Friday, 31 August 2018

సలేశ్వర మల్లిఖార్జున స్వామి









సలేశ్వర మల్లిఖార్జున స్వామి



సలేశ్వర మల్లికార్జున స్వామి వారి ఆలయ చరిత్ర:
అక్కడి ప్రతి చెట్టు నిత్యం స్మరిస్తూనే ఉంటుంది. ఎత్తయిన కొండల నుంచి జాలువారే ప్రతి నీటి బొట్టు లింగాన్ని తాకాలని తపిస్తూనే ఉంటుంది. ప్రకృతి ఒడిలో కొలువైనట్లుగా కనిపించే సలేశ్వరుడు యాత్ర నాగర్ కర్నూల్ లోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది.

తెలుగు రాష్ట్రాల అమరనాధ్ యాత్రగా చెప్పుకునే సలేశ్వరం యాత్ర:
ఉగాది వెళ్లిన తొలి పౌర్ణమి సమయంలో కేవలం 5 రోజులు మాత్రమే భక్తులు దర్శించుటకు వీలు కలిగే సలేశ్వర యాత్ర:

శివుడు మల్లిఖార్జున స్వామి రూపంలో కీకారణ్యంలో వేలసంవత్సరాల క్రితం వెలసిన క్షేత్రం సలేశ్వరం.

హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా ,లింగాల మండలం మన్ననూరు, అచ్చంపేట గ్రామాల అటవీ ప్రాంతంలో సలేశ్వర మల్లిఖార్జున స్వామి వెలిసారు. చుట్టూ కొండలు ఉండటం వలన శైలాలు(కొండలు) పేరు మీదుగా మొదట శైలేశ్వరం అని కాలక్రమేణా వాడుక భాషలో ప్రజలు సలేశ్వరంగా ఈ ప్రాంతాన్ని పిలవటం మొదలయింది. సలేశ్వర యాత్ర అతి కఠిన తరమైనది కావున తెలుగు రాష్ట్రాల అమర్ నాధ్ యాత్రగా పేరుపొందింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గ మధ్యలో మన్ననూర్ అటవీ ప్రాంతంలో 150 వ మైలు రాయి వద్ద నుండి అటవీ మార్గం ద్వారా 20 కిలోమీటర్లు వాహనాలు పై ప్రయాణిస్తే సలేశ్వరం కు వెళ్లే మార్గంకు చేరుకుంటాము. ఈ 20 కిలో మీటర్లు కూడా క్లిష్టమైన అటవీ ప్రాంతం,మట్టిరోడ్డు కావటం మరియు సింగిల్ రోడ్డు వల్ల 20 కిలోమీటర్లు చేరుకోవటానికి 4 నుంచి 5గంటల సమయం పడుతుంది,శ్రీశైలం నుండి తిరిగి హైదరాబాదు వెళ్లే మార్గం లో సరిగ్గా 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే మన్ననూరు వస్తుంది.

ఇది దట్టమైన కీకారణ్య ప్రాంతం కావున అటవీ శాఖ అధీనంలో ఉంటుంది.కేవలం చైత్ర శుధ్ధ త్రయోదశి నుండి చైత్ర బహుళ విదియ వరకు మాత్రమే 5 రోజులు స్వామి వారి వార్షిక ఉత్సవాల సమయంలో మాత్రమే భక్తులను ఆలయం వరకు అనుమతిస్తారు.మిగిలిన రోజుల్లో ఈ ఆలయం కు వెళ్లటం అసాధ్యం. ఈ జాతరలో పాల్గొనటానికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జంగమయ్యను అయిన దర్శించుకొని పరవశిస్తారు. అంతేకాదు తరతరాలుగా స్థానిక చెంచులే ఈ జాతరను నిర్వహించడం విశేషం.

అద్బుత మైన ప్రకృతి,ఆకాశం తాకే కొండలు,వాటి కిందనుండి పై వరకు పచ్చని చెట్లు,గుహలు,జలపాతాలు ఈ ప్రాంతం సొంతం,అందుకే 17 వ శతాబ్దం లో అలనాటి నిజాం నవాబ్ అటవీ సంచారానికి వచ్చి ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యానికి ముగ్దుడు అయ్యి ఆ రోజుల్లోనే ఈ ప్రాంతంలో వేసవి విడిది పర్హాబాద్ పేరుతో భవనం నిర్మించుకున్నారు. అనగా అందమైన ప్రదేశం అని అర్థం, అంతకు ముందు దాని పేరు’ పుల్ల చెలమల’. 1973 లో ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పలుల సరక్షణా కేంద్రం.అడవిలో 20 కిలోమీటర్లు వాహనాలపై ప్రయాణించాక వాహనాలు అక్కడ నిలిపి తమకు అవసరమైన దుస్తులు, ఆహార పదార్దాల వంటివి మాత్రమే తీసుకుని కాలి నడకన 5 కిలోమీటర్లు నడవాలి.

ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది కనుక కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. ఈ మార్గం కొండలు, ఇరుకైన ప్రాంతాలు, అతి క్లిష్టమైన సన్నని రోడ్లు కలిగి ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక రెండు కొండల మధ్య ఒక వాగు ప్రవాహం కలిగి ఉంటుంది. ఆ కొండలను పట్టుకుని అతి జాగ్రత్తగా అడుగులో అడుగు వేస్తూ ఆ వాగు దాటాలి. ఏ మాత్రం కాలు జారినా వాగు ప్రవాహంలో పడిపోతారు.

ఈ ఆలయంలో చైత్ర శుద్ధ పౌర్ణమి  రోజున చంద్రకిరణాలు నేరుగా స్వామి వారి పై ప్రసరించి తేజోమూర్తి అయిన లింగమూర్తిగా స్వామి దర్శనమిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజున మాత్రమే ఇలా జరుగుతుంది.  కనుకనే ఈ రోజున లక్షలాది భక్తులు స్వామి వారిని దర్శించి కృపపొందుతారు. ఈ ఆలయానికి దగ్గరలో దాదాపు 1000 అడుగుల పై నుండి జాలు వారే తెల్లని స్వచ్చమైన పాలధార లాంటి జలపాతం పడుతుంది. ఈ జలపాతం క్రింద స్నానమాచరించి స్వామిని దర్శిస్తారు. ఈ జలపాతం కింద స్నానమాచరిస్తే దీర్ఘకాలిక రోగాలు మాయం అవుతాయని భక్తుల నమ్మకం.

దట్టమైన అరణ్యం లో ఎన్నో ఔషధ మొక్కలు, ఆకులును తాకుతూ పై నుండి జాలు వారే జలం లో అనేక గుణాలు ఉండి రోగాలు నయం చేస్తాయని చెపుతారు. ఈ ప్రవాహం భక్తులు కొద్ది సంఖ్యలో వెళ్తే తక్కువ ధారతో ఎక్కువ సంఖ్యలో వెళ్తే పెద్ద ధారతో పై నుండి పడడం స్వామి లీల అని చెపుతారు. పుట్టకు దారాలు కట్టి పూజ చేస్తే సంతానం లేని వారికి సంతాన ఫలం,తిరుగు ప్రయాణంలో కోరిన కోర్కెలు త్వరగా నెరవేరాలని వివాహం కాని వాళ్లు చలువపందిళ్లు వేస్తారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లు రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చి మరోసారి ఆ లింగమయ్యకు మొక్కుకుంటారు. ఈ క్షేత్రానికి వచ్చి శివయ్యను దర్శించుకుంటే ఏడాదంతా పంటలు బాగా పండుతాయన్నది రైతుల విశ్వాసం. కష్టమైనా ఈ నడక ప్రయాణాన్ని సాగిస్తున్న భక్తులు “వస్తున్నాo  వస్తున్నా లింగమయ్య” అంటూ దర్శనానంతరం తిరిగి వెళ్తూ “వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం లింగమయ్య” అంటూ చేసే పనుల వల్ల ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది.

చారిత్రక ఆధారాలు:
నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలో చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరిపై అనాడు శ్రీలంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులు కొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరినే ఈ సలేశ్వరమేనని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు ఉన్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16″/10″/3″ గా ఉన్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . “సుళ” తెలుగులో “సుల” అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరంగా చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల క్రీ.శ.. 360-370 కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10"/10″/3″. దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం ఉంది.

స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్ది అనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బి.ఎన్ శాస్త్రి నిరూపించారు.

13వ శతాబ్దంలో పండితారాధ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రం రాసిన ప్రముఖ శివ భక్త పండితుడు పాల్కురి సోమనాధుడు తన గ్రంధాలలో సలేశ్వర ఆలయ విశేషాలు తెలిపారు,దీనిని బట్టి ఎంత ప్రాసస్త్యం ఉన్న ఆలయమో మనం గ్రహించవచ్చు. 17వ శతాబ్దంలో శ్రీశైలం దర్శించిన చత్రపతి శివాజీ అడవుల గుండా ప్రయాణించి సలేశ్వరం చేరుకుని స్వామి వారికి ఆరాధించినట్లు చారిత్రక కధనాలు ఉన్నాయి.   సలేశ్వర ఆలయానికి దగ్గరలో అటవీ ప్రాంతంలో అధ్బుతమైన మల్లెల తీర్దం అనే చారిత్రక జలపాతం ఉంటుంది.

భక్తుల సౌకార్యార్థం కోసం కొందరు స్వచ్ఛంద సంస్థల వారు ఉచితంగా భోజనం, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతారని వారికి ఐటీడీఏ, అటవీశాఖ, ఇతర శాఖల అధికారుల సహకారం అందిస్తారు. జాతరకు వచ్చే భక్తులు విలువైన ఆభరణాలు ధరించరాదని సూచించారు. ఆర్టీసీ బస్సులు కూడా రాంపూర్‌పెంట వరకే వెళ్తాయని అక్కడ నుంచి 2KM ఆటొ ప్రయాణం తరువాత కాలినడుకన భక్తులు సలేశ్వరం చేరుకోవాలి. లింగమయ్యను దర్శించుకోవడానికి, వాహనాలను లోపలికి అనుమతి కోసం వసూలు చేసే టోల్‌గేట్ ద్వారా వచ్చె డబ్బులను సలేశ్వరం చుట్టున్న 12 పెంటల అభివృద్ధికి ఖర్చు చేస్తారు.

నల్లమల అడవిలో మొత్తం పంచ లింగాలున్నాయి అంటారు:
శ్రీశైల మల్లికార్జునస్వామి (జ్యోతిర్లింగం), సలేశ్వరం లింగమయ్యస్వామి, లొద్దిమల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలిసినవి. తెలియని ఐదో లింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ ఐదో లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే!

లింగాలలో జరిగే కోదండరాముడి బ్రహ్మోత్సవాల సమయంలోనే ఈ క్షేత్రాన్ని భక్తుల దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రత్యేక బస్సులు భక్తుల సౌకర్యార్థం నాగర్ కర్నూల్, అచ్చంపేట నుండి RTC బస్సులు నడుపుతున్నారు. లింగాల మండలం అప్పాయిపల్లిలో RTC క్యాంపులు ఏర్పాటు, లింగాల నుండి కాలినడకన సలేశ్వరం వెళ్ళే భక్తులకు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ నుండి లింగాల, అప్పాయిపల్లి వరకూ ప్రతి 20 నిమిషాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.

సలేశ్వరం చేరుకోవడానికి మార్గాలు:
1. హైదరాబాద్ వైపు నుండి సలేశ్వరం వచ్చే భక్తులు నేరుగా శ్రీశైలం బస్సు ఎక్కి ఫర్హాబాద్ చౌరస్తా దగ్గర దిగితే సరిపోతుంది. అక్కడ నుండి బస్సులు. ఆటోల రాంపూర్ చెంచు పెంట వరకు ప్రయాణించవచ్చు. తెలంగాణ వైపు నుండి వచ్చే భక్తులకు అచ్చంపేట ,నాగర్ కర్నూలు బస్ డిపోల నుండి సలేశ్వరం కు నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

2. శ్రీశైలం వైపు నుంచి వచ్చే భక్తులు హైదరాబాద్ బస్సు ఎక్కి ఫర్హాబాద్ చౌరస్తా దగ్గర దిగి సలేశ్వరం చేరుకోవచ్చు.

3. మరో మార్గం లింగాల మండలం అప్పాయిపల్లి మీద గా ఉంది. ట్రాక్టర్ల ద్వారా గిరిజ గుండాల వరకు అతి కష్టంమీద చేరుకొని అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తే సలేశ్వరం చేరుకోవచ్చు.








సలేశ్వరం



సలేశ్వరం గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులు కోవాల్సిందే..!!

గుడి అంటే రోజూ పూజలు, నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే! కానీ ఓ దేవాలయం కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది. ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు. మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే. ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే. అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు. గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి. ఇంతకీ ఆ గుడి ఎక్కడ వుంది? అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని వుంది కదూ!

సలేశ్వరం.
శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది. శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.

  1. ఆలవాలం.
    అదో దట్టమైన కీకారణ్యం. ఎత్తైన కొండలు, పాలనురుగులా జాలువారే జలపాతాలు, ప్రకృతి రమణీయదృశ్యాలు, అక్కడి ప్రతి అణువూ నిండి వుంటుంది. దీనితో పాటు కారడివి ఆధ్యాత్మికతకు కూడా ఆలవాలంగా వుంటుంది.

  2. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం.
    తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవున్న సలేశ్వర క్షేత్రం వెళ్ళాలంటే ఎవరికైనా ఒణుకు పుట్టాల్సిందే. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ రాయి దగ్గర పరహాబాద్ గేటు వుంటుంది. అక్కడి నుంచి 32కిమీల దూరం దట్టమైన అడవిలో వెళ్ళాలంటే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి తీసుకోవాల్సిందే.

  3. జాగ్రత్త.
    గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నెనో గుహలు సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం.

  4. లోయలో జాగ్రత్తగా నడవాలి.
    గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే.

  5. నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా.
    గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది.

  6. లింగమయ్య స్వామి లింగం.
    గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.

  7. సలేశ్వరం జాతర సంవత్సరాని కొకసారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు 'వత్తన్నం వత్తన్నం లింగమయ్యో' అంటూ వస్తారు. వెళ్లేటప్పుడు 'పోతున్నం పోతున్నం లింగమయ్యొ' అని అరుస్తూ నడుస్తుంటారు.

  8. శిధిలావస్థ.
    10కి.మీలు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిధిలావస్థలో వున్న భవనాలు కనిపిస్తాయి. నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై వందేళ్ళకు పూర్వమే అక్కడ వేసవి విడిది నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశాన్ని పరహాబాద్ అంటారు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం.

  9. నడకదారులు.
    ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973 లో కేంద్రప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది. అక్కడ నుంచి సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. దట్టమైన అడవిలో వున్న సలేశ్వర ఆలయంలో చెంచులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తూవుంటారు.

  10. చైత్రపౌర్ణమి.
    సలేశ్వరంలో సంవత్సరానికి ఒక్క సారి జాతర జరుగుతుంది. చైత్రపౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజుల తరువాత అంటే మొత్తం 5 రోజులపాటు జాతర జరిగే సమయంలోనే ఆ గుడిని తెరచివుంచుతారు. ఈ 5రోజులలో దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు సాహసయాత్ర చేయాల్సి వుంటుంది.

  11. జలపాతాలు.
    ఇరుకైన లోయల్లో కేవలం కాలు మాత్రమే పట్టే దారి మాత్రమే వుంటుంది. పొరపాటున అక్కడ కాలు జారితే అంతే సంగతులు. కనీసం శవం కూడా దొరికే పరిస్థితి వుండదు. అక్కడికి వెళ్ళే దారిలో వుండే జలపాతాలు మండు వేసవిలో ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

  12. భక్తులతో కిటకిటలాడుతూ.
    నీటి గుండాలు చూపులు తిప్పుకోనివ్వవు. గుడి తెరచి వుండే 5రోజులు భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగామయ స్వామి, లుగ్దీ మల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలుసు. ఐదో లింగం నల్లమల అడవులలో ఎక్కడ వుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.

  13. చరిత్రకారులు.
    సలేశ్వర ఆలయాన్ని 6వశతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దంలోని మల్లికార్జునపండితారాజ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలను పాల్పురి సోమనాధుడు వర్ణించాడు. ఆలయం నిర్మించిన నాటి నుంచి ఏడాదిలో 5 రోజులు మాత్రమే తెరచివుంచటం ఆనవాయితీగా వస్తోంది. 17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర చెబుతుంది.

  14. ఎలా చేరుకోవాలి..
    • హైదరాబాద్ - శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూర్ అనే ఊరు వస్తుంది. అక్కడి నుండి 10 -12 KM దూరం శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెళ్తే సలేశ్వరం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు చూపించే గుర్తు వైపు 10 కిలోమీటర్లు వెళ్తే సలేశ్వరం లోయ కనిపిస్తుంది. అక్కడే వాహనాలు, బస్సులు ఆపాలి. లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి. అదే సలేశ్వర క్షేత్రం.
    • నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి.
ఓం నమః శివాయ..స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!



‘కంచి’ - బంగారు బల్లి








‘కంచి’
బంగారు బల్లి


ఏ కథైనా సరే కంచికి వెళ్లాల్సిందే అంటారు. మరి, కాంచీపురంగా పేరొందిన ఆ ‘కంచి’ కథ ఏమిటో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. కాచీపురం అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది.. కంచి పట్టు చీరలు, బంగారు బల్లి మాత్రమే కాదు. దాదాపు వెయ్యికి పైగా ఆలయాలు కలిగిన ఈ ప్రాచీన నగరంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

తమిళనాడులోని కాంచీపురంలో అడుగుపెట్టగానే.. మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోతాం. చెన్నైకి 72 కిమీలో మీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి ‘కంజీవరం’ అనే పేరు కూడా ఉంది.

ప్రతి హిందువు తమ జీవిత కాలంలో ‘కంచి’కి రావల్సిందేనని మన పూర్వికులు చెబుతుండేవారు. అందుకే కాబోలు కథలను ముగించేప్పుడు.. కథ ‘కంచి’కి అనేవారు.

హిందూ మత పురాణాల ప్రకారం.. ఏడు పవిత్ర ప్రదేశాలలో ఒకటిగా పేరొందిన కంచిలో ఉన్న ముఖ్య ఆలయాలను ‘పంచ భూత స్థలాలు’ అని అంటారు. ఈ నగరంలో ఎక్కడ చూసినా శివుడు, విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవీ ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉంది. ఇక్కడి ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం, కైలసనతార్ ఆలయాలు కూడా సందర్శించతగినవి.

‘క’ అంటే సరస్వతి రూపం.. ‘మా’ అంటే లక్ష్మీదేవి రూపం.. ‘అక్షి’ అంటే కన్ను అని అర్థం. అంటే, సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుందని అర్థం. అలాగే, కంచికి ఆ పేరు రావడం వెనుక మరో అర్థం కూడా ప్రాచుర్యంలో ఉంది. ‘క’ అంటే బ్రహ్ అని, ‘అంచి’ అంటే విష్ణువని చెబుతారు. అందుకే, ఆ ప్రాంతానికి కంచి అనే పేరు వచ్చిందంటారు.

ఏకాంబరేశ్వర, కైలాశనాథ్ ఆలయాల శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయంలో శివుడిని పంచభూతాల్లో ఒక్కటైన భూమిగా పూజిస్తారు. 20 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలోని దక్షిణ గోపురం ఎత్తు 58.5 మీటర్లు. ఈ ఆలయానికి మొత్తం 11 అంతస్థుల ఎత్తైన గోపురాలు ఔరా అనిపిస్తాయి. వైకుంఠ పెరుమల్ ఆలయం, వరద రాజ ఆలయాలు సైతం యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

కంచి వెళ్లినప్పుడు మీరు తప్పకుండా పై ఆలయాలనే కాదు, కంచి వస్త్రాలను కూడా షాపింగ్ చేయండి. వేదంతంగల్ పక్షుల అభయారణ్యం, ఎలగిరి హిల్స్, శ్రీపెరుంబదర్, కంచి పీఠం తదితర ప్రాంతాలను తప్పకుండా సందర్శించండి.

‘బంగారు బల్లి’.. కథ!
కంచి కథ ముగించేప్పుడు.. ‘బంగారు బల్లి’ గురించి తెలుసుకోకపోతే కథ కంచికి వెళ్లదు. శరీరం మీద బల్లి పడగానే.. కంచి నుంచి వచ్చినవారిని తాకితే దోషం పోతుందని అంటారు. లేదా కంచి క్షేత్రానికి వెళ్లి వరదరాజ పెరుమళ్ ఆలయంలోని బంగారు, వెండి బల్లిని తాకాలని అంటారు. దీనికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. గౌతమ అనే మహర్షికి ఇద్దరు శిష్యుటు ఉండేవారు. ఒక రోజు వారిద్దరు నది నుంచి కుండతో నీరు తీసుకొస్తారు. అయితే, ఆ నీటిలో బల్లి పడిన విషయాన్ని గుర్తించారు. మహర్షి ఆ బల్లిని చూసి.. ఇద్దరిని బల్లులుగా మారిపోవాలని శపిస్తాడు. శపవిముక్తి కోసం ప్రార్థించగా.. కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయంలో ఉపశమనం లభిస్తుందని చెబుతాడు. దీంతో పెరుమాళ్ ఆలయంలో స్వామిని ప్రార్థించిన కొన్నాళ్లకు వారికి మోక్షం లభిస్తుంది. ఆ సమయంలో వారిద్దరూ సూర్య, చంద్రుల ప్రతిరూపాలుగా బంగారు, వెండి బల్లుల బొమ్మలుగా భక్తులకు దోషనివారణ చేయాలని ఆదేశిస్తాడు. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించారనే కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది.



Sunday, 5 August 2018

గండికోట








గండికోట రహస్యమిదే!


పెన్నానది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది. చిత్రావతి చిన్నగా ఉరకలేస్తుంటుంది. ఎప్పుడో గాని ఈ నదులు ఉధృతంగా ప్రవహించవు. అందుకే కాబోలు శతాబ్దాలు గడుస్తున్నా గండికోట చెక్కుచెదరక నిల్చుంది. కోటలోని రహస్యాలు పదిలంగా ఉన్నాయి. రెండో హంపీగా పేరున్న గండికోటలో పాగా వేసేందుకు ఎందరో రాజులు ఎన్నెన్నో యుద్ధాలు చేశారు. పెన్నాలో నెత్తురు పారించారు. ఇప్పుడదే కోటకు కులాసాగా చేరిపోవచ్చు. దిలాసాగా విహరించవచ్చు. పెన్నా లోయ సోయగాలు మనసారా ఆస్వాదించవచ్చు.

అందమైన లోయలు, శత్రుదుర్భేద్యమైన కోట, ప్రాచీన కట్టడాలు, ఎటు చూసినా అబ్బురపరిచే దృశ్యాలు.. గండికోట రహస్యమిదే! కడప జిల్లా జమ్మలమడుగు నుంచి 11 కిలోమీటర్ల దూరంలో పెన్నానది ఒడ్డున ఉంటుందీ కోట. పూర్వం ఈ ప్రాంతాన్ని గిరిదుర్గం అనేవారు. పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట కొండల మధ్య భారీ గండి ఏర్పడింది. ఆ సమీపంలో కోటను నిర్మించడంతో దీనికి గండికోట అని పేరొచ్చింది. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవున్న లోయ గుండా పెన్నా నది వయ్యారాలు ఒలకబోస్తూ ప్రవహిస్తుంటుంది.



ఎందరో రాజులు..

11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్య రాజు త్రైలోక్యమల్లకు సామంతుడుగా ఉన్న కాకరాజు ఈ కోటను నిర్మించారు. విజయనగర రాజుల ఏలుబడి తర్వాత గండికోటపై పెమ్మసాని పాలకుల ఆధిపత్యం కొనసాగింది. పదహారో శతాబ్దంలో గోల్కొండ నవాబు అబ్దుల్‌ కులీకుతుబ్‌ షా ప్రధాని, సైన్యాధికారి మీర్‌జుమ్లా గండికోటను ముట్టడించాడు. తర్వాత హైదర్‌ అలీ, టిప్పుసూల్తాన్‌ స్వాధీనపరుచుకున్నారు. టిప్పు సుల్తాన్‌ మరణం తర్వాత స్వాతంత్య్రం వచ్చే వరకు ఇక్కడ ఆంగ్లేయుల పెత్తనం కొనసాగింది. 1980లో కేంద్ర పురాతత్వ శాఖ గండికోటను తమ అధీనంలోకి తీసుకుంది.

పునాదుల్లేని కోట..

గండికోట చుట్టూ మూడు రాతి ప్రాకారాలు ఉన్నాయి. పునాదులు లేకుండానే కొండలపై కోట గోడలను నిర్మించడం విశేషం.  నిర్మాణంలో ఎర్రటి నున్నటి రాళ్లను వినియోగించారు. 1,200 మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పు ఉన్న కోట చుట్టూ 101 బురుజులు ఉన్నాయి. కోటలో 21 దేవాలయాలు ఉన్నాయి. 55 స్తంభాలతో, అరుదైన శిల్పకళతో మాధవరాయస్వామి ఆలయం అత్యద్భుతంగా ఉంటుంది. ఇక్కడి రంగనాయక ఆలయ స్తంభాలపై రామాయణ, భాగవత గాథలు దర్శనమిస్తాయి. ఆలయ మూలవిరాట్టు రంగనాయకస్వామి విగ్రహం ప్రస్తుతం మైలవరం పురావస్తు మ్యూజియంలో ఉంది. కోటలో జుమ్మా మసీదు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఇవేగాక కారాగారం, ఎర్రకోనేరు, ధాన్యాగారం, రామబాణపు బురుజు, రాయలచెరువు, రంగమహల్‌, ఆయుధ కర్మాగారం, వ్యాయామశాల ఇలా సందర్శనీయ స్థలాలెన్నో ఉన్నాయి.
ఇలా వెళ్లొచ్చు..

* కడప నుంచి గండికోట 86 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం ఇతర ప్రధాన నగరాల నుంచి కడపకు బస్సులు, రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

* గండికోటకు సమీపంలో (32 కి.మీ) ఉన్న రైల్వేస్టేషన్‌ ముద్దనూరు. హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వెంకటాద్రి, రాయలసీమ, తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లు ముద్దనూరు మీదుగా వెళ్తాయి. ఇక్కడి నుంచి గండికోటకు బస్సులు, ట్యాక్సీల్లో వెళ్లొచ్చు. విజయవాడ నుంచి నేరుగా జమ్మలమడుగు వెళ్లే రైలు ఉంది. అక్కడి నుంచి సులభంగా గండికోటకు చేరుకోవచ్చు.


యస్‌. మహమ్మద్‌ ఆరీఫ్‌

మహాబలేశ్వర్‌









కృష్ణమ్మ పుట్టిల్లు
మహాబలేశ్వర్‌



‘‘ఏదైనా పుణ్యక్షేత్రానికైతే వస్తా!!’’ ఇది ఇంట్లో పెద్దవారి మాట.
జలపాతాలు, సరస్సులు చూపిస్తానంటేనే వస్తామంటారు పిల్లలు.
ట్రెక్కింగులు, కయాకింగులు ఉంటేనే ఓటేస్తారు యువకులు.
పచ్చదనం, చల్లదనం అందరూ కోరుకుంటారు.
ఇవన్నీ ఒకేచోట ఉన్నాయంటే భలే భలే అనాల్సిందే! అవన్నీ ఆస్వాదించాలంటే కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్‌ వెళ్లాల్సిందే!


కృష్ణమ్మ.


ఆ తల్లి అడుగుపెట్టిన చోటల్లా పచ్చదనమే. తెలుగింట ధాన్యరాశులు కురిపించిన కృష్ణమ్మ ఒడ్డున పుణ్యక్షేత్రాలెన్నో! పర్యాటక విశేషాలెన్నెన్నో!! ఆ నది జన్మించిన మహాబలేశ్వర్‌ యాత్రాస్థలిగా, వినోద కేంద్రంగా పర్యాటకులను అలరిస్తోంది. ఆరు రుతువుల్లోనూ ఇక్కడ ఆమని తిష్టవేస్తుంది. వేసవిలో చల్లదనాన్ని, శీతాకాలంలో ఆహ్లాదాన్ని అందించే మహాబలేశ్వర్‌ వానాకాలంలో పచ్చదనంతో పలకరిస్తుంది. కొండల అంచులను ఒరుసుకుంటూ కదలిపోతున్న మేఘమాలికలు.. పరవశంతో ప్రణయగీతాన్ని ఆలపించేలా చేస్తాయి. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న పర్వత ప్రాంతం మహాబలేశ్వర్‌. ఈ సుందర ప్రదేశం సముద్ర మట్టానికి 4,718 అడుగుల ఎత్తులో ఉంటుంది. సహ్యాద్రి పర్వత సానువుల్లో నెలకొని ఉన్న ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది.
కొండపై కోట
శతాబ్దాలకు పూర్వం సింగన్‌ అనే రాజు ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడి మహాబలేశ్వరుడి దేవాలయం కూడా ఆయన హయాంలోనే నిర్మించారు. 17వ శతాబ్దంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహాబలేశ్వర్‌ను కైవసం చేసుకున్నాడు.1656లో ప్రతాప్‌గఢ్‌ కోటను కట్టించాడు. ఇది మహాబలేశ్వర్‌కు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొండపై కోటలో భవానీదేవి, మహాదేవ ఆలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కోటలోకి అనుమతిస్తారు.
చూడచక్కని వ్యూపాయింట్లు
హిల్‌స్టేషన్‌గా పేరున్న మహాబలేశ్వర్‌లో దాదాపు 30 వ్యూపాయింట్లు ఉన్నాయి. విల్సన్‌ పాయింట్‌ అత్యంత ఎత్తయిన ప్రదేశం. ఆ తర్వాతి స్థానం కొన్నాట్‌ శిఖరానిది. ఆర్ధర్స్‌ సీట్‌ పాయింట్‌, హెల్సెన్‌ పాయింట్‌ ఇలా రకరకాల వ్యూ పాయింట్ల నుంచి మహాబలేశ్వర్‌ సౌందర్యాన్ని 360 డిగ్రీల కోణంలో ఆస్వాదించొచ్చు. ఏనుగు తల ఆకారంలోని పర్వతాన్ని ఎలిఫెంట్‌ హెడ్‌ పాయింట్‌గా పిలుచుకుంటారు. ఈ వ్యూపాయింట్‌ నుంచి చుట్టుపక్కల ప్రాంతాలు చూడొచ్చు. సూర్యాస్తమయం సమయానికి పర్యాటకులు ఎక్కువగా ఇక్కడికి చేరుకుంటారు. ముంబయి పాయింట్‌ నుంచి కూడా మలి సంధ్య మనోహరంగా కనిపిస్తుంది. సాహసయాత్రికుల కోసం పలు వ్యూపాయింట్ల దగ్గర ట్రెక్కింగ్‌ అందుబాటులో ఉంది. స్థానికంగా ఉన్న అడ్వెంచర్‌ క్లబ్‌లు ట్రెక్కింగ్‌, ర్యాపెలింగ్‌ క్రీడలు నిర్వహిస్తుంటాయి.

జలపాతాల సోయగాలు


ఐదునదుల పుట్టినిల్లు మహాబలేశ్వర్‌ పరిసరాల్లో అద్బుతమైన మూడు జలపాతాలున్నాయి. 600 అడుగుల ఎత్తు నుంచి దుమికే లింగమల జలపాతం ప్రధానమైనది. మహాబలేశ్వర్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ధోబీ జలపాతం ఉంటుంది. దీనిని చూసేందుకు యాత్రికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చైనామన్స్‌ జలపాత సోయగాలు చూపరులను కట్టిపడేస్తాయి. 18వ శతాబ్దంలో బ్రిటిష్‌ వాళ్లు.. చైనా, మలేసియాకు చెందిన ఖైదీలను ఇక్కడ బందీలుగా ఉంచేవారట. వారు స్ట్రాబెర్రీ తోటలను సాగు చేసేవారు. నేటికీ ఇక్కడ స్ట్రాబెర్రీ తోటలు ఉండటం విశేషం. ఇక వెన్నా సరస్సులో బోటింగ్‌ ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ కయాకింగ్‌ పోటీలు జరుగుతుంటాయి.
ఆధ్యాత్మిక సౌరభాలు

మహాబలేశ్వర్‌లో పరమశివుడు స్వయంభువుగా వెలిశాడని స్థలపురాణం. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన రుద్రాక్ష ఆకారంలో ఇక్కడ లింగం దర్శనమిస్తుంది. ఆలయంలో స్వామివారి కోసం పడక కూడా ఉంటుంది. ప్రతిరోజూ రాత్రి పరమేశ్వరుడు దీనిపై శయనిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకు తగ్గట్టుగానే ఆలయం మూసివేసే సమయంలో ఏమాత్రం నలగకుండా ఉండే పక్క.. తెల్లారేసరికి చెదిరి కనిపించడం విశేషం. మహాబలేశ్వరుడి ఆలయ సమీపంలో కృష్ణానది జన్మస్థానంలో కృష్ణాబాయి ఆలయం ఉంటుంది.

త్రిమూర్తులే నదులుగా



సాక్ష్యాత్తు విష్ణుమూర్తే ఇక్కడ కృష్ణానదిగా ఉద్భవించాడని అంటారు. దీనికి సంబంధించి పౌరాణిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం మహావిష్ణువు సూచన మేరకు పరమశివుడి పర్యవేక్షణలో బ్రహ్మదేవుడు ఒక యజ్ఞాన్ని నిర్వహించాలనుకున్నాడట. యజ్ఞ సమయానికి సరస్వతీదేవి రాకపోవడంతో మరో స్త్రీమూర్తితో క్రతువు నిర్వహణకు పూనుకున్నాడట బ్రహ్మ. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సరస్వతి తన స్థానంలో మరో మహిళ ఉండటాన్ని చూసింది. ఆగ్రహంతో త్రిమూర్తులను నదులుగా మారిపొమ్మని శపించిందట. అప్పుడు విష్ణుమూర్తి కృష్ణానదిగా, రుద్రుడు వెన్నా నదిగా, బ్రహ్మ కొయినా నదిగా మారారని కథ. ఈ మూడు నదులతో పాటు సావిత్రి, గాయత్రి నదులు కూడా ఇదే ప్రాంతంలో జన్మించాయి. ఐదు నదులు సంగమించే ప్రదేశం.. పంచగంగ. ఇక్కడ మహాదేవుడి ఆలయం ఉంది.
ఎలా వెళ్లాలంటే?

* పుణె నుంచి మహాబలేశ్వర్‌ 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి పుణెకు విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ నుంచి రైళ్లు ఉన్నాయి. పుణె నుంచి బస్సులు, ట్యాక్సీల్లో మహాబలేశ్వర్‌ చేరుకోవచ్చు.
* సొంత వాహనంలో వెళ్తే.. హైదరాబాద్‌ నుంచి మహాబలేశ్వర్‌ సుమారు 590 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జహీరాబాద్‌, హుమ్నాబాద్‌, సోలాపూర్‌, పండరీపూర్‌, ఫల్టణ్‌ మీదుగా మహాబలేశ్వర్‌ చేరుకోవచ్చు. పండరీపూర్‌ నుంచి పుణె మీదుగా కూడా వెళ్లొచ్చు.



ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు అష్టాదశ శక్తిపీఠాలు

State Name12 Jyotirlingas18 Shakti Peethas
1.Maharastra - మహారాష్ట్ర్ర 1) Grishneshwar -Near Aurangabad-గ్రిష్ణేశ్వర్
2) Triambak- Near Nashik- త్రయంబక్
3) Bhimashankar -భీమశంకర్ Near Pune
1) Ekaveerika/Renukadevi -Mahur ఏకరవీరికా దేవి,మహూర్
2) Mahalaskhmi - Kolhapur మహాలక్ష్మీ, కొల్హాపూర్
2.Gujarath గుజ‌రాత్ 4)Somnath-సోమనాధ్
5) Nageshwar -నాగేశ్వర్ Near Dwaraka
3.Madya Pradesh మధ్యప్రదేశ్ 6) Mahakaleshwar- Ujjain మహాకాశేశ్వర్, ఉజ్జయిని
7) Omkareshwar ఓంకారేశ్వర్
3)Ujjain – ఉజ్జయిని


4.Jammu & Kashmir జమ్ము,కాశ్మీర్ 4) Vishnodevi-వైష్ణోదేవి Jammu-Katra
5.Himachal Pradesh హిమాచల్ ప్రధేశ్ 5) Jwalamukhi - జ్వాలాముఖి – Kangra
6.Uttarakhand ఉత్తరాఖండ్ 8) Kedharnath కేధార్ నాధ్ (Temple Closing Times up to Ukimat)
7.Uttara Pradesh ఉత్తరప్రధేశ్ 9) Vishwanath Temple -Kasi/Varanasi విశ్వనాధ ఆలయం,కాశి 6)Madhaveshwari-Allahabad మాధవేశ్వరి, అలహాబాదు
 7) Vishalakshi- Kasi/Varanasi విశాలక్ష్మీ, కాశి
8.Bihar బిహార్ 8) Sarwa Mangala Devi-Gaya సర్వమంగళదేవి,గయ
9.Jharkhand జార్కండ్ 10) Baidyanath, Deogarh బైధ్యనాధ్, థియోగర్
10.West Bengal వెస్ట్ బెంగాల్ 9)Srinkala-Pandua (Present Minar) శ్రుంకళ- పాండువ
10) Kalika Mandhir, Kalighat, Kolkata కాళికమందిర్,కలకత్తా (Adi Shakti Peetha)
11.Assam అస్సాం 11) Kamarupadevi, కామరూపదేవి,గౌహతి Kamakhya – Guwahati
12.Orissa ఒరిస్సా 12) Girijadevi-Jaipur గిరిజాదేవి, జైపూర్ 
13) Bhimaladevi-Puri భీమల(Adi Shakti Peetha)
14) TaraTarani-తారతరణి బెర్హంపూర్ Berhumpur (Adi Shakti Peetha)
13.Andhra Pradesh ఆంధ్రఫ్రదేశ్ 11) Mallikarjuna Swamy, Srisailam మల్లిఖార్జున,శ్రీశైలం 15) Puruhutika devi -పురుహుతిక - పిఠాపురం
16) Manikyamba Devi -మానిక్యాంబదేవి(ద్రాక్షారామం)
17) Bramarambika- భ్రమరాంభిక- Srisailam
14.Telangana తెలంగాణ 18) Jogulamba-జోగులాంబ- అలంపూర్
15.Tamilnadu తమిళనాడు 12) Rameshwaram రామేశ్వ‌రాల‌యం , రామేశ్వరం 19) Meenaskshi-Kanchi మినాక్షి – కంచి
16.Karnataka కర్ణాటక 20) Chamuneshwari-చాముండేశ్వరి- Mysore

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...