22-01-2018
సరస్వతిమాతకు వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. దేశంలో సరస్వతిమాతకు సంబంధించిన ఆరు పుణ్యక్షేత్రాలు ప్రముఖంగా వెలుగొందుతున్నాయి.
1. జ్ఞాన సరస్వతి ఆలయం(తెలంగాణ): పురాణగాథలను అనుసరించి మహాభారత యుద్ధం తరువాత ఈ ప్రాంతంలో వేదవ్యాసుడు.. సరస్వతిమాత ప్రసన్నం కోసం తపస్సు చేశాడట. దీంతో అమ్మవారు శిశువు రూపంలో దర్శనమిచ్చిందట.
2. కొట్టాయం సరస్వతి ఆలయం(కేరళ): కేరళలోని ఏకైక సరస్వతి ఆలయంగా ఇది పేరొందింది. దీనిని దక్షిణ మూకాంబిక పేరుతో కూడా పిలుస్తారు. కొట్టాయం లో సరస్వతి ఆలయంలో దేవత సరస్వతి దేవి. ఇది కేరళలో మాత్రమే ఉన్న ఆలయం,మరియు దక్షిణ మూకాంబికా అని పిలుస్తారు.ఈ ఆలయం చిన్గావనం సమీపంలో ఉంది. స్థానిక విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయం లోని విగ్రహం ఒక భక్తునిచే కనుగొనబడింది. తూర్పు ముఖంగా సెట్ చేసిన ఈ విగ్రహాన్ని కిజ్హేప్పురం నంబూద్రి ప్రతిష్ట చేసారు. దీనికి పశ్చిమంగా మరో విగ్రహం ఉంటుంది, కానీ విగ్రహం ఏ ఆకారంలోను ఉండదు,కానీ దానిని పూజిస్తారు. ఈ విగ్రహం దగ్గర అన్ని సమయాలలో వెలిగే రాయిదీపం ఉంది. పణతి కుతూ చెడి మొక్కలు తూర్పు ముఖంగా ఉన్న విగ్రహం చుట్టూఉంటాయి. ఎవరూ ఈ మొక్కలు తొలగించడానికి అనుమతి లేదు, మరియు ఈ మొక్కలు ఎప్పుడూ వాడిపోయి ఉంటాయి. ఈ సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. ఆలయం ఉదయం 5.30 నుంచి 11.30 వరకు,మరియు సాయంత్రం 5 గం.నుండి 7,30 గం. వరకు తెరచి ఉంటుంది.
3. పురా తమన్ సరస్వతి ఆలయం(బాలి): ఇది బాలీలోని అబుద్లో ఉంది. ఇది ఇండోనేషియాలోని ప్రధాన హిందూ ఆలయాలలో ఒకటి. ఇక్కడ నిర్మించిన కుండ్ ఈ ఆయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
4. శృంగేరి ఆలయం(కర్నాటక): ఇక్కడ సరస్వతి ఆలయాన్ని 7వ శతాబ్దంలో శంకర భగవత్పాదులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. మొదట్లో ఇక్కడ చందన మూర్తి ఉండేదని, తరువాత స్వర్ణ విగ్రహాన్ని స్థాపించారని చెబుతారు.
5. మైహర్లోని శారదా మందిరం(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్లోని త్రికూట పర్వతంపై దుర్గమ్మవారు శారదాదేవి రూపంలో దర్శనమిస్తుంది.
ప్రాణాలను తీసే గుడి ఇది! రాత్రి అయిందంటే చాలు..
ఎవరైనా దేవాలయాలను ఎందుకు దర్శిస్తారు చెప్పండి? మంచి ఆరోగ్యమైన జీవితం గడపాలని ఇంకా ఇలా ఎన్నో కోరికలతో భక్తిగా గుళ్లకు వెళతారు. అయితే మీరు ఈ దేవాలయం గురించి విన్నారా? ఇక్కడ గడిపితే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయంటారు. చాలా విచిత్రంగా ఉంది కదూ! ఇప్పుడు చెప్పబోయే కథ మైహర దేవి ఆలయం గురించి. ఇక్కడ రాత్రిపూట గడిపితే ఇక ప్రాణాలు వదిలేసుకోవడమే అని నమ్ముతారు. మరి సాహసాలు చేసేవారు ఇలాంటి వాటి గురించి ఆసక్తిగా ఉందా? అయితే పదండి.. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.
దేవాలయం గురించి..
ఇలాంటి కథనానికి ప్రఖ్యాతి గాంచిన ఈ దేవాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలో సాత్నా జిల్లాలో మైహర్ ఉంది. ఈ దేవాలయంలో శారద అమ్మవారు కొలువై ఉన్నారు. మైహర్ అంటే మా కా హార్ అని అర్థం. అంటే దేవత యోక్క హారం అని తెలుగులో అర్థం.
కొండల్లో ఉంది
ఈ గుడి త్రికూట్ అనే కొండల మధ్య ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడి శారద దేవిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తండోపతండాలుగా వస్తుంటారని చెబుతారు. అక్కడ అంత భయంకరమైన చరిత్ర ఉన్నా సరే లెక్కచేయకుండా వీరు అక్కడి వస్తారట.
అసలేం ఉంది అక్కడ..
దేవాలయం గురించి కథలు కథలుగా చెబుతారు. ఈ నమ్మకాలన్నీ నిజమని చాలా మంది నమ్ముతారు కూడా. ఇక రాత్రి పూట అక్కడ ఉండలేమని కూడా అంటారు. అలా ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బతికి బట్టకట్టలేరని కూడా చెబుతారు.
దానికి కారణముంది…
ఈ నమ్మకం వెనక ఒక కథ ఉంది. ఇప్పటికీ శారద మాతకు అతి పెద్ద భక్తులైన ఆలహ, ఉదమ్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు అక్కడ తిరుగుతాయట. ఈ రెండు ఆత్మలు అప్పట్లో పృథ్వీ రాజ్ చౌహాన్తో వీరోచితంగా పోరాడారని చెబుతారు. అది కాకుండా వీళ్లిద్దరు మొదటిసారి మైహర్ దేవి ఆలయాన్ని గుట్టల్లో కనుగొన్నారు అని చెబుతారు.
రాత్రి వేళ్లలో మూసేస్తారు
రాత్రిపూట దేవాలయాన్ని మూసివేస్తారు. అక్కడి వారు నమ్మేదాని ప్రకారం ఈ ఇద్దరు సోదరులు అమ్మవారిని పూజిస్తారట. అదే కారణంగా చెప్పి గుడి లోపలికి రాత్రిపూట ఎవరినీ అనుమతించరు. ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మరునాడు ప్రాణాలతో ఉండరని అంటారు.
6. పుష్కర్లోని సరస్వతి మందిరం (రాజస్థాన్): పుష్కర్లో గల ఈ ఆలయాన్ని ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో సరస్వతి ఆలయం ఉంది.