Showing posts with label హిమాలయాలు. Show all posts
Showing posts with label హిమాలయాలు. Show all posts

Sunday, 22 January 2017

హిమాచల్‌ ప్రదేశ్‌ - ఆలయాలకు ఆలవాలం






ఆలయాలకు ఆలవాలం హిమసమూహం

వెండిలా తళతళా మెరిసిపోయే హిమాలయ పర్వత శ్రేణులను సందర్శించడానికి అటు భక్తజనులూ, ఇటు పర్యాటక ప్రియులూ కూడా ఉవ్విళూరుతుంటారనడంలో అతిశయోక్తి లేదు. బహుశా అందుకే కాబోలు, దేశానికి పర్యాటకరంగం నుంచి ఆదాయం చేకూర్చే రాష్ట్రాలలో హిమాచల్‌ ప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. ఇక అక్కడి కులూ లోయల సంగతి చెప్పనవసరం లేదు. అక్కడి కొండల మీద వెలుగు నీడలకి వెర్రెత్తిన నికొలన్‌ రోరిచ్‌ అనే రష్యా చిత్రకారుడు గతంలో అక్కడ స్థిరపడి అద్భుతమైన పెయింటింగ్‌లు చేశారు.

సిమ్లా, కుర్గి, నర్కండా, కులు, మనాలి, చంబా, కూపర్, పబ్బర్‌ వంటి ప్రాంతాలు హిమాచల్‌ప్రదేశ్‌ అనే తోటలోని అందమైన పూలు! సోలోంగ్‌నుల్లా నుంచి పథ్రూ వరకు గల లోయ ప్రాంతంలో స్కీయింగ్‌ ఆనందం కోసం దేశవిదేశీ పర్యాటకులు బిలబిలలాడుతుంటారు.

శివరాత్రి అక్కడ బ్రహ్మాండంగా జరుగుతుంది. అక్కడి శాలువాలు, రగ్గులు, దుప్పట్లు, తివాచీలు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి. అంతేకాదు, ఈ హిమవత్పర్వత శ్రేణులలో శక్తిస్వరూపిణి, చింతలు తీర్చే చల్లనితల్లి చింతపూర్ణాదేవి, చారెడేసి కన్నులతో కనువిందు చేసే నయనాదేవి, భీమసేనుడి భార్య హిడింబకు కూడా ఆలయాలున్నాయి.

చింతపూర్ణాదేవి
చింత అంటే బాధలు, ఆందోళనలు. తన భక్తుల చింతలను దూరంచేసే దేవి కాబట్టి ఈ తల్లికి చింతపూర్ణాదేవి అని పేరు వచ్చిందట. దక్షయజ్ఞంలో అవమానానికి గురై ప్రాణత్యాగం చేసిన సతీదేవి దేహాన్ని పరమశివుడు భుజాన వేసుకుని తిరుగుతుండగా, విష్ణుమూర్తి ఆ దేహాన్ని ముక్కలు చేసినప్పుడు, ఆమె పవిత్రపాదం ఇక్కడ పడిందని అంటారు. మరోగాథ ప్రకారం, భగత్‌మయీదాస్‌ అనే భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతి నిత్యం అమ్మవారిని పూజించేవాడు. కానీ లౌకిక సంబంధమైన కోరికలు ఏవీ కోరలేదు. ఒకసారి ఈ భక్తుడు తన మామగారి ఊరికి బయలుదేరాడు. అతను కొంతదూరం వెళ్లాక, అలసిపోయి ఒక చెట్టునీడన పడుకొని నిద్రపోయాడు. అతను నిద్రలో ఒక కలగన్నాడు.

ఆ కలలో, ఒక బాలిక కనిపించి, అక్కడ తను పిండ రూపంలో - గుండ్రని రాతి రూపంలో ఉన్నానని, తనకొక ఆలయం నిర్మించమని చెప్పింది. ఆమె చెప్పిన విధంగానే అతను అక్కడ ఉన్న అమ్మవారిని (పిండ రూపాన్ని) ఆలయంలో ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికి ఇరవై ఆరు తరాల కిందట అమ్మవారి ప్రతిష్ఠ జరిగిందని చెబుతారు. సోలాసింఘి పర్వతశ్రేణిలోని అతి ఎత్తయిన ఒక పర్వతశిఖరం మీద చింతపూర్ణాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయం ఉదయం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంటుంది. లడ్డు, హల్వా, పాయసం, పళ్లు మొదలైన నివేదనలతోపాటు పూలు, వస్త్రాలు అమ్మవారికి సమర్పిస్తారు.

కులు-మనాలి
కులు-మనాలి అనే రెండు ప్రాంతాలు కలిసిపోయి, అది ఒకే ఊరు అనుకునే పరిస్థితి ఉంది. కానీ కులు, మనాలి వేర్వేరు ఊళ్లు. మొదట కులు వెళ్లి అక్కడి నుంచి మనాలికి ప్రయాణం కట్టాలి. హిమాచలప్రదేశ్‌ అంటేనే హిమాచల పర్వతాలలో ఉన్న ప్రాంతమని అర్థం. కులు-మనాలి చుట్టూ ఎత్తయిన కొండలే దర్శనమిస్తాయి. ఈ ప్రాంతాలు వేసవి విడిది ప్రాంతాలు. సెప్టెంబరు నుంచి పూర్తిగా పచ్చదనంతో నిండిపోయి, ఈ కొండలు కనువిందు చేస్తాయి. జనవరి, ఫిబ్రవరి నెలలలో మంచుమీద స్కైయింగ్‌ జరుగుతూంటుంది. కులు జిల్లాకు దేవతల లోయ అని పేరు.

కులు ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలో బిజిలీ మహదేవ్‌ ఆలయం ఉంది. కులులోని రఘునాథ ఆలయం చూడదగినది.భారతీయ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన ప్రాంతం మనాలి. పూర్వం ప్రళయంలో ప్రపంచమంతా మునిగిపోయి నప్పుడు, తిరిగి సృష్టి చేయడానికై ఓడలో నుండి మనువు ఈ ప్రాంతంలో అడుగుపెడతాడు. అందుకే ఈ ప్రాంతానికి నిమనాలి - మనువు నివసించిన ప్రాంతం అని పేరు. పాత మనాలిలో మనువు ఆలయం ఉంది. ఈ ఆలయాన్నే కాక, పాత మనాలిలోని పురాతన కోటలను, కట్టడాలను, యాత్రికులు సందర్శిస్తూంటారు. మనాలి, దాని పరిసరాలు సప్తర్షుల నివాసంగా చెబుతారు.

అత్యద్భుతమైన ప్రకృతి అందాలతో, సాహస క్రీడలు జరిగే ప్రదేశాలతో మనాలి గొప్ప పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హిడింబి ఆలయం ఉంది. పాండవులలోని భీమసేనుని భార్య హిడింబి. ఈమె రాక్షస సంతతికి చెందినది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు హిడింబాసురుని సోదరి అయిన హిడింబి భీముడిని పెళ్లాడింది. వీరి కుమారుడే ఘటోత్కచుడు. హిమాలయాల పాదాల దగ్గర ఉన్న ఈ ఆలయం చుట్టూ అటవీ ప్రాంతం కలిగి ఉండి ఎంతో రమణీయంగా ఉంటుంది. నాలుగు అంతస్థుల గోపురంతో, దారు చెక్కడాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈ ఆలయం. మనాలిలో బౌద్ధుల ఆశ్రమాలు కూడా చూడదగిన ప్రదేశాలు. వీటిని గోంపాలు అంటారు. గదన్‌ తెక్చోగోంప, హిమాలయన్‌ న్విన్గమప గోంప మొదలైన ఆశ్రమాలున్నాయి.

హిమాచలప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్వహించే హోటల్‌ కూడా చూడదగినదే. ఇది పూర్వకాలంలో నగ్గర్‌కోటగా పేరు పొందింది. ఇది ప్రస్తుతం హోటల్‌గా రూపాంతరం చెంది, హిమాచలప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్వహణలో ఉంది. దీనిని దర్శించినవారు, ఇందులోని కళానైపుణ్యానికి ఆశ్చర్యపోతారు. హనీమూన్‌ జంటలను ఆకర్షించే ప్రదేశంగా కూడా మనాలి పేరుపొందింది. ఇంతేకాక, సాహసక్రీడలైన స్కీయింగ్, పారాగ్లైడింగ్, ట్రెక్కింగ్, మౌంటెన్‌ బైకింగ్‌ మొదలైన సాహసక్రీడలు కూడా మనాలిలో జరుగుతుంటాయి. ఈ ఆటలలో పాల్గొనాలనే కాక, కేవలం మంచులో సరదాగా ఆటలాడుకోవాలని వచ్చేవారి సంఖ్య కూడా తక్కువ కాదు. మంచుకొండలలోని వేడినీటిబుగ్గలు ప్రకృతిలోని వింతగా, దేవుడిచ్చిన వరంగా చెబుతారు. మనాలికి సీమపంలో రహల్లా జలపాతం కనువిందు చేస్తుంది. ఇది సుమారు 2,500 మీటర్ల ఎత్తున ఉన్న ఈ జలపాతం చూస్తే, నయాగరాని చూసిన అనుభూతి పొందుతారు.

చాముండానందికేశ్వరి
చాముండాదేవిని గురించి దేవీభాగవతం, దుర్గాసప్తశతి మొదలైన పురాణాలలో వివరంగా ఉంది. చాముండాదేవి ఆలయాన్ని సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు. కాళికాదేవి చాముండాదేవిగా ఇక్కడ ఉన్నదని చెబుతారు.మరోగాథ కూడా ఉంది. అమ్మవారు ప్రారంభంలో ఒక ఎత్తయిన పర్వతం మీద వెలిసిందని, ఒక అంధ భక్తుడు ప్రతీరోజు అమ్మవారిని దర్శించలేక పోతున్నందున బాధపడి అమ్మవారిని ప్రార్థించాడని, అతనిని కరుణించడానికని దేవి కొండ మీద నుండి ఇప్పుడున్నచోటికి వచ్చిందని స్థానికులు చెబుతారు.

జ్వాలాముఖి
జ్వాలాముఖి ఆలయం కాంగ్రాకి దక్షిణంగా సుమారు 30 కి.మీ. దూరంలో ఉంది. ఇది 51 శక్తిపీఠాలలో ఒకటి. జ్వాలాముఖి దగ్గర సతీదేవి నాలుక పడిందని చెబుతారు. స్వచ్ఛమైన నీలిమంటతో ప్రకాశించే దేవిని పాండవులు కూడా దర్శించారని స్థానిక గాథ చెబుతోంది. ఈ ఆలయంలో ఒక రాగి గొట్టం నుంచి నిరంతరం సహజవాయువు వెలువడుతుంది. దీన్ని ఆలయ పురోహితుడు వెలిగిస్తాడు. ఈ జ్వాలే జ్వాలాముఖి అమ్మవారిగా ఇక్కడ కొలువుదీరి భక్తుల పూజలందుకుంటోంది. ఇక్కడ ఈ జ్వాలే కాక, ఇంకో తొమ్మిది జ్వాలలు ఉన్నాయి. అవి కూడా దేవతలుగా పూజలందుకుంటున్నాయి. మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగుళ, వింధ్యవాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజిదేవి ఈ తొమ్మిది జ్వాలా దేవతల పేర్లు. అమ్మవారికి పాలు, ఫలాలు, కలకండలని నివేదిస్తారు. రోజంతా రకరకాల పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రతీరోజు అయిదుసార్లు ఆరతి జరుగుతుంది. రోజుకొకసారి హోమం చేసి, దుర్గాసప్తసతి పారాయణ చేస్తారు.

హిమాచల్‌ కొండల దారిన...
ఒక్కసారి హిమాచల్‌ప్రదేశ్‌ కొండల వాలుల్లో నడిస్తే చాలు మీకు కొండల పిచ్చి పట్టుకుంటుంది. అలా పర్వతాలు ఎక్కడానికి, పెద్ద పెద్ద మంచు బండరాళ్లు ఎక్కి కొండల మీద తిరగడానికి తగిన శిక్షణ లేకపోతే ఎక్కలేరు. అందుకే అక్కడి మనాలీలో మౌంటెనీరింగ్, స్కీయింగ్‌ నేర్పే శిక్షణాలయం ఉంది. సట్లె్లజ్, బియాస్‌ నదులు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ప్రశాంతంగా ప్రవహిస్తాయి గనుక వాటిలో పడవల పోటీలు, పడవ ప్రయాణాలు బహు చక్కగా సాగుతాయి.

హిమాచలపర్వతాలను ఎలా చేరుకోవాలంటే...?
జ్వాలాముఖి ఆలయాన్ని సందర్శించాలంటే ముందుగా కాంగ్రా చేరుకోవాలి. కాంగ్రాకు దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి రైళ్లున్నాయి. విమానంలో వెళ్లాలంటే గగ్గల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలి. అక్కడినుంచి కాంగ్రాకు క్యాబ్‌లు, ట్యాక్సీలు ఉంటాయి. కాంగ్రా నుంచి బస్సులో జ్వాలాముఖికి వెళ్లవచ్చు లేదంటే ఢిల్లీ నుంచి ధర్మశాలకు విమానంలో వెళ్లి, అక్కడినుంచి ట్యాక్సీలో జ్వాలాముఖి ఆలయానికి చేరుకోవచ్చు.

ఉత్తమమైన మార్గం ఏమిటంటే... tourismmin-hp@nic.in, tourism.hp@nic.inకు మెయిల్‌ చేస్తే హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌నుంచి అక్కడ చూడదగ్గ ప్రదేశాలు; ఎలా చేరుకోవాలి, ఎక్కడ బస చేయాలి, ప్యాకేజీ ఏమిటి... వంటి వివరాలతో కూడిన మెయిల్‌ వస్తుంది. దాని ప్రకారం ప్లాన్‌ చేసుకోవచ్చు.

DVR. భాస్కర్‌



Sunday, 1 January 2017

చంద్రుడి మీదకి వెళ్లొచ్చినట్లే ఉంది..!

" హిమాలయాల అందాలనీ అక్కడి జీవనసౌందర్యాన్నీ ఆసాంతం ఆస్వాదించాలంటే ఆ పర్వతశ్రేణుల్ని అధిరోహించాల్సిందే. " అంటూ లేహ్ లద్దాఖ్ లోని ట్రెక్ అనుభవాలను వివరిస్తున్నారు బెంగళూరుకు చెందిన యామర్తి శ్రీనివాస్ శ్రీవాత్సవ్.

బెంగళూరు నుంచి దిల్లీకి విమానంలో వెళ్లి, అక్కడనుంచి మరో విమానంలో 1325 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేహ్‌ లద్దాఖ్‌కు గంటలో చేరుకున్నాం. లేహ్‌ అనేది జస్కర్‌, లద్దాఖ్‌ పర్వతశ్రేణుల మధ్య ఉన్న లోయ. ఇది చైనా, టిబెట్‌ సరిహద్దులో ఉంది.

ఆక్సిజన్‌ అందలేదు!
హిమాలయ పర్వతశ్రేణుల్లో సముద్రమట్టానికి 3,500 వేల అడుగుల ఎత్తులోని లేహ్‌కి చేరగానే వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం తగ్గిపోయి కొంత ఇబ్బందికి గురయ్యాం. దీన్ని ఎక్యూట్‌ మౌంటెయిన్‌ సిక్‌నెస్‌గా పిలుస్తారు. అందుకే పర్వతారోహకులను రెండుమూడురోజులు వాతావరణానికి అలవాటు పడేవరకూ ఆ ప్రాంతంలోనే ఉంచుతారు. దాంతో మేం మూడు రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో లద్దాఖ్‌లోని ప్రాంతాలన్నీ తిరిగాం. పట్టణంలోని ప్రధాన బజారుకి వెనకగా ఉన్న చాంగ్‌ గలి అనే రోడ్డులోని చిన్న దుకాణాల్లో ముత్యాలూ పగడాలూ లాపిస్‌ లాజులి వంటి రత్నాలూ బాగా దొరుకుతాయి. ఒకరోజు సాయంత్రం జపాన్‌వాళ్లు నిర్మించిన చాంగ్స్‌ పా అనే శాంతి స్థూపాన్ని దర్శించాం. దీన్ని 1985లో దలైలామా ప్రారంభించారట. ఇది తెలుపు రంగులో అద్భుతంగా ఉంది. రాత్రివేళ లైట్లలో అందంగా మెరుస్తూ కనిపించింది. దీన్ని చూడ్డానికి అనేకమంది సందర్శకులు ఏటా లద్దాఖ్‌ను సందర్శిస్తుంటారట.

నాలుగోరోజు లామాయురు - చిల్లింగ్‌ ట్రెక్‌కు బయలుదేరాం. లేహ్‌ పట్టణంలో ట్రెక్కింగ్‌కు సంబంధించిన ఏజెన్సీలు చాలానే ఉన్నాయి. మేం ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడంతో అక్కడకు వెళ్లగానే ఆ ఏజెన్సీకి వెళ్లి రిపోర్టు చేశాం. వాళ్లు మాకు గైడ్లనీ వంటమనిషినీ సామాన్లు చూసుకునే కేర్‌ టేకర్‌నీ ఏర్పాటుచేశారు. వాళ్లు మాకోసం కూరలూ వంటసామాన్లూ టెంట్లూ అన్నీ తీసుకుని మాతోపాటు బయలుదేరారు. సామాన్లు మోసేందుకు కంచరగాడిదలూ పొట్టి గుర్రాలూ కూడా తీసుకొచ్చారు. ఈ సామాన్లు వేసుకుని వంటమనిషీ కేర్‌టేకరూ మాకన్నా ముందుగానే వెళ్లిపోయేవారు. మేం చేరాల్సిన మజిలీకి ముందుగానే చేరుకుని టెంట్లు వేసి వంటలు చేసి ఉండేవారు.

సరస్సు మాయమైంది!
ముందుగా లేహ్‌ పట్టణానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లామాయురు అనే ప్రాంతానికి చేరుకున్నాం. నిజానికి ఈ లామాయురు అనేది ఒకప్పుడు పెద్ద సరస్సు అనీ లాట్సొవా నరోపా అనే బౌద్ధగురువు చేతి మహిమతో ఆ సరస్సు అంతర్థానమైందనీ చెబుతారు. ఇక్కడే పదో శతాబ్దంలో రింకె జాంగ్పొ స్థాపించిన బౌద్ధారామాన్నీ సందర్శించాం. లద్దాఖ్‌ ప్రాంతంలోకెల్లా పురాతనమైనది ఇదే. ఈ ట్రెక్‌లో హిమాలయాల సౌందర్యాన్నే కాదు, బౌద్ధారామాల్నీ అక్కడి ప్రజల సంస్కృతీ సంప్రదాయాల్నీ పరిశీలించవచ్చు.

బౌద్ధారామాన్ని సందర్శించాక గైడ్‌ సహాయంతో పర్వతారోహణ ప్రారంభించాం. ఆ కొండల్లో అన్నీ మెలికల దారులే. వాటి వెంబడి నడుచుకుంటూ వెళ్లాం. కొంతవరకూ తారురోడ్లూ మరికొంత మట్టిరోడ్లూ ఉన్నాయి. అక్కడ ఉన్న కొండల్ని చూస్తుంటే మాకేదో చంద్రగ్రహంమీద నడుస్తున్నామా అనిపించింది. అందుకేనేమో వాటిని మూన్‌ స్కేప్‌ అంటారట. నడక మొదలుపెట్టినప్పుడు ఉత్సాహంగా ఉన్నా కొంతసేపటికి ఆయాసం రావడంతో మెల్లగా వేగం తగ్గించాం. అలా కాసేపు వేగంగానూ మరికాసేపు నెమ్మదిగానూ నడుస్తూ 3750 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రింక్టి లా అనే ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం.

అక్కడ నుంచి మళ్లీ సన్నని దారిలో కిందకు దిగుతూ షిల్లా అనే గ్రామం మీదుగా నడుస్తూ 3160 మీటర్లలోని వాన్లా అనే ప్రాంతానికి చేరుకున్నాం. మేం అక్కడకు చేరుకునేసరికి టెంట్లు సిద్ధంగా ఉన్నాయి. బాగా అలసిపోవడంవల్ల వెంటనే నిద్రపట్టేసింది. తరవాతి రోజు పొద్దునే అల్పాహారం తిని మళ్లీ నడక మొదలుపెట్టాం. దారిలో ఫెంజిల్లా, ఉరి అనే గ్రామాల మీదుగా 3740 మీటర్ల ఎత్తులోని హింజు అనే గ్రామానికి చేరుకుని ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాం.





మూడోరోజు ఉదయాన్నే హింజు నుంచి 4950 మీటర్ల ఎత్తులోని కాంజెస్కి లా అనే ప్రాంతానికి ఎక్కాం. మా పర్వతారోహణలోకెల్లా ఎత్తైన ప్రదేశం ఇదే. అక్కడ నుంచి చూస్తే మేఘాలు కొండ శిఖరాన్ని తాకుతున్నాయి. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా అనిపించింది. ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని తరవాతి రోజు ఉదయాన్నే కాంజెస్కి లా నుంచి 3810 మీటర్ల ఎత్తుకి దిగాం. అక్కడక్కడా ఎత్తైన మంచు శిఖరాల మీద నుంచి జాలువారే నదీపాయల్ని దాటుకుంటూ సుందా చెన్‌మో అనే గ్రామానికి చేరుకున్నాం. ఆ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. అడవి గులాబీలు తలలూపుతూ స్వాగతిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ దారిలో మాకు జడలబర్రెలూ వాటిని మేపే వాళ్ల గుడిసెలూ కనిపించాయి.

ఆ తరవాతి మజిలీ లానాఖ్‌ లా... అది 4370 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడి నుంచి నేరుగా పైకి ఎక్కుతూ 4820 మీటర్ల ఎత్తులోని డూంగ్‌ డూంగ్‌ చాన్‌ లా అనే ప్రదేశానికి చేరుకున్నాం. అక్కడి నుంచి 3550 మీటర్ల దిగువన ఉన్న లోయలోని చిల్లింగ్‌ అనే ప్రాంతానికి దిగడంతో మా పర్వతారోహణ దిగ్విజయంగా పూర్తయింది. లద్దాఖ్‌ ప్రాంతంలో రాగి, ఇత్తడి, కంచు, వెండి, ఇనుము... వంటి లోహవస్తువులు విక్రయించే మార్కెట్‌ ఉన్న గ్రామం చిల్లింగ్‌ ఒక్కటే. ఆ గ్రామంలో కాసేపు తిరిగి చూశాం. తరవాత జస్కర్‌ నది, సింధూనది కలుసుకునే నిమ్మొ అనే ప్రదేశానికి వెళ్లాం. సింధూనది టిబెట్‌ నుంచి మనదేశంలోని లేహ్‌ పట్టణంగుండా ప్రవహిస్తూ పాకిస్థాన్‌కు చేరుకుని అటునుంచే అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది.

అన్నీ చెక్క ఆలయాలే!
సింధూనదీ పరీవాహక ప్రాంతంలో మాత్రమే చిన్నా పెద్దా మొక్కలు కనిపిస్తాయి. మిగిలిన ప్రాంతమంతా ఎడారే. అక్కడ ఎక్కువగా క్యాబేజీ, కాలీఫ్లవర్‌, గోధుమ, బార్లీ పంటలు పండిస్తారు. అవే వాళ్ల ప్రధాన ఆహారం. అక్కడక్కడ గడ్డి తుప్పలు కనబడుతూ ఉంటాయి. సింధూనదిలో కనిపించే నీరు స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది. అక్కడి ప్రజలకు తాగునీరూ సాగునీరూ అన్నీ సింధూ జలాలే. లేహ్‌కి తిరిగివచ్చి అక్కడి ప్రదేశాలన్నీ చూశాం. లేహ్‌ పట్టణమంతా బౌద్ధమతస్తులే. ఇక్కడి ఆలయాలన్నీ చెక్కతో చేసినవే. బుద్ధ విగ్రహాలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఆలయాల్లో ఉండే పూజారులను లామాలు అంటారు. లేహ్‌లో 1672 సంవత్సరంలో కట్టిన హెమిస్‌ అనే ఆలయానికి వెళ్లాం. అక్కడినుంచి పదో శతాబ్దంలో నిర్మించిన ఆల్చీ అనే పురాతన ఆలయాన్ని సందర్శించాం. తరవాత పట్టణంలోని పురాతన వస్తుప్రదర్శనశాల చూడ్డానికి వెళ్లాం. అందులో లద్దాఖ్‌కు చెందిన చారిత్రక వస్తువులూ ఆయుధాలూ ఉన్నాయి.

కాలినడకే శరణ్యం!
కార్గిల్‌, లేహ్‌ రెండూ లద్దాఖ్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. లేహ్‌ పట్టణంలో స్కూళ్లూ కాలేజీలూ ఉన్నాయి. అక్కడి పర్వతశ్రేణుల్లో కూడా ప్రజలు నివసిస్తున్నారు. ఎత్తైన ప్రాంతాల్లో కాకుండా దిగువన ఉన్న ప్రదేశాల్లో చిన్న గ్రామాలు చాలానే ఉన్నాయి. హింజు, వాన్లా... వంటివన్నీ ఆ కోవకే చెందుతాయి. ఆయా గ్రామాల్లో ఇళ్ల సంఖ్య పదీ ఇరవైకి మించదు. జడలబర్రె, కుందేళ్లను పోలిన మార్‌మోట్‌, జింకలూ పష్మీనా గొర్రెల్నీ ఎక్కువగా పెంచుతారు. పష్మీనా గొర్రెల నుంచి తీసిన వూలు చాలా ఖరీదు. దాంతో వాళ్లు శాలువాలూ స్వెట్టర్లూ అల్లి విక్రయిస్తుంటారు. అదే వాళ్ల ప్రధాన ఆదాయం.

అక్కడ ప్రతి గ్రామంలోనూ ధర్మచక్ర అనే ప్రార్థనా చక్రాలు ఉంటాయి. వూళ్లలో చిన్న చిన్న స్కూళ్లు ఉన్నాయి కానీ కాలేజీ చదువుకి మాత్రం లేహ్‌కి రావాల్సిందే. కొండ ప్రాంతాలనుంచి కిందకి రావాలంటే కాళ్లే వాళ్లకి వాహనాలు. కిందకు వచ్చి కూరలూ సరుకులూ తీసుకెళుతుంటారు. సువాసన భరితమైన పూలు అక్కడ చాలానే దొరుకుతాయి. వాటితో అగరబత్తీలు తయారుచేస్తుంటారు.

తరవాతి రోజు టిబెట్‌ సరిహద్దులో ఉన్న పాన్‌గాంగ్‌ అనే సరస్సు చూడ్డానికి వెళ్లాం. ఆ సరస్సు 4267 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉంది. లేహ్‌ నుంచి ఐదు గంటలు ప్రయాణం చేసి ఆ సరస్సుకి చేరుకున్నాం. అందులో సగ భాగం భారతదేశంలోనూ మిగిలిన సగం టిబెట్‌ ప్రాంతంలోనూ ఉంది. ఆ సరస్సు అందాన్ని మాటల్లో వర్ణించలేం. అందులోని నీరు సూర్యకాంతిని అనుసరించి రంగులు మారుతుంటుంది. వూదారంగు నుంచి ఆకుపచ్చా, నీలం రంగుల్లోకి మారుతూ సందర్శకుల్ని మరోలోకంలో విహరింపజేస్తుంది. ఆ సరస్సుకి వెళ్లే దారిలోనే చాంగ్లా అనే ప్రాంతం వస్తుంది. అది ప్రపంచంలోనే వాహనాలు వెళ్లే మూడో ఎత్తైన రోడ్డు. చాంగ్లా ప్రాంతంలో ఓ కేఫెటేరియా ఉంది. అక్కడ కాస్సేపు ఆగి టీ తాగాం. అక్కడే తుక్వా అనే ఓ వంటకాన్నీ రుచి చూశాం. మరో రోజు లేహ్‌కి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖర్దుంగ్‌ లా పాస్‌కీ వెళ్ళొచ్చాం. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు.

విద్యార్థులే గైడ్లు!
ఈ యాత్రలో గైడ్లూ కేర్‌టేకరూ మాకు అందించిన సహకారం మర్చిపోలేనిది. మా పర్వతారోహణ విజయవంతంగా ముగించడానికి వాళ్లే కారణం. ఉదయాన్నే వంటచేసి బాక్సుల్లో పెట్టి ఇచ్చేవారు. మేం బయలుదేరే సమయానికి టిఫెన్‌ రెడీ చేసి అందించేవారు. మళ్లీ రాత్రికి మేం చేరబోయే ప్రాంతానికి మాకన్నా ముందే వెళ్లి టెంట్లు వేసి వంటలు చేసి తయారుగా ఉంచేవారు. అక్కడ ఎక్కువగా చదువుకునే విద్యార్థులే గైడ్లుగా పనిచేస్తారు. ట్రెక్కింగ్‌ ఏజెన్సీల ద్వారా ఈ ఏర్పాటు చేసుకుని చదువుకి కావాల్సిన ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. వివిధ ప్రాంతాల యాత్రికులతో కలిసి తిరగడంవల్ల వాళ్లు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్చుకుంటుంటారు. ఆయా వ్యక్తుల ఆచార వ్యవహారాలూ జీవన విధానాలూ అన్నీ తెలుసుకుంటారు. రకరకాల భాషలు నేర్చుకుని ఏ రాష్ట్రం వారితో ఆ భాషలో మాట్లాడుతున్న పిల్లలను చూస్తే ఎంతో ముచ్చటేసింది. అంతేకాదు, మాకు వండిపెట్టే వ్యక్తి పాకశాస్త్ర నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాం. ఉదయాన్నే ఉడికించిన గుడ్లూ అరటిపండ్లూ ఆలూపరాటాలూ అల్పాహారంగా ఇచ్చేవారు. మధ్యాహ్నం భోజనానికి ఉడికిన బంగాళాదుంపలూ శాండ్‌విచ్‌లూ చాక్లెట్లూ ఫ్రూటీలూ బాక్సుల్లో అందించేవారు.

పగలంతా కొండలు ఎక్కీ దిగీ బాగా అలసిపోయి రాత్రికి మజిలీకి చేరుకునేసరికి వేడి వేడి అన్నమూ పప్పూ పన్నీరుతో కూరా పండ్లూ ఇచ్చేవారు. అవన్నీ తృప్తిగా తిని, అప్పటికే పక్కలు వేసి సిద్ధంగా ఉంచిన టెంట్లలో హాయిగా నిద్రపోయేవాళ్లం. ఆ విధంగా వాళ్ల సహకారంతో మా ట్రెక్కింగ్‌ను దిగ్విజయంగా పూర్తిచేసుకోగలిగాం.

Tuesday, 7 June 2016

మంచుపూల వనాల్లో...

కాశ్మీరుకి బయల్దేరే ముందు మేము పడ్డ ఆందోళన ఇంతా అంతా కాదు. 'కాశ్మీరా? ఫరవాలేదా? అక్కడంతా అల్లర్లట కదా, కాల్పులట కదా' అని మా మిత్రులు, సన్నిహితులూ మొదట్లో భయపెట్టారు. తీరా అక్కడికి చేరాక ఆ భయమంతా పటాపంచలైపోయింది. మీడియా కాస్త ఎక్కువ చేస్తోందేమో అనే అనుమానం వచ్చింది.

విశాఖపట్నం నుండి విమానంలో బయలుదేరిన మేము అంటే మా అమ్మా నాన్నా నేనూ ఢిల్లీలో దిగి, అక్కడ ఆ రాత్రి బస చేసి, మరుసటి రోజు మూడు గంటల ప్రాంతంలో కాశ్మీరుకు చేరాం. దారిలో విమానంలోంచి హిమాలయాలను చూడడం గొప్ప అనుభవం. ఆ కొండలన్నీ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కట్టిన తెల్లటి ఇసుక గూళ్లలా కనిపించాయి. పై నుండి భూమిని చూడటమే ఒక వింత అనుభవమయితే అలాంటిది ఏకంగా హిమాలయాలనే చూడటం మహా అద్భుత అనుభవం.

ముందుగానే జమ్ముకాశ్మీర్ పర్యాటక కేంద్రం వారి రూమ్స్‌ను ఇంటర్నెట్‌లో బుక్ చేసుకున్నందువల్ల హోటల్ 'లలారుఖ్' చేరుకుని గదిలో సామన్లు పెట్టి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత శ్రీనగర్‌లోని అందమైన ప్రాంతాలు చూడడానికి బయల్దేరాం.

ఇంకొన్ని కళ్లుంటే...
ఊరు చూపెట్టడానికి ఆటోవాడు ఎంత తీసుకుంటాడని అక్కడివారిని అడిగితే, మమ్మల్ని వారు చాలా విచిత్రంగా చూశారు. ఎందుకలా చూశారో మొదట మాకు అర్థం కాలేదు. పర్యాటకులు చలికి భయపడి ఎక్కువగా ఆటోల్లో తిరగరనీ, సుమోల్లోనే తిరుగుతారనే విషయం తర్వాత తెలిసింది. మేం ఒక సుమో మాట్లాడుకుని పావు గంటలో దాల్ సరస్సు పక్క నుంచి 'మొగల్ నిషాద్' గార్డెన్స్‌కు వెళ్లాం. ఆ గార్డెన్ ముందు వైపు దాల్ సరస్సు వెనుక మంచు కొండలు. మధ్యలో తివాచీ పరిచినట్లు పచ్చదనం. చూడడానికి నాకు ఇంకొన్ని కళ్లుంటే బావుండేదనిపించింది.

కాశ్మీరులో గొప్పవారైనా, పేదవారైనా ఇంటి పై కప్పును రేకులతోనే వేసుకుంటారు. కప్పులన్నీ ఇంగ్లీషు 'ఎ' ఆకారంలో ఉండి కురిసిన మంచు జారిపోవడానికి వీలుగా ఉంటాయి.

తర్వాత రోజు గుల్మార్గ్ వెళ్లాం. ఆ చోటంతా మంచు నిండుగా అందంగా కనిపించింది. ఆ ముందు రోజు వరకూ బాగా వర్షం పడి, దారంతా మంచుతో నిండిపోయి యాత్రికులను ఇబ్బంది పెట్టిందట. కాని మేం వెళ్లిన రోజునుండే వర్షాలు తగ్గి, రోడ్డు మీద పేరుకుపోయిన మంచును ఊడుస్తున్నారు. మన దగ్గర మున్సిపాలిటీ వాళ్లు రోడ్డు మీద చెత్త ఊడ్చినట్టు అక్కడ మంచును ఊడ్చి పారేస్తున్నారు.

స్టెడ్జ్ బళ్లపై తిరిగాం
గుల్మార్గ్ మంచు కొండల్లో ఆడుకోవాలనుకునే వాళ్లు అక్కడే పొడవాటి జర్కిన్లు, బూట్లూ అద్దెకు తీసుకోవచ్చు. మేము 'స్లెడ్జ్' బళ్ల మీద చిన్న చిన్న మంచుకొండలు ఎక్కాము. ఈ బళ్లను మనుషులే తాడుకట్టి లాగుతారు. ఆ మంచుకొండల పై బళ్లతో జారుతూ వెళుతుంటే ఎవ్వరైనా సరే బాల్యంలోకి వెళ్లిపోవలసిందే.

తర్వాత 'హజరత్‌బల్ దర్గా'కి వెళ్లాం. మహ్మద్ ప్రవక్త వెంట్రుక ఉండడం వల్లే అది వారికి ఎంతో పవిత్రం. ఆ దర్గా వెనుక భాగం నుంచి దాల్ సరస్సులో బోట్ షికారు చేశాం. మధ్యలో ఒక చోట చిన్న ద్వీపంలా కనిపించింది. అక్కడ నాలుగు చినార్ చెట్లు ఉన్నాయి. అందుకే ఆ చోటుని 'చార్ చినార్' అంటారు. బోటులో అక్కడిదాకా వెళ్లొచ్చాం.

సింధునదిలో గంతులేశాం
రెండవ రోజు మేము సోన్‌మార్గ్ వెళ్లాం. దారిలో మాకు కొన్ని స్కూళ్లు కనబడ్డాయి. స్కూలు పిల్లలు ఎండలో కూర్చోవడం చూసి పాపమనిపించింది. వారంతా ఎండ కోసం అక్కడ కూర్చున్నారని తెలిశాక నవ్వుకున్నాం. సోన్‌మార్గ్ వెళ్లే దారికి ఇరుపక్కలా ఆవాల పొలాలు ఎక్కువగా కనిపించాయి. ఆ మొక్కలకి పసుపు పచ్చ పూలు ఉంటాయి. దారి పొడుగూతా ఎటు చూసినా పసుపు పచ్చ అందాలే.

సోన్‌మార్గ్ కూడా గుల్మార్గ్ లాగే మంచు కొండలతో నిండి ఉంటుంది. కానీ ఇక్కడ మంచు కరిగి సింధూనదిగా ప్రవహిస్తుంది. పరవళ్లు తొక్కి పారుతున్న నదిని చూస్తే అందమైన లేడి పిల్ల చెంగు చెంగున గంతులేసి పరిగెడుతున్నట్లు ఉంటుంది. నదిలో చెయ్యి పెడితే షాక్ కొట్టేంత చల్లగా ఉన్నాయి. అయినా సరే ముఖం కడుక్కొని, ఆ నీళ్లు తాగి, మా దగ్గరున్న సీసాల్లో నింపుకొని కదల్లేక కదిలాం.

అక్కడ నుంచి ఆసియాలోనే అతి పెద్ద సరస్సయిన వుళ్లారు సరస్సు చూడడానికి వెళ్లాం. సరస్సు చుట్టూ పార్కులాంటిది కట్టారు. మంచు కొండలు, చెట్లు చూస్తున్నప్పుడు కాశ్మీరు వాళ్లు వాళ్ల సినిమాలు తీయడానికి వేరే ఎక్కడికీ వెళ్లనవసరం లేదనిపించింది.

అందాల 'టులిప్' గార్డెన్
అక్కడి నుండి శ్రీనగర్‌లోని ఫేమస్ టులిప్ గార్డెన్‌కి వెళ్లాము. అక్కడ రంగు రంగుల 'టులిప్స్' చూపరులను కట్టిపడేస్తాయి. నలుపు, తెలుపు, గులాబి, కాషాయం, ఎరుపు, పసుపు ఇంకా బోలెడు రంగురంగుల టులిప్స్‌ను చాలా అందమైన ఆకృతుల్లో పెంచారు. ఆ తోటను చూస్తే చిన్నప్పుడు చదివిన జానపద కథల్లో యువరాణుల పూల తోట ఇదేనేమో అనిపించింది.

మూడో రోజు పహల్గాం వెళ్లాం. అక్కడికి వెళ్లే దారిలో లిడ్డర్ వేలీ కనబడుతుంది. లిడ్డర్ వేలీ అంటే అదేదో లోయ కాదు - ఒక నది. ఆ నదిలో ఎవరు గేలం వేసినా తప్పనిసరిగా చేప తగులుతుందని విని ఆశ్చర్యపోయాం. దీన్ని బట్టి ఆ నదిలో ఎన్ని లక్షల చేపలున్నాయో అనిపించింది! ఆ నీళ్లు మానస సరోవరం దగ్గరి మంచు కరిగి ప్రవహిస్తుండడం వల్ల వచ్చినవట. ఎలాగూ మానస సరోవరం వరకూ వెళ్లలేం కదా అని ఆ నీళ్లలో కాసేపు దిగి ఆడుకున్నాం. ఆ నీళ్లు కూడా ఒళ్లు జిల్లుమనేంత చల్లగా ఉన్నాయి. అక్కడి పారే నదులు అంత అందంగా ఎందుకుంటాయా అని ఆలోచిస్తే ... పారే నీటికి ఇరుపక్కలా కొండ రాళ్లు ఉండడం వల్లనేమో అన్పించింది. మన దగ్గర ఇసుక ఉన్నట్టు. నీరు ఆ రాళ్లకు తగుల్తూ, ఆ రాళ్ల సందుల్లోంచి పైకి చిందుతూ తుంపర్లుగా లేస్తూ వెళ్లడం మనోహరంగా కన్పించే దృశ్యం. అదే రోజు శ్రీనగర్‌లో పారి మహల్ కూడా వెళ్లాం. పారి మహల్ నుంచి దాల్ సరస్సు మొత్తం కనిపిస్తుంది.

కాశ్మీరీలు యాత్రికుల్ని గౌరవిస్తారు
శ్రీనగర్‌లో మనుషులు చాలా స్నేహశీలతతో కనిపించారు. యాత్రికులను గౌరవిస్తారు. పర్యాటకుల్ని మోసం చేయరు. ఒకరోజు అక్కడ ఒక ఆటో డ్రైవర్‌ని మమ్మల్ని జీలమ్ నదికి తీసుకెళ్లమని అడిగితే ఇంత దగ్గరగా ఉన్న దానికి ఆటో ఎందుకని చెప్పి దారి చూపించాడే కానీ అటూ ఇటూ తిప్పి డబ్బులు అడగాలనుకోలేదు. అక్కడి మనుషులతో మనం కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు టీ తాగి వెళ్లమనో, భోంచేసి వెళ్లండనో ఎంతో మర్యాదగా వాళ్లింటికి ఆహ్వానిస్తారు. మనుషుల పట్ల వారు చూపించే ప్రేమకు కళ్లు చిప్పిల్లాయి నాకు.

చలిపులికి భయపడిపోయాను
మేం వెళ్లింది ఏప్రిల్ నెలలో. అక్కడ పగటి గరిష్ఠ ఉష్టోగ్రత 25 డిగ్రీల కంటే ఎక్కువ లేదు. అదే చలికాలంలో మైనస్ 20 డిగ్రీలకు పడిపోతుందట. అయితే మన ఉష్ణోగ్రత 45 డిగ్రీల వరకూ ఉంటుందని చెబితే 'అమ్మో ... మేము అక్కడ వస్తే మాడి మసైపోతామేమో' అని నవ్వారు. చలంటే ఎంతో ఇష్టపడే నేను రాత్రుళ్లు 8 రగ్గులు కప్పుకుని పడుకోవాల్సి వచ్చింది. మొదట్లో అరచేతులు కనిపించనంత పొడుగాటి చొక్కాల్లాంటివి చూసి ఆశ్చర్యపోయా. ఒకర్నిద్దర్ని చూసి అవిటి వారేమో అనుకున్నాను. ఎండ వచ్చేకొద్దీ ఒక్కొక్కరూ చేతుల్ని బయటకి తీయడం చూసి 'హమ్మయ్య' అనుకున్నాను. చలికి భయపడి అరచేతుల్ని చొక్కాల్లోపల ఉంచుకున్నారని అర్థమైంది.

మన స్కూళ్లు ఏప్రిల్, మే మాసాల్లో మూసేస్తే అక్కడ చలికి భయపడి నవంబర్, డిసెంబర్లలో మూసేస్తారట. మనవి వేసవికాలం సెలవులైతే వాళ్లవి శీతాకాలం సెలవులన్నమాట. అన్నం పొయ్యి మీద నుంచి దించగానే తినెయ్యాలి అక్కడ. లేదంటే క్షణాల్లో బిరుసెక్కిపోతుంది. 'కీషవ' అనే డ్రై ఫ్రూట్స్‌తో చేసిన లిక్విడ్ స్వీట్‌ని నేను చాలా ఇష్టంగా తాగాను.

మేం సుమోలో వెళ్తున్నప్పుడు ఒక ఉద్యోగిని కలిశాం. మాతో కాసేపు మాట్లాడిన తరువాత 'కాశ్మీరు గురించి, మా వాళ్ల గురించి మీ వాళ్లతో ఏమని చెప్తారు' అని అడిగాడాయన. 'ఇక్కడ ప్రశాంతంగా ఉందని, ఇక్కడి ప్రజలు చాలా మంచివాళ్లని' చెబుతాం అని బదులిస్తే అతను చాలా సంతోషించాడు.

- ఎస్.ఎ. కిరణ్మయి

సాహసికులకు స్వాగతం

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అని అందరికీ తెలిసిన విషయమే... అదొక్కటే కాకుండా భారత్ - నేపాల్ సరిహద్దులన్నీ హిమాలయాల మయమే..! అందువల్ల ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఆశ్చర్యమేముంది..! అలాంటి ప్రఖ్యాత ట్రెక్కింగ్ స్పాట్‌లలో కొన్ని మీకోసం...



ఎవరెస్ట్ ప్రాంతంలో సెలవులు గడపటానికి వెళితే, అక్కడ మంచుతో బాగా కప్పబడిన హిమాలయాల దర్శనం, కొన్ని మంచి షెర్పా పల్లెలను చూస్తూ సాగే అందమైన, స్పూర్తి ప్రదాయకమైన ప్రయాణం, ప్రాచీన బౌద్ధరామాలు వంటి వాటిని చూడగలగడం, ఇంకా చూపు తిప్పుకోనివ్వని శిఖరాలు మీరా, ఐలాండ్, పోకల్డే శిఖరం, ఇంకా మరెన్నో చూడవచ్చు. ప్రపంచ ప్రసిద్దమైన ట్రెక్కింగ్ ప్రదేశం అన్నపూర్ణ ప్రాంతం. ఇక్కడ మూడు ముఖ్యమైన ట్రెక్కింగ్ దారులు ఉన్నాయి. ఇవి ఉత్తరంగా నేపాల్ మధ్యలోకి వచ్చేలా ఉంటాయి. అవి... జామ్సం, అన్నపూర్ణ శాంక్చురీ, అన్నపూర్ణ ప్రాంతమే వలయాల్లా ఉం టుంది. ఇక్కడి విభిన్న సంప్రదాయాలు, ప్రజలు, దీనిని మం చి ట్రెక్కింగ్ ప్రదే శంగా చేశాయి. ఇక్కడ మీరు అద్బుతమైన పర్వతాల అందాలు చూడగలరు. అందులో ధులగిరి, అన్నపూర్ణ, మనస్లు, లమ్జంగ్ హిమాల్ మంచాపుచ్చారే, టుకుచే శిఖరం, టిలిచో శిఖరం, నీలగిరి ముఖ్యమైనవి.

కాళి గండకి:
అన్నపూర్ణ, ధులగిరిల మధ్యగా వెళుతున్న కాళి గండకి ప్రపంచంలోనే లోతై నది. హిందువుల నుండి బౌద్ధుల వరకు, ఆర్యుల నుండి మంగోలుల వరకు, గొప్ప గోర్ఖా సైనికులు, పల్లెలు, లోయలు, బాగా వర్షం పడే ప్రాంతాలు, నేపాల్ లోని వర్షం పడనివ్వని ప్రాంతాలు ఇలా అన్నీ నేర్తిగా విభిన్నంగా ఉండే విషయాలు, మీ నడకను ఒక ప్రత్యేక అనుభవంగా చేస్తాయి. ఈ మధ్య మోడర్న్ మెచ్యూరిటీ (యూయస్ఏ) వారు చేసిన సర్వే ప్రకారం, ఈ ప్రాంతం ప్రపంచం లోనే అత్యద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతంగా గుర్తించబడినది. పోఖరా ది సిటీ అఫ్ లేక్స్ ఈ అన్నపూర్ణ ప్రాంతంలో ట్రెక్కింగ్ మొదలు పెట్టే ప్రాంతం కానీ, లేదా ముగించే ప్రాంతం కానీ అవుతుంది. సహజ సౌందర్యంతో, చిత్రవిచి త్రంగా కనిపించే ఈ పట్టణం 3000 అడుగుల ఎత్తులో, గొప్ప హిమాలయ పర్వతాల ఒడిలో ఉంది. పర్యాటకులకు స్వర్గధామం అయిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

లంగ్ టంగ్:
ఖాట్మండు లోయ నుండి ఇది కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు రోడ్డు మార్గం ద్వారా కానీ లేదా విమానంలో కానీ తేలికగా చేరుకో వచ్చు. లంగ్‌టంగ్ ప్రాంతం ఆశ్చర్యపరిచే ప్రకృతిని తిలకించడానికి సరైన ప్రదేశం! ఇది మరొక అత్యంత ప్రత్యేకమైన ట్రెక్కింగ్ స్థానం. ఇది ఉత్తర ఖాట్మండులో, హిమాలయాల మధ్యలో, టిబెటన్ సరిహద్దుపై, తేలికగా చేరుకునేలా ఉంది. ఈ ప్రదేశం ఎన్నో రకాల మొక్కలకు, హిమాలయాల రెడ్ పాండాతో సహా ఎన్నో రకాల జాతులకు చెందిన జంతు వులకు, ఆలవాలంగా ఉన్నది. పికా, దుప్పి, హిమాలయాల నల్ల ఎలుగుబంటి మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల యాత్రికులకు ఇది ఒక చక్కటి సెలవుల విడిదిగా పేరుగాంచింది. ఉత్తర ఖాట్మండులో ఉన్న హేలంబు, అద్భుతమైన షెర్పా, తమంగ్ పల్లెలతో ట్రెక్కింగ్‌కు చాలా చాలా అనువుగా ఉంటుంది. గోసాయి కుండ అనేది ఒక చక్కటి సరస్సు. ఇది తనతో పాటుగా ఉన్న ఇతర చక్కటి సరస్సులతో సహా పేరు పొందినది.

పర్వతారోహణము:
800 ల కిలోమీటర్ల నేపాల్‌లోని హిమాలయముల పంక్తి మౌంట్ ఎవరెస్ట్‌తో సహా 8,000 మీటర్లకు పైగా ఉన్న ఎనిమిది పర్వత శిఖరములు, ప్రపంచ ములోనే గొప్పవి. 1994లో దేశము ఈ పర్వత శిఖరములు ఎక్కడానికి అనుమతించినప్పటినుంచి, నేపాల్ హిమాలయములు పర్వతారోహణకు ఆల వాలము అయింది మరియు అందులో విజయము, అపజ యము వేలమంది స్త్రీలు, పురుషులకు అక్కడకు చేరడము అనే సవాలులో నెగ్గాలన్న తపనను పెంచింది. ఈ నేపాల్ హిమాలయములు సాధువులు, తత్వవేత్తలు, పరిశోధ కులు లేదా సాహస ములు చేసేవారు వంటి ఎంతో మందికి ఆకర్షణియముగా ఉన్నాయి.

చూపుతిప్పుకోనివ్వని సోయగాలు:
బర్డ్ వాచింగ్ నేపాల్ పక్షి ప్రేమికులకు మొత్తము 646 జాతులతో(దాదాపు ప్రపంచములో 8% శాతము) స్వర్గధామము, మరియు వాటిలో దాదాపు 500ల జాతులు ఒక్క ఖాట్మండు లోయలోనే చూడవచ్చు. జాతీయ అభయా రణ్యములైన ఫుల్ చోకి, గోదావరి, నాగార్జున్, బాగమతి చెరువు, టౌడహాలు పక్షులను చూసే ప్రదేశములలో బాగా పేరు పొందినవి. మీ బైనాక్యులర్స్ కూడా తెచ్చుకుని ఒక అద్భుతమైన, సంతృప్తికరమైన అనుభవము కొరకు ఎదురు చూడండి.

మౌంటైన్ ఫ్లైట్ భూమి పైన ఎత్తౖన పర్వత శిఖరములు చేరడము అనే అనుభవమునకు దగ్గరగా రాగలిగింది కేవలము భయానకమైన నిశ్శబ్దము మాత్రమే. పర్వత శిఖరములు మౌంట్ ఎవరెస్ట్,కాంచెనగంగ మరియు టిబె టన్ ప్లేటుల దగ్గరి విహంగ వీక్షణము ఇస్తాయి. పర్వతశిఖరములు అన్ని రక ముల ప్రయాణికులకు నచ్చుతాయి మరియు నేపాల్ పర్యాటకములో పేరు పొందిన ఆకర్షణ అయ్యాయి. సమయాభావంతో లేదా వేరే ఇతర ఏ కారణ ముల వలన అయినా కానీ ఇలా వెళ్ళలేని వారికి, ఈ శిఖరములు హిమాలయ ములకు నాలుగు దిక్కులా ఉన్న అధ్బుతమైన సౌందర్యమును ఒక్క గంటలోనే చూపిస్తాయి.రాక్ క్లైమ్బింగ్ అక్కడ ఉన్న క్లిఫ్ హంగర్స్ కు, ఖాట్మండ్‌లోని రాళ్ళ గోడల పంక్తి ఒక మంచి జీవిత అనుభవము అవుతుంది. ఆలస్యముగా అయినా, ఖాడ్మండ్‌లో రాక్ క్లైమ్బింగ్‌కు అనువుగా ఉన్న కొన్ని భయంకరమైన ప్రదేశముల వలన ఇది పేరు పొందిన ఆట అయింది. మీరు ఈ ఆట కోసము చూడదగిన ప్రదేశములలో నాగార్జున్, బలాజు, శివ్ పురి మరియు బుధానిల్ కంత వంటివి ముఖ్యమైనవి.

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...