Showing posts with label వినాయకుడు. Show all posts
Showing posts with label వినాయకుడు. Show all posts

Tuesday, 18 September 2018

మహావిద్యాగణపతి








మహావిద్యాగణపతి



సత్యప్రమాణాల దేవుడిగా విద్యలకు ఒజ్జగా కృష్ణాజిల్లాలో కొలువైన మహావిద్యాగణపతిని ఆరాధిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పార్వతీనందనుడిని పూజిస్తారు. చోళరాజుల కాలంనాటి నల్లరాతి విగ్రహంతోపాటు ఆలయ మండపంలో ముఫ్ఫైరెండు రూపాల్లో గణనాథుడు దర్శనమివ్వడం ఈ క్షేత్ర విశిష్టత.

వినాయకుడు ప్రథమ పూజ్యుడు. ప్రమథ గణాలకు అధిపతి. విఘ్నాలను పోగొట్టే విశిష్ట దైవం. ఆయన్ను ఆరాధించేవారికి కొండంత అండ. అందుకే దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. పేదాగొప్పా తేడాలేకుండా ప్రతి ఇంటా గణపయ్యను కొలువుదీర్చి శక్తిమేరకు పత్రం పుష్పం ఫలం తోయం సమర్పిస్తారు. అలాంటి గజముఖుడు కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో మహావిద్యాగణపతిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు ఆలయమండపం చుట్టూ వినాయకుడిని సిద్ధీబుద్ధీ సమేతంగా, సంతాన గణపతిగా, జ్ఞానమూర్తిగా... ఇలా వివిధ రూపాల్లో ఏర్పాటుచేశారిక్కడ.

విగ్రహం వెనక...
ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలసిన గణనాథుడు భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుస్తూ వరసిద్ధి వినాయకుడయ్యాడు. విద్యార్థులకు మంచి చదువులు ప్రసాదిస్తూ మహావిద్యాగణపతిగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఈ ఆలయంలో పూజలందుకుంటున్న వినాయకుడి విగ్రహం ఏర్పాటు వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. రెండేళ్ల కిందట... చల్లపల్లిలోని కేసీపీ చక్కెర కర్మాగారం ఆవరణలో వినాయకుడి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని పరిశ్రమ యాజమాన్యం భావించింది. దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన కోసం మట్టిని తవ్వుతుండగా మూడు అడుగుల ఎత్తున్న నల్లరాతి వినాయకుడి విగ్రహం కనిపించింది. దైవానుగ్రహంగా భావించి ఆ విగ్రహాన్నే మూలవిరాట్టుగా ప్రతిష్ఠించి, పూజాదిక క్రతువులు నిర్వహిస్తున్నారు. పురావస్తు అధికారులు ఈ విగ్రహాన్ని పరిశీలించి ఇది చోళరాజుల కాలానికి చెందిందిగా గుర్తించారు. మొదట ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి వినాయకుడి విగ్రహాన్ని అందులో ఉంచారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ దొరికిన విగ్రహాన్నే గర్భగుడిలో ప్రతిష్ఠించారు. ఇక్కడి వినాయకుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఏ కోరిక కోరుకున్నా అది తప్పక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాణిపాకం వినాయకుడి దర్శనం వల్ల కలిగే ఫలితమే ఇక్కడి స్వామిని దర్శించినా సిద్ధిస్తుందని స్థానికుల నమ్మకం.

ఎన్నెన్ని రూపాలో...
లంబోదరుడు ఈ ఆలయంలో చతుర్భుజాలతో దర్శనమిస్తాడు. పైన రెండు చేతుల్లో పాశాంకుశాలు అనే ఆయుధాలనూ, కింది వాటిలో కుడి చేతిలో అక్షరమాల, ఎడమ చేతిలో మామిడి పండును పట్టుకుని కనిపిస్తాడు. అక్షరమాలను చేతిలో ధరించడం వల్లే ఇక్కడి వినాయకుడిని మహావిద్యా గణపతిగా అర్చిస్తారు. ఈ ఆలయంలో ఆగమశాస్త్ర ప్రకారం పూజాదిక క్రతువులను నిర్వహిస్తారు. ఏ ఆలయంలోనైనా ప్రధాన విగ్రహం ఒక్కటే ఉండటం సర్వసాధారణం. కానీ మహావిద్యా గణపతి ఆలయంలో మాత్రం మండపంగా ఏర్పాటు చేసిన పదహారు శిలా స్తంభాలకూ ఒక్కోదానికి రెండేసి చొప్పున మొత్తం ముప్ఫైరెండు విభిన్న ఆకృతుల్లో వినాయక విగ్రహాలు దర్శనమిస్తాయి. సంకట గణపతి, త్రిముఖ గణపతి, రుణ విమోచన గణపతి, సృష్టి గణపతి, ఏకాక్షర గణపతి... ఇలా అనేక రూపాల్లోని వినాయకుడి విగ్రహాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

నిత్య పూజలు
ఇక్కడ కొలువైన మహావిద్యాగణపతికి ఉదయం నుంచే వివిధ రకాల అభిషేకాలూ అర్చనలూ ప్రారంభమవుతాయి. శాస్త్ర ప్రకారం పంచహారతులు, నీరాజన సహిత మంత్రపుష్పాలు సమర్పిస్తారు. ప్రతి బుధవారం అన్నదాన కార్యక్రమాన్ని చేపడతారు. వీటితోపాటు హస్తద్రవ్య అభిషేకం, సహస్రనామార్చనలు, సంకష్టహర చతుర్ధినాడు ప్రత్యేక హోమాలు, కార్తికమాసంలో కోటి దీపోత్సవం, లక్ష గరిక పూజలను విశేషంగా జరిపిస్తారు. ఏటా చైత్రబహుళ పాఢ్యమి రోజున వార్షిక మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

ఇలా చేరుకోవాలి...
విజయవాడకు అరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉందీ మహావిద్యాగణపతి ఆలయం. బస్‌స్టాండ్‌ నుంచి కరకట్ట మీదుగా చల్లపల్లి వెళ్లే బస్సులు అందుబాటులో ఉంటాయి. అక్కడి నుంచి మచిలీపట్నం వెళ్లే రహదారిలో అయిదు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే బస్సులూ, ప్రయివేటు వాహనాల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.

- ముత్తా నారాయణరావు

Wednesday, 17 January 2018

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం






స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం

గతంలో 'కేప్ కొమరిన్'గా ఖ్యాతి చెందిన కన్యాకుమారి తమిళనాడులో కలదు. ఈ పట్టణం ఇండియాకు దక్షిణ భూభాగా దిశలో కోనలో వుంది. కన్యాకుమారి ప్రాంతంలో అరేబియన్ సముద్రం మరియు బంగాళా ఖాతం రెండూ కలుస్తాయి. దీనికి వాయువ్యం మరియు పడమరలో కేరళ రాష్ట్రం వుంటుంది. ఉత్తరం వైపు మరియు తూర్పున తిరునల్వేలి జిల్లా వుంటుంది. కేరళ రాజధాని అయిన తిరువనంతపురం ఇక్కడకు 85 కి.మీ. ల దూరంలో కలదు. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి పౌర్ణమి రోజులలలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది. టెంపుల్స్ మరియు బీచ్ లు - కన్యాకుమారిలోను మరియు చుట్టుపట్ల కల ఆకర్షణలు సృజనాత్మక మైండ్ లేని వారు ఈ టవున్ యొక్క కళలను మరియు సంస్కృతిని ఆనందించలేరు. అయితే, కన్యాకుమారిలో అనేక టెంపుల్స్ మరియు బీచ్ లు కలవు. ఇవి యాత్రికులను, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. సిటీలో ప్రధాన ఆకర్షణలు అంటే, అవి వివేకానంద రాక్ మెమోరియల్, వత్తకోట్టై ఫోర్ట్, పద్మనాభపురం పలద్సు, తిరువల్లువార్ విగ్రహం, వవతురాయి, ఉదయగిరి ఫోర్ట్ మరియు గాంధీ మ్యూజియం.

టవున్ లోని ప్రసిద్ధ ప్రదేశాలలో కన్యాకుమారి టెంపుల్, చితరాల్ హిల్ టెంపుల్ మరియు జైన స్మారకాలు , నాగరాజా టెంపుల్, సుబ్రమణ్య టెంపుల్ మరియు తిరునందికరాయి కేవ్ టెంపుల్ కలవు. తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వినోద పర్యటనకు వచ్చే వారికి కన్యాకుమారి లో కల బీచ్ లు ప్రధాన ఆకర్షణలు. ఈ బీచ్ లలో సంగుతురాయి బీచ్, తేన్గాపట్టినం బీచ్ మరియు సొత విలి బీచ్ లు ప్రసిద్ధి.

కేప్ కొమరిన్ చరిత్ర. కన్యాకుమారి మతానికి మరియు కాలాలకు ప్రధాన కేంద్రాలే కాదు, ఇది వర్తక వ్యాపారాలకు కూడా గత కొన్ని శతాబ్దాల నుండి ప్రసిద్ధి. ఈ టవున్ ను ఎన్నో రాజ వంశాలు పాలించాయి. వాటిలో పాండ్యులు, చొళులు, నాయక లు, చేరాలు ప్రధానమైనవి. కన్యాకుమారి టెంపుల్స్ యొక్క శిల్ప సంపద చూసిన వారికి ఈ ప్రాంత కాలాలకు, నాగరికతకు నిదర్శనాలు గా చెప్పవచ్చు.

ఈ టవున్ వేనాడ్ వంశ పాలనకు వచ్చే సమయానికి ఈ టవున్ రాజధాని పద్మనాభపురం లో కలదు. 1729 నుండి 1758 వరకు , పాలించిన అనిజం తిరునల్ మార్తాండ వర్మ అంటే వేనాడ్ చక్రవర్తి ట్రావెన్ కూర్ ను స్థాపించాడు. దానితో ఈ ప్రాంతం కన్యాకుమారి జిల్లా కిందకు వచ్చింది. సౌత్ ట్రావెన్ కూర్ గా ప్రసిద్ధి చెందింది.

పరావర్ రాజుల పాలన తర్వాత ఈ పట్టణం ట్రావెన్ కూర్ రాజులు చే బ్రిటిష్ అధీనం లో 1947 లో స్వాన్తంత్రం వచ్చే వరకూ పాలించా బడింది. 1947 లో ట్రావెన్ కూర్ ఇండియన్ యూనియన్ లో స్వ పరిపాలన కింద కలదు. ఈ పాలన ట్రావెన్ కూర్ రాజులు చేసారు.

కాల గమనంలో స్త్రీశక్తిస్వరూపిణి వినాయకుని పూర్తిగా మర్చిపోతున్నారు. వినాయకుడికి స్త్రీరూపం వుందని కూడా తెలియనివారు ఎంతోమంది వున్నారంటే నేడు ఆశ్చర్యపోనక్కరలేదు. హిందూ పురాణాల్లోనే వినాయకప్రస్తావన తక్కువగా వున్నప్పటికీ వినాయక స్త్రీ రూపానికి అనేక పేర్లున్నాయి.

ప్రముఖ పరిశోధకుడు బాలాజ్ ముండకుర్ రాసిన పుస్తకం ప్రకారం వినాయకుడికి వైనాయకి, గణేశుని, గజానుని, విజ్ఞేశుని, గజరూప అనే పేర్లున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపదనెలలో వినాయకుని పుట్టినరోజొస్తుంది.

సహజంగా ఆగస్టునెలలో వచ్చిన వినాయకుడు పుట్టినరోజు నాడు ఆయనకు ఘనంగా పూజలు నిర్వహించటంవల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయన్నది హిందువులవిశ్వాసం. విఘ్నాలు తొలగిపోటానికి స్త్రీరూపాన్ని పూజించినట్లు పురాణాధారాలు ఏమీలేవుగాని ప్రతి నెలలో వచ్చే నెలవంక 4వ రోజున వినాయకచతుర్ధిపేరిట మహిళలుప్రత్యేకపూజలు చేసేవారనటానికి ఆధారాలు వున్నాయి.

ఎక్కడవుంది?
తమిళనాడులోని కన్యాకుమారిజిల్లా తనుమలయన్ ఆలయంలో వినాయకవిగ్రహాలు ఇప్పటికీ స్పష్టంగానే వున్నాయి. ఇందులో ఓవిగ్రహం సుఖాసనంలో కూర్చునుంది. 4చేతులుండే ఈ విగ్రహంలో పై ఎడమచేతిలో గొడ్డలి,కింది ఎడమచేతిలో శంఖంపట్టుకుని వుంది.

అలాగే కుడివైపున పైచేతిలో కలశం, మరో చేతిలో దండముంది.ఆ పక్కనే మరోవిగ్రహంలో వినాయకవిగ్రహం నిలబడివుంది.దానికి 2చేతులేవున్నప్పటికీవిరిగిపోయి వున్నాయి. 1300యేళ్ళక్రితంనాటి ఈ ఆలయంలో వినాయకుని విగ్రహాలకు ప్రత్యేకతలు వున్నాయని,రిటైర్డ్ పురాతత్వశాస్త్రవేత్త శ్రీశాంతలింగం చెప్పారు.

ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈశాన్యంలో ఈ వినాయకునివిగ్రహాలు కనిపిస్తాయని మరే ఆలయంలో ఈశాన్యదిశలో ఇలా విగ్రహాలు వుండవని ఆయన వివరించారు.క్రీ.శ.550లో రాసిన మత్స్యపురాణంలో కూడా వినాయకప్రస్తావన వుంది.

శివుడి అవతారంగా పేర్కొన్న 200మంది దేవతలపేర్లలో వినాయకునిపేరునిపేర్కొన్నారు. హిందూపురాణాలపై పలుపుస్తకాలు రాసిన దేవదత్ పట్నాయక్ కూడా వినాయకప్రస్తావన తీసుకొచ్చారు.ఆయన కధనంప్రకారం అంధకఅనే రాక్షసుడు పార్వతిని మోహించి పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు.

ఈ విషయాన్ని పార్వతిశంకరుడికి పిర్యాదుచేయటంతో ఆ రాక్షసుడిని శివుడు చంపాలనుకుంటాడు. అయితే ఆ రాక్షసుడి ఒక్కరక్తం చుక్కకూడా నేలరాలకూడదు. అలా రాలిన చుక్కలనుంచి మళ్ళీప్రాణంపోసుకునే వరం ఆ రాక్షసుడికుంది.

అందుకే పార్వతి విష్ణుమూర్తి శక్తి అయిన వైష్ణవి, బ్రహ్మశక్తి అయిన బ్రాహ్మణి, ఇంద్రుడి శక్తిఅయిన ఇంద్రాణితోపాటు వినాయకుని సహాయం చేయవలసినదిగా ప్రార్ధిస్తుంది. అప్పుడు వీరందరూ ఆ రాక్షసుడిరక్తాన్ని,నేలరాలకుండానే గాలిలో వుండగానే తాగేస్తారు.

రాజస్థాన్ లోని రైరావ్, ఒరిస్సాలోని హీరాపూర్, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ దగ్గర భారాఘాట్ వద్ద ఇప్పటికి వినాయకవిగ్రహాలున్నాయి. ముందుగా జానకిశ్రీనివాసన్ వినాయకవిగ్రహాలను సోషల్ మీడియాలో పోస్ట్,చేయగా వాటిని అనేకమంది షేర్ చేసుకోవటంతో పాటు వాటిని తమప్రాంతాల్లోని ఆలయాల్లో ఇప్పటికివున్న వినాయకి విగ్రహాలను వెతికిపట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్తసోధనలో మరిన్ని వినాయకివిగ్రహాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

కన్యాకుమారి లో షాపింగ్ ఎల్లపుడూ షాపింగ్ చేసే వారికి కన్యాకుమారి సరైన ప్రదేశం కాదు. అయితే కొట్టి పాటి గుర్తు కొరకు ప్రియమైన వారికి ఇవ్వగల కొన్ని వస్తువులు తప్పక దొరుకుతాయి. సముద్రపు ఆలిచిప్ప వంటి వి, సంఖాలు, మరియు చిన్న మోమెంతో లు దొరుకుతాయి.

హస్త కళల వస్తువులు ఇక్కడ స్థానికులచే చేయబడినవి దొరుకుతాయి. అందమన ఈ కెన్ మరియు వెదురు, చెక్క ఉత్పత్తులు ఇంటి అలంకరణకు లేదా ఫ్రెండ్స్ లేదా బంధువులకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు బాగుంటాయి. సి షెల్ల్స్ తో చేయబడిన కొన్ని నగలు రంగుల సముద్ర ఇసుక వంటివి కూడా షాపింగ్ లిస్టు లో చేర్చవచ్చు.

సిటీ లో ప్రసిద్ధ షాపులు అంటే తమిళ్ నాడు కో ఆప టెక్స్ సేల్స్ ఎంపోరియం మరియు తమిళ్ నాడు క్రాఫ్ట్స్ అండ్ పూమ్పుహార్ లు. ఇక్కడ వివిధ టెక్స్ టైల్స్ మరియు హంది క్రాఫ్ట్ వస్తువులు కొనవచ్చు. రోడ్ల పై అమ్మే వస్తువులు సరసమైన ధరలలో వుంటాయి. రుచి కర ఆహారాలు సి ఫుడ్ లు కన్యాకుమారి స్థానికులకు ప్రసిద్ధి.

ఈ ఆహారం అధిక మసాలా , కొబ్బరి వంటివి ప్రతి ఆహారం లోను కలిగి వుంటాయి. టవున్ లోని చాలా రెస్టారెంట్ లు సౌత్ ఇండియన్ డిష్ లు వడ, ఇడ్లి, దోస మరియు ఊతప్పం వంటివి అందిస్తారు. కన్యాకుమారి లో చైనీస్, రాజస్థాని, గుజరాతి ఆహారాలను అందించే కొద్దిపాటి రెస్ట రెంట్లు కూడా కలవు.

కన్యాకుమారి ఎలా చేరాలి ?
సిటీకి సమీప ఎయిర్ పోర్ట్ తిరువనంతపురంలో కలదు. ఎయిర్ పోర్ట్ లో దిగి టాక్సీ లేదా బస్సు లేదా ట్రైన్ లో కన్యాకుమారి చేరవచ్చు. కన్యాకుమారి టవున్ లో ఆటో రిక్షాలు లేదా బస్సులలో ప్రయాణించవచ్చు. లేదా ప్రైవేటు టాక్సీ కూడా అద్దెకు తీసుకోవచ్చు.

రోడ్డు ప్రయాణం
కన్యాకుమారికి రోడ్డు మార్గాలు బాగానే వుంటాయి. పర్యాటకులు తేలికగా చేరవచ్చు. ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలనుండి బస్సు లు కన్యాకుమారి కి కలవు.

రైలు ప్రయాణం
పర్యాటకులు కన్యాకుమారికి రైలు లో చేరవచ్చు. ఇక్కడకు సూపర్ ఫాస్ట్ మరియు ఎక్స్ ప్రెస్ ట్రైన్ లు వివిధ ప్రదేశాలనుండి చేరతాయి.

విమాన ప్రయాణం
కన్యాకుమారి విమాన ప్రయాణంలో చేరాలంటే, సమీప ఎయిర్ పోర్ట్ 89 కి.మీ.ల దూరంలో తిరువనంతపురంలో కలదు. ఇక్కడ నుండి కన్యాకుమారికి ఇంటర్నేషనల్ మరియు స్థానిక విమానాలు నడుస్తాయి.

ఉత్తమ సమయం
సంవత్సరం పొడవునా నగర వాతావరణం ఆనందంగా వుంటుంది. కనుక పర్యాటకులు ఈ కాలంలో అయినా సరే పర్యటించవచ్చు. అయితే ఈ ప్రదేశ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ గల నెలలు సూచించ వచ్చు.

Saturday, 2 September 2017

మదరాంతేశ్వర స్వామి

రోజు రోజుకూ పెరిగే గణపయ్య

విఘ్నాలకు అధిపతి వినాయకుడు. పార్వతీ తనయుడైన గణపతిని పూజించిన అనంతరమే అన్ని కార్యాలను ప్రారంభిస్తాం. మూషిక వాహనుడైన విఘ్నేశ్వరునికి దేశంలో ఆలయాలు అనేకం ఉన్నాయి. తొలి పండగను వినాయక చవితిగా జరుపుకొంటాం. జగన్మాత కుమారుడైన స్వామికి ఉన్న విశిష్ట ఆలయాల్లో కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లాలోని మధూరు ఒకటి. మధురవాహిని నదీ తీరంలో, ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన విఘ్నరాజును దర్శించుకునేందుకు భక్తులు వస్తుండటంతో మధూరు నిత్యం దైవ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో నిండివుంటుంది.




ఉద్భవమూర్తి..
మధూరులోని ఆలయంలో ప్రధాన దైవం పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. స్థలపురాణం ప్రకారం ఒక మహిళ స్వామివారి విగ్రహాన్ని కనుగొంది. అందుకనే స్వామివారిని ఉద్భవమూర్తిగా పేర్కొంటారు. తొలిసారిగా మహిళా భక్తురాలికి స్వామివారు దర్శనమిచ్చారు. అందుకనే ఆమె పేరుపై మధూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. స్వామి గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. రోజురోజుకూ స్వామివారు పెరుగుతుండటం విశేషం. అందుకనే బొడ్డ గణేశా అని పిలుస్తుంటారు. ప్రధాన దైవం ఈశ్వరుడు అయినా గణనాథునికి విశేషపూజలు నిర్వహించడం క్షేత్ర ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది.


టిప్పుసుల్తాన్‌ వెనుదిరిగాడు..
ఒక కథనం ప్రకారం టిప్పుసుల్తాన్‌ ఆధ్వర్యంలోని సేనలు మలబార్‌పై దండెత్తాయి. ఈ క్రమంలోనే ఆలయంపైకి సేనలు వచ్చాయి. ఆలయ ప్రాంగణంలోని బావిలోని నీటిని టిప్పుసుల్తాన్‌ తాగిన తరువాత మనస్సు మారి దాడిని విరమించుకొని వెనక్కు మళ్లినట్టు తెలుస్తోంది.ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది.


ప్రసాదంగా అప్పం..
ఆలయంలో కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. మహాగణపతికి ఉదయాస్తమానసేవ నిర్వహిస్తారు. సహస్ర అప్ప పూజలో భాగంగా వెయ్యి అప్పాలతో పూజలు జరిపిస్తారు. మరో ముఖ్యమైన సేవ మూడప్పమ్‌. ఇందులోనూ అప్పాలతో పూజ జరిపించడం విశేషం. వినాయక చవితికి భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.


ఎలా చేరుకోవాలి...

  • కాసర్‌గోడ్‌ నుంచి ఆలయం 7 కి.మీ. దూరంలో ఉంది.
  • కాసర్‌గోడ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మధూర్‌కు వివిధ వాహనాల ద్వారా చేరుకునే సౌలభ్యముంది.
  • మంగళూరు విమానాశ్రయం ఇక్కడ నుంచి 70 కి.మీ. దూరంలో ఉంది. విమానాశ్రయం నుంచి ఆలయానికి ప్రైవేటు ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు.

కాణిపాకం వినాయకుడు

అలాంటి వాళ్ల‌కు సింహస్వప్నం కాణిపాకం వినాయకుడు

సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం భాసిల్లుతోంది. కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

క్షేత్రచరిత్ర / స్థలపురాణం:
సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.

ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!
కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

నిత్యం పెరిగే స్వామి!
వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.

కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.

బ్రహ్మహత్యా పాతక నివారణార్థం:
స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు:
మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.


సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550
సేవాఫలితం:స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.

గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500
సేవాఫలితం:‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.

గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300
గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.

సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58
సేవాఫలితం:‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.

మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300
సేవాఫలితం: దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.

సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151
సేవాఫలితం: గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.

పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000
సేవాఫలితం: వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.

అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116
సేవాఫలితం: చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.

అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116
సేవాఫలితం: పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51
సేవాఫలితం: వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.

వసతి.. రవాణా సౌకర్యాలు:
కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. 

తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి. దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.

Sunday, 23 April 2017

భక్తులను అనుగ్రహించే బొజ్జగణపతి ఆలయం

కేరళలో అనంత సంపదలకు అధినేత అయిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి అందరికీ తెలుసు కానీ, ఆ ఆలయానికి అతి సమీపంలోనే ఉన్న గణపతి ఆలయం గురించి తెలిసింది అతి కొద్దిమందికే. అతి పురాతనమైన ఈ ఆలయంలో స్వామివారి మూలమూర్తి అన్ని ఆలయాలలో కనిపించేలా ఎడమ కాలును పైకి మడిచి కూర్చున్న భంగిమలో కాకుండా కుడికాలిని పైకి మడిచి ఎడమకాలిని కిందికి పెట్టి భిన్నంగా కనిపించడం ఒక విశేషం కాగా, కేరళ ఆలయాలకు భిన్నంగా తమిళనాడు రీతిన కట్టడంతో, చిన్న ఆవరణలోనే మహాగణపతి కొలువుదీరడం మరో విశేషం. మహా మహిమాన్వితుడిగా పేరున్న ఈ స్వామివారి ఆలయ ప్రాంగణంలో కోరికలెన్నో కోరుకుని అవి తీరాక కొబ్బరికాయలు కొడుతూ కనిపించే భక్తజనులు ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటారు.

తమిళనాడులోని కన్యాకుమారికి సమీపంలో నాగర్‌కోయిల్‌ పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో గల పద్మనాభపురం అప్పట్లో కేరళ రాజధాని. ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్‌ అనే రాజు పద్మనాభపురంలో రాజభవనాన్ని నిర్మించాడు. ఆ రాజభవన ప్రాంగణంలోనే చిన్నపాటి గణపతి ఆలయం ఉండేది.

గణపతికి మొక్కిన తర్వాతే దండయాత్రలకు, వేటకు, ఇతర దేశయాత్రలకు బయలుదేరేవారు ఎవరైనా ఆ కాలంలో. తదనంతర కాలంలో రాజా మార్తండవర్మ ట్రావెన్‌కోర్‌ రాజవంశాన్ని పద్మనాభదాసులుగా ప్రకటించి, అనంతుడు వెలసిన పురానికి రాజధానిని మార్చాడు. 1795వ సంవత్సరంలో శ్రీ మహాగణపతిని కూడా సాదరంగా తోడుకొని వచ్చి, పళవంగాడుగా పిలుచుకునే ఆ కోట తూర్పు భాగంలో పునఃప్రతిష్ఠించారు.ఆనాటినుంచి పళవంగాడు మహాగణపతిగా భక్తుల కోర్కెలను నెరవేరుస్తున్నాడు స్వామి.

ఆలయ విశేషాలు
ఆలయ గోపురానికి నల్లరంగు వేయడంతో దూరానికే కొట్టవచ్చినట్లుగా, ప్రత్యేకంగా కనిపిస్తుంది ఆలయం. ఆలయంలో మండపాలెన్నో ఉన్నాయి. రహదారి మీద ఉండే చిన్న రాజగోపురం గుండా ప్రాంగణంలోకి ప్రవేశిస్తే, మండప స్తంభాలపైన ఎంతో రమణీయంగా చెక్కిన శ్రీ లక్ష్మీ సరస్వతీ విగ్రహాలు, ఇతర మూర్తులు దర్శనమిస్తాయి. అన్నింటికీ మించి ముఖమండపం గోడలపైన శిల్పసౌందర్యంలో ఒకదానికొకటి పోటీపడుతున్నట్లుగా చెక్కి ఉన్న 32 రకాలైన గణపతి చిత్రాలు అమితంగా ఆకట్టుకుంటాయి. ఇవిగాక ఉపాలయాలెన్నో ఉన్నాయి. వాటిలో దుర్గాదేవి, ధర్మశాస్త్త్ర, నాగరాజు ఆలయాలు తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటాయి.

నాడు రాజులకు మాత్రమే.. నేడు పేదలకు కూడా
అలనాడు ట్రావెన్‌కోర్‌ రాజవంశీకుల పూజలందుకున్న పళవంగాడు మహాగణపతి నేడు పేదలకు కూడా దర్శనమిస్తూ, వారి కోర్కెలు తీరుస్తూ, మొక్కులనూ సంతోషంగా స్వీకరిస్తున్నాడు. కొబ్బరికాయలపైన తనకున్న మక్కువను తీర్చుకుంటున్నాడు మహాగణపతి.

పూజలూ... ఉత్సవాలూ
రోజూ ఉదయం నాలుగున్నర గంటలకు ఆలయ ద్వారాలు తెరచిన వెంటనే భక్తులకు నిర్మాల్య దర్శనం కల్పిస్తారు. అనంతరం ఉషఃకాలపూజ, నైవేద్యం, ఉచ్చపూజ, దీపారాధనలతో సహా మొత్తం 21 రకాల పూజాకైంకర్యాలు జరుగుతాయి. ప్రతినెలా సంకటహరచతుర్థి పూజ, హస్తానక్షత్ర పూజ, ప్రత్యేకపూజ, హోమాలు నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే గణపతి హోమానికి ఎంతో గొప్ప పేరు. ప్రతి సంవత్సరం గణేశ చతుర్థి, ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాలు, మాఘమాసంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్లపక్ష చతుర్థినాడు జరుపుకునే వినాయక వరద చతుర్థి అంగరంగవైభవంగా జరుగుతాయి.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి తిరువనంతపురం వరకు బస్సులు, రైళ్లు ఉన్నాయి. తిరువనంతపురం సెంట్రల్‌ రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌లకు అతి సమీపంలో గల ఈ ఆలయానికి వెళ్లడం చాలా సులభం.

ఇతర ప్రదేశాలు...
అనంతపద్మనాభస్వామి ఆలయం, కుంటాలలో గల మరో అనంతుని ఆలయం, ఇంకా కేరళ రాజవంశీకులున్న కోట... అసలు కేరళలో అడుగుపెట్టడమే భూలోక స్వర్గానికి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంది. మహామహిమాన్వితుడైన పళవంగాడు మహాగణపతి ఆలయ సందర్శనం అనంతమైన ఫలాలనిస్తుందని విశ్వాసం.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Monday, 27 February 2017

కాణిపాకం





కాణిపాకం
అబద్ధం ఈ ఆలయంలో నిషిద్ధం

దేశంలో ఎక్కడా లేని విధంగా సత్య ప్రమాణాలకు వేదికగా కాణిపాకం పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. తప్పుచేసిన వారు ఈ ఆలయంలో ప్రమాణం చేయడానికి సాహసించరు. ఇక్కడ కొలువైన వినాయకుడు కోరిన కోర్కెలు తీర్చే వరసిద్ధుడిగా పేరు గాంచాడు. ఐరాల మండలంలోని కాణిపాకం గ్రామంలో ఇరవై ఏళ్ల క్రితం కేవలం ఒక మండపంలోని ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ తిరుమల, శ్రీకాళహస్తి తరువాత జిల్లాలో అంతటి ఆదరణ గల ఆలయంగా ప్రాచుర్యం పొందింది. ఆలయానికి ప్రతి రోజు ఇరవై వేల మందికి తక్కువ కాకుండా ముఖ్యమైన పర్వదినాలలో లక్ష మంది వరకు భక్తులు ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు.

వరసిద్ధుడి ఆలయానికి సుమారు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కాణిపాకాన్ని అప్పట్లో విహారపురిగా పిలిచేవారు. గ్రామానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకొని జీవనం సాగించేవారట. వీరిలో ఒకరు అంధుడు, మరొకరు చెవిటివాడు, ఇంకొకడు మూగవాడు. వీరు తమ పొలానికి నీరు పెట్టడానికి బావి నుంచి యా తం వేసి నీరు తోడుతుండగా బావిలోని ఓ శిలకు యాతపు బాణ తగిలి రక్తం స్రవించిందట. ఆ నీరు తగిలి అంధుడికి కళ్లు కనిపించాయి,చెవిటివాడికి వినబడింది, మూగవాడు మాట్లాడగలిగాడు. యాతపు బాణ తగిలింది స్వామి విగ్రహ శిరస్సుకు. అందుకే స్వామి విగ్రహం తలపై ఇప్పటికీ కొప్పులా ఉంటుంది. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు విగ్రహం మహిమను గుర్తించి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పూజించారు. భక్తులు కొట్టిన కొబ్బరి నీళ్లు కాణి(ఎకరా)పారకం అయింది. ఈ క్షేత్రం ఆ విధంగా కాణిపారకమని కాలక్రమేణా కాణిపాకమని పేరుపడింది.

స్వామి విగ్రహం పెరుగుతోందిస్వయంభుగా వెలసిన స్వామి విగ్రహం అచ్చుం శిల్పి చెక్కినట్లు ఉంటుంది. ఈ విగ్రహం ప్రతి ఏడాది కొంత పరిమాణంలో పెరుగుతూ ఉందని భక్తులు చెబుతారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాలలో ఉంచిన స్వామి వెండి కవచాలే దీనికి నిదర్శనం. దోషులతో నిజం చెప్పించడానికి, మద్యపానం వంటి దురలవాట్లు మాన్పించడానికి ఈ క్షేత్రంలో సత్యప్రమాణాలు చేయిస్తారు. స్వామి సన్నిధిలో అబద్ధం ఆడడానికి ఎవరూ సాహసించరని నమ్మకం.

స్వర్ణ ధ్వజ స్తంభాలు, కలశాల ఏర్పాటుకాణిపాకం క్షేత్రంలోని ప్రదాన ఆలయం, అనుబంధ ఆలయమైన మణికంఠేశ్వరస్వామి ఆలయంలో బెంగళూరుకు చెందిన కాశెట్టి వెంకటేశ్వర్లు, కుటుంబ సభ్యులు కోట్లాది రూపాయలు వెచ్చించి స్వర్ణ ధ్వజస్తంభాలను ఏర్పాటు చేశారు. మణికంఠేశ్వరస్వామి ఆలయంలో త్వరలో కుంభాభిషేకం నిర్వహించనున్నారు. అలాగే వరసిద్ధుని ఆలయ విమాన గోపురం,తూర్పు రాజగోపురం, పశ్చిమరాజగోపురం,ఆంజనేయస్వామి ఆలయ విమాన గోపురంపై నెల్లూరుకు చెందిన వీటీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత వేమిరెడ్డిప్రభాకరరెడ్డి, ప్రశాంతిరెడ్డి 14 స్వర్ణ కలశాలను ప్రతిష్ఠింపజేశారు.

వేలాది మంది భక్తులకు అన్నదానంకాణిపాకం క్షేత్రంలో ప్రతి రోజు వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. ఇక్కడ నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా బుగ్గమఠానికి చెందిన దేవిమంగమ్మ చారిటీ ట్రస్టు వారు తొలత విరాళం ఇచ్చి అన్నదానాన్ని వరసిద్ధుని ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం ఆలయంలో స్వామి దర్శనానికి విచ్చేసే భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.





Tuesday, 6 September 2016

గణపతులు

ముక్కంటి గణపతి!
ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో వెలసిన దశభుజ గణపతి వైభవాన్ని చూడాల్సిందే!

ఏనుగు మొహం, చాట చెవులు, బానపొట్ట... గణపతి రూపం జగద్విఖ్యాతం. అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో కొలువైన గజాననుడి రూపం మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. మరుగుజ్జు స్వామి కాస్తా మహాకాయుడిగా దర్శనమిస్తాడు. పదిహేను అడుగుల ఎత్తుతో, పన్నెండు అడుగుల వెడల్పుతో ఉంటుందా విరాట్ మూర్తి. ‘శుక్లాంబరధరం విష్ణుం...’ శ్లోకం గణనాథుడిని ‘చతుర్భుజం’ అని కీర్తిస్తుంది. కానీ, ఇక్కడి గణపతికి మొత్తం పదిచేతులుంటాయి. ఎడమవైపున అయిదు చేతులూ, కుడివైపున అయిదు చేతులతో ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధంతో ఆ రూపం భక్తుల్ని తన్మయుల్ని చేస్తుంది. కుడివైపున మొదటి చేతిలో నారికేళం, రెండో చేతిలో చక్రం, మూడో చేతిలో త్రిశూలం, నాలుగో చేతిలో ధనుస్సు, ఐదో చేతిలో అంకుశం ఉంటాయి. ఎడమ వైపున మొదటి చేతిలో భార్య సిద్ధి, రెండో చేతిలో శంఖం, మూడో చేతిలో పవిత్రం, నాలుగో చేతిలో శరం, అయిదో చేతిలో ఖడ్గం దర్శనమిస్తాయి. విగ్రహం ఎడమ అరికాలి కింద అష్టదళ పద్మం ఉంది. ఇలాంటి స్వరూపాన్ని ‘మహాగణపతి’గా ఉపాసిస్తారు ఆధ్యాత్మిక సాధకులు. కాళ్లకు గజ్జెలూ, కాలికింద మూషిక వాహనమూ ముచ్చటగొలుపుతాయి. ‘అచ్చంగా తండ్రిపోలికే...’ అన్నట్టు ఫాలభాగంలో మూడో కన్ను ఉంటుంది. ‘ప్రసన్న వదనం’ విషయంలో మాత్రం ఏమాత్రం తేడా లేదు. మహా చిద్విలాసంగా కనిపిస్తాడు. పదిచేతులవాడు కావడంతో ‘దశభుజ గణపతి’గా పేరుతెచ్చుకున్నాడు. చేతలవాడు కూడా కావడంతో, కోరికల్ని సిద్ధింపజేస్తూ ‘సిద్ధి వినాయకుడు’ అనిపించుకుంటున్నాడు.

స్వామి ముక్కంటిగా దర్శనమిస్తున్న కారణంగా, పరమశివుడిలానే దుష్టశిక్షకుడనీ శిష్టరక్షకుడనీ విశ్లేషిస్తారు. విగ్రహానికి కుడివైపున సూర్యుడూ ఎడమవైపున చంద్రుడూ ఉండటంతో విశ్వగణపతిగా కీర్తిస్తారు. చేతిలోని నారికేళ ఫలం సుఫలాలకు ప్రతీక. అందుకే భక్తులు, మొక్కులు మొక్కుకునే ముందు కొబ్బరికాయల్ని సమర్పిస్తారు. అభీష్టం సిద్ధించాక మళ్లీ వచ్చి, ఇంకొన్ని కాయల్ని నివేదిస్తారు.

రాయలకాలం...
దశభుజ మహాగణపతి ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో భూపతిరాయలు అనే పాలకుడు నిర్మించినట్టు తెలుస్తోంది. ఆది, మంగళవారాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. నెలనెలా సంకష్టహర చతుర్థికి వందలాది భక్తులు వస్తారు. పక్కనే నరసింహుడి ఆలయం ఉంది. ఇది కూడా రాయల కాలం నాటిదే. లక్ష్మీదేవి సమేతంగా కొలువైన ప్రహ్లాద వరదుడిని కళ్లారా దర్శించుకోవచ్చు. ఆలయాలకు ఆనుకుని ఉన్న కొండమీదికి మెట్ల మార్గం ఉంది. పైకి ఎక్కితే, శిథిల నగరం కనిపిస్తుంది. కొలనులూ రాజప్రాసాదాలూ విపణులూ గతవైభవ ఘనకీర్తిని వివరిస్తాయి. జిల్లా కేంద్రం అనంతపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది రాయదుర్గం. కర్ణాటకలోని బళ్లారి నుంచి అయితే యాభై కిలోమీటర్లు.

- వునికిలి హరగోపాలరాజు, అనంతపురం డెస్క్, ఈనాడు
ఫొటోలు: సి.రామాంజినప్ప



కాటన్ దొర గంట!
అపర భగీరథుడు కాటన్ దొర పార్వతీ నందనుడి పరమభక్తుడు. ఆ గలగలల స్వాప్నికుడు రాజమహేంద్రిలో వెలసిన విఘ్నాధిపతికి గణగణల గంటను కానుకగా ఇచ్చాడు. రెండువందల యాభై సంవత్సరాల క్రితం... రాజమహేంద్రవరంలోని నాళంవారి వీధిలో ఏటా వినాయక చవితికి మట్టి గణపతిని పూజించేవారు. 1830 ప్రాంతంలో, స్వామివారికి ఆలయాన్ని నిర్మించాలన్న ఆలోచన వచ్చింది స్థానికులకు. చిత్రపు వెంకటాచలం అనే భక్తుడు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. చల్లా సూర్యనారాయణశాస్త్రి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ప్రాజెక్టు నిర్మాణం కోసం కాటన్ దొర రాజమహేంద్రవరం వచ్చారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోదావరి మీద ఆనకట్ట పనులు మొదలుపెట్టారు. అంతలోనే తొలి విఘ్నం. తీవ్ర అనారోగ్యంపాలై ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వచ్చాక కూడా ఏవో అవరోధాలు. గణపతిని అర్చిస్తే వ్యక్తిగత, వృత్తి జీవితాల్లోని విఘ్నాలు తొలగిపోతాయని కొందరు సలహా ఇచ్చారు. దీంతో, తొలిసారిగా నాళంవారివీధిలోని సిద్ధిలక్ష్మీగణపతి ఆలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచీ తరచూ ఇక్కడికి వచ్చేవారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తయితే, గంటను కానుకగా ఇస్తానని విఘ్నాధిపతికి మొక్కుకున్నారు. నిరాటంకంగా పని పూర్తయిపోయింది. ఆ తర్వాత కృష్ణానది కాలువ పనులూ చకచకా జరిగిపోయాయి. మొక్కు ప్రకారమే, లండన్ నుంచి ఓ భారీ గంటను తెప్పించి సమర్పించారు. ఇప్పటికీ గణగణమంటూ కాటన్ దొర భక్తిప్రపత్తుల్ని చాటుతోందా గంట.

- సూర్యకుమారి
న్యూస్టుడే, రాజమహేంద్రవరం

Friday, 12 February 2016

వింత విచిత్ర వినాయక ఆలయాలు

తమిళనాడు రాష్ట్రంలోని నాగర్కోయిల్‌ జిల్లాలోని కేరళపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది. అదే శ్రీ మహాదేవర్‌ అతిశయ వినాయగర్‌ ఆలయం. ఈ ఆలయం చూడడానికి చిన్నదే అయినా పిట్ట కొంచం కూత ఘనం అన్నట్టు, ఈ ఆలయం ఘనత మాత్రం చాలా గొప్పది. అందుకు కారణం ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి తన రంగు తానే మార్చుకోవడం. ఉత్తరాయణ కాలం (మార్చి నుంచి జూన్‌) వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలం (జూలై నుంచి ఫిబ్రవరి) వరకూ తెల్లని రంగులో ఉంటాడు. ఈ విధంగా రంగులు మార్చుకోవడం ఈ వినాయకుని మాహాత్మ్యం అని భక్తుల విశ్వాసం. అంతే కాదు ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచినీటి బావి వుంది. నీటికి రంగు లేదు అన్న నిజం మనందరికీ తెలిసిన విషయమే. కానీ అది మిగతా చోట్ల మాటేమోగానీ.., నా దగ్గర మాత్రం అది చెల్లదు అంటుంది ఇక్కడున్న ఈ బావి. ఇక్కడ వున్న వినాయకుడు తన రంగును మార్చుకున్నట్లే.., ఈ బావిలో నీళ్లు కూడా తమ రంగును మార్చుకుంటాయి. అయితే ఈ మార్పులో చిన్న తేడా ఉంది. వినాయకుడు నల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి.., వినాయకుడు తెల్లగా ఉన్న సమయంలో.., ఈ బావిలో నీళ్లు నల్లగా ఉంటాయి. అంతేకాదు, ఇంత కన్నా మరో విచిత్రం కూడా ఉంది. సాధారణంగా శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలడం ప్రకృతి సహజం. కానీ, దట్టమైన అడవుల కారణంగా తమిళ, కేరళారణ్య ప్రాంతాలకు ఈ ఋతు భేదం వర్తించదు. అవి ఎప్పుడూ సతతహరితాలే. కానీ, ఈ ఆలయంలో ఉన్న మఱ్ఱిచెట్టు మాత్రం దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించడం ప్రారంభిస్తుంది. అందుకే ఈ ఆలయాన్ని మిరాకిల్‌ వినాయకర్‌ ఆలయం అని కూడా పిలుస్తారు.

చారిత్రక ప్రాశస్త్యం:
ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయానికి 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది శివాలయం. ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని శ్రీ మహాదేవర్‌ అతిశయ వినాయగర్‌ ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది. ఆ కాలంలో ఈ ఆలయం మీద కేరళ ప్రభుత్వం ఆధిపత్యం కూడా ఎక్కువగా ఉండేది. తర్వాతి కాలంలో రాష్ట్రాలు విడిపోయాక, ఈ ఆలయం తమిళనాడుకు చెందడంతో, కేరళ ప్రభుత్వం ఆధిపత్యం తగ్గింది.

చారిత్రక చరిత్ర:
ఆ రోజులలో కేరళ పురం రాజుగారు తీర్థయాత్రలకని రామేశ్వరం వెళ్లడం జరుగింది. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది. రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని కేరళ పురం రాజుకే ఇస్తూ, మరొక మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు. అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం మన అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమ శాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు. ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపు మూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.

పెన్నులతో పూజలందుకునే అయినవిల్లి వినాయకుడు

అమలాపురానికి 12 కి.మీ. దూరంలోఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారుండరు. ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు. స్వయంభువు గణపతి క్షేత్రాలలో ఒకటైన ఈ అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం కృతయుగం నుంచీ ఇక్కడే ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. 14వ శతాబ్ది కాలంలో శంకరభట్టు సంస్కృతంలో రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర గ్రంథంలో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీని ప్రకారం క్రీ.శ. 1320లో శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించినట్లు, వారి మాతామహులైన మల్లాది బాపన్నావధానులు అయినవిల్లి క్షేత్రంలో స్వర్ణగణపతి మహాయఙ్ఞం జరిపినట్టు తెలుస్తుంది.

ఆ సమయంలో చివరి హోమంలో ఆహుతులను అందుకోవడానికి సాక్షాత్తు ఈ సిద్ధివినాయకుడే స్వర్ణకాంతులతో వచ్చి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే శ్రీపాద శ్రీవల్లభుడు జన్మించారు. ఆ కాలంలో ముగ్గురు నాస్తికులు ఈ సిద్ధివినాయకుని అవహేళన చేసిన పాపానికి ప్రతిఫలంగా, ఆ ముగ్గురూ మరుజన్మలో గుడ్డి, మూగ, చెవిటివాళ్ళుగా పుట్టినట్టూ, వాళ్ళు కాణిపాక స్థలంలో సేద్యం చేస్తూంటే..బావిలో కాణిపాక వినాయకుడు దొరికినట్టు ఈ గ్రంథం చెబుతుంది. దీన్నిబట్టి కాణిపాక వినాయక క్షేత్రం కంటే, అయినవిల్లి సిద్ధివినాయక క్షేత్రం ప్రాచీనమైందని తెలుస్తోంది. దక్షప్రజాపతి తన యఙ్ఞ ప్రారంభానికి ముందు ఈ సిద్ధివినాయకుని పూజించాడని స్థానికులు చెబుతారు. అందుకే పూర్వం నుంచీ ఈ స్వామివారంటే భక్తులకు అపారమైన నమ్మకం, గురి. సిద్ధివినాయకస్వామికి ప్రతి నిత్యం రుద్రాభిషేకాలు, అష్టోత్తపుష్పార్చన, పుస్తకపూజ, అన్నప్రాశన, అక్షరాభ్యాసాలు విశేషంగా జరుగుతూంటాయి. ఉభయ చవితి తిథులలోను, దశమి, ఏకాదశి తిథులలోను, పర్వదినాలలోనూ ఈ స్వామికి విశేష పూజలు జరుగుతాయి.

సంకటహర చతుర్థినాడు శ్రీ స్వామివారికి ప్రత్యేకంగా గరిక పూజలు చేస్తారు. వీటితోపాటు సకల ఈతిబాధా నివారణార్థం శ్రీ మహాలక్ష్మీ గణపతి యాగం కూడా చేస్తారు. వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. వినాయకచవితి రోజున రకరకాల పండ్లరసాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి పర్వదినాన దేశంలోని సప్త జీవనదుల(గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి) జలాలతో సప్తనదీ జలాభిషేకం చేస్తారు. ఇంతకన్న ముఖ్యమైనది ఏమిటంటే.. ప్రతియేటా విద్యార్థుల కోసం జరిగే వార్షిక పరీక్షల ముందు ఫిబ్రవరి 2,3 వారాలలో దాదాపు లక్ష పెన్నులతో శ్రీ స్వామివారికి అభిషేకం చేసి, వాటిని విద్యార్థులకు ప్రసాదంగా బహూకరించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ పెన్నులతో పరీక్ష రాస్తే తప్పకుండా మంచి మార్కులతో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తామని విద్యార్థుల విశ్వాసం. విశాల ప్రాంగణం గల ఈ సిద్ధివినాయకస్వామి ఆలయ ప్రాకారంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరాలయం, శ్రీభూసమేత కేశవస్వామి ఆలయం, ఈశాన్య భాగంలో కాలభైరవస్వామి ఆలయం ఉన్నాయి.

అందుకే ఈ ఆలయం పంచాయతన క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది.మొదట్లో ఈ ఆలయానికి కేశవస్వామి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు. అయితే తూర్పు చాళుక్యుల కాలంలో ఆలయ పునరుద్ధరణ జరిగినప్పుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడిగా ప్రతిష్ఠించినట్లు చారిత్రక శాసనాలవల్ల తెలుస్తుంది. ఈ సిద్ధివినాయకుని ఘనత నలుదిశలు వ్యాపించడంతో ఈ స్వామివారిని దర్శించడానికి ఎందరో రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు కూడా రావడం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక ఆకర్షణ.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...