితే సరిపోతుంది. అక్కడ నుండి బస్సులు. ఆటోల రాంపూర్ చెంచు పెంట వరకు ప్రయాణించవచ్చు. తెలంగాణ వైపు నుండి వచ్చే భక్తులకు అచ్చంపేట ,నాగర్ కర్నూలు బస్ డిపోల నుండి సలేశ్వరం కు నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

2. శ్రీశైలం వైపు నుంచి వచ్చే భక్తులు హైదరాబాద్ బస్సు ఎక్కి ఫర్హాబాద్ చౌరస్తా దగ్గర దిగి సలేశ్వరం చేరుకోవచ్చు.

3. మరో మార్గం లింగాల మండలం అప్పాయిపల్లి మీద గా ఉంది. ట్రాక్టర్ల ద్వారా గిరిజ గుండాల వరకు అతి కష్టంమీద చేరుకొని అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తే సలేశ్వరం చేరుకోవచ్చు.








సలేశ్వరం



సలేశ్వరం గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే..!!

గుడి అంటే రోజూ పూజలు, నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే! కానీ ఓ దేవాలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది. ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు. మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే. ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే. అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు. గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి. ఇంతకీ ఆ గుడి ఎక్కడ వుంది? అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని వుంది కదూ!

సలేశ్వరం.
శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.

  1. ఆలవాలం.
    అదో దట్టమైన కీకారణ్యం. ఎత్తైన కొండలు, పాలనురుగులా జాలువారే జలపాతాలు, ప్రకృతి రమణీయదృశ్యాలు, అక్కడి ప్రతి అణువూ నిండి వుంటుంది. దీనితో పాటు కారడివి ఆధ్యాత్మికతకు కూడా ఆలవాలంగా వుంటుంది.

  2. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం.
    తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవున్న సలేశ్వర క్షేత్రం వెళ్ళాలంటే ఎవరికైనా ఒణుకు పుట్టాల్సిందే. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ రాయి దగ్గర పరహాబాద్ గేటు వుంటుంది. అక్కడి నుంచి 32కిమీల దూరం దట్టమైన అడవిలో వెళ్ళాలంటే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి తీసుకోవాల్సిందే.

  3. జాగ్రత్త.
    గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నెనో గుహలు సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం.

  4. లోయలో జాగ్రత్తగా నడవాలి.
    గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే.

  5. నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా.
    గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది.

  6. లింగమయ్య స్వామి లింగం.
    గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.

  7. సలేశ్వరం జాతర సంవత్సరాని కొకసారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు 'వత్తన్నం వత్తన్నం లింగమయ్యో' అంటూ వస్తారు. వెళ్లేటప్పుడు 'పోతున్నం పోతున్నం లింగమయ్యొ' అని అరుస్తూ నడుస్తుంటారు.

  8. శిధిలావస్థ.
    10కి.మీలు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిధిలావస్థలో వున్న భవనాలు కనిపిస్తాయి. నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై వందేళ్ళకు పూర్వమే అక్కడ వేసవి విడిది నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశాన్ని పరహాబాద్ అంటారు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం.

  9. నడకదారులు.
    ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973 లో కేంద్రప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది. అక్కడ నుంచి సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. దట్టమైన అడవిలో వున్న సలేశ్వర ఆలయంలో చెంచులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తూవుంటారు.

  10. చైత్రపౌర్ణమి.
    సలేశ్వరంలో సంవత్సరానికి ఒక్క సారి జాతర జరుగుతుంది. చైత్రపౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజుల తరువాత అంటే మొత్తం 5 రోజులపాటు జాతర జరిగే సమయంలోనే ఆ గుడిని తెరచివుంచుతారు. ఈ 5రోజులలో దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు సాహసయాత్ర చేయాల్సి వుంటుంది.

  11. జలపాతాలు.
    ఇరుకైన లోయల్లో కేవలం కాలు మాత్రమే పట్టే దారి మాత్రమే వుంటుంది. పొరపాటున అక్కడ కాలు జారితే అంతే సంగతులు. కనీసం శవం కూడా దొరికే పరిస్థితి వుండదు. అక్కడికి వెళ్ళే దారిలో వుండే జలపాతాలు మండు వేసవిలో ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

  12. భక్తులతో కిటకిటలాడుతూ.
    నీటి గుండాలు చూపులు తిప్పుకోనివ్వవు. గుడి తెరచి వుండే 5రోజులు భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగామయ స్వామి, లుగ్దీ మల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలుసు. ఐదో లింగం నల్లమల అడవులలో ఎక్కడ వుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

  13. చరిత్రకారులు.
    సలేశ్వర ఆలయాన్ని 6వశతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దంలోని మల్లికార్జునపండితారాజ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలను పాల్పురి సోమనాధుడు వర్ణించాడు. ఆలయం నిర్మించిన నాటి నుంచి ఏడాదిలో 5 రోజులు మాత్రమే తెరచివుంచటం ఆనవాయితీగా వస్తోంది. 17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర చెబుతుంది.

  14. ఎలా చేరుకోవాలి..
    • హైదరాబాద్ - శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూర్ అనే ఊరు వస్తుంది. అక్కడి నుండి 10 -12 KM దూరం శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెళ్తే సలేశ్వరం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు చూపించే గుర్తు వైపు 10 కిలోమీటర్లు వెళ్తే సలేశ్వరం లోయ కనిపిస్తుంది. అక్కడే వాహనాలు, బస్సులు ఆపాలి. లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి. అదే సలేశ్వర క్షేత్రం.
    • నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి.
ఓం నమః శివాయ..స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!



Thursday, 28 June 2018

అమర్‌నాథ్‌ యాత్ర





28-06-2018

భక్తిగా... జాగ్రత్తగా

అమర్‌నాథ్‌ యాత్ర ఈ రోజు మొదలవుతోంది. భక్తులు ఎంత పవిత్రమైనదిగా భావిస్తారో అంతకు మించిన క్లిష్టతతో కూడుకున్న ప్రయాణం ఇది. అందుకే ఈ యాత్రకు బయలుదేరినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. హిమాలయాల్లో సముద్రమట్టానికి సుమారు 3,900 మీటర్ల ఎత్తున, చుట్టూ ఆవరించిన మంచు పర్వతాల మధ్య నెలకొన్న గుహాలయం ఇది. దాదాపు నలభై మీటర్ల ఎత్తులో ఉండే గుహలో హిమరూపంలో పరమశివుడు దర్శనమిస్తాడు. ఏడాదిలో కొంతకాలం తప్ప మిగిలిన మాసాల్లో ఈ ప్రాంతమంతా దట్టమైన మంచుతో కప్పి ఉంటుంది. ఆ ప్రాంతంలో మే నుంచి ప్రారంభమయ్యే వేసవి కాలంలో మాత్రమే అక్కడికి చేరుకోగలరు. ఈ రోజు (జూన్‌ 28వ తేదీ) నుంచి ఆగస్టు 26వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే వాతావరణం అనుకూలిస్తే తప్ప ఈ యాత్రకు అనుమతించరు. అమర్‌నాథ్‌ యాత్ర చేస్తున్నవారు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలివి.

ఇవి మరచిపోవద్దు
గుర్తింపు వివరాలు: యాత్రకు మీరు అనుమతి పొందినట్టు ధ్రువీకరించే రిజిస్ట్రేషన్‌ కార్డు తీసుకువెళ్ళడం మరచిపోవద్దు. ఈ కార్డు లేకపోతే యాత్రకు అనుమతించరు. అలాగే మీ ఐడి ప్రూఫ్‌ కూడా తీసుకువెళ్ళండి. మీ పేరు, చిరునామా, యాత్రలో మీతోపాటు పాల్గొంటున్న వారి వివరాలు, మీ కుటుంబ సభ్యుల ఫోన్‌ నెంబర్లు కాగితం లేదా చిన్న పుస్తకంలో రాసి మీతో పాటు ఉంచుకోండి. అత్యవసర పరిస్థితుల్లో మీరు చిక్కుకున్నప్పుడు వాటి అవసరం ఉండొచ్చు.

ఆరోగ్య ధ్రువపత్రాలు:13 ఏళ్ల లోపు బాలబాలికలనూ, 75 ఏళ్లు దాటిన వారినీ ఈ యాత్రకు అనుమతించరు. యాత్రకు వెళ్లే భక్తులు పూర్తి స్థాయి రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే గుండె సంబంధిత ECG, 2D-ECHO తదితర పరీక్షలను వయసును బట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్య ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాపీలను యాత్ర సమయంలో దగ్గర ఉంచుకోవాలి.

బీమా ఉండాల్సిందే: ఇది ప్రమాదకరమైన యాత్ర. కాబట్టి బీమా తీసుకోండి. సుమారు మూడు లక్షల రూపాయల వరకూ గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ను అమర్‌నాథ్‌ యాత్ర బోర్డు అందిస్తోంది.

తగినంత నగదు: దారిలో ఆహారం, అవసరమైన పరికరాలు కొనుక్కోవడానికీ, బస చేయడానికీ అవసరమైన నగదు తీసుకువెళ్ళండి.

మార్గంలో మన కోసం...
ఆహారం:బిస్కట్లు, మిల్క్‌ పౌడర్‌, చక్కెర, డైరఫ్రూట్స్‌, గ్లూకోజ్‌, ఇతర తినుబండారాలూ మీతో పాటు తీసుకువెళ్ళండి. సీసాతో నీళ్ళు, గ్లాసు, స్పూన్లు, ఒక ప్లేట్‌ మీ కిట్‌లో ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి. మార్గమధ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సరుకుల దుకాణాలు, ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే రెస్టారెంట్లు, టీ దుకాణాలు ఉంటాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఉచితంగా ఆహారాన్నీ, దారిపొడుగునా మంచి నీటినీ అందిస్తున్నాయి. ఖాళీ కడుపుతో ప్రయాణం చెయ్యకండి. దానివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

హెలీ సేవలు: యాత్రికుల కోసం వివిధ సంస్థలు హెలికాఫ్టర్‌ సేవలు అందిస్తున్నాయి. నీల్‌గ్రాత్‌ (బల్తాల్‌) నుంచి పంచ్‌తరణి వరకూ ఒక వైపు ప్రయాణానికి రూ. 1,600, పహల్గామ్‌ నుంచి పంచ్‌తరణి వరకూ ఒకవైపు ప్రయాణానికి రూ. 2,751 ఛార్జీలుగా నిర్ణయించారు.

నో ప్రీపెయిడ్‌: జమ్మూ-కాశ్మీర్‌లో, యాత్ర జరిగే ప్రాంతంలో ఇతర రాష్ట్రాల ప్రీపెయిడ్‌ సిమ్‌ కార్డులు పని చెయ్యవు. భక్తులు తమ బృందంలో ఒక్కరికైనా పోస్ట్‌ పెయిడ్‌ ఫోన్‌ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL వారి కనెక్షన్‌ ఉన్న ఫోన్‌ను వెంట ఉంచుకోవడం ఉత్తమం. లేదంటే బల్టాల్‌, నున్వాన్‌ బేస్‌ క్యాంప్‌ల వద్ద ప్రీయాక్టివేటెడ్‌ సిమ్‌ కార్డుల్ని కొనుక్కోవచ్చు.

ఛార్జీలు తెలుసుకోండి:ఏ సేవకు ఎంత మొత్తంలో చెల్లించాలో అమర్‌నాథ్‌ బోర్డు నిర్ణయిస్తుంది. ఆ వివరాలతో బోర్డులు ఉంటాయి. ఆ మేరకు మాత్రమే చెల్లించండి.

ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్‌: వేసలైన్‌, కోల్డ్‌ క్రీమ్‌, మోశ్చరైజర్‌, లిప్‌ బామ్‌, సర్జికల్‌ కాటన్‌, నొప్పి నివారణ మాత్రలు, స్ర్పేలు, చిన్న చిన్న గాయాలు, ఆరోగ్య ఇబ్బందులకు అత్యవసరంగా ఉపయోగపడే మందులతో ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌ మీతో ఉంటే మంచిది. కర్పూరం కూడా తీసుకువెళ్ళండి. శ్వాసకోశ సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని వాసన చూస్తే ఉపశమనం కలుగుతుంది.

ఇతర పరికరాలు: దారి మిట్టపల్లాలుగా ఉంటుంది. సుమారు మూడు కిలోమీటర్లకు పైగా మంచు మీద నడవాల్సి ఉంటుంది. కనుక ఊత కోసం పొడవైన కర్ర లేదా వాకింగ్‌ స్టిక్‌ తీసుకు వెళ్ళండి. టార్చిలైట్‌ కూడా దగ్గర ఉంచుకోండి.

చలిని గెలుద్దాం
దుస్తులు: అమర్‌నాథ్‌ మంచు ప్రదేశం. చలి ఎముకలు కొరికేస్తూ ఉంటుంది. ఆ చలిని తట్టుకోవడం చాలా కష్టం. అందుకే శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచడంతోపాటు వెచ్చదనాన్ని అందించే దుస్తులు ఈ యాత్రకు తప్పనిసరి. కాబట్టి ఊలుతో చేసిన స్వెట్టర్లు, ఫ్యాంట్లు, మంకీ క్యాప్‌లు, చేతి తొడుగులు ధరించండి. బయటి నుంచి గాలి శరీరాన్ని తాకకుండా జాగ్రత్త పడండి. రైన్‌ కోట్‌, స్లీపింగ్‌ బ్యాగ్‌, చలిని బాగా తట్టుకోగలిగే రగ్గులు, గొడుగు తీసుకువెళ్ళండి. సాధారణమైన చెప్పులు, షూస్‌ వేసుకోకండి. మంచులో నడవాల్సి ఉంటుంది కనుక వాటర్‌ ప్రూఫ్‌ బూట్లు ధరించండి. స్లిప్పర్లతో, కాళ్ళకు ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా నడవకండి. చెవుల్లోకి చలి గాలి వెళ్ళకుండా దూది పెట్టుకుంటే మేలు.

ఇవి వద్దు: మహిళలు చీరలు ధరించకపోవడం మంచిది. అలవాటు ఉంటే ఫ్యాంట్లు బెస్ట్‌. లేదంటే సల్వార్‌ సూట్లు వేసుకోవచ్చు. ధోవతీల్లాంటివి ధరించకండి.

బస: యాత్ర జరిగే సమయంలో జమ్మూ-కాశ్మీర్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ దారి పొడుగునా గుడారాలు ఏర్పాటు చేస్తుంది. వీటిలో వివిధ సౌకర్యాలుంటాయి. ప్రైవేటు వసతి కూడా అందుబాటులో ఉంటుంది. బేస్‌ క్యాంపుల వద్ద వీటిని బుక్‌ చేసుకొవచ్చు. ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

అవగాహనతో ప్రయాణం
సమయాలు తెలుసుకోండి: డోమెల్‌, చందన్‌వారీల వద్ద ప్రవేశ ద్వారాలు సాధారణంగా ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకూ తెరుస్తారు. ఆ సమయానికల్లా గేట్‌ దగ్గరకు యాత్రికులు చేరుకోవాలి. గేట్లు మూసిన తరువాత యాత్రికులు ప్రయాణానికి అనుమతించరు. మధ్యాహ్నం 3 గంటలు దాటిన తరువాత పంచ్‌తరణి క్యాంప్‌ నుంచి గుహాలయం వైపు ప్రయాణించకండి. సాయంత్రం 6 గంటల తరువాత దర్శనానికి అనుమతించరు.

సొంత ప్రయోగాలు వద్దు: దగ్గర దారి అని ఎవరో చెప్పారనో, మీ బుద్ధికి తోచిందనో తెలియని మార్గాల్లో ప్రయాణం చేయకండి. హెచ్చరిక సంకేతాలు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సేపు నిలిచి ఉండకండి. అలాగే రాత్రిపూట గుహల దగ్గర ఉండడం శ్రేయస్కరం కాదు. ఆక్సిజన్‌ బాగా తక్కువగా ఉండడం వల్ల శ్వాస సంబంధిత ఇబ్బందులు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి చీకటి పడకముందే వెనక్కి బయలుదేరడం మంచిది.

హడావిడి పనికిరాదు: తొందరగా వెళ్తామన్న ఆలోచనతో ఇతరుల్ని ఓవర్‌టెక్‌ చెయ్యడం, ట్రాఫిక్‌ నియమాలు ఉల్లంఘించడం లాంటివి చేయకండి. మీరు ప్రయాణించేది ప్రమాదకరమైన మార్గం. రెప్పపాటు పొరపాటు జరిగినా ప్రాణాపాయం పొంచి ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో ప్రయాణం సాగించండి.

వారి సేవలే పొందండి: అమరనాథ్‌ ఆలయ బోర్డు గుర్రాలు, డోలీల నిర్వాహకులకు లైసెన్స్‌ కార్డులు ఇస్తుంది. అధికారికంగా నమోదైన వ్యక్తుల సేవలు మాత్రమే వినియోగించుకోండి. వారు మీతో పాటే వచ్చేలా చూసుకోండి. వారిని వదిలి దూరంగా వెళ్ళకండి. వారి పేరు, వివరాలు ఉన్న కార్డులు తీసుకోండి.

ఆదేశాలు పాటించండి: యాత్ర అధికారులు ఎప్పటికప్పుడు సూచనలూ, సలహాలూ ఇస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న వారిని అడిగి తెలుసుకోండి. యాత్ర సమయంలో అమరనాథ్‌ ఆలయ బోర్డు సిబ్బంది, పోలీసులు, పర్యాటక, ఆరోగ్య శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. మీకు ఎలాంటి సందేహాలున్నా వాళ్ళను అడిగి తెలుసుకోండి.

పర్యావరణహితంగా: డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ కప్పులూ, ప్లేట్లను వినియోగించకండి. పాలిథిన్‌ వాడకం జమ్మూ-కాశ్మీర్‌లో నిషేధం. చెత్తను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే పడేయండి.

Saturday, 16 June 2018

అరుణాచలేశ్వరుడు






అగ్నిలింగాకారంలో కనిపించే అరుణాచలేశ్వరుడు!
పంచభూతాల్లో అగ్నిలింగం
ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడించే గిరి ప్రదక్షిణం
పాపాలు హరించే శివపుణ్యక్షేత్రం


భరతఖండం వేదభూమి. లెక్కకు మించిన అద్భుతాలు ఈ నేలపై కొలువైవున్నాయి. అలాంటి అద్భుతాల్లో ఒకటి అరుణాచలం. గాలి, నీరు, భూమి, వాయువు, అగ్ని అనే పంచభూతాల్లో ఒకటి. ప్రకృతిలో మమేకమై పరమాత్మునితత్వం ఉట్టిపడేలా వెలసిన అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుడు. ఈ పేరు మదిలో తలంపుకు రాగానే మనసు భక్తిభావంతో ఉప్పొంగిపోతుంది. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో గిరిప్రదక్షిణం ఆధ్యాత్మిక లోకంలో ఓలలాడిస్తుంది. ప్రతి యేటా కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపోత్సవం అణువణువునూ శివతేజంతో నింపి భక్తులను పులకింపజేస్తుంది. అంతేనా.. అరుణాచలం అనగానే రమణమహర్షి గుర్తుకు వచ్చే ఆధ్యాత్మిక కేంద్రం తిరువణ్ణామలై. అలాంటి అరుణాచలేశ్వరుని గురించి ప్రత్యేక కథనం.

చరిత్ర పుటలను తిరగేస్తే...
దేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో అరుణాచలం ఒకటి. శివభక్తుల పుణ్యక్షేత్రం. అరుణ అంటే ఎర్రని, ఆచలము అంటే కొండ అని అర్థం. అ-రుణ అంటే పాపములు హరించునది అనే అర్థం కూడా వస్తుంది. తమిళంలో తిరువణ్ణామలై అని అంటారు. తిరు అనగా శ్రీ అని, అణ్ణామలై అనగా పెద్దకొండ అని అర్థం. ఇక్కడ కొలువైవున్న శివుడిని స్మరిస్తే చాలు పుణ్యం వస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వేదాలు, పురాణాల్లో కూడా ఈ ఆలయ ప్రస్తావన ప్రముఖంగా కనిపిస్తుంది. స్కంద పురాణంలోని మహేశ్వరకాండలో వేదవ్యాసుడు అరుణాచలం గొప్పతనం గురించి వర్ణించాడు.

శివాజ్ఞ్ఞతో విశ్వకర్మ నిర్మించిన ఆలయం...
అరుణాచలేశ్వర ఆలయాన్ని శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించారని, ఆలయం చుట్టూ అరుణ అనే పురము నిర్మించబడిందని పురాణాలు చెపుతున్నాయి. పైగా ఈ ఆలయంలో జరిగే పూజాపునస్కారాలకు సంబంధించిన విధానమంతా శివుడి ఆదేశం మేరకు గౌతమ మహర్షి రూపకల్పన చేశారని స్కందపురాణంలోని అరుణాచలేశ్వర మహాత్మ్యంలో ఉంది. ఈ జ్యోతిర్లిగం తేజోలింగం కనుక దీన్ని అగ్నిక్షేత్రమని అంటారు. ఈ ఆలయాన్ని తమిళ సామ్రాజ్యాన్ని పాలించిన చోళ మహారాజులు 9, 10 శతాబ్దాల మధ్య నిర్మించారని చోళ రాజుల శాసనాలు చెపుతున్నాయి. తిరువణ్ణామలై పల్లవులు, చోళులు, విజయనగరరాజులు, కన్నడ రాజులు, టిప్పుసుల్తాన్‌ ఆ తర్వాత బ్రిటిష్‌ పాలకుల ఏలుబడిలో వుంది.. ఈ ఆలయానికి ఉండే ఒక్కో రాజగోపురం చూడటానికి రెండు నేత్రాలు చాలవు. వీటిని పోటీపడి మరీ నిర్మించారా అనిపిస్తుంది. నాలుగు దిక్కులా నాలుగు రాజగోపురాలు ఉంటాయి. ఈ దేవాలయం మొత్తం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దక్షిణ భారతంలో ఉన్న అతిపెద్ద ఆలయాల్లో ఇది ఒకటి.

పంచభూత క్షేత్రాల్లో ఒకటి
పురాణాల్లో పేర్కొన్నట్టుగా పంచభూతాలను సూచించే పంచభూతస్థలాల్లో అరుణాచలం ఒకటి. అన్నామలేశ్వరుడు(అగ్ని) కనుక దీనిని తేజోక్షేత్రంగా పిలుస్తారు. మిగిలిన పంచభూత క్షేత్రాల్లో ఏకాంబరేశ్వర ఆలయం (పృథ్వీలింగం - భూమి), జంబుకేశ్వరుడు (జలలింగం - నీరు), కాళహస్తీర్వుడు (వాయులింగం - గాలి), చిదంబరేశ్వరుడు (ఆకాశలింగం - ఆకాశం). దక్షిణ భారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాల్లో దీన్ని అగ్నిభూతమునకు ప్రతీకగా పేర్కొంటారు.

గిరిప్రదక్షిణం కాదు.. సాక్షాత్‌ శివప్రదక్షిణం
ఈ అరుణాచలేశ్వరుడు సాక్షాత్‌ జ్యోతిర్లింగ స్వరూపం. అందుకే ఈ ఆలయం చుట్టూ గిరిప్రదక్షిణం చేస్తే సాక్షాత్‌ ఆ శివునికి ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల నమ్మకం. రమణ మహర్షి ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. పాదచారులై శివనామ స్మరణ చేస్తూ గిరిప్రదక్షిణం చేస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుకే గిరిప్రదక్షిణంలో నిత్యం వందలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ కొండలపై ఉండే మహాఔషధ మొక్కల ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణ వల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్ల మేరకు సాగుతుంది. దీన్నే గిరివాలం అని కూడా అంటారు. ఈ గిరివాలం వల్ల భక్తులు పాపవిముక్తులవుతారని, కోరిన కోర్కెలు తీరడమే కాకుండా మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. అరుణాచలాన్ని తలచుకుంటే అన్ని బంధనాలు తెంచుకుని స్వేచ్ఛాజీవులమవుతామని కూడా భక్తులు భావిస్తారు. అందుకే రమణ మహర్షి ఈ ప్రాంతాన్ని హార్ట్‌ ఆఫ్‌ ఎర్త్‌ (భూహృదయం)గా అభివర్ణించారు. స్కందపురాణంలో అన్నికంటే గొప్ప పుణ్యక్షేత్రంగా ఈ ఆలయాన్ని పేర్కొన్నారు.

అగ్నిలింగాకారంలో పరమేశ్వరుడు..
అరుణాచలేశ్వరుడితో పాటు ఎన్నో ఆశ్రమాలకు నెలవైన తిరువణ్ణామలై శాశ్వతమైన శాంతినొసగే ప్రశాంతభూమిగా పేరు గడించింది. ఇక్కడ శివుడిని దక్షిణామూర్తి అని పిలుస్తారు. ఈ ఆలయంలో పరమేశ్వరుడు అగ్నిలింగాకారంలో భక్తులకు దర్శనమిస్తుంటాడు. అరుణాచలేశ్వరుడు కొలువైవున్న కొండ ఎత్తు 2669 అడుగులు. పచ్చటి చెట్లతో చుట్టూత కొండలతో అణువణువునా ప్రకృతి అందాలు కనిపిస్తుంటాయి. ఈ అరుణాచలం కొండకు కృతయుగంలో అగ్ని కొండ అని, త్రేతాయుగంలో బంగారు కొండ అని, ద్వాపర యుగంలో తామ్ర కొండ అని, కలియుగంలో రాతి కొండ అనే పేర్లు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ కొండని తేజో లింగం లేదా జ్యోతిర్లింగం అని కూడా పేర్కొంటారు. కొండ చుట్టూ ఎనిమిది లింగాలు, ఎనిమిది నందులు, 350కి పైగా చెరువులు, మరెన్నో మండపాలు ఉన్నాయి. ఎనిమిది లింగాలు అంటే ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం (ఈ లింగంపై ప్రజలు నాణేలు వేస్తారు), ఈశాన్య లింగం అనే పేర్లు ఉన్నాయి.

యేడాదిలో 4 బ్రహ్మోత్సవాలు
ఈ క్షేత్రంలో ఒక యేడాదిలో నాలుగు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. తమిళ నెల కార్తీక మాసం (నవంబరు, డిసెంబరు)లో జరిగే బ్రహ్మోత్సవాలు ప్రసిద్ధి చెందాయి. పది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు కార్తీక దీపోత్సవంతో ముగుస్తాయి. ఆ రోజు సాయంత్రం అన్నామలై కొండపై మూడు టన్నుల నెయ్యితో జ్యోతి ప్రజ్వలన చేస్తారు. అలాగే, ప్రతి పౌర్ణమి రోజున ఈ ఆలయానికి వందలాది మంది భక్తులు వస్తుంటారు. తమిళ పంచాంగం ప్రకారం వచ్చే చిత్రపౌర్ణమి రోజున కూడా భక్తులు భారీగా తరలివస్తుంటారు.

ఎలా వెళ్ళాలి...
తమిళనాడు రాజధాని చెన్నై నుంచి రోడ్డు, రైలు మార్గంలో ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరల్లో వసతి దొరుకుతుంది. అలాగే, రమణాశ్రమంలో కూడా గదులు అద్దెకు ఇస్తారు. అయితే, ఇక్కడ గదులను ముందుగానే రిజర్వు చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు భాషలు మాట్లాడుతారు.





Sunday, 13 May 2018

బైద్యనాథ్ దేవాలయం






బైద్యనాథ్ దేవాలయం
భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం

ఆమె మనసు ఉద్విగ్నంగా ఉంది.
యుద్ధానికి వెళ్లిన భర్త క్షేమసమాచారం లేదు.
ఏమయ్యాడో తెలియదు. పది రోజుల క్రింద ఉత్తరం వచ్చింది. ఆ తరువాత నుంచి అజా అయిపూ లేదు.
గుర్రంపై స్వారీ చేస్తూ తెలియకుండానే కొండపైకి ఎక్కుతోంది ఆమె.
“మార్టిన్. ఐ మిస్ యూ మార్టిన్. ఐ మిస్ యూ సో మచ్ డియర్”
కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
కడిగేసినంత స్పష్టంగా కల్నల్ మార్టిన్ బొమ్మ ఆమె కళ్లముందు కట్టింది.
సాయంత్రం.
సూర్యుడు పడమర ఒడిలో పడుకుండిపోతున్నాడు.
కొండమీద కాషాయ కాంతి విరజిమ్ముతోంది.
వింత నిశ్శబ్దం అంతా పరుచుకుపోయింది.
ఉన్నట్టుండి.
గణ గణ గణ గణ …..
గణ గణ గణ గణ……
గంటల శబ్దం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ వచ్చింది.
ఆ శబ్దం వచ్చిన వైపు చూపింది ఆమె.

దూరంగా ఒక శిధిల దేవాలయం.
అందులో నుంచి హారతి దీపాల వెలుగు.
ధూపాల పొగ. ఘంటారావం.
అప్రయత్నంగానే ఆమె ఆ గుడిపైపు వెళ్లింది.
గుడిముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి వెళ్లింది.
లోపల వైద్యనాథ మహాదేవ శివుడు.
లింగాకారంలో విచిత్ర కాంతులు వెదజల్లుతూ.
అర్థనిమీలిత నేత్రాలతో పూజారి అర్చన చేస్తున్నాడు.
ఆయన నోటి నుంచి మంత్రాలు అలవోకగా వెలువడుతున్నాయి.

ఆమె తనకు తెలియకుండానే అక్కడే నిలబడిపోయింది.
కళ్లనుండి ధారగా నీరు కారుతూనే ఉంది.
పూజ పూర్తికాగానే పూజారి ఆమె వైపు చూశాడు.
“మేమ్ సాబ్ తీర్థం తీసుకొండి.”
“ఏమిటమ్మా ఏదో దుఃఖంలో ఉన్నట్టున్నారు.”

ఆమె తన భర్త కల్నల్ మార్టిన్ అఫ్గన్ యుద్ధానికి వెళ్లిన సంగతి, ఆయన క్షేమ సమాచారం లేని విషయమూ చెప్పింది. చెప్పిందన్న మాటే కానీ కన్నీళ్ల వర్షం కురుస్తూనే ఉంది.
“మేమ్ సాబ్ కంగారు పడకండి. బైద్యనాథ్ మహాదేవుడు అందరినీ కాపాడతాడు. ఆయన దయ ఉంటే మృత్యువేమీ చేయదు. అంతఃకరణశుద్ధిగా బైద్యనాధుడిని అర్చించండి. ఓం నమశ్శివాయ అన్న మంత్రాన్ని పదకొండు రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి. అంతా మంచే జరుగుతుంది.” అన్నాడు.

ఆమెకి ఏమనిపించిందో తెలియదు కానీ ఆ మరుసటి రోజు నుంచే అన్నపానాలు మానేసింది. అన్ని పనులూ మానేసింది. తన గదిలోనే కూచుంది. “ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.” మంత్రం జపించసాగింది. మరొక ధ్యాస లేదు. ఇంకో ధ్యానం లేదు. ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.

ఒకటి … రెండు …. మూడు ….. నాలుగు …. అయిదు …..
రోజులు గడిచిపోతున్నాయి.
“ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.”

పదకొండో రోజు. రోజు రోజంతా పంచాక్షరిని జపించింది
సాయంత్రం అవుతూ ఉండగా సేవకుడొకడు “మేమ్ సాబ్ … మేమ్ సాబ్… సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై… సాహిబ్ కీ చిట్ఠీ ఆయీ హై…” అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఉద్వేగాన్ని ఆపుకుంటూ ఆమె ఆ లేఖను తెరిచి చూసింది.
తన ప్రియాతిప్రియమైన మార్టిన్ సంతకం చూసింది. కట్టలు తెంచుకుంటున్న భావోద్వేగాన్ని ఎలాగోలా ఆపుకుంటూ లేఖను చదవసాగింది.

“డియర్. గతంలో నీకు లేఖ వ్రాసిన మరుసటి రోజు నుంచే అఫ్గన్లు మా పటాలాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచి భీకరమైన దాడి చేశారు. మేమెవరమూ బతికిబట్టకట్టి బయటపడే పరిస్థితి లేదు. మా దగ్గర ఆయుధాలూ తక్కువే. ఆహారమూ తక్కువే. వాళ్లు వందల సంఖ్యలో ఉన్నారు. ఇక మా పని అయిపోయిందనుకున్నాను. ఒక అఫ్గన్ పొడవాటి ఖడ్గంతో నాపై దూకాడు. నేను భయంతో కళ్లు మూసుకున్నాను. ఆ క్షణంలో నువ్వు తప్ప నాకింకెవరూ గుర్తుకురాలేదు. అంతలో అద్భుతం జరిగిపోయింది. ఎవరో ఒక మనిషి అఫ్గన్లపైకి దూకాడు… ఆయన్ని నేను అంతకుముందు ఎప్పుడూ చూడలేదు….ఒళ్లంతా తెల్లగా ఏదో రాసుకున్నాడు. సింహం చర్మం మొలకి కట్టుకున్నాడు. చేతుల్లో పొడవాటి శూలం లాంటి ఆయుధం ఉంది. ఆ శూలం కొన మూడుగా చీలి ఉంది. ఆయన ధాటికి అఫ్గన్లు కకావికలమైపోయారు. కాలికి బుద్ధిచెప్పి పారిపోయారు. వాళ్లు పారిపోగానే ఆయన కూడా ఏమైపోయాడో తెలియదు. ఎక్కడికి వెళ్లిపోయాడో తెలియదు. ఆయన ఆ క్షణాన వచ్చి ఉండకపోతే నేను నీకు దక్కేవాడికి కాదు డియర్.”.

1880 అఫ్గన్ యుద్ధం నుంచి తిరిగి వచ్చాక కల్నల్ మార్టిన్, ఆయన భార్య కొండ మీద కొలువున్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆ దేవాలయం జీర్ణోద్ధరణకు పదిహేనువేల రూపాయలు సమర్పించుకున్నారు. మహాదేవ్ మందిరానికి కొత్త శోభ వచ్చింది.
కొన్నాళ్లకి కల్నల్ మార్టిన్ సతీ సమేతంగా ఇంగ్లండుకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ కూడా వారి ఇంట్లో ఒక శివుడి విగ్రహం పెట్టుకున్నారు. కడవరకూ ఆయన్నే అర్చించారు.
మందిరం ముందు ఉన్న శిలాఫలకంపై తమ కథను కల్నల్ మార్టిన్, ఆయన భార్య వ్రాయించారు. ఆ మందిరం మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాలో ఉంది. భారత దేశంలో బ్రిటిషర్ కట్టించిన ఏకైక దేవాలయం అది.






Indian Temple Built by a British Man

Interesting Story..
In 1879, when the British were ruling India, Lt. Col. Martin of Agar Malva was leading the army in the war against Afghanistan.

Col. Martin used to regularly send messages of his well-being to his wife. The war continued for long & Lady Martin stopped getting messages. She was very upset.

Once riding on her horse, she passed by the temple of Baijnath Mahadev. She was attracted by the sound of Conch & Mantra. She went inside and came to know that the Brahmanas were worshipping Lord Shiva. They saw her sad face and asked her problem. She explained everything to them. They told her that Lord Shiva listens to the prayers of devotees and takes them out of difficult situations in no time. With the advice of the Brahmanas she started the ‘Laghurudri Anushtthan’ of the Mantra:

‘Om Namah Shivaya’ for 11 days. She prayed to Lord Shiva that if her husband reaches home safely, then she would get the temple renovated.

On the last of the ‘Laghurudri’ a messenger came and gave a letter to her. Her husband had written: ‘I was regularly sending messages to you from the battle grounds but suddenly the Pathans surrounded us from all sides. We were entrapped in a situation where there was no scope of escaping death. Suddenly I saw a Yogi of India with long hair, carrying a weapon with three pointers (Trishul). His personality was amazing and he was maneuvering his weapon with a magnificent style. Seeing this great man, the Pathans started running back. With his grace our bad times turned into moments of victory. This was possible only because of that man of India wearing a lion skin & carrying a three-pointer weapon (Trishul). That great Yogi told me that I should not worry and that he had come to rescue me because he was very pleased with my wife’s prayers.’

Tears of joy were falling down Lady Martin’s eyes while reading the letter. Her heart was overwhelmed. She fell into the feet of Lord Shiva’s statue and burst in tears.

After a few weeks Col. Martin returned. Lady Martin narrated the whole incident to him. Now both husband & wife became devotees of Lord Shiva. In 1883 they donated Rs. 15,000 for renovating the temple. The information engraved slab for the same is still there in the Baijnath Mahadev Temple of Agar Malva. This is the only Hindu temple built by a Britisher.

Analysis:The message talks about the Baijnath Mahadev (Shiva) Temple in Agar Malwa of Madhya Pradesh state in India, that it is the only temple made by a Britisher in India, and that it happened after the Colonel Martin was miraculously saved by an avatar of Lord Shiva – post prayers from his wife, Lady Martin. Many people could not believe these supernatural claims, but there are documented records suggesting such an incident could have possibly happened. There is some misinformation in the story though.

History of Baijnath Temple 

This famous Baijnath Mahadev Temple is located in southern banks of Banganga river in Agar Malwa of Madhya Pradesh, India. The Shiv Ling (the sacred stone form of Lord Shiva) in the Baijnath temple is believed to belong to 13th century, while some legends say it is probably more than thousand years old. As written in the foundation stone of the temple (shown in a Hindi documentary video of the temple in reference section below, at timeline 5:32), at the end of 16th century, the local inhabitants built a small mutt like mandhir and mandap (a type of small temple structure). Then after 300 years, in 1883, with the inspiration from British army Hindu officials, and financial help of British Commander Lt. Colonel C. Martin and other local people, 11000 rupees was donated for the renovation of the temple, making it large, and also building few other temples around it.

There is also another piece of writing on one of the pillars in middle of the temple suggesting that it was built (renovated) with the orders of C. Martin in 1883. The official website of Shajapur district in Madhya Pradesh (shajapur.nic.in), where this temple is located, also mentions about this story. It is said that when the British Commander Martin was in a war, his wife went to Baijnath mahadev temple and made a request for his returning. Then Martin successfully came back from the war, and thereafter a beautiful temple was constructed.

Our verification says that Agar is an ancient archaeological site, located 66 KMs from Ujjain, and was a Camp (Chhavani) in English period. And Lt. Colonel C. Martin was indeed the Commander of Central India Horse British regiment during the second Anglo-Afghan war between 1878-1880:

Commanded by Lt. Colonel C. Martin. The men of the Central India Horse (a wing each of the 1st and 2nd Regiments) crossed the frontier at Jamrud in February 1880 where they were then employed on the Khyber line of communications. In May a portion of the force was involved with the expedition against Mullah Khalil in the Besud Valley, before they were called to Kabul to join General Roberts’ force that was to march on Kandahar. They fought at the battle of Kandahar, including the pursuit of the retreating Afghans, and then returned to India in October.

The Baijnath Mahadev Temple is known to be powerful – for the Lord Shiva residing there shall fulfill the sincere wishes of all the people who pray and worship him. Not just thousands of Indians, many people from other countries also visit the temple quite often.

Conclusion 

Considering the aforementioned documented records and the beliefs about the power of the temple, we can conclude that such an incident could have possibly happened. So the Baijnath Mahadev Temple is the only Indian temple made by a Britisher during their rule in India.

There is this popular belief among Indians, especially Hindus, that God sometimes comes in human form (avatar or incarnation) to rescue his sincere devotees who are in trouble. One such example is the story of Bhadrachala Ramadasu (Kancherla Gopanna) who has been very keen and devoted towards Lord Rama that when he was jailed for using tax money to renovate the holy Rama temple at Bhadrachalam, both Rama and Lakshmana, in the guise of two youngsters paid up his dues to release him. Apart from the numerous songs of praise written by Ramadasu, the golden coins paid by Rama, known as Ram Tanka coins can be seen even today. You can read the detailed story from reference section below.






Friday, 16 March 2018

శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి





శివలింగంపై కొప్పు
శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉన్న శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామివారి క్షేత్రం బహు పురాతనమైనది. ఈ గ్రామం రావులపాలెం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అనుకోకుండా మొన్నీమధ్య మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడికి చేరుకున్నాను. ఆ సమయంలో దేవాలయం తెరిచి ఉంటుందా అన్న అనుమానంతో దేవాలయంలోకి ప్రవేశించాను. ఏవో కారణాలవల్ల తెరిచే ఉన్నది. అలా మనకి రాసున్నదన్నమాట. ఈ దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం. రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. శ్రీ పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం ఇక్కడే ఉన్నది. మూడవది – నిజానికి శివలింగంపై కొప్పు మొదటినుండీ ఉండినది కాదు; కాలాంతరంలో పుట్టుకొచ్చినది.

శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామిగుడి వెలుపల, ఇటీవలే అమర్చిన ఒక శిలా ఫలకంపై ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలియజేస్తున్న వివరాలను యథాతదంగా ఇక్కడ ఫొటోలతో సహా పొందుపరుస్తున్నాను. కానీ వింధ్య పర్వతం, అగస్త్య మహాముని వివరాలు కౢప్తంగా తెలుసుకుంటే కింద ఉన్న మాహాత్మ్య వర్ణనం పూర్తిగా అర్థమవుతుంది.

అగస్త్యుడు: ఒకానొక సమయంలో వింధ్య పర్వతానికి మేరు పర్వతం పై అసూయ కలిగి, తానదే పనిగా పెరిగిపోతూ గ్రహనక్షత్రమండల గమనానికి అవరోధం కలిగించసాగింది. అందుకు సూర్యుడు తన చుట్టూ తిరుగక మేరువు చుట్టూ తిరగడమే ప్రధాన కారణం. అలా వింధ్య పర్వతం పెరిగిపోవడంతో లోక వ్యవహారం దెబ్బ తిన్నది. దేవతలు వింధ్య పర్వతాన్ని ప్రార్థించారు. ఆయన వినలేదు; తగ్గ లేదు. చేసేదేమీలేక దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అంత బ్రహ్మ ఈ ఉపద్రవము నుండి మిమ్ము రక్షించువాడు అగస్త్యుడు తప్ప మరెవరూ లేరని సెలవిచ్చారు. దేవతలు తిన్నగా అగస్త్యుని చేరి విషయం విశదపరిచారు. విన్న అగస్త్యుడు భయము వలదని వారికి అభయమిచ్చి తాను వింధ్య పర్వత ప్రాంతాన్ని సమీపించాడు.

అంత దూరాన అగస్త్యుని చూచిన వింధ్య, పూర్వం వలె ఒదిగిపోయింది. గ్రహ గమనము మరలా ప్రారంభమైనది. వింధ్య పురుషాకృతి దాల్చి అగస్త్యునకు సాష్ఠాంగదండ ప్రణామం చేసి ఆయన రాకకు కారణం వినగోరాడు. అందుకు సమాధానంగా ఆ మహా ముని “నేను దక్షిణాపథమందలి తీర్థములను చూడ బయలుదేరితిని. తిరిగి వచ్చునంత వరకూ నీవు ఇటులనే ఉండవలెను” అని ఆదేశించగా వినమ్రంగా వింధ్య అంగీకరించి అలాగే ఉండి పోయింది. అప్పటి నుండి ఆయన దక్షిణ భారతంలోనే స్థిర పడి పోయారు. ఆయనకిచ్చిన మాట మేర వింధ్య పర్వతం కూడా అలాగే ఉండి పోయింది.

అగస్త్యుని మాట వింధ్య పర్వతం విన్నది అంటే, ఆయన ఎంతటి పుణ్య పురుషుడో అర్థమవుతుంది. శ్రీమద్రామాయణం, అరణ్య కాండము సర్గలు 10, 11 లలో ఆయన ఎంతటి గొప్పవాడో స్వయంగా శ్రీరాముడే తెలియజేస్తాడు. నిజానికి ‘అగమ్ స్థంభయతీతి అగస్త్యః’ అనగా అగమును (పర్వతమును) స్థంబింపజేసిన వాడు కాబట్టి ఆయన ‘అగస్త్యుడు’ అను పేరుతో విఖ్యాతి కెక్కారు.

ఇక శిలా ఫలకంపై ఉన్న క్షేత్ర మాహాత్మ్య వివరాలు…

శ్రీ స్వామివారి పూర్వ చరిత్ర:పూర్వము అగస్త్య మహాముని కౌశికానది తీరామున పల్వలపుర ప్రాంతంలో తపస్సు చేసుకొనుచుండగా హిమవత్ పర్వతమున లోక కల్యాణార్థమై పార్వతీ పరమేశ్వరుల కల్యాణము అతి వైభవముగా జరుగుచుండెను. ఆ కల్యాణమును చూచి తరించవలెనని అగస్త్య మహాముని సంకల్పించెను. అగస్త్యుడు బయలుదేరి వెళ్ళినచో వింధ్య పర్వతము యెప్పటియెట్లే తన ఉగ్రరూపమును చూపి సంభోంతరాశమునకు ఎదిగి, గ్రహభ్రమణమునకు తీవ్ర ఆఘాతము కలుగజేయును. అట్టి ఉపద్రవం జరుగునని భయపడి ఇంద్రాది దేవతలు అగస్త్యుని ప్రయాణమును విరమింపజేయుటకై విశ్వబ్రహ్మను పంపిరి. అగస్త్యుడు విశ్వబ్రహ్మ ద్వారా కల్యాణ మహోత్సవ వైభవమును శ్రవణానందముగా విని, తన దివ్యదృష్టిచే కనులారా గాంచి పార్వతీపరమేశ్వరులను కల్యాణ పసుపు వస్త్రములతో దర్శనమీయవలసినదిగా ప్రార్ధించెను. వారట్లే దర్శనమిచ్చిరి. కల్యాణపీఠముపై దివ్యమంగళ స్వరూపులుగా విరాజిల్లుచున్న పార్వతీ పరమేశ్వరులను ఏకపీఠముపై పల్వలపుర దివ్యక్షేత్రమున భక్త వాంచితమును తీర్చుటకై లోక కల్యాణార్ధం ప్రతిష్ఠ గావించెను. అగస్త్యునిచే ఈ క్షేత్రమునకు “అగస్త్యేశ్వర క్షేత్రము” అని పేరు ఈ లింగము ప్రతిష్ఠింపబడుటచే వచ్చెను. ఇట్లుండ…

శ్రీ అగస్త్యేశ్వరుడు కొప్పులింగేశ్వరుడైన చరిత్ర:పల్వలపురంలో అగస్త్య మహాముని వలన ప్రతిష్ఠ గావింపబడిన అగస్త్యేశ్వరుని వెలనాటి వంశమునకు చెందిన యొక విప్రుడు పరమ నిష్టాగరిష్టుడై విశేష భక్తితో పూజించుచుండేను. పౌరులాతని వేశ్యాలోలతను సహింపజాలక రాజ్యపాలకునకు ఫిర్యాదు చేసిరి. మహారాజు ఫిర్యాదులను వినయు నిర్లక్ష్యము చేసెను. కాని నానాటికి ఫిర్యాదులు హెచ్చుచుండుటచే ఒకానొక రోజున ఆకస్మికంగా పూజారిని పరీక్షింపనెంచి మహారాజు పల్వలపురమునకు వచ్చెను. ఆ సమయమున పూజారి వేశ్య యొద్ద నుండెను. మహారాజు రాక విని రివాజు ప్రకారము నిర్మాల్య మాలికను రాజు గారికి ప్రసాదముగా ఇచ్చుటకుగాను ఆ సమయములో మరియొక పూలమాల లేదు కదాయని గ్రహించి, తన వేశ్య కొప్పులో అంతకుముందే యుంచిన స్వామి పూలమాలను తీసి రహస్యముగా ఆలయములోనికి తెచ్చి నిర్మాల్య మాలికగా రాజుగారికి ఇచ్చెను. మహారాజు ఆ నిర్మాల్య మాలికయందు నిగనిగలాడుచున్న పొడవైన కేశమును గాంచి శంకించి పూజారిని ప్రశ్నింపగా నాతను “పరమశివుడు జటాఝూటధారి” గాన పూలమాలికను అగస్త్యేశ్వరుని కేశము చుట్టుకొని యుండేనని బదులు పలికెను. లింగమునకు జటాఝూటముండుటయా అని రాజు ఆశ్చర్యపడి – అయినచో ఈశ్వరలింగమునకు కేశములు చూపమనెను. దానికి పూజారి నిర్మల హృదయుడై ధైర్యమును బూని, మహారాజా, యిది మాధ్యాహ్నిక సమయము, స్వామివారికి అభిషేక పూజా విధులు నిర్వర్తించి మహానివేదనమొనర్చి నాగాభరణాలు అలంకరించి యుంటిని, రేపటి ఉదయం వరకు అలంకరణాదులను తొలగించరాదు. మీరు ప్రాతః కాలము వరకు యుండిన స్వామి జటాఝూటమును చూపగలననేను.

మహారాజు దానికంగీకరించి జటాఝూటములు చూపనిచో నీకు శిరచ్ఛేదము తప్పదని పలిక ఆ రేయి పల్వలపురం లోనే విడిదిచేసి యుండెను. అంతట పూజారి తనకు శిరచ్ఛేదము తప్పదని యెంచి అవసానకాలంబున చేసికొనినచో మోక్షం లభించునని యెంచి ఆ రాత్రంతయు శ్రీ స్వామి గర్భాలయమునందే యుండి పరమ శివుని పలురీతులు వేడుకొనుచూ స్వామీ! నీ భక్త పరమాణువును నా పూర్వ జన్మ ఫలంబుచే నేనీ పాపాలు చేసి యుంటిని. నా తప్పును మన్నించి ఇప్పటి నుండి మీరు కొప్పును ధరించవలెను. మీ కొప్పును మహారాజుగారికి చూపనిచో నాకు శిరచ్ఛేదము తప్పదు. మీరు కొప్పును ధరించరేని నా శిరస్సును ఈ లింగమునకు బాదుకొని ప్రాణములు విడిచెదను. అని దీనముగా పలికి మూర్ఛిల్లెను. అంతట నీలకంఠుడు పూజారి మొరాలకించి లింగోద్భవ కాలమున (అర్ధరాత్రి) కొప్పును ధరించెను. స్వామి కొప్పును ధరించుట పూజారి చేసిన కృత్రిమ చర్య అని ప్రజలు ఏక కంఠముతో పలికిరి. అంతట మహారాజు “ఏది శిరోజమును పెకిలించి తీసుకొని రమ్ము” అని ఆజ్ఞాపించగా పూజారి అట్లే చేసెను. రాజునకు శిరోజము మొదట రక్తము కనిపించెను. వెంటనే రాజునకు నేత్ర అవరోధము కలిగెను. అప్పుడు మహారాజు పరమేశ్వరునకు అపచారము జరిగెనని తలంచి, దోషమును మన్నించి దృష్టిని ప్రసాదించమని వేనోళ్ళ పరమేశ్వరుని వేడుకొనగా అంతట పరమేశ్వరుడు శాంతించి రాజునకు దృష్టిని ప్రసాదించెను. మహారాజునకు పరమేశ్వరుడు దృష్టిని ప్రసాదించినందుకు దానికి గుర్తుగా రాజుగారు జుత్తుగపాడు గ్రామానికి చెందిన భూమిని స్వామికి కానుకగా సమర్పించెను.

జుత్తుగపాడు అను గ్రామం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామమునకు రెండు ఫర్లాంగుల దూరంలో కలదు.

కావున అగస్త్యేశ్వరుడు తన పూజారి ప్రాణములను కాపాడుటకుగాను కొప్పును ధరించుటవలన నాటి నుండి శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామిగా నామాంతరము చెంది అప్పటి లగాయతు శోభాయమానంగా విరాజిల్లు చున్నది.

ఆనాటి పల్వలపురమే నేటి పలివెల గ్రామము.





Thursday, 15 March 2018

కాకిముట్టని క్షేత్రం - కాటకోటేశ్వరం





కాకిముట్టని క్షేత్రం - కాటకోటేశ్వరం

అనంతపురం / తాడిమర్రి: కాటికోటేశ్వరాలయం ప్రాంగణంలో కాకులు కనిపించవు. అసాంఘిక కార్యక్రమాలు జరగవు. అలా ఎవరైనా జరపడానికి ప్రయత్నించినా ఆలయ ప్రాంగణంలో ఉన్న తేనెటీగలు వారిని చుట్టుముట్టి ఆలయాన్ని దాటి వెళ్లేంతవరకు వదిలిపెట్టవని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్నారు. సోదరులు తాగేందుకు నీరు అడగటంతో వారి దప్పిక తీర్చేందుకు భీముడు భూమిని గదతో మోదగా ఇక్కడ గదేగుండం ఏర్పడి నీరు వస్తోందని స్థలపురాణం చెబుతోంది. ఆలయానికి హాజరయ్యే భక్తులు ముందుగా గదేగుండంలో స్నానం చేసిన తరువాత స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే దీర్ఘ కాలిక రోగాలతో బాధపడుతున్న వారు కూడా ఆలయప్రాంగణంలోనే గడుపుతూ రోజూ గదేగుండంలో స్నానం చేయడం ద్వారా రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.

ఇటీవల కాలంలో ఆలయ ప్రాంగణంలో దక్షిణకాశీ నుంచి తెప్పించిన శివలింగాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. దీంతో పాటు ధ్యానమందిరం, అన్నదాన సత్రం, వసతిగృహాలను భక్తుల విరాళాలతో నిర్మించడంతో ఆలయానికి విచ్చేస్తున్న భక్తులకు వసతులు సులువుగా లభిస్తున్నాయి. ప్రతి సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. కార్తీకమాసాన్ని పురష్కరించుకుని ప్రతిరోజూ పూజలను నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో నిత్యాన్నదానం చేస్తున్నారు. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే అనంతపురం వైపు నుంచి వచ్చే భక్తులు నార్పల, గూగూడు, నడింపల్లి మీదుగా చిల్లవారి పల్లి కాటకోటేశ్వర క్షేత్రానికి చేరుకోవచ్చు. రోజూ అనంతపురం నుంచి రెండు బస్సులు తిరుగుతాయి. ధర్మవరం వైపు నుంచి వచ్చే భక్తులు దాడితోటకు చేరుకుని అక్కడి నుంచి ఆటోల ద్వారా క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
Tags : Crow, Katakoteswaram



Wednesday, 14 March 2018

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు









ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు










సోమనాథలింగం



ద్వాదశ జ్యోతిర్లింగాలలో(12) మొదటిదిగా వర్ణించబడింది సోమనాథలింగం. ఇది ఒకనాడు సౌరాష్ట్రగా చెప్పబడిన గుజరాత్ రాష్ట్రములోని ప్రభాస పట్టణానికి సుమారు 40 కి.మీ.ల దూరంలో ఉన్నది.

యాత్రామార్గం:
విజయవాడ నుండి ఖాజీపేట, సికింద్రాబాద్, కురిదివాడి, పూనాల మీదుగా బొంబాయి వెళ్ళి అక్కడ నుంచి అహ్మదాబాద్, వీరంగం స్టేషన్‌లమీదుగా వెరావల్ స్టేషన్‌లో దిగాలి. వెరావల్ రైల్వేస్టేషన్ నుండి 7 కి.మీ. దూరంలో వున్న సోమనాథ్ క్షేత్రానికి బస్సు ద్వారా వెళ్ళవచ్చు.

పురాణగాథ:
ఈ జ్యోతిర్లింగము చంద్రుని వలన ప్రతిష్ఠింపబడిందని చెబుతారు. దక్షప్రజాపతికి సంతతిలోని అశ్విని మొదలుకొని రేవతి వరకు మొత్తం 27 మంది కుమార్తెలు అందరూ చక్కని చుక్కలే. దక్షుడు తన కుమార్తెలకు సరియైన జోడుగా భావించి వారిని సౌందర్యమూర్తి అయిన చంద్రునికిచ్చి వివాహం చేశాడు. భార్యలందరిలో రోహిణి మరింత అందగత్తె కావటంవల్ల ఆమె పై చంద్రుడు అధికంగా ప్రేమను ప్రకటించసాగాడు. మిగిలిన వారందరికి ఇది అసూయను కల్గించింది. రోహిణి తప్ప మిగిలిన 26 మంది ఈర్ష్యతో తన తండ్రి దగ్గరకు వెళ్ళి తమబాధను చెప్పుకున్నారు. దక్షుడు చంద్రుణ్ణి పిలిచి భార్యలందరిని సమానమైన ప్రేమతో చూడమని పలువిధాలుగా నచ్చచెప్పాడు. కాని మామగారి మాటలు చంద్రుని మనస్సునకు ఎక్కలేదు. అందువల్ల అతడు మునుపటి కంటే ఎక్కువగా రోహిణిపై అనురాగాన్ని చూపించాడు అందుకు దక్షుడు పట్టరానికోపంతో చంద్రుణ్ణి “క్షయరోగంతో పీడించబడుదువుగాక” అని శపించాడు. అప్పటినుంచి ఆ శాపం కారణంగా చంద్రుడు తన కళలను కోల్పోవటం ప్రారంభించాడు. సుధాకరుని సుధాకిరణములు నీరిసంచి పోవటంవల్ల అమృతమే ఆహారముగా గల దేవతలు హాహాకారాలు చేయసాగారు. ఓషధులు వాడిపోయాయి. చరాచరజగత్తు అంతా నిస్తేజం అయిపోయింది. అపుడు ఇంద్రుడు మొదలైన దేవతలు, వశిష్టుడు మొదలైన మునీంద్రులు కలసి చంద్రుని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఈ ఉపద్రవం నుండి లోకాలనన్నింటిని రక్షించమని వేదుకున్నారు. అప్పుడు బ్రహ్మ చంద్రునితో పవిత్రమైన ప్రభాసతీర్థానికి వెళ్ళి పరమశివుని ఆరాధించవలసినదిగాను అందువల్ల సమస్త శుభములు చేకూరగలవని హితవు చెప్పి, అతనికి మృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు.

ఆ తరువాత చంద్రుడు దేవతలతో కలసి ప్రభాసక్షేత్రానికి వెళ్ళి నిష్టతో మహేశ్వరుని ఆరాధించి, ఆరు మాసాల కాలం (ఘోరమైన) తపస్సు చేశాడు. దీక్షతో 10 కోట్లసార్లు మృత్యుంజయమంత్రాన్ని జపించాడు. చంద్రుని భక్తికి మెచ్చిన శంకరుడు అతని ముందు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. అప్పుడు చంద్రుడు ఆ పరమ శివునికి సాష్టాంగ ప్రణామం చేసి తనను అనుగ్రమింపమని శివుని కటాక్షవీక్షములను తనపై ప్రసరింపచేసి శాప నివృత్తిని కలిగించమని ప్రార్థించడు. కరుణామయుడైన శివుడు చంద్రుని ప్రార్థనను మన్నించి దక్షుడి శాపాన్ని రూపుమాపే అవకాశం లేదని చెప్పి దానికి సవరణలు చేస్తాడు. కృష్ణ పక్షంలో మాత్రం చంద్రుని కళలు క్షీణించే విధంగానూ, శుక్లపక్షంలో కళలు దినదిన ప్రవర్థమానం అయ్యేటట్లు, పూర్ణిమనాటికి కళాపరిపూర్ణుడుగా విరాజిల్లగలడనీ వరం ప్రసాదించాడు.

ఈ విధంగా మరల అమరత్వం ప్రసాదించిన చంద్రుడు కళాప్రపూర్ణుడై కళకళలాడుతూ మునుపటి వలెనే అమృతవర్షాన్ని కురిపంచసాగాడు. అపుడు బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా పరమశివుడు పార్వతీసమేతుడై ఈ ప్రభాసక్షేత్రములో సోమనాథునిగా నిలిచిపోయాడు.

ఈ సోమనాథ లింగమును దర్శించటానికే తప్ప తాకటానికి మాత్రం భక్తులకు అవకాశం లేదు. పశ్చిమ సముద్రతీరాన, రామేశ్వరంలాగా ఉన్న జ్యోతిర్లింగం ఇది. ఈ ఆలయ వాస్తునిర్మాణం, త్రయంబకేశ్వరాలయాన్ని గుర్తుకు తెస్తుంది.








మల్లికార్జున లింగం:

12 జ్యోతిర్లింగాలలో రెండవదిగా చెప్పబడే ఈ జ్యోతిర్లింగం శక్తిపీఠంలో కలిసి ఉండటం వలన అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది. ధూళి దర్శనం ఆచారంగా ఉన్న శ్రీశైలమహాక్షేత్రంలో యుగయుగాలనుండి స్వామిని తాకి తల ఆనించి తమ కష్టాలను చెప్పుకొనే అవకాశం ఉంది.

యాత్రామార్గం:
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన కూడలుల నుండీ నేరుగా బస్సులున్నాయి. విజయవాడ- కర్నూలు మార్గంలోని దోర్నాల నుండి 49 కి.మీ. ఘాట్ రోడ్డులో ప్రయాణించవలసి ఉంటుంది. రాత్రి గం 9.00 ల నుండి ఉదయం 6 గం ల వరకు ప్రేవేటు వాహనాలు ఘాట్‌లో ప్రవేశించే అవకాశం ఉండదు. దోర్నాల నుండి శ్రీశైలానికి రోజూ సుమారు 40 ఆర్.టి.సి. బస్సులు వెడతాయి. ఇవన్నీ ఇతర ప్రాంతాల నుండి శ్రీశైలం వెళ్ళే బస్సులే.

ఉనికి:
శ్రీశైలమహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, ఆత్మకూరు తాలూకాలోనున్న నల్లమల అడువులలోని పర్వతశ్రేణుల నడుమ పాతాళగంగ పేరుతో ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్న కృష్ణానదికి కుడివైపున ఉంది. 16⁰12 ఉత్తర అక్షాంశము, మరియు 78⁰5 తూర్పు రేఖాంశముల వద్దనున్న యీ క్షేత్రపు ఎత్తు సముద్రమట్టానికి 476 మీటర్లు (1500 అడుగులు).

శ్రీశైల మహిమ:
12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జునస్వామికి 18 శక్తిపీఠాలలో ఒకరైన శ్రీ భ్రమరాంబాదేవికి, నిలయమైన యీ మహాక్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై, ఎనిమిది శృంగాలతో, 44 నదులతో, 60 కోట్ల తీర్థరాజాలతో, పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో, చంద్రగుండ, సూర్యగుండాది పుష్కరిణులతో, స్పర్శ వేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో, అనంతమైన ఓషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనస్సులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

శ్రీశైల దర్శనఫలం:
కురుక్షేత్రంలో లక్షలకొలదీ దానమిచ్చినా రెండువేలసార్లు గంగాస్నానం చేసినా,నర్మదానదీ తీరంలో బహుకాలం తపస్సాచరించినా, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైల మల్లికార్జునుని ఒక్కసారి దర్శించినంతనే కలగుతుందని స్కాందపురాణం చెబుతోంది.

శిఖరదర్శన మాత్రాన, అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మనుండి ముక్తిని కలిగించే ఈ క్షేత్రాన్ని ఆయా మాసాలలో సందర్శించేవారు వాజపేయ, అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు అచరించినందువల్ల కలిగే ఫలాన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలన్ని, కన్యాదానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందువల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణం చెబుతున్నది.

యుగయుగాలుగా  ప్రసిద్ధికెక్కిన యీ శైవక్షేత్రం కృతయుగంలో హిరణ్య కశిపునికి పూజామందిరం కాగా, అహోబిలక్షేత్రం సభామండపమనీ, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీసమేతుడై శ్రీశైలనాధుని సేవించి సహస్రలింగాన్ని ప్రతిష్ఠించాడని, పాండవులు తమ వనవాస సమయంలో ద్రౌపదీ సమేతులై యీ క్షేత్రంలో కొంతకాలముండి, లింగాలను ప్రతిష్ఠించారని చెప్పబదుతోంది. ఇందుకు నిదర్శనంగా నేటికీ యీ క్షేత్రంలో, రామప్రతిష్ఠితసహస్రలింగం, సీత్పాతిష్ఠిత సహస్రలింగం, పాండవులచే ప్రతిష్ఠింపబడిన ‘సద్యోజాత ‘ మొదలైన ఐదు లింగాలు భక్తుల సేవల నందుకొంటున్నాయి.








మహాకాళేశ్వర లింగం:

మాలవ దేశంలోని ఉజ్జయిని పట్టణంలో శిప్రానది ఒడ్డున ఈ జ్యోతిర్లింగం ఉన్నది. ఉజ్జయిని నగరాన్నే అవంతి అని కూడా అంటారు. భారతేశంలోని మోక్షదాయకములైన 7 నగరాలలో అవంతిక ఒకటి. ఈ విషయాన్ని

అయోధ్యామధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయకాః ||
అనే పురాణ వచనం చెబుతోంది.

స్కౌంద పురాణంలోని ఆవంత్య ఖండం ఈ నగరం యొక్క గొప్పతనాన్ని ఎంతగానో వర్ణించింది. శివపురాణంలోను మహాభారతంలోను ఉజ్జయిని యొక్క మహిమ ఎంతగానే చెప్పబడింది. ఇక్కడ ప్రవహించే శిప్రానదిలో స్నానం చేసినవారికి సర్వపాపాలు నశిస్తాయని, అష్టదరిద్రాలు దూరమైపోతాయని పురాణాలు చెప్పబడింది. శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేసిన సాందీపని ఆశ్రమం ఇక్కడే ఉన్నది. ఈ క్షేత్రమే విక్రమాదిత్యునికి రాజధాని అయి కాళిదాసు మొదలైన మహాకవులకు నిలయమయ్యింది.

యాత్రామార్గం:
విజయవాడ నుంచి అహ్మదాబాద్ వెళ్ళే మార్గంలో ఉజ్జయిని రైల్వేస్టేషన్ వుంది. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వరాన్ని సందర్శించిన భక్తులు 5 గంటల కాలం ప్రయాణించి ఉజ్జయినిని చేరుకోవచ్చు. ఈ దారిలో ప్రయాణించేవారు దారిలో ఇన్‌డోర్ నగరాన్ని కూడా చూడవచ్చు. ఇన్‌డోర్ నగరం ఒకప్పుడు రాణి అహాల్యాబాయ్ నివాసస్థలం. ఇన్‌డోర్ నగరం ఉజ్జయినికి 53 కి.మీ. దూరంలో వుంది.

పురాణగాథ:
ఒకప్పుడు అవంతి నగరంలో వేద విద్యలలో గొప్పవాడైన వేదప్రియుడనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దేవప్రియుడు, ప్రియమేథుడు, సుకృతుడు, సువ్రతుడు అని నలుగురు కుమారులు ఉండేవరు. వారంతా శివభక్తులే. ఇది యిలా ఉండగా అవంతి నగరానికి సమీపంలో ఉన్న రత్నమాల పర్వతం మీద నివసించే దూషణుడు అనే రాక్షసుడు వేదప్రియుని కీర్తిప్రతిష్ఠలు విని తన సైన్యంతో అవంతి నగరం మీదికి దండెత్తాడు.

ఆ పట్టణంలోని ప్రజలంతా ఆ రాక్షసుని చూచి ఆర్తనాదాలు చేయటం ప్రారంబించారు. ప్రజల ఏడుపుల ధ్వని ఆకాశాన్ని అంటుకుంది. కానీ శివభక్తుడైన వేదప్రియుడు మాత్రం ఆవంతైనా చలించలేదు. ఆయన నిశ్చలమైన మనస్సుతో శివదీక్షతో నిమగ్నుడై ఉన్నాడు. రాక్షసుడు అతనిని చూచి క్రోధంతో “నరకండి, చంపండి ” అంటూ వేదప్రియునిపై దురాక్రమణ చేశాడు. అప్పుడు శివుడు మహాకాళ రూపంతో సాక్షాత్కరించి ప్రళయ హుంకారంతో ఆరాక్షసుని భస్మంచేశాడు. తరువాత శంకరుడు ప్రసన్నవదనంతో వేదప్రియుని చూచి వరం కోరుకోమన్నాడు. వేదప్రియుడు చేతులు జోడించి నమస్కరించి “దేవ దేవా నా వంటి దీనులైన భక్తులను అకాల మృత్యువు నుండి రక్షిస్తూ సర్వకాలములలో ఇక్కడనే నెలకొని వుండు” అని ప్రార్థించాడు. శివుడు ఆ భక్తుని కోరికను అనుసరించి మహాకాళ నామంతో జ్యోతిర్లింగమై అచ్చట వెలసి ముక్తిని ప్రాసాదిస్తున్నాడు.

ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజు గొప్ప శివభక్తుడు. ఒకనాడు అతడు శివపూజలో నిమగ్నమై ఉండగా ‘శ్రీకరుడు ‘ అనే ఐదేళ్ళ గోపాలబాలుడు తన తల్లితోపాటు అక్కడకు వచ్చాడు. రాజుగారి దైవభక్తిని చూచి తన్మయుడైతాను కూడా స్వయంగా భగవంతుని ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్ళే మార్గంలోని శిలాఖండాన్ని ఒకదానిని తీసుకొని వెళ్ళి ఆ రాతిబండనే శివలింగంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించాడు. శ్రీకరుడు శివధ్యానంలో నిమగ్నుడై ఉన్నప్పుడు అతని తల్లి వచ్చి భోజనమునకు రమ్మని పిలిచింది. తల్లిమాటలు వినిపించుకొనక కళ్ళు మూసుకొని తన్మయుడై ఉన్నాడు శ్రీకరుడు. పిలిచి పిలిచి వేసారిన అతని తల్లి చివరకు శిలాశకలాన్ని తీసి దూరంగా పారవేసింది.

శ్రీకరుడు తన ఇష్ట దైవమైన శివునికోసం పెద్దగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి మూర్ఛ పొందాడు. అపుడు భక్తసలభుడైన శంకరుడు శ్రీకరుని ముందు నిజరూపముతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీకరుడు కళ్ళు తెరచేటప్పటికి ఎదురుగా మహాకాళ మందిరం, అందులో దేదీప్యమానంగా ప్రకాశించే జ్యోతిర్లింగం అతనికి కనిపించాయి. అది చూచిన బాలుడు ఆశ్చర్యంతో పులకించిపోయాడు.మాహాదేవుడైన ఆ శివుని మరల స్తుతించటం ప్రారంభించాడు. ఇంతలో తల్లివచ్చి జరిగినదానిని చూచి ఆనందంతో ఉప్పొంగిపోయింది. కొద్ది సేపటిలోనే ఈ విషయం నగరమంతటా వ్యపించింది.

చంద్రసేన మహారాజు ఆ విషయం తెలుసుకొని వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి శ్రీకరుని భక్తికి ఆశ్చర్యం పొందాడు. ఇంతలో హనుమంతుడు వారి ముందు ప్రత్యక్షమై “ఓ మానవులారా ! ఈ చరాచర సృష్టికి శంకరుడే ఏకైక శరణ్యడు. ఆ మహాదేవుని ఆరాధించి తరింపుడు. వేలకొలది సంవత్సరములు తపస్సు చేసిన మహార్షులు కూడా పొందలేని ఫలమును శివపూజవలన ఈ బాలుడు సునాయాసంగా పొందగలిగెను. వీని సందర్శనము వలన వీరందరు ధన్యులైరి. ఈ గోపబాలుని ఎనిమిదవ తరమున నందుడను వాడు జన్మించును. మహావిష్ణువు ఆ నందునికి కుమారుడై జన్మించి లోకోద్ధరణ చేయగలడు.” అని చెప్పి అదృశ్యమయ్యాడు.

శ్రీ మహాకాళలింగమును సేవించి వేదప్రియుడు, శ్రీకరుడు, చంద్రసేన మహారాజు మొదలైనవారు శివసాన్నిద్యం పొందారు.

“ఆకాశే తారకం లింగం పాతాలే హటకేశ్వరం
మర్త్యలోకే మహాకాలం లింగత్రయ నమోస్తుతే ||”

అని పురాణములలో మహాకాళేశ్వరుని యొక్క మహిమ చెప్పబడింది.








ఓంకారేశ్వరలింగం:

ఓంకారేశ్వరుని అమరేశ్వరుడని, అమలేశ్వరుడని కూడా పిలుస్తారు. కానీ ఇక్కడ నర్మదానదికి రెండువైపుల ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు ఉన్నాయి. వాటిమధ్య నర్మదానదిమీద వంతెన కూడా నిర్మించబడింది. ఈ క్షేత్రంలో నర్మదానది, నర్మద, కావేరిక అని రెండు పాయలుగా ప్రవహిస్తోంది. ఈ రెండుపాయల మధ్య ఉన్న ప్రదేశాన్ని ‘‘ శివపురి ” అని ‘‘మాంధాతృపురి ‘ అని పిలుస్తారు.

మాంధాత సూర్యవంశపురాజు. ఈయన రఘవంశానికి మూలపురుషుడు. శ్రీరామచంద్రుడు కూడా ఈ వంశములోనివాడే. మహావీరుడైన మాంధాత ఇక్కడి పర్వతశిఖరం మీద అనేక సంవత్సరాలు తప్పస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకొని స్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. అందువలన దీనికి మాంధాతపురి అని పేరు వచ్చింది.

మాంధాత పర్వతం మీద చాలా దేవాలయాలు ఉన్నాయి. అవన్నీ “ఓం ” అనే ప్రణవకారంలో ఉండి. ఓంకారేశ్వర దేవాలయం ఆ ప్రణవంపై బాలచంద్రుని లాగే ప్రకాశింస్తొంది. ఈ ఓంకారేశ్వరుని దగ్గరకు వెళ్ళే మార్గంలో విష్ణుపురి, బ్రహ్మపురి అనే చిన్న చిన్న రెండు కొండగుట్టలున్నాయి. ఆ రెండింటి మధ్య “కపిలధార” అనే నది ప్రవహించి నర్మదానదిలో కలుస్తూంది.








వైద్యనాథ లింగం:

జ్యోతిర్లింగంగా చెప్పబడే వైద్యనాథలింగం బీహార్ రాష్ట్రంలోని చితాభూమిలో ఉన్నదని ఉత్తరాదివారు భవిస్తారు. వారి దృష్టిలో మహారాష్ట్రలోని పర్లివైద్యనాథలింగం జ్యోతిర్లింగం కాదు. కానీ దక్షిణాదివారు మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథ క్షేత్రాన్నే జ్యోతిర్లింగ క్షేత్రంగా చెబుతారు. ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉన్నదిగా చెప్పబడినప్పటికి దానికి సంబంధించిన పురాణగాథ ఒక్కటే.

యాత్రామార్గం:
ఔరంగాబాద్ నుంచి 12 గం|| ల కాలం బస్సులో ప్రయాణించి పర్లివైద్యనాథ క్షేత్రాన్ని చేరవచ్చు. లేదా పర్భిణి రైల్వేజంక్షన్ నుంచి 40 కి.మీ. దూరం రైలులో ప్రయాణించి పర్లివైద్యనాథ్ క్షేత్రంలో దిగవచ్చు.

పురాణగాథ:
శివభక్తుడైన రావణాసురుడు ఒకప్పుడు వెండికొండకు పోయి శివుని ప్రీతికోసం తన తలలను హోమంచేసి 9 తలలను హోమంలో వేసిన తరువాత 10వ తలను కూడా ఖండిచబోగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు ఇతరులు తన తలలను ఖండించినప్పుడు అవి వెంటనే మరల మొలచి యథాస్థితిగా ఉండాలని, శివుడు తన లంకారాజ్యానికి వచ్చి అక్కడే స్థిరంగా ఉండాలని వరం కోరాడు. అందుకు శివుడు అలాగే అంటూ తన బదులు ఆత్మలింగాన్ని ఇస్తున్నానని, దానిని తీసుకొనిపోయి లంకారాజ్యంలో ఉంచమని అది లంకలో ఉన్నంతకాలం రావణునికి అపజయం అన్నది లేక రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రాజ్యానికి ఎటువంటి పతనావస్థా ఉండదని చెప్పాడు. కానీ ఆత్మలింగాన్ని లంకకు వెళ్ళేలోపు మరెక్కడా క్రిందపెట్టకూడదని, నేలపై పెట్టిన తరువాత దానిని పెకలించటం ఎవరికీ సాధ్యంకాదని కూడా శివుడు చెప్పాడు.

దానికి అంగీకరించిన రావణుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకొని మధ్య దారిలో సంధ్యా వందనానికి సమయం కాగా ఆ సమయానికి కనిపించిన ఒక బాలుని చేతిలో ఆ లింగాన్ని ఉంచి వెంటనే తిరిగి వస్తాననీ, అప్పటివరకు క్రింద పెట్టికుండా జగ్రత్తగా పట్టుకోవలసినదిగాను చెప్పి సంధ్యావందనానికి వెళ్ళాడు.

శివుడు ఆత్మలింగం లంకకు చేరినందువల్ల దేవతలకు కష్టములు నాలుగింతలు అవుతాయని ఊహించిన దేవతలు నారదుని సలహామేరకు గణాధిపతి అయిన వినాయకుని ఆత్మలింగం లంకకు చేరకుండా చూడమని ప్రార్థించినట్లుగానీ, వినాయకుడే పిల్లవాని రూపంలో తనకు కనిపించాడని గానీ రావణాసురునికి తెలయదు.

సంధ్యావందనానికి వెళ్ళిన రావణుడు 48 ని||ల కాలంవరకు రాలేదు. పనిపూర్తి చేసుకొని తిరిగివస్తున్న రావణుని చూడగానే ఆ పిల్లవాడు ” రావణా ! ఈ లింగాన్ని ఇంక మోయలేను ” అని గట్టిగా అరుస్తూ ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టివేశాడు. పరుగు పరుగున వచ్చిన రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగంపైకి రాలేదు సరికదా అతని శరీరమంతా గాయాలయ్యాయి. అపుడు శివుడు ప్రత్యక్షమై అతని గాయాలను మానపి ఇక ఆ లింగం కదలదని కనుక రావణసురునే ప్రతిరోజు వచ్చి ఆ లింగాన్ని సేవించుకోవలసినదిగాను ఉపదేశించి అదృశ్యమయ్యాడు.

రావణాసురునికి వైద్యం చేసి గాయాలను మానపినందువల్ల స్వామికి వైద్యనాథుడని పేరు వచ్చింది. ఈ సందర్భంగా రావణాసురుడు చేసిన శివతాండవ స్తోత్రం ఎంతో పేరు పొందింది.








భీమశంకర లింగం :

సహ్య పర్వతం యొక్క శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు ” భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. భీమానది ఇక్కడే పుట్టింది. అది పుట్టినచోట శివలింగం ప్రక్కభాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తుంటుంది. భీమశంకరుడు శాకిని, డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణవచనం.

యాత్రా మార్గం:

బొంబాయి దగ్గరలోని పూనావరకు రైలులో వెళ్ళి పూనాలో బస్సు ఎక్కి 75 కి.మీ. ప్రయాణం చేసి ”డాకినీ భీమ శంకరం” క్షేత్రాన్ని చేరాలి. యాత్రికులకు వసతులు అంతగా లేని యీ క్షేత్రానికి పూనా నుండి ప్రతిరోజు ఐదారు బస్సులు వస్తాయి. ఆలయం చుట్టూ అరణ్యం దట్టంగా ఉంటుంది. లోయలో నిర్మించబడిన ఈ ఆలయానికి ప్రక్కనే ఉన్న కోనేరులో స్నానం చేసి భీమశంకరుని సేవించవచ్చు.

పురాణ గాథ:
పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లియైన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. వాడు ఒకనాడు తల్లిని ”అమ్మా నా తండ్రి ఎవరు ?” ఎక్కడున్నాడు? నీవు ఈ కొండమీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి ” అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో “నాయనా లంకా రాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి, పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెదతండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి. నా మొదటి భర్త విరాధుడు. అతనిని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు.

ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్యమహర్షి శిష్యుడైన సుతీక్ష్ణుడు అనేవాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకొనిరా” అని చెప్పింది.

తల్లిమాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తినీ, ఆయన భక్తులనూ సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టుపెట్టాలని పట్టుపట్టాడు. బ్రహ్మదేవుని గురించి వేయి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని , అనంతమైన దైర్యాన్ని వరంగా ప్రసాదించాడు.

వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకొన్నాడు. ఆ తరువాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహార్షులను బాధించాడు.

ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతనిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదక్షిణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి “ఓరీ బుద్ధిమాలినవాడా ఈ జపము లేమిటి? ఈ శివపూజలేమిటి ? ఇకపై ఈ పిచ్చిపనులు మాను ” అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి వళ్ళు మండింది పళ్ళు పటపట కొరకుతూ కత్తిని తీసి ” మూర్ఖుడా ఏమి మాట్లాడవు ! నిన్నే !” అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరచి “రాక్షసరాజా మనకు కనిపించే చరాచర జగత్తుకంతటికి పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పత్తిని సేవిస్తూన్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు” అన్నాడు. అంతటితో భీముడు మరింత … మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని ఝుళిపిస్తూ “ఈ లోకానికి వీడేనా కర్త ? వీడేనా రక్షించేది ? ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను. తనను తాను రక్షించుకోమను” అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి, ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తిపారవశ్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు. పరమశివుని కరుణాకటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయ్యింది. ఇంద్రుడు మొదలైన దేవతలంతా తమ తమ స్థానాలను అలంకరించారు. అప్పటినుండి మునులంతా నిరాటంకంగా తపస్సు చేసుకోవటం ప్రారంభించారు. సుదక్షిణుడు తన రాజ్యాన్ని పొంది ఎప్పటివలెనే పరిపాలించసాగాడు. నారదుడు మొదలైనవారి కోరికమేరకు జ్యోతిర్లింగరూపిగా అక్కడే నెలకొన్న పరమశివుడు భీమశంకరునిగా భక్తుల పూజలందుకొన్నాడు.








రామేశ్వరలింగం:

రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణ సముద్రతీరంలో ఉంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని గురించి స్కాందపురాణం ఎంతగానో వర్ణించింది. ఈ జ్యోతిర్లింగం శ్రీరామచంద్రుని చేతులమీదుగా ప్రతిష్టించబడింది. రామేశ్వరస్వామి దేవాలయం 1000 అడుగుల పొడవు, 650 అడుగుల వెడల్పు, 150 అడుగుల ఎత్తు కలిగి అనంతమైన శిల్పకళతో అలరారుతోంది. ఈ క్షేత్రంలో నందీశ్వరుడు, వెండి రథము, బంగారు గోపురాలు చూడవలసినవి. ఆలయం చుట్టూ 1200 స్తంభాలతో కూడిన ప్రదక్షిణ మండపం భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ ఆలయంలో 23 తీర్ధాలు ఉన్నాయి. కాగా సముద్రాన్ని 24వ తీర్థమైన అగ్ని తీర్థముగా చెబుతారు. ఉత్తర భారతం నుండి వచ్చే యాత్రికులు గంగాజలన్ని తెచ్చి రామలింగేశ్వరునికి అభిషేకిస్తారు. మన దక్షిణాదివారు రామేశ్వరంలో సముద్రమునందలి ఇసుకను సేకరించి కాశీలో గంగానదిలో కలుపుతారు. ఈ పుణ్యకార్యం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని నుండి నేటివరకు కొనసాగుతూనే వుంది.

యాత్రామార్గం:
విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళి, మద్రాసు ఎగ్మోర్ స్టేషన్ నుంచి రామేశ్వరానికి నేరుగా రైలులో వెళ్ళవచ్చు. గంగా, కావేరి ఎక్స్‌ప్రెస్ కాశీ – రామేశ్వరం మధ్య మద్రాసు మీదుగా నడుస్తోంది. ఒకప్పుడు బస్సులో ప్రయాణించి వెళ్ళిన యాత్రికులు పాంబన్ వరకు వెళ్ళి అక్కడి నుండి 34 కి.మీ. రైలులో సముద్రం మీదుగా ప్రయాణించి రామేశ్వరం చేరేవారు. ప్రస్తుతం బస్సులో ప్రయాణించేవారు కూడా నేరుగా రామేశ్వరాన్ని చేరటానికి వీలుగా ఇటీవల సముద్రంపై వంతెనను నిర్మించారు.

పురాణగాథ:
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన తరువాత సీతతో కలసి సపరివారంగా పుష్పక విమానంపై సముద్రాన్ని దాటి గంధమాదన పర్వతానికి వచ్చాడు. అక్కడ మునులంతా శ్రీరామచంద్రుని చూచి పులస్త్యబ్రహ్మ కొడుకైన రావణాసురుని చంపటంవలన బ్రహ్మహత్యాపాపం సంభవించిందని, కనుక ఆ పాపపరిహారార్థం ఆ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించవలసినదిగాను చెప్పారు.

శ్రీరాముడు శివలింగమును తీసుకొనిరమ్మని హనుమంతుని కైలాసానికి పంపాడు. ఆంజనేయుడు శివలింగమును తెచ్చునంతలో శుభముహూర్తం సమీపించినందువల్ల ఋషుల ఆజ్ఞప్రకారం సీతాదేవి చేతులతో అక్కడ ఇసుకను పోగు చేయించి శివలింగమును సిద్ధంచేసి యథావిధిగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ పూర్తి అయ్యే సమయానికి హనుమంతుడు శివలింగంతో వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తన పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్న హనుమంతుని శ్రీరాముడు పైకి లేవనెత్తి బుజ్జగిస్తూ జరిగినదానికి కారణాన్ని చెప్పాడు.

శ్రీరాముని మాటలు హనుమంతునికి తృప్తిని కలిగించలేదు. అప్పుడు శ్రీరాముడు ఒక నవ్వు నవ్వి “ఆంజనేయా శుభముహూర్తం మించినదని కదా ప్రతిష్ఠ జరిపితిమి. నీకు ఇష్టం లేనిచో ఆ లింగమును పెకలించి వేయుము. తరువాత నీవు తెచ్చిన లింగమునే అక్కడ ప్రతిష్టించుదము” అన్నాడు. హనుమంతుడు పట్టరాని సంతోషముతో కుప్పిగంతువేసి, ముందుకు దూకి, శివలింగాన్ని పెకిలించాలని ప్రయత్నించాడు. గొప్ప బలసంపన్నుడైన వాయుపుత్రుడు ఎంత ప్రయత్నించినా శివలింగం కదలలేదు. పొడవాటి తన తోకను లింగం చుట్టూ చుట్టి బలవంతంగా ఒక్క గుంజు గుంజాడు. ఆవగింజంతైన ఉపయోగం లేకపోగా ఆ ఊపుకు హనుమంతుడు ఎగిరి క్రిందపడి మూర్చపోయాడు. సీత భయపడింది. శ్రీరాముని బ్రతిమాలింది. రాముడు తన చల్లని చేతులతో హనుమంతుని శరిరాన్ని తాకి మూర్చను పోగొట్టి,తన వడిలోనికి చేరదీశాడు. కన్నీరు తుడిచి బుజ్జగిస్తూ “నాయనా శాస్త్రోక్తముగా స్వామిని ప్రతిష్ఠించాం కదా! ఇప్పుడు ఈ శివలింగాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ కదిలించలేదు” అని ఓదార్చి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని ఆ దగ్గరలోనే శాస్త్రోక్తంగా ప్రతిష్ఠ చయించి హనుమంతుని తృప్తిపరచాడు. రామునిచే ప్రతిష్ఠించబడిన లింగం రామేశ్వరునిగాను, హనుమంతుడు తీసుకొనివచ్చిన శివలింగం హనుమదీశ్వరునిగాను ప్రసిద్ధి పొంది పూజలను అందుకొంటున్నాయి.








నాగేశ్వరలింగం:

నాగేశ్వర జ్యోతిర్లింగం. దారుకావనంలో గోమతికీ అరేబియా సముద్రానికి సంగమ స్థానంలో వుంది. ఒకప్పుడు శ్రీకృష్ణుని నివాసస్థానమైన ద్వారకా నగరం ఈ దారుకావనంలోనిదే.

యాత్రామార్గం:
గుజరాత్ రాష్ట్రంలోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే బొంబాయినుండి అహ్మదాబాద్, సోమనాథ్, జూనాగఢ్ మీదుగా ద్వారాకచేరి అక్కడ నుండి 22 కి.మీ దూరంలో ఉన్న నాగేశ్వరాలయానికి సముద్ర ప్రయాణం చేసి దారుకావనంలో దిగి ‘గోపీ తలాబ్’ వెళ్ళే బస్సులో నాగ్‌నాథ్ వద్ద దిగాలి.

జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ క్షేత్రమునుండి 7 గంటల కాలం బస్సులో ప్రయాణించి ద్వారకను చేరుకోవచ్చు.ద్వారకలో యాత్రికులకు వసతి సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నాగ్‌నాథ్, ద్వారకకు 22 కి.మీ దూరం కాగా భేట్ ద్వారక 32 కి.మీ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో నాగ్‌నాథ్ ఆలయమే అతి చిన్నది.

మహారాష్ట్రులు గుజరాత్‌లోని దీనిని జ్యోతిర్లింగముగా కాక పర్లి, వైద్యనాథ్ సమీపంలోని ఔండా నాగనాథ్‌ను క్షేత్రముగా భావిస్తారు.

పురాణగాథ:
పుర్వం దారుకుడు అనే పేరుగల రాక్షసుడు ఉండేవాడు. అతని భార్య దారుక ఆ రాక్షస దంపతులు మానవులను బాధిస్తూ, మహర్షుల యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ పశ్చిమ సముద్ర తీరంలో 1000 యోజనాల పొడవు 1000 యోజనాల వెడల్పుగల వనాన్ని సొంతం చేసుకొని విలాసంగా విహరించసాగారు. వారిచే బాధింపబడే సాధువులందరు ఔర్వమహర్షి దగ్గరకు వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు. వానిని రక్షించాలని భావించిన ఔర్వ మహర్షి “నిరపరాధులైన భూమిమీది ప్రజలను హింసించిన యెడల ఆ రాక్షసులు మరుక్షణమే మరణించెదరుగాక” అని శపించాడు.

ఆ విషయం తెలిసిన దారుకుడు ఆ వనాన్నంతటిని పైకెత్తి సముద్రం మధ్యలో స్థాపించుకున్నాడు. మహర్షి తన శాపంలో “భూమిమీద ప్రజలు” అన్నందువల్ల ఆ రాక్షస దంపతులు భూమిపై ఉన్న ప్రజల జోలికి పోకుండా సముద్రంలో ప్రయాణించేవారిని సంహరిస్తూ నిర్భయంగా కాలం గడపసాగారు.






విశ్వేశ్వరలింగం

విశ్వేశ్వర జ్యోతిర్లింగం పురాణ ప్రసిద్ధమైన కాశీనగరంలో ఉన్నది. కాశీక్షేత్రానికి వారణాసి, వారణాసి, మహాశ్మశానం,ఆనందకాననం, అవిముక్తం, రుద్రావాసం, ముక్తిభూమి, శివపురి, క్షేత్రపురి,కాశిక మొదలైన పేర్లున్నాయి. “వరణ” “అసి” అనే రెండు నదులు రెండు ప్రక్కల ఈ క్షేత్రానికి ప్రవహించటం వల్ల దీనికి వారణాసి అనే పేరు వచ్చినట్లు కనబడుతుంది.

మోక్షదాయకమైన ఏడు క్షేత్రాలలో కాశీ ప్రసిద్ధి పొందింది. వేదాలలోను పురాణాలలోను కాశీక్షేత్రం యొక్క మహిమ గొప్పగా వర్ణించబడింది. స్కాంద  పురాణంలోని కాశీఖండం ఈ క్షేత్రాన్ని గురించిన అసంఖ్యాకమైన వివరాలను తెలియజేస్తోంది.

ప్రళయ కాలంలో పరమేశ్వరుడు కాశీనగరాన్ని, తన త్రిశూలంమీద నిలబెట్టాడని చెబుతారు. “కాశ్యాంతు మరణాన్ముక్తిః” అనే సూక్తివలన ఈక్షేత్రంలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుందని తెలుస్తోంది. ఈ క్షేత్రంలో మరణించిన వారికి కాశీ విశ్వనాథుడు కుడిచెవిలో తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడని పూరాణాలు చెబుతున్నాయి.

“ఎప్పుడు కాశీకి వెళతానో! ఎప్పుడు విశ్వనాథుని సేవిస్తానో!” అని మనస్సులో పదే పదే తపన పడేవారికి కాశీలో నివసించినంత పుణ్యఫలం లభిస్తుందని.

    కదా కాశీం గమిష్యామి కదా డ్రక్ష్యామి శంకరం |
    ఇతి ఋవాణస్సతతం కాశీవాసఫలం లభేత్ ||

అనే పురాణవచనం చెబుతోంది.

యాత్రామార్గం:
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచీ కాశీ క్షేత్రానికి వెళ్ళటానికి రైలు సదుపాయాలున్నాయి. విజయవాడ నుంచి ఈ క్షేత్రం వెళ్ళేవారు కాజీపేట నాగపూర్, ఇటార్సీ, అలహాబాద్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది.

పురాణగాథ:
చిత్‌స్వరూపుడైన పరమశివుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాలని అనుకున్నప్పుడు సగుణ రూపములో శివ స్వరూపుడుగా ఆవిర్భవించాడు. స్త్రీ పురుష రూపాలలో ప్రకటీకృతమైన ఆ పరబ్రహ్మమే శక్తిగాను, శివుడుగాను రూపొందారు. ఆ శివశక్తులు ప్రకృతి, పురుషులను సృష్టించారు. ప్రకృతి, పురుషుడు ఇరువురూ తమ తల్లిదండ్రులను తెలుసుకోలేక విచారిస్తున్నారు. అదే సమయంలో నిర్గుణ పరబ్రహ్మ అయిన పరమశివుడు అక్కడ ప్రత్యక్షమై “మీరిద్దరూ తపస్సు చేయండి బ్రహ్మాండాన్ని సృష్టించండి ” అని చెప్పాడు.

“ప్రభూ తపస్సు చేయటానికి అనువైన స్థానం ఏది ” అని ప్రశ్నించారు ప్రకృతి పురుషులు. అప్పుడు పరమశివుడు ఐదు కోసుల పరిమితి గల ఒక సుందరమైన నగరాన్ని వారికి నిర్మించి ఇచ్చాడు. ఆ మహానగరం ఆ పురుషునికి దగ్గరలో ఆకాశంలో నిలబడింది. ఆ నగరమే కాశీక్షేత్రం. పురుషుడే శ్రీమహావిష్ణువు.

విష్ణుదేవుడు కాశీనగరం నుండి సృష్టి చేయాలని సంకల్పించి చాలా సంవత్సరాలపాటు తపస్సు చేశాడు. ఆ సమయములో అలసిపోయిన ఆయన శరీరం నుండి అసంఖ్యాకమైన స్వేదజలధారలు ప్రవహించి విశాలమైన ఆకాశంలో వ్యాపించాయి. ఆ విచిత్రమైన దృశ్యాన్ని చూచి విష్ణువు ఆశ్చర్యంతో శిరస్సును కంపించాడు. అప్పుడీతని కుడిచెవి నుండి ఆభరణం (మణిభూషణం) జారిపడింది. అది పడిన ప్రదేశమే “మణికర్ణిక” అనే మహాతీర్థమయ్యింది. మహత్తరమైన ఆ జలరాశిలో కాశీనగరం మునిగిపోవటం మొదలయ్యింది. అప్పుడు పరమశివుడు కాశీపట్టణాన్ని తన త్రిశూలంపై ధరించాడు. మహావిష్ణువు తన భార్య అయిన ప్రకృతితో అక్కడ నిద్రించాడు. అప్పుడు ఆయన నాభినుంచి చతుర్ముఖబ్రహ్మ ఆవిర్భవించాడు. ఆయన శివాజ్ఞను పొంది బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఆ సందర్భంలో మహావిష్ణువు అణువుకంటే చిన్న, బ్రహ్మాండంకంటే పెద్ద అయిన పరమాత్మ స్వరూపుడగు పరమశివుని ఎన్నో విధాల స్తుతించాడు.

శ్రీమన్నారాయణుని సోత్రానికి పరమశివుడు సంతుష్టుడై, బ్రహ్మ, విష్ణు మొదలైనవారి ప్రార్థనను మన్నించి విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా వారణాసిలో కొలువుతీరాడు.





త్ర్యంబకేశ్వరలింగం:

నాసిక్ మండలంలోని సహ్య పర్వతశిఖరం మీద వెలసియున్న త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం ప్రపంచ ప్రఖ్యాతి గాంచినది. ఆ పరిసరాలలోనే పంచవటి ఉన్నది. లక్ష్మణుడు, శూర్పణఖకు ముక్కు, చెవులు కోసిన ప్రదేశమే పంచవటి. రావణాసురుడు సీతను అపహరించినది కూడా ఈ ప్రదేశంలోనే. ఇక్కడికి కొద్దిదూరంలో ఉన్న బ్రహ్మగిరి మీద గోదావరి నది పుట్టింది.

భక్తుల పాపాలను పోగొట్టుటలో ఉత్తర భారతదేశంలోని  గంగానది ఎలా ప్రసిద్ది గాంచినదో దక్షిణ భారతదేశంలోని గోదావరినది అంతటి ప్రసిద్ధిగాంచినది. గంగానది అవతరించటానికి భగీరథుని తపశ్శక్తి కారణం కాగా, గోదావరినది ఆవిర్భవించడానికి గౌతమమహర్షి త్యాగఫలం కారణమయ్యింది. అందువల్లనే గంగానదికి ‘భాగీరథి ‘ అని ప్రేరువచ్చినట్లు గోదావరికి ‘గౌతమి’ అని పేరు వచ్చింది.

గోదావరి, గౌతమ మునీంద్రుల ప్రార్థనవల్ల భక్తవత్సలుడైన శివుడు త్ర్యంబకేశ్వర రూపంలో ఇక్కడ వెలసియున్నాడు. ఈ ఆలయంలో మూడు చిన్న చిన్న లింగాకృతులు ఉన్నాయి. వాటిని బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన వాటిగా భక్తులు భావిస్త్తారు.

యాత్రామార్గం:మహారాష్ట్రలో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని చూడటానికి బొంబాయి నగరం నుండి నాసిక్ వరకు 184 కి.మీ.లు రైలులో ప్రయాణించి అక్కడి నుండి 30 కి.మీ. బస్సులో ప్రయాణించి ఈ క్షేత్రాన్ని చేరవచ్చు.

పురాణగాథ:
గౌతముడు తపస్సంపన్నుడైన మహర్షి. ఆయన ధర్మపత్ని అహల్యాదేవి. బ్రహ్మగిరి శిఖరంమీద గౌతముడు అహల్యతో కలసి 1000 సం||రాలు కఠోరమైన తపస్సు చేశాడు. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు అనావృష్ఠి కారణంగా దేశం నాలుగు మూలలా కరువుకాటకాలు వచ్చాయి. త్రాగటానికి నీరుకానీ, తినటానికి తిండిగానీ లేక ప్రజలు మలమలా మాడిపోయారు. పశువులకు గడ్డిలేక ఒక్కొక్కటి అంతరించి పోయాయి. చెట్టు చేమలు ఎండిపోయాయి. నేలబీటలు వారింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచమంతా పాడుపడినట్లు అయింది.

దేశంలోని ఆ పరిస్థితి గౌతముని మనస్సును కదిలించివేసింది. కరుణామయుడైన గౌతముడు, వరుణదేవుని గురించి ఆరునెలలు తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమై “మహర్షీ నీ తపస్సుకు కారణం గ్రహించాను. నీవు చిన్న సరస్సు ఒకటి నిర్మించుకో, నేను దానిని నిండుగా అయ్యేలా చేస్తాను. అందులోని నీటిని ఎంతవాడినా తరగక అక్షయమై ఉంటుంది. అది అని చెప్పి అంతర్థానమయ్యాడు.

గౌతముడు సరస్సును నిర్మించాడు. వరుణదేవుని అనుగ్రహం వలన అది అక్షయ జలంతో నిండిపోయింది. గౌతముడు ఆ నీటితో తన నిత్యకృత్యాలు నెరవేర్చుకుంటూ జపహోమాలు, పూజలు మొదలైనవి యథావిధిగా చేసుకొంటున్నాడు. ఈ సరోవరంలోని నీటివల్ల పరిసర ప్రాంతమంతా చెట్లు చిగిర్చి పచ్చపడింది. పశువులకు, పక్షులకు సుఖజీవితం లభించింది. ఆ సరసున చుట్టూ ఒక చక్కని తపోవనం తయ్యారయ్యింది.

ఎక్కడెక్కడి ఋషులు అక్కడికి వచ్చి చేరారు. మునులంగా గౌతమాశ్రమం చుట్టూ వర్ణశాలలను నిర్మించుకొని కాలం సుఖంగా గడపసాగారు .

ఇది ఎలా ఉండగా ఒకరోజు ఋషుల భార్యలు గౌతముని భార్య అయిన అహల్యాదేవితో కారణం లేకుండానే తగాదాపడ్డారు. అంతటితో ఆగక తమ భర్తలను గౌతమునిపైకి పురికొల్పారు. విశ్వాసం లేని ఆ ఋషులు గౌతముని మీదికి కయ్యానికి కాలుదువ్వారు. చివరకు గౌతమునికి హాని తలపెట్టారు. అయినా ఋషుల దూషణలనుగానీ రోషంతో కూడిన తీవ్రపదజాలాన్ని గానీ గౌతముడు లెక్కపెట్టక సహనంతో ఉన్నాడు. అతని సహనం. వారి కోపాన్నీ వేయింతలు చేసింది. చివరకు చెడ్డవారైన ఆ ఋషులు గౌతముని పంటపొలాలలోనికి తోలరు. ఆవు పంటను పాడుచేయుట చూచి గౌతముడు ఒక గడ్డిపరకతో ఆవును అదలించాడు. ఆ గడ్డిపరక ఆవును తాకునంతనే ఆ ఆవు గిరగిర తిరిగి నెలపై కొరిగి మరణించింది.ఇదంగా ఋషులు చేసిన కుట్ర అని గౌతముడు ఊహించలేదు.

ఆవు నేలపై పడినే వెంటనే సమయం కోసం వేచి చూస్తున్న ఆ ఋషులందరూ పరుగు పరుగున గౌతముని వద్దకు వచ్చి గోహత్య చేసినందుకు గౌతమ మహర్షిని రకరకాలుగా నిందించారు. అహంకారం వల్ల కళ్ళు మూసుకుపోతున్నాయా! అని నిలదీశారు. అంతేకాక తక్షణమే ఆ వనాన్ని వదలి వెళ్ళిపోవలసినదని శాసించారు. ధర్మమూర్తి అయిన గౌతముడు చేసేదిలేక భార్యతో కలసి ఆశ్రమాన్ని వదలి కొంతదూరం వెళ్ళి అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకొన్నాడు.

మునులంతా అహంకారంతో గౌతముని కుటీరానికి వెళ్ళి “ఓయీ గౌతమా నీతలపై గోహత్యా పాతకం తాండవిస్తోంది. నీ ముఖం చూస్తేనే పంచ మహాపాపాలు అంటుకుంటాయి. నీ దర్శనంవల్ల అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి. నీవు మాకు దగ్గరలో ఉన్నందువల్ల మేము చేసే యజ్ఞయాగాదులకు దేవతలు హాజరుకావటంలేదు. హోమంలో వేసే పదార్థలు దేవతలకు కానీ పితృదేవతలకు కానీ చెందటంలేదు. అందువల్ల ఇక్కడ ఉండే అర్హత నీకులేదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో ” అని గర్జించారు.

గౌతముడు “మునులతో నా పాపానికి ప్రాయశ్చిత్తం కూడా మీరే చెప్పండి.” అన్నాడు.

అప్పుడు ఋషులు గౌతముని చూచి “నీవు మూడుసార్లు భూప్రదక్షిణం చేసిరావాలి. ఒక నెలకాలం ఏ విధమైన ఆహారం తీసుకోకుండా తపోదీక్ష సాగించాలి. ఈ బ్రహ్మగిరి చుట్టూ 101సార్లు తిరిగి రావాలి. ఇక్కడకు గంగను తీసుకొనిరావాలి. ఆ నీటితో కోటీ శివలింగాలకు అభిషేకం చేసి పూజించాలి. తరువాత 100 బిందెల నీటితో శివుని అభిషేకించాలి. అప్పటికి గానీ నీ గోహత్యాపాతకం తీరదు.” అని కఠోరంగా పలికారు.

గౌతముడు ఋషుల ఆదేశాన్ని శిరసా వహించాడు. వాళ్ళు చెప్పిన పనులన్నీ కొనసాగించాడు. భార్యతో కలసి బ్రహ్మగిరిపైన పార్ధివలింగాకారములో ఉన్న పరమశివుని భక్తితో పూజించాడు.

గౌతముని ధర్మాసక్తికి, దైవభక్తికి, సహనానికి శివుడు సంతోషించి ప్రమథగణంతో సహా ప్రత్యాక్షమై గౌతమునితో “నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక తీర్చటనికే వచ్చాను. కావలసిన వరం ఏమిటి కోరుకో.” అన్నాడు.

గౌతముడు ఆనందంతో ప్రభూ నీ దర్శనం వలన నా జన్మ తరించినది. నాకు ఇంకేమీ వద్దు” అని శివుని పాదాలు పట్టుకోని ప్రార్థించాడు.

శివుడు “నీవు మునులలో శ్రేష్ఠవు. నీ తోడి ఋషులు నీ గొప్పతనాన్ని సహించలేక అజ్ఞానముతో నిన్ను హింసించారు. వారిని క్షమించు. ” అన్నాడు .

అందుకు గౌతముడు “స్వామీ వారు నాకు చాలా ఉపకారం చేశారు. లేకుంటే మీ దర్శనభాగ్యం నాకు కలిగేది కాదుగదా” అన్నాడు.

గౌతముని శాంత స్వభావానికి పరమశివుడు సంతోషించి “గౌతమా ఇదిగో నీ కోరికను అనుసరించి గంగను ప్రసాదిస్తున్నాను. ఈ గంగ గౌతమి అనే పేరుతో నీ కీర్తిప్రవాహంలాగా ప్రవహిస్తుంది. నేను త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ రూపంతో ఈ గౌతమి తీరంలో ఉండి నీవంటి భక్తులను అనుగ్రహిస్తాను.” అని అంతర్ధనమయ్యాడు.

ఋషులంతా గౌతముని పాదాలపై పడి క్షమించమని వేడుకున్నారు. దేవతలంతా సంతోషించారు. అప్పటి నుండి గంగ “గౌతమి” పేరుతో ప్రవహిస్తూ భూమిని పవిత్రం చేస్తోంది. శివుడు త్ర్యంబకేశ్వర రూపంతో ఆ తీరంలో విరాజిల్లుతున్నాడు.








కేదారేశ్వర లింగం

హిమాలయాలలోని కేదార శిఖరంపై విరాజిల్లే జ్యోతిర్లింగమే కేదారనాథ లింగం. కేదార శిఖరానికి పడమటి వైపున ‘మందాకిని’, తూర్పువైపున అలకనంద ప్రవహిస్తున్నాయి. మందానికి ఒడ్డున కేదారనాథస్వామి, అలంకనంద ఒడ్డున బదరీనారాయణ స్వామి వెలసియున్నారు. అలకనందా, మందాకిని నదులు ‘రుద్రప్రయాగ’లో కలసి కొంతదూరం ప్రవహించి ‘దేవప్రయాగ’ దగ్గర ‘భాగీరథి’లో కలుస్తున్నాయి. అందువల్ల గంగా స్నానముచేసే భక్తులు కేదారనాథ, బదరీనాథ్‌ల చరణ కమలాల నుండి వచ్చిన నీటిలో మునుగుతున్నట్లుగా భావించి పులకించిపోతారు. స్కాందపురాణంలోని కేదారఖండం ఈ కేదారేశ్వర జ్యోతిర్లింగం మహిమను గొప్పగా వర్ణించింది. ఏ భక్తుడైన కేదారనాథుని దర్శించకుండా బదరీయాత్ర చేసినట్లుయితే వాని యాత్ర నిష్ఫలమని పై పురాణం చెబుతోంది.

కేదారనాథుని దర్శించటానికి బయలుదేరిన ప్రాణి మార్గమధ్యంలో మరణించినా స్వామిని దర్శించిన పుణ్యం తప్పక లభిస్తుందని పురాణలు చెబుతున్నాయి.

కేదారనాథక్షేత్రం హరిద్వారమునకు 240 కి.మీ.లు., ఋషి కేశమునకు 211 కి.మీ.లు. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత ఉన్నతమైనది కేదారనాథ్. ఇది సముద్ర మట్టానికి సుమారు 16,000 అడుగుల ఎత్తులో వుంది. 12 జ్యోతిర్లింగాలలో అతిపెద్దది కూడా ఇదే. పర్వతశిఖరమే జ్యోతిర్లింగము కనుక దీనికి పానుపట్టంలేదు. గర్భగృహాన్ని లింగాకారములో ఉన్న పర్వత శిఖరము ఆక్రమించివున్నదని చెప్పటంకంటే జ్యోతిర్లింగ రూపమైన పర్వత శిఖరం చుట్టూ ఆలయం నిర్మించబడిందని చెప్పటం బాగుంటుందేమో. ఈ జ్యోతిర్లింగంలో కైలాసపర్వతం యొక్క సూక్ష్మరూపం గోచరిస్తుంది.

కేదారనాథ్ యాత్రలో శివశక్తి స్పష్టంగా కనపడుతుంది.

యాత్రామార్గం:
ఉత్తరప్రదేశ్‌లోని ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే విజయవాడ నుండి నేరుగా ఢిల్లీ వెళ్ళి అక్కడ నుండి ఋషికేశ్ దాకా రైలులో ప్రయాణించి అక్కడ నుండి 280 కి.మీ బస్సులో వెళ్ళి గుప్తకాశీని దాటి గౌరీకుండాన్ని చేరాలి. అక్కడే గౌరీదేవి ఆలయం ఉంది. అక్కడే మంచుకొండల మధ్య నిరంతరం ఒక నీటిబుగ్గలో నుండి వేడినీరు వస్తూ ఉంటుంది. అదే గౌరీకుండం. అక్కడే పార్వతీదేవి తపస్సు చేసింది. ఆమె సౌకర్యం కోసమే తండ్రి అయిన హిమవంతుడు ఆ తపోభూమిని ఏర్పాటు చేశాడు. అదే నేడు భక్తులకు సౌకర్యంగా వుంది. ప్రకృతిలోని విచిత్రాలలో యీ వేడినీటిబుగ్గ ఒకటి.

గౌరీకుండం నుంచి భక్తులు తప్పనిసరిగా కాలినడకనగానీ, డోలీలలో గానీ, పొట్టి గుఱ్ఱాలపై గానీ 14 కి.మీ.లు ప్రయాణించి కేదరనాథ్‌ను చేరాలి. గుఱ్ఱపుస్వారికి సుమారు 200 రూ.లు, డోలీకి 350 రూ.లు తీసుకుంటారు. ఉదయం బయలుదేరితే కేదరానాథ్ దర్శనము చేసుకొని సాయంత్రానికి గౌరీకుండానికి తిరిగి రావచ్చు.

రాత్రిపూట కేదరానాథ్‌లోని ఉండాలనుకొన్న యాత్రికులకు “కాలీకంబ్లీ వాలాసత్రం” “భారత్ సాధూసమాజ్” వారి యాత్రా నివాసం, టూరిస్ట్ బంగ్లా మొదలైనవి వసతిని కల్పిస్తున్నాయి. కేదారేశ్వర వాతావరణం చాలా మనోహరంగా ఉంటుంది. కానీ తరుచు హఠాత్తుగా మబ్బులు కమ్మి వడగండ్లతో వాన పడుతుంది.

పురాణగాథ:
నరనారాయణులు గొప్ప తపస్సంపన్నులు. వారిద్దరూ విష్ణుమూర్తి యొక్క అవతారములు. ఆ మహర్షులు బదరికాశ్రమంలో చాలా సంవత్సరాలు తపస్సు చేసి జగత్తుకు మేలు కలగాలన్న కోరికతో కేదార శిఖరంపై శివుని ఆరాధించటం మొదలుపెట్టారు.

వారిద్దరూ ప్రతిరోజు ప్రభాత కాలంలో మందాకినిలో స్నానం చేసి ఈశ్వరుని పార్థింప లింగములను నిర్మించుకొని భక్తితో పూజ చేసేవారు. మందాకిని నీటితోనూ పవిత్రమైన బిల్వప్రతితోనూ చక్కగా వికసించిన తామర పువ్వులతోనూ వారిద్దరూ ప్రతిరోజు మిక్కిలి శ్రద్ధతో శివుని పూజించేవాళ్ళు.

ఇలా కొంతకాలం గడిచాక పరమశివునికి నరనారాయణులపై కరుణ కలిగి వారికి సాక్షాత్కరించాడు. అప్పుడు వారిద్దరు శివునికి సాష్టాంగ నమస్కారములు చేసి ఏంతగానో స్తుతించారు. ప్రసన్నుడైన శివుడు వారిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారిద్దరు చేతులు జోడించి “మృత్యుంజయా ! జగత్ కళ్యాణం కోసం మేము నిన్ను ఆరాధించాము. నీవు మమ్ము అనుగ్రహించావు. ఇక ముందుకాలములో కూడా నిన్ను ఇక్కడ సేవించినవారికి కోరికలు నెరవేరుస్తూ ఈ శిఖరం మీదనే ‘కేదారేశ్వరుడు’ అనే పేరుతో నిలిచివుండు. నిన్ను దర్శించి స్తుతించిన భక్తులు తరిస్తారు. ఇదే మా కోరిక”  అని ప్రార్థించారు. పరమశివుడు వారి కోరికను మన్నించి కేదారనాథ్ జ్యోతిర్లింగ రూపంలో అక్కడే ప్రకాశిస్తున్నాడు.

ఈ స్వామిని కృతయుగంలో నరనరాయణులు, త్రేతాయుగంలో ఉపమన్యు మహర్షి, ద్వాపర యుగంలో పాండవులు పూజించి ధన్యులయ్యారు. కేదారనాథ్ దేవాలయంలో పాండవులు శిలావిగ్రహాలను మనం చూస్తాం.





ఘృష్ణేశ్వరలింగం

దక్షిణ భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు సమిపంలో వుంది. దౌలతాబాద్‌కు 4 కి.మీ. దూరంలోని ఎల్లోరాలో ఉన్న ఈ జ్యోతిర్లింగం “స్పర్శవేది లింగం”. సంతానం లేనివారు ఈ స్వామిని సేవించి సంతానాన్ని పొందుతారు. ఇతిహాస కాలంలో ‘విశాల’ దేశంగా ప్రసిద్ది చెందిన ఆ ప్రాంతానికి అదే ముక్తికేద్రం.

యాత్రామార్గం:
ఈ క్షేత్రానికి చేరటానికి ఔరంగాబాద్ నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. స్థానికులచే “వెరూలా”గా పిలువబడే ఈ క్షేత్రం ఔరంగాబాదుకు 8 కి.మీ.లు ఇది చిన్నగ్రామం అయినందువల్ల యాత్రికుల వసతికి ఏర్పాట్లు అంతగా లేవు. అందువల్ల యాత్రికుల ఔరంగాబాద్‌లోనే విశ్రాంతి తీసుకుంటారు.

పురాణగాథ:
పూర్వం దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు, సుదేహ అనే బ్రాహ్మణ దంపతులుండేవారు. వారిద్దరు ధర్మ కార్యాలలో ఆసక్తి కలిగి వైదిక విధులను నిర్వర్తిస్తూ శివభక్తులై ఉండేవారు. వారికి సకల సంపదలు ఉన్నప్పటికి సంతానం లేనందువల్ల ఎన్నో నోములు నోచి తీర్థయాత్రలు చేసి అప్పతికీ ఫలితం లేనందువల్ల తమ వంశాన్ని ఎలా నిలుపుకోవాలా అని ఆలోచించసాగారు.

ఒకనాడు సుదేహ తన భర్తతో సంతానం కోసం తన చెల్లెలు అయిన ఘృశ్మలను వివాహం చేసుకొనవలసినదిగా వత్తిడి చేసింది. భార్య కోరికమేరకు సుధర్ముడు చివరకు ఘృశ్మలను పెళ్ళిచేసుకొన్నాడు. శివానుగ్రహం వలన ఘృశ్మలకు చక్కని కుమారుడు పుట్టాడు. వారు ముగ్గురు పిల్లవానిపై మమకారాన్ని పెంచుకుటూ ఎంతో గారాబంతో విద్యాబుద్దలు చెప్పించారు.

శివభక్తురాలైన ఘృశ్మల తన వివాహం అయినప్పటినుంచి ప్రతిరోజూ 1001 పార్థివ లింగాలకు పూజచేసి అనంతరం వాటిని ఇంటికి దూరంగా ఉన్న ఒక చెరువులో వేసివచ్చిన తరువాతనే భోజనం చేసేది. తమ కుటుంబానికి మంచి జరగటం కోసం ఆమె చేస్తున్న పూజలవల్లనే తనకు పుత్రసంతానం కలిగిందని ఆమె విశ్వసించేది.

ఇదిలా వుండగా ఘృశ్మల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. సుధర్ముడు మంచి సంస్కారం, చక్కని రూపంగల ఒకామెను తీసుకొని వచ్చి ఆమెతో తన కుమారునికి వివాహం జరిపించాడు.

సుధర్ముడి పెద్ద భార్య సుదేహ తన చెల్లెలి వివాహం అయినప్పట్టి నుండి చుట్టు ప్రక్కల ప్రజలు ఆమెకు యిస్తున్న గౌరనాన్ని, ఆమెకు పుత్రుడు కలిగిన తరువాత ప్రజలు ఆమెకు మరింత గౌరవాన్ని యివ్వడాన్ని ఓర్చుకోలేకపోయింది. కొడుకు, కోడలుతో ఘృశ్మల ఎంత ఆనందంగా ఉన్న విషయం సుదేహకు మరీ భాదను కలిగించింది.ఎలాగైనా ఆ ఆనందాన్ని కాలరాయాలని అనుకొంది. అసూయా ద్వేషాలతో కుళ్ళిపోతున్న ఆమె మనస్సుకు ఘృశ్మల కొడుకును చంపేయాలనిపించింది. ఒకనాటి రాత్రి అందరూ నిద్రిస్తుండగా కొడుకు తలనరికి యింటికి దూరంగా ఉన్న చెరువులో వేసి ఏమీ తెలియనిదానిలా వచ్చి నిద్రకు ఉపక్రమించింది. భర్త మొండెం నుంచి ప్రవహించిన రక్తం తన శరిరానికి తాకగానే కోడలు నిద్రలేచి భర్త తలనరికి ఉండటం చూసి పెద్దగా ఏడుస్తూ అత్తమామలకు చెప్పబోయింది. శివపంచాక్షరీ జపంలో నిమగ్నమై ఉన్న సుదర్ముడు ఏమీ గమనించే స్థితిలో లేదు. ఘృశ్మల ఆనాటి లింగార్చనలో లీనమై ఉంది.

కోడలి ఏడుపులు విని కళ్ళు తెరచిన ఘృశ్మల కొడలితో “అమ్మా నేటితో కోటింగార్చన పూర్తి అయ్యింది. శివుడు మనకు సాక్షాత్కరించునున్నాడు. అందువల్ల యీ శుభసమయంలో నీకు పతివియోగం కాని, నాకు పుత్రశోకం గాని ఉండదు నా కుమారుడు ఎలా మరణించాడో అలాగే తిరిగి జీవిస్తాడు” అంటూ పూజలో నిమగ్నమయ్యింది.

కోడలికి ఏం చేయాలో దిక్కుతోచలేదు.

పూజ పూర్తి అయిన వెంటనే ఘృశ్మల లింగాలను తీసుకొని వెళ్ళి చెరువులో వేసింది.

వెంటనే శివుడు ప్రత్యక్షమై “నీ కోటి లింగార్చనకు, శివపూజలో నీ ఏకాగ్రతకూ మెచ్చాను. వరం కోరుకో.” అన్నాడు.

అందుకు ఘృశ్మల “స్వామీ నా కోడలు పతి వియోగం విలవిలలాడుతోంది. ఆమెకు పతిబిక్ష పెట్టు. నీవు ప్రత్యక్షమైన ఈ ప్రదేశంలోనే జ్యోతిర్లింగ రూపునివై ఘృశ్మేశ్వరునిగా ప్రజల సేవలనందుకొంటూ నిన్ను సేవించినవారికి సంతాన నష్టంగాని అకాల మరణంగాని లేకుండా కాపాడు.” అని కోరింది.

‘తథాస్తు’ అన్నాడు శివుడు.

ఇప్పుడున్న ఘృష్ణేశ్వరలింగానికి దగ్గరలో చెరువులో కోటిలింగాలున్నాయి.





బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...