Monday, 22 January 2018

ప్రముఖ సరస్వతి ఆలయాలు



22-01-2018

ప్రముఖ సరస్వతి ఆలయాలు

సరస్వతిమాతకు వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు. దేశంలో సరస్వతిమాతకు సంబంధించిన ఆరు పుణ్యక్షేత్రాలు ప్రముఖంగా వెలుగొందుతున్నాయి.

1. జ్ఞాన సరస్వతి ఆలయం(తెలంగాణ): పురాణగాథలను అనుసరించి మహాభారత యుద్ధం తరువాత ఈ ప్రాంతంలో వేదవ్యాసుడు.. సరస్వతిమాత ప్రసన్నం కోసం తపస్సు చేశాడట. దీంతో అమ్మవారు శిశువు రూపంలో దర్శనమిచ్చిందట.

2. కొట్టాయం సరస్వతి ఆలయం(కేరళ): కేరళలోని ఏకైక సరస్వతి ఆలయంగా ఇది పేరొందింది. దీనిని దక్షిణ మూకాంబిక పేరుతో కూడా పిలుస్తారు. కొట్టాయం లో సరస్వతి ఆలయంలో దేవత సరస్వతి దేవి. ఇది కేరళలో మాత్రమే ఉన్న ఆలయం,మరియు దక్షిణ మూకాంబికా అని పిలుస్తారు.ఈ ఆలయం చిన్గావనం సమీపంలో ఉంది. స్థానిక విశ్వాసాల ప్రకారం, ఈ ఆలయం లోని విగ్రహం ఒక భక్తునిచే కనుగొనబడింది. తూర్పు ముఖంగా సెట్ చేసిన ఈ విగ్రహాన్ని కిజ్హేప్పురం నంబూద్రి ప్రతిష్ట చేసారు. దీనికి పశ్చిమంగా మరో విగ్రహం ఉంటుంది, కానీ విగ్రహం ఏ ఆకారంలోను ఉండదు,కానీ దానిని పూజిస్తారు. ఈ విగ్రహం దగ్గర అన్ని సమయాలలో వెలిగే రాయిదీపం ఉంది. పణతి కుతూ చెడి మొక్కలు తూర్పు ముఖంగా ఉన్న విగ్రహం చుట్టూఉంటాయి. ఎవరూ ఈ మొక్కలు తొలగించడానికి అనుమతి లేదు, మరియు ఈ మొక్కలు ఎప్పుడూ వాడిపోయి ఉంటాయి. ఈ సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి. ఆలయం ఉదయం 5.30 నుంచి 11.30 వరకు,మరియు సాయంత్రం 5 గం.నుండి 7,30 గం. వరకు తెరచి ఉంటుంది.

3. పురా తమన్ సరస్వతి ఆలయం(బాలి): ఇది బాలీలోని అబుద్‌లో ఉంది. ఇది ఇండోనేషియాలోని ప్రధాన హిందూ ఆలయాలలో ఒకటి. ఇక్కడ నిర్మించిన కుండ్ ఈ ఆయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

4. శృంగేరి ఆలయం(కర్నాటక): ఇక్కడ సరస్వతి ఆలయాన్ని 7వ శతాబ్దంలో శంకర భగవత్పాదులు నిర్మించారని చరిత్ర చెబుతోంది. మొదట్లో ఇక్కడ చందన మూర్తి ఉండేదని, తరువాత స్వర్ణ విగ్రహాన్ని స్థాపించారని చెబుతారు.

5. మైహర్‌లోని శారదా మందిరం(మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని త్రికూట పర్వతంపై దుర్గమ్మవారు శారదాదేవి రూపంలో దర్శనమిస్తుంది.

ప్రాణాల‌ను తీసే గుడి ఇది! రాత్రి అయిందంటే చాలు..
ఎవ‌రైనా దేవాల‌యాల‌ను ఎందుకు ద‌ర్శిస్తారు చెప్పండి? మ‌ంచి ఆరోగ్య‌మైన జీవితం గ‌డ‌పాల‌ని ఇంకా ఇలా ఎన్నో కోరిక‌ల‌తో భ‌క్తిగా గుళ్ల‌కు వెళ‌తారు. అయితే మీరు ఈ దేవాల‌యం గురించి విన్నారా? ఇక్క‌డ గ‌డిపితే చ‌నిపోయే అవ‌కాశాలు కూడా ఉన్నాయంటారు. చాలా విచిత్రంగా ఉంది క‌దూ! ఇప్పుడు చెప్ప‌బోయే క‌థ మైహ‌ర దేవి ఆల‌యం గురించి. ఇక్క‌డ రాత్రిపూట గ‌డిపితే ఇక ప్రాణాలు వ‌దిలేసుకోవ‌డ‌మే అని న‌మ్ముతారు. మ‌రి సాహ‌సాలు చేసేవారు ఇలాంటి వాటి గురించి ఆస‌క్తిగా ఉందా? అయితే ప‌దండి.. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.

దేవాల‌యం గురించి..
ఇలాంటి క‌థ‌నానికి ప్ర‌ఖ్యాతి గాంచిన ఈ దేవాల‌యం మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని భోపాల్ స‌మీపంలో సాత్నా జిల్లాలో మైహ‌ర్ ఉంది. ఈ దేవాల‌యంలో శార‌ద అమ్మ‌వారు కొలువై ఉన్నారు. మైహ‌ర్ అంటే మా కా హార్ అని అర్థం. అంటే దేవ‌త యోక్క హారం అని తెలుగులో అర్థం.

కొండ‌ల్లో ఉంది
ఈ గుడి త్రికూట్ అనే కొండ‌ల మ‌ధ్య ఉంది. ప్ర‌తి సంవ‌త్స‌రం ఇక్క‌డి శార‌ద దేవిని ద‌ర్శించుకునేందుకు వేలాది మంది భ‌క్తులు తండోప‌తండాలుగా వ‌స్తుంటార‌ని చెబుతారు. అక్క‌డ అంత భ‌యంక‌ర‌మైన చ‌రిత్ర ఉన్నా స‌రే లెక్క‌చేయ‌కుండా వీరు అక్క‌డి వ‌స్తార‌ట‌.

అస‌లేం ఉంది అక్క‌డ‌..
దేవాలయం గురించి క‌థలు క‌థ‌లుగా చెబుతారు. ఈ న‌మ్మ‌కాల‌న్నీ నిజ‌మ‌ని చాలా మంది న‌మ్ముతారు కూడా. ఇక రాత్రి పూట అక్క‌డ ఉండ‌లేమ‌ని కూడా అంటారు. అలా ఉన్న‌వారు ఎవ‌రూ ప్రాణాల‌తో బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేర‌ని కూడా చెబుతారు.

దానికి కార‌ణ‌ముంది…
ఈ న‌మ్మ‌కం వెన‌క ఒక క‌థ ఉంది. ఇప్ప‌టికీ శార‌ద మాతకు అతి పెద్ద భ‌క్తులైన ఆల‌హ‌, ఉద‌మ్ అనే ఇద్ద‌రు సోద‌రుల‌ ఆత్మ‌లు అక్క‌డ తిరుగుతాయ‌ట‌. ఈ రెండు ఆత్మ‌లు అప్ప‌ట్లో పృథ్వీ రాజ్ చౌహాన్‌తో వీరోచితంగా పోరాడార‌ని చెబుతారు. అది కాకుండా వీళ్లిద్ద‌రు మొద‌టిసారి మైహ‌ర్ దేవి ఆల‌యాన్ని గుట్ట‌ల్లో క‌నుగొన్నారు అని చెబుతారు.

రాత్రి వేళ్ల‌లో మూసేస్తారు
రాత్రిపూట దేవాల‌యాన్ని మూసివేస్తారు. అక్క‌డి వారు న‌మ్మేదాని ప్ర‌కారం ఈ ఇద్ద‌రు సోద‌రులు అమ్మ‌వారిని పూజిస్తార‌ట‌. అదే కార‌ణంగా చెప్పి గుడి లోప‌లికి రాత్రిపూట ఎవ‌రినీ అనుమ‌తించ‌రు. ఎవ‌రైనా సాహ‌సం చేసి రాత్రంతా గ‌డిపితే ఇక మ‌రునాడు ప్రాణాల‌తో ఉండ‌ర‌ని అంటారు.

6. పుష్కర్‌లోని సరస్వతి మందిరం (రాజస్థాన్): పుష్కర్‌లో గల ఈ ఆలయాన్ని ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయానికి సమీపంలో సరస్వతి ఆలయం ఉంది.

Wednesday, 17 January 2018

స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం






స్త్రీ రూపంలో ఉండే వినాయక ఆలయం

గతంలో 'కేప్ కొమరిన్'గా ఖ్యాతి చెందిన కన్యాకుమారి తమిళనాడులో కలదు. ఈ పట్టణం ఇండియాకు దక్షిణ భూభాగా దిశలో కోనలో వుంది. కన్యాకుమారి ప్రాంతంలో అరేబియన్ సముద్రం మరియు బంగాళా ఖాతం రెండూ కలుస్తాయి. దీనికి వాయువ్యం మరియు పడమరలో కేరళ రాష్ట్రం వుంటుంది. ఉత్తరం వైపు మరియు తూర్పున తిరునల్వేలి జిల్లా వుంటుంది. కేరళ రాజధాని అయిన తిరువనంతపురం ఇక్కడకు 85 కి.మీ. ల దూరంలో కలదు. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తామయాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి పౌర్ణమి రోజులలలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది. టెంపుల్స్ మరియు బీచ్ లు - కన్యాకుమారిలోను మరియు చుట్టుపట్ల కల ఆకర్షణలు సృజనాత్మక మైండ్ లేని వారు ఈ టవున్ యొక్క కళలను మరియు సంస్కృతిని ఆనందించలేరు. అయితే, కన్యాకుమారిలో అనేక టెంపుల్స్ మరియు బీచ్ లు కలవు. ఇవి యాత్రికులను, పర్యాటకులను బాగా ఆకర్షిస్తాయి. సిటీలో ప్రధాన ఆకర్షణలు అంటే, అవి వివేకానంద రాక్ మెమోరియల్, వత్తకోట్టై ఫోర్ట్, పద్మనాభపురం పలద్సు, తిరువల్లువార్ విగ్రహం, వవతురాయి, ఉదయగిరి ఫోర్ట్ మరియు గాంధీ మ్యూజియం.

టవున్ లోని ప్రసిద్ధ ప్రదేశాలలో కన్యాకుమారి టెంపుల్, చితరాల్ హిల్ టెంపుల్ మరియు జైన స్మారకాలు , నాగరాజా టెంపుల్, సుబ్రమణ్య టెంపుల్ మరియు తిరునందికరాయి కేవ్ టెంపుల్ కలవు. తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వినోద పర్యటనకు వచ్చే వారికి కన్యాకుమారి లో కల బీచ్ లు ప్రధాన ఆకర్షణలు. ఈ బీచ్ లలో సంగుతురాయి బీచ్, తేన్గాపట్టినం బీచ్ మరియు సొత విలి బీచ్ లు ప్రసిద్ధి.

కేప్ కొమరిన్ చరిత్ర. కన్యాకుమారి మతానికి మరియు కాలాలకు ప్రధాన కేంద్రాలే కాదు, ఇది వర్తక వ్యాపారాలకు కూడా గత కొన్ని శతాబ్దాల నుండి ప్రసిద్ధి. ఈ టవున్ ను ఎన్నో రాజ వంశాలు పాలించాయి. వాటిలో పాండ్యులు, చొళులు, నాయక లు, చేరాలు ప్రధానమైనవి. కన్యాకుమారి టెంపుల్స్ యొక్క శిల్ప సంపద చూసిన వారికి ఈ ప్రాంత కాలాలకు, నాగరికతకు నిదర్శనాలు గా చెప్పవచ్చు.

ఈ టవున్ వేనాడ్ వంశ పాలనకు వచ్చే సమయానికి ఈ టవున్ రాజధాని పద్మనాభపురం లో కలదు. 1729 నుండి 1758 వరకు , పాలించిన అనిజం తిరునల్ మార్తాండ వర్మ అంటే వేనాడ్ చక్రవర్తి ట్రావెన్ కూర్ ను స్థాపించాడు. దానితో ఈ ప్రాంతం కన్యాకుమారి జిల్లా కిందకు వచ్చింది. సౌత్ ట్రావెన్ కూర్ గా ప్రసిద్ధి చెందింది.

పరావర్ రాజుల పాలన తర్వాత ఈ పట్టణం ట్రావెన్ కూర్ రాజులు చే బ్రిటిష్ అధీనం లో 1947 లో స్వాన్తంత్రం వచ్చే వరకూ పాలించా బడింది. 1947 లో ట్రావెన్ కూర్ ఇండియన్ యూనియన్ లో స్వ పరిపాలన కింద కలదు. ఈ పాలన ట్రావెన్ కూర్ రాజులు చేసారు.

కాల గమనంలో స్త్రీశక్తిస్వరూపిణి వినాయకుని పూర్తిగా మర్చిపోతున్నారు. వినాయకుడికి స్త్రీరూపం వుందని కూడా తెలియనివారు ఎంతోమంది వున్నారంటే నేడు ఆశ్చర్యపోనక్కరలేదు. హిందూ పురాణాల్లోనే వినాయకప్రస్తావన తక్కువగా వున్నప్పటికీ వినాయక స్త్రీ రూపానికి అనేక పేర్లున్నాయి.

ప్రముఖ పరిశోధకుడు బాలాజ్ ముండకుర్ రాసిన పుస్తకం ప్రకారం వినాయకుడికి వైనాయకి, గణేశుని, గజానుని, విజ్ఞేశుని, గజరూప అనే పేర్లున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపదనెలలో వినాయకుని పుట్టినరోజొస్తుంది.

సహజంగా ఆగస్టునెలలో వచ్చిన వినాయకుడు పుట్టినరోజు నాడు ఆయనకు ఘనంగా పూజలు నిర్వహించటంవల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయన్నది హిందువులవిశ్వాసం. విఘ్నాలు తొలగిపోటానికి స్త్రీరూపాన్ని పూజించినట్లు పురాణాధారాలు ఏమీలేవుగాని ప్రతి నెలలో వచ్చే నెలవంక 4వ రోజున వినాయకచతుర్ధిపేరిట మహిళలుప్రత్యేకపూజలు చేసేవారనటానికి ఆధారాలు వున్నాయి.

ఎక్కడవుంది?
తమిళనాడులోని కన్యాకుమారిజిల్లా తనుమలయన్ ఆలయంలో వినాయకవిగ్రహాలు ఇప్పటికీ స్పష్టంగానే వున్నాయి. ఇందులో ఓవిగ్రహం సుఖాసనంలో కూర్చునుంది. 4చేతులుండే ఈ విగ్రహంలో పై ఎడమచేతిలో గొడ్డలి,కింది ఎడమచేతిలో శంఖంపట్టుకుని వుంది.

అలాగే కుడివైపున పైచేతిలో కలశం, మరో చేతిలో దండముంది.ఆ పక్కనే మరోవిగ్రహంలో వినాయకవిగ్రహం నిలబడివుంది.దానికి 2చేతులేవున్నప్పటికీవిరిగిపోయి వున్నాయి. 1300యేళ్ళక్రితంనాటి ఈ ఆలయంలో వినాయకుని విగ్రహాలకు ప్రత్యేకతలు వున్నాయని,రిటైర్డ్ పురాతత్వశాస్త్రవేత్త శ్రీశాంతలింగం చెప్పారు.

ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఈశాన్యంలో ఈ వినాయకునివిగ్రహాలు కనిపిస్తాయని మరే ఆలయంలో ఈశాన్యదిశలో ఇలా విగ్రహాలు వుండవని ఆయన వివరించారు.క్రీ.శ.550లో రాసిన మత్స్యపురాణంలో కూడా వినాయకప్రస్తావన వుంది.

శివుడి అవతారంగా పేర్కొన్న 200మంది దేవతలపేర్లలో వినాయకునిపేరునిపేర్కొన్నారు. హిందూపురాణాలపై పలుపుస్తకాలు రాసిన దేవదత్ పట్నాయక్ కూడా వినాయకప్రస్తావన తీసుకొచ్చారు.ఆయన కధనంప్రకారం అంధకఅనే రాక్షసుడు పార్వతిని మోహించి పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు.

ఈ విషయాన్ని పార్వతిశంకరుడికి పిర్యాదుచేయటంతో ఆ రాక్షసుడిని శివుడు చంపాలనుకుంటాడు. అయితే ఆ రాక్షసుడి ఒక్కరక్తం చుక్కకూడా నేలరాలకూడదు. అలా రాలిన చుక్కలనుంచి మళ్ళీప్రాణంపోసుకునే వరం ఆ రాక్షసుడికుంది.

అందుకే పార్వతి విష్ణుమూర్తి శక్తి అయిన వైష్ణవి, బ్రహ్మశక్తి అయిన బ్రాహ్మణి, ఇంద్రుడి శక్తిఅయిన ఇంద్రాణితోపాటు వినాయకుని సహాయం చేయవలసినదిగా ప్రార్ధిస్తుంది. అప్పుడు వీరందరూ ఆ రాక్షసుడిరక్తాన్ని,నేలరాలకుండానే గాలిలో వుండగానే తాగేస్తారు.

రాజస్థాన్ లోని రైరావ్, ఒరిస్సాలోని హీరాపూర్, మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ దగ్గర భారాఘాట్ వద్ద ఇప్పటికి వినాయకవిగ్రహాలున్నాయి. ముందుగా జానకిశ్రీనివాసన్ వినాయకవిగ్రహాలను సోషల్ మీడియాలో పోస్ట్,చేయగా వాటిని అనేకమంది షేర్ చేసుకోవటంతో పాటు వాటిని తమప్రాంతాల్లోని ఆలయాల్లో ఇప్పటికివున్న వినాయకి విగ్రహాలను వెతికిపట్టుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్తసోధనలో మరిన్ని వినాయకివిగ్రహాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

కన్యాకుమారి లో షాపింగ్ ఎల్లపుడూ షాపింగ్ చేసే వారికి కన్యాకుమారి సరైన ప్రదేశం కాదు. అయితే కొట్టి పాటి గుర్తు కొరకు ప్రియమైన వారికి ఇవ్వగల కొన్ని వస్తువులు తప్పక దొరుకుతాయి. సముద్రపు ఆలిచిప్ప వంటి వి, సంఖాలు, మరియు చిన్న మోమెంతో లు దొరుకుతాయి.

హస్త కళల వస్తువులు ఇక్కడ స్థానికులచే చేయబడినవి దొరుకుతాయి. అందమన ఈ కెన్ మరియు వెదురు, చెక్క ఉత్పత్తులు ఇంటి అలంకరణకు లేదా ఫ్రెండ్స్ లేదా బంధువులకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు బాగుంటాయి. సి షెల్ల్స్ తో చేయబడిన కొన్ని నగలు రంగుల సముద్ర ఇసుక వంటివి కూడా షాపింగ్ లిస్టు లో చేర్చవచ్చు.

సిటీ లో ప్రసిద్ధ షాపులు అంటే తమిళ్ నాడు కో ఆప టెక్స్ సేల్స్ ఎంపోరియం మరియు తమిళ్ నాడు క్రాఫ్ట్స్ అండ్ పూమ్పుహార్ లు. ఇక్కడ వివిధ టెక్స్ టైల్స్ మరియు హంది క్రాఫ్ట్ వస్తువులు కొనవచ్చు. రోడ్ల పై అమ్మే వస్తువులు సరసమైన ధరలలో వుంటాయి. రుచి కర ఆహారాలు సి ఫుడ్ లు కన్యాకుమారి స్థానికులకు ప్రసిద్ధి.

ఈ ఆహారం అధిక మసాలా , కొబ్బరి వంటివి ప్రతి ఆహారం లోను కలిగి వుంటాయి. టవున్ లోని చాలా రెస్టారెంట్ లు సౌత్ ఇండియన్ డిష్ లు వడ, ఇడ్లి, దోస మరియు ఊతప్పం వంటివి అందిస్తారు. కన్యాకుమారి లో చైనీస్, రాజస్థాని, గుజరాతి ఆహారాలను అందించే కొద్దిపాటి రెస్ట రెంట్లు కూడా కలవు.

కన్యాకుమారి ఎలా చేరాలి ?
సిటీకి సమీప ఎయిర్ పోర్ట్ తిరువనంతపురంలో కలదు. ఎయిర్ పోర్ట్ లో దిగి టాక్సీ లేదా బస్సు లేదా ట్రైన్ లో కన్యాకుమారి చేరవచ్చు. కన్యాకుమారి టవున్ లో ఆటో రిక్షాలు లేదా బస్సులలో ప్రయాణించవచ్చు. లేదా ప్రైవేటు టాక్సీ కూడా అద్దెకు తీసుకోవచ్చు.

రోడ్డు ప్రయాణం
కన్యాకుమారికి రోడ్డు మార్గాలు బాగానే వుంటాయి. పర్యాటకులు తేలికగా చేరవచ్చు. ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలనుండి బస్సు లు కన్యాకుమారి కి కలవు.

రైలు ప్రయాణం
పర్యాటకులు కన్యాకుమారికి రైలు లో చేరవచ్చు. ఇక్కడకు సూపర్ ఫాస్ట్ మరియు ఎక్స్ ప్రెస్ ట్రైన్ లు వివిధ ప్రదేశాలనుండి చేరతాయి.

విమాన ప్రయాణం
కన్యాకుమారి విమాన ప్రయాణంలో చేరాలంటే, సమీప ఎయిర్ పోర్ట్ 89 కి.మీ.ల దూరంలో తిరువనంతపురంలో కలదు. ఇక్కడ నుండి కన్యాకుమారికి ఇంటర్నేషనల్ మరియు స్థానిక విమానాలు నడుస్తాయి.

ఉత్తమ సమయం
సంవత్సరం పొడవునా నగర వాతావరణం ఆనందంగా వుంటుంది. కనుక పర్యాటకులు ఈ కాలంలో అయినా సరే పర్యటించవచ్చు. అయితే ఈ ప్రదేశ సందర్శనకు అక్టోబర్ నుండి మార్చ్ వరకూ గల నెలలు సూచించ వచ్చు.

Saturday, 30 December 2017

కేరళ... ఓ అందాల భరిణె..!


కేరళ... ఓ అందాల భరిణె..!




‘ఎటు చూసినా ఆకాశాన్ని తాకుతున్నట్లున్న పచ్చని చెట్లూ, చేయి ఎత్తితే అందేంత దగ్గరలో తెల్లని మబ్బులూ, కళ్లు తిరిగిపోయే లోతైన లోయలూ, పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటల కొండలూ, కొబ్బరిచెట్ల సౌందర్యంతో తడిసిముద్దవుతోన్న బ్యాక్‌వాటరూ... అవన్నీ చూస్తుంటే జన్మ ధన్యమైనట్లే అనిపించింది’ అంటూ కేరళ అందాల గురించి చెప్పుకొస్తున్నారు వరంగల్‌కు చెందిన బండి రవీందర్‌.



నేషనల్‌ జియోగ్రాఫిక్‌ ట్రావెలర్‌ సర్వే ప్రకారం ప్రపంచంలో చూడదగ్గ మొదటి 50 ప్రదేశాల్లో కేరళ ఉండటంతో కేరళ అందాలను చూడాలనుకుని ఉపాధ్యాయ కుటుంబ మిత్రులమంతా కలిసి 80 మందిమి బయలుదేరాం. వరంగల్‌ నుంచి ఎర్నాకుళం జంక్షన్‌కు 24 గంటల ప్రయాణం. రెండు ట్రావెల్‌ బస్సుల్లో కొచ్చీకి వెళ్లి ముందే బుక్‌ చేసుకున్న హోటల్లో దిగాం. స్నానపానాదులు అయ్యాక డచ్‌ ప్యాలెస్‌, మ్యూజియంలను చూసి సాయంత్రం హార్బర్‌కు వెళ్లాం. ఇది ప్రకృతి సిద్ధమైన హార్బర్‌. మనదేశంలోని పోర్టుల్లోకెల్లా పెద్దది. ఆ రాత్రి బోటు అద్దెకు తీసుకుని అర్ధరాత్రి 12 గంటల వరకూ ఆనందంగా గడిపాం.



గురువాయూర్‌లో...
తెల్లవారి త్రిసూర్‌ జిల్లాలోని గురువాయూర్‌కి బయలుదేరాం. దారి పొడవునా కొబ్బరిచెట్లే. వేలు, లక్షల కొబ్బరిచెట్లను చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. మూడుగంటల ప్రయాణం తరవాత గురువాయూర్‌కి చేరుకున్నాం. ఈ దేవాలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. దీన్ని భూలోక వైకుంఠంగా చెబుతారు. తెలుగువారికి తిరుపతి, శ్రీశైలం ఎలానో కేరళీయులకి గురువాయూర్‌, శబరిమల అలాగే. ఇందులోకి హిందువులకు మాత్రమే ప్రవేశం. ఆడవాళ్లు తెల్లని చీరలూ మగవాళ్లు చొక్కా లేకుండా తెల్లని అంగవస్త్రం, లుంగీతో దేవుణ్ణి దర్శించుకోవాలి. అయస్కాంత లక్షణాలున్న నల్లని రాయితో మలిచిన చిన్నికృష్ణుని విగ్రహాన్ని దర్శించుకుని తన్మయత్వానికి లోనయ్యాం. గురువు అంటే బృహస్పతి, వాయు అంటే వాయుదేవుడు. ఊర్‌ అంటే స్థలం. బృహస్పతి, వాయుదేవుడు కలిసి ఈ స్థలంలో స్వయంగా కృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి గురువాయూర్‌ అని పేరొచ్చిందట. గురువాయురప్పన్‌గా పిలుచుకునే ఇక్కడి చిన్నికృష్ణుడి దర్శనం సమస్త పాపహరణంగా భావిస్తారు. ఏటా ఫిబ్రవరిలో గురువాయూర్‌ ఉత్సవం పదిరోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతుంది. మొదటిరోజు అనయోట్టం ఉత్సవం ఏనుగుల పరుగుపందెంతో మొదలవుతుంది. పందెంలో గెలిచిన ఏనుగు ఏడాదిపాటు దేవుని ఉత్సవ విగ్రహాన్ని మోసే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఇక్కడి ఏనుగులను నడిచే గురువాయురప్పన్‌లుగా భావిస్తారు. అందుకే ఎంతోమంది ఏనుగులను దేవాలయానికి విరాళంగా ఇస్తుంటారు. వాటిని ప్రత్యేక క్యాంపులో సంరక్షిస్తున్నారు. దైవదర్శనం తరవాత ఏనుగుల క్యాంపు చూడ్డానికి వెళ్లాం. అక్కడ 56 ఏనుగులు ఉన్నాయి. అవన్నీ మగవే కావడం విశేషం. నాలుగు దశాబ్దాలపాటు దేవాలయంలో సేవచేసి 1976లో మరణించిన కేశవన్‌ సేవలకు గుర్తుగా విగ్రహాన్ని నిర్మించారు. ఆ మధ్యాహ్నం మున్నార్‌కు బయలుదేరాం.



మున్నార్‌లో...
ఇడుక్కి జిల్లాలో ఉన్న మున్నార్‌, గురువాయూర్‌కి 180 కి.మీ. దూరంలో సముద్రమట్టానికి 1800 మీ. ఎత్తులో ఉంది. ఆ దారిలో ఎత్తయిన కొండలూ లోతైన లోయలూ కొండలమీద నుంచి ఉరికే జలపాతాలూ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. జలపాతం కనిపించినప్పుడల్లా ఆగుతూ సాగిన మా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది. రాత్రి ఎనిమిది గంటలకు మున్నార్‌కి చేరుకున్నాం. ఉదయం కర్టెన్లు తీసి చూస్తే, వెనక వైపంతా పెద్దలోయా, పచ్చనిచెట్లూ, కొండలూ, వాటి మధ్యలో అందమైన ఇళ్లూ... చిత్రకారుడు గీసిన చిత్రంలా ఎంతో అందంగా అనిపించింది. అల్పాహారం తిన్నాక మున్నార్‌ అందాలను చూడ్డానికి బయలుదేరాం. ఎటుచూసినా ఆకాశాన్ని తాకే పచ్చని చెట్లూ, చేతికి అందుతాయేమోనన్నంత దగ్గరగా తెల్లని మబ్బులూ, చూస్తేనే కళ్లు తిరిగిపోతాయనిపించే లోతైన లోయలూ, కొండలనిండా పచ్చటి దుప్పటి పరిచినట్లుగా ఉన్న తేయాకుతోటలూ... మరోలోకంలో విహరిస్తున్నట్లే అనిపించింది. ఇక్కడ 30కి పైగా టీ ఎస్టేట్స్‌ ఉన్నాయి. దారిలో రెండుమూడు తోటల్లో బస్సు ఆపి కాసేపు వాటిల్లో తిరిగి, దగ్గర్లోని టాటా టీ మ్యూజియం చూడ్డానికి వెళ్లాం. లోపల తేయాకుని వివిధ దశల్లో ఎలా ప్రాసెసింగ్‌ చేస్తారో గైడ్‌ చూపించాడు. కమ్మని రుచిగల టీని ఉచితంగా అందించారు. అక్కడి అవుట్‌లెట్స్‌లో రకరకాల టీ పొడులు కొనుక్కోవచ్చు.



అక్కడినుంచి 13 కి.మీ. దూరంలోని మట్టుపెట్టి డ్యామ్‌కు వెళ్లాం. దీన్ని 1953లో రెండుకొండల మధ్యలో నిర్మించారు. జలవిద్యుచ్ఛక్తి తయారీతోబాటు వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తోందీ డ్యామ్‌. ఇక్కడే బోటింగ్‌ సౌకర్యం కూడా ఉంది. తరవాత 20 కి.మీ. దూరంలోగల ఎరవికుళం వైల్డ్‌లైఫ్‌ పార్కుకి బయలుదేరాం. కేరళలో ఏర్పాటుచేసిన మొట్టమొదటి వైల్డ్‌లైఫ్‌ పార్కు ఇదేనట. ఇక్కడ అంతరించిపోతున్న నీలిగిరి థార్‌, లాంగర్‌, సాంబార్‌, గౌర్‌, ఇంకా కొన్ని ఏనుగులు ఉన్నాయట. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్పించే నీలకురింజి మొక్కలు ఉన్నాయి. అవి పూలుపూసిన సంవత్సరం పార్కులోని కొండలు మొత్తం నీలంరంగులో కనిపిస్తాయి. పశ్చిమ కనుమల్లోని అనాముడి అనే ఎత్తయిన కొండ ఈ పార్కులోనే కనిపిస్తుంది. ఈ కొండ పెద్ద ఏనుగు తల రూపంలా ఉండటంవల్ల అనాముడి (మలయాళంలో ఏనుగుతల)అని పిలుస్తారు. దీన్ని దక్షిణ భారత ఎవరెస్ట్‌ అనీ అంటారు.

తరవాత మజిలీ 90 కి.మీ. దూరంలోని తెక్కడి. ఈ దారిలో అన్నీ సుగంధద్రవ్యాల తోటలే. దారిలో మైలాదుమ్‌పురా వద్ద సుగంధద్రవ్యాల పార్కుకి వెళ్లాం. మిరియాలు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క...వంటి మొక్కలను  ప్రత్యక్షంగా చూడొచ్చు. అన్ని భాషల్లో వివరించడానికి గైడ్లు ఉన్నారు. ఈ మొక్కలు ఎలా పెరుగుతాయో వాటిని ఎలా ప్రాసెస్‌ చేస్తారో అన్నీ చక్కగా తెలుగులో వివరించారు. అక్కడి షాపుల్లో తాజా దినుసుల్ని కొనుక్కున్నాం. మిరియాల తరవాత ఎక్కువగా కనిపించేవి రబ్బర్‌ తోటలే. రబ్బరు ఉత్పత్తిలో 90 శాతం కేరళ రాష్ట్రానిదే. ఈ చెట్లన్నింటికీ కాండం దగ్గర చేతికి అందే ఎత్తులో కవర్లు కట్టి ఉన్నాయి. ఆ కవర్లలోకి తెల్లని ద్రవం(లేటెక్స్‌) వస్తుందనీ దాన్నే రబ్బురుగా మలుస్తారనీ చెప్పారు. సాయంత్రానికి తెక్కడికి చేరుకున్నాం. అక్కడ పెరియార్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చ్యురీ ఉంది. ఇందులో పులులూ, ఏనుగులూ, సాంబార్‌లూ, కోతులూ ఉన్నాయి. వీటిని చూడ్డానికి అడవి చుట్టూ సరస్సును ఏర్పాటుచేశారు. పడవలో వెళ్లి చూడాలి. ఆ రాత్రికి తెక్కడిలోని మార్షల్‌ ఆర్ట్‌ థియేటర్‌కు వెళ్లి, కలారిపట్టు అనే యుద్ధవిద్యనుచూసి, అలెప్పీకి బయలుదేరాం.



అలెప్పీలో...
బ్యాక్‌ వాటర్‌ సందర్శక కేంద్రంగా దీనికి పేరు. హౌస్‌ బోటులకీ స్నేక్‌ బోటులకీ ఇది పేరొందిన ప్రదేశం. మున్నార్‌ నుంచి 170 కి.మీ. దూరంలో ఉన్న అలెప్పీ అలప్పుజా జిల్లా ముఖ్య కేంద్రం. బస్సులో వస్తుంటే ఇరువైపులా పంటకాలువలూ పడవలూ కొబ్బరిచెట్లూ ఎవరో అందంగా తీర్చిదిద్దినట్లుగా ఉందీ ప్రాంతం. ఇక్కడ పడవలే ప్రయాణసాధనాలు. అలెప్పీ అందాలను పర్యటకులకు చూపించడానికి దాదాపు వెయ్యి హౌస్‌బోటులు రెడీగా ఉన్నాయి. మనం చెల్లించే ధరనుబట్టి వీటిల్లో ప్రీమియం, డీలక్స్‌, లగ్జరీ రకాలు ఉన్నాయి. పడవలో సిట్టింగ్‌, లివింగ్‌, డైనింగ్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌.... అన్నీ దేనికది ఉంటాయి. ఏసీ, గీజర్‌, శాటిలైట్‌ టీవీ అన్ని సదుపాయాలూ ఉన్నాయి. పడవమీద ఎక్కి కూర్చోవడానికి సన్‌డెక్‌ ఉంటుంది.



ఈ పడవలో సుమారు 10, 12 కి.మీ. బ్యాక్‌వాటర్లో తీసుకెళ్లి రాత్రంతా ఒకచోట ఆపి ఉదయం తిరిగి మనం ఎక్కినచోట వదిలిపెడతాయి. మన ఇష్టాన్నిబట్టి ఒక రాత్రిగానీ ఒక పగలూరాత్రి కలిపిగానీ ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు. అల్పాహారం, లంచ్‌, డిన్నర్‌, కాఫీ, టీలు అన్నీ మన వెంటే ఉన్న కుక్‌ బోటులోని కిచెన్‌లోనే వండి వడ్డిస్తాడు. మేం రెండు బోట్లు అద్దెకు తీసుకుని వెళ్లాం. మధ్యలో ఒకచోట రెండు గంటలు ఆపుతారు. అక్కడ హోటళ్లు ఉన్నాయి. వాటిల్లో మనముందే చేపలను పట్టేసి, వేయించి వడ్డిస్తారు. వాటి రుచి అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రయాణిస్తుంటే ఒకవైపంతా ఇళ్లూ మరోవైపంతా కొబ్బరిచెట్లూ పంటపొలాలూ ఉన్నాయి. ఇళ్లముందు నుంచే బోట్లు వెళ్తుంటాయి. ఇంటింటికీ ఓ పడవ ఉంటుంది.

అలెప్పీ నెహ్రూట్రోఫీ బోట్‌ రేసింగ్‌కు ప్రసిద్ధి. ఏటా ఆగస్టు నెలలో రెండో శనివారం జరుగుతాయివి. వీటినే స్నేక్‌ బోట్‌ రేసెస్‌ అనీ అంటారు. పడవ వెనక భాగం 15 అడుగుల ఎత్తులో లేచి పాములా కనిపిస్తుంది. 140 అడుగుల పొడవున్న ఈ పడవలను 110 మంది నడుపుతూ పందెంలో పాల్గొంటారు. దాదాపు 20 బృందాలు పోటీలో పాల్గొంటాయి. దీన్ని లక్షలమంది స్థానికులూ పర్యటకులూ వీక్షిస్తారు. వందమంది ఒకే పడవను ఒకేసారి తెడ్డువేయడం గమ్మత్తుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి త్రివేండ్రం వెళ్లి, పద్మనాభస్వామి గుడినీ కోవలం బీచ్‌నీ సందర్శించి వెనుతిరిగాం.

Saturday, 2 December 2017

లడక్‌ సరస్సు





మనోహరం లడక్‌ సరస్సుల విహారం!

‘సుర్రో సుర్రన్నాడే ’ అంటూ శక్తి సినిమాలో ఇలియానా మెలికలు తిరుగుతూ అందాలొలికించిన ప్రదేశం గుర్తుందా, ‘సత్‌రంగీ రే...’ అంటూ మణిరత్నం దిల్‌ సేలో చిత్రీకరించిన పాటా, త్రీ ఇడియట్స్‌ క్లైమాక్స్‌ సీనూ... ఇలా అనేక సినిమాల్లో కనువిందు చేస్తోన్న లడక్‌ సరోవర అందాలను ప్రత్యక్షంగా చూసి వచ్చాం’ అంటూ ఆ అనుభవాలను చెప్పుకొస్తున్నారు సికింద్రాబాద్‌కు చెందిన డాక్టర్‌ కె.సీతారత్న.

భిన్న ప్రాంతాలూ అక్కడ మాత్రమే జీవించే విభిన్న రకాల జంతువులూ పక్షులూ వృక్షజాతులూ ఆటవిక తెగలూ... ఇలా జీవ వైవిధ్యానికి మరో పేరు భారతదేశమైతే; అరుదైన, కనుమరుగవుతున్న జీవజాతులతో కూడిన బయోరిజర్వ్‌లూ అద్దాల్లా మెరిసే నీలి రంగు సరోవరాలకూ మారుపేరే లడక్‌. ఎత్తైన ఆ మంచుకొండల్లోని ముదురు నీలిరంగుల్లో ప్రకాశించే సరస్సుల సోయగం వర్ణించనలవి కాదు. అందుకే అచ్చంగా ఆ సరస్సుల్ని సందర్శించాలనుకుని ప్రణాళిక చేసుకున్నాం. జూలై 30వ తేదీన ముందుగా లేహ్‌కు చేరుకున్నాం. అక్కడి నుంచి ఇన్నోవాలో Pangong Tso Lake(పాంగోంగ్‌ త్సొ సరస్సు)కి బయలుదేరాం. ఇది 40 శాతం భారత భూభాగంలోనూ 60 శాతం టిబెట్‌(చైనా) లోనూ ఉంది. భారత్‌-చైనా సరిహద్దు నియంత్రణ రేఖ మీద ఉన్నందున నిరంతరం సైన్యం కాపలా ఉంటుంది. విదేశీయులు ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే లైన్‌ పర్మిట్‌ ఉండాలి. మారిన రాజకీయ పరిస్థితుల వల్ల దేశీయులు కూడా ఇన్నర్‌లైన్‌ పర్మిట్‌ తీసుకోవాలి. అందుకే Leh[లేహ్‌(లే)]లోనే పర్మిట్‌తో బాటు వాటి జిరాక్స్‌ ప్రతులూ, ఆధార్‌, మా ఫొటోలూ అన్నీ తీసుకున్నాం. వాటిని చెక్‌ పోస్టుల దగ్గర ఇవ్వాల్సి ఉంటుంది.

కత్తి మీద సవాల్‌!
Leh(లేహ్‌) నుంచి బయలుదేరి, 45 కిలోమీటర్ల దూరంలోని Karu (‘కార్‌’) అనే ప్రాంతానికి చేరుకుని, అక్కడి నుంచి 17,800 అడుగుల ఎత్తులోని Chang La Pass (చాంగ్‌ లా పాస్‌)కి చేరుకున్నాం. ఇది ఎత్తైన కొండదారుల్లో రెండోది. అక్కడ ఉన్న ఓ చిన్న హోటల్లో టీ తాగి, చుట్టుపక్కల దృశ్యాలను ఫొటోలు తీసుకుని మళ్లీ బయలుదేరాం. నెమ్మదిగా ప్రవహిస్తున్న సింధునదినీ దాని మధ్యలో వూదారంగు పూలతో నిండిన మట్టి దిబ్బల్నీ చూస్తూ మా ప్రయాణం సాగింది. అక్కడి నుంచి మరో 58 కి.మీ. ప్రయాణించాక తంక్‌సే అనే ప్రాంతం వచ్చింది. ఇది దాటాక రోడ్డు పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఈ ప్రాంతాన్ని Pagal Nala(పాగల్‌నాలా) అంటారు. అక్కడక్కడా హిమనదాల నుంచి కిందకి ప్రవహించి వచ్చిన నీరు మూడు నాలుగు అడుగుల లోతు వరకూ ఉంది. ఆ ప్రవాహాలని దాటడం కత్తి మీద సవాలే. టైర్లు రాళ్ల మధ్య ఇరుక్కుని ముందుకీ వెనక్కీ కదలని పరిస్థితి. ఎలాగో కష్టపడి 32 కి.మీ. ప్రయాణించాక స్పాంగుర్‌ త్సొ సరస్సు వచ్చింది. ఇది దాటాక మేం బస చేసే పాంగోంగ్‌ త్సొ రిసార్టుకు చేరుకున్నాం.

ఈ ప్రయాణంలో వాతావరణం ఎప్పుడెలా మారిపోతుందో తెలీదు. రోడ్డు అస్సలు బాగుండదు. టెలిఫోనూ సెల్‌ఫోను సంకేతాలు చేరని ఎత్తైన ప్రాంతం. అక్కడ వీచే ఈదురు గాలుల తాకిడికి చెవులు చిల్లులు పడతాయేమో అనిపిస్తుంది. వాతావరణంలో ఆక్సిజన్‌ శాతం చాలా తక్కువ. మౌంటెయిన్‌ సిక్‌నెస్‌కు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆక్సిజన్‌ సిలిండర్లను ఉపయోగించే విధానాన్ని తెలుసుకుని, వాటిని ఉపయోగించడానికి మానసికంగా సిద్ధపడినవారే ఈ ప్రాంతాన్ని పర్యటించాలి. చలికాలంలో అయితే పాంగోంగ్‌ సరస్సు గడ్డ కట్టి ఉంటుంది. మే నుంచి మంచు కరగడం ప్రారంభమవుతుంది. అందుకే అప్పటి నుంచి సెప్టెంబరు వరకూ దీన్ని ఎక్కువమంది సందర్శిస్తుంటారు. భూమ్మీద ఉన్న ఎత్తైన ఉప్పునీటి సరస్సు ఇదే.

కరెంటు ఉండదు!
సాయంత్రం నాలుగు గంటలకు సరస్సు దగ్గరకు చేరుకున్నాం. అది చూశాక అప్పటివరకూ పడ్డ కష్టమంతా హుష్‌కాకిలా ఎగిరిపోయింది. 14,270 అడుగుల ఎత్తులో నెమలిపింఛం వర్ణంలోని నీటితో మెరిసిపోతుందా ఉప్పునీటి సరస్సు. అప్పటికే అక్కడ చాలామంది సందర్శకులు ఉన్నారు. క్రమంగా సూర్యాస్తమయం కావడంతో పసుపూ బంగారు వర్ణాలు సంతరించుకున్న నీలాకాశ అందాలు సరస్సుల్లో ప్రతిఫలిస్తున్నాయి. అలా చాలాసేపు ఆ సరస్సు దగ్గరే ఉండి, మారుతున్న ఆకాశంలోని రంగుల్నీ హిమశిఖర సౌందర్యాన్నీ చూస్తూ గడిపేశాం. ఎనిమిది గంటలకు చీకట్లు కమ్ముకు రావడంతో రిసార్టుకి వచ్చేశాం. రిసార్టుల్లోగానీ గ్రామాల్లోగానీ కరెంటు ఉండదు. రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ రిసార్టుల వాళ్లే జనరేటర్ల ద్వారా చిన్న చిన్న బల్బులు వెలిగేలా చూస్తారు. రాత్రి పది గంటలకు ఆ జనరేటర్‌ కూడా బంద్‌ అవుతుంది. రాత్రివేళ ఉపయోగించుకోవడానికి హై పవర్‌ టార్చిలైటు వెంట ఉండాల్సిందే. మౌంటెయిన్‌ సిక్‌నెస్‌ కారణంగా ఆ రాత్రంతా నిద్రలేదు. ట్యాబ్లెట్లు వేసుకుని, రెండు గంటలపాటు ఆక్సిజన్‌ తీసుకోవాల్సి వచ్చింది.

మర్నాడు ఉదయం రిసార్టు కుర్రాడు ఇచ్చిన వేడినీళ్లతో కాలకృత్యాలు ముగించుకుని అల్పాహారం తీసుకుని, ఉదయ కాంతిలో సరస్సు అందాలను మరోసారి తనివితీరా చూసి, తిరుగుప్రయాణమయ్యాం. లేహ్‌ ప్రాంతానికి చేరుకునేసరికి సాయంత్రం ఐదు గంటలయింది. త్సొ మోరిరి, త్సొ కర్‌ ప్రాంతాలకు వెళ్లడానికి ఇన్నోవాను ఏర్పాటుచేసుకున్నాం. మధ్యలో పెట్రోల్‌ దొరకదు కాబట్టి మొత్తం 400 కి.మీ. దూరానికి సరిపడా పోయించుకుని బయలుదేరాం. ఈ సరస్సులకు వెళ్లడానికీ లేహ్‌ పట్టణంలోనే రిస్ట్రిక్టెడ్‌ ఏరియా అనుమతి తీసుకుని బయలుదేరాలి.

ఆరు గంటలకే లేహ్‌ నుంచి బయలుదేరి, ఉప్పి మీదుగా చుమ్‌థాంగ్‌ చేరుకున్నాం. అక్కడ మధ్యాహ్న భోజనం చేసి, కాసేపు విశ్రమించాం. అక్కడ ఓ బౌద్ధ ఆరామం, వేడినీటి బుగ్గలూ ఉన్నాయి. వాటిని సందర్శించి ప్రయాణం కొనసాగించాం. దారిపొడవునా సింధునది మా వెంటే వస్తోంది. అక్కడక్కడా అది గట్లు తెంచుకుని దారికి అడ్డం పడటంతో వాహనాలు కూడా ఆగిపోయాయి. నదీప్రవాహం రోడ్లమీద మూడు అడుగుల ఎత్తు చేరడంతో అసలు అది నదా లేక రోడ్డా అనేది కూడా తెలిసేది కాదు. రక్షణ దళాలు రోడ్లను మరమ్మత్తులు చేస్తున్నా ప్రవాహాన్ని నియంత్రించడం వాళ్ల వల్ల కావడం లేదు. మొత్తమ్మీద ఆర్మీ వాహనాల సాయంతో బయటపడ్డాం.

పష్మీనా గొర్రెలతో...
చుమ్‌థాంగ్‌ నుంచి 60 కి.మీ. ప్రయాణించాక త్సొ మోరిరి సరస్సుకి చేరుకున్నాం. కొంతదూరం ప్రయాణించగానే పష్మీనా జాతికి చెందిన తెల్లని గొర్రెల్ని మేపుతున్న స్థానిక తెగల స్త్రీ పురుషులు కనిపించారు. టిబెట్‌ నుంచి వలస వచ్చిన చాంగ్‌పాస్‌ అనే సంచార తెగ ఇక్కడ నివసిస్తోంది. వీళ్లు వ్యవసాయం కూడా చేస్తారు. ప్రభుత్వ సహకారంతో ఈ పష్మీనా గొర్రెల్ని పెంచి వాటి నుంచి తీసిన బొచ్చుని విక్రయిస్తారు. ఇది ఖరీదైన ఉన్నిగా పేరొందింది. దీంతో చేసే శాలువాలూ దుప్పట్లూ పలుచగా ఉంటాయి. కానీ చలి నుంచి బాగా కాపాడతాయి.

సాయంత్రం ఐదు గంటలకు అక్కడకు చేరుకున్నాం. టెంటులో లగేజీ పెట్టేసి, రిసార్టు వారిచ్చిన కాఫీ తాగి కెమెరాలతో సరస్సు దగ్గరకు చేరుకున్నాం. ఇది మంచినీటి సరస్సు. సముద్రమట్టానికి 15,075 అడుగుల ఎత్తులో ఉంది. దీని చుట్టూ హిమాలయ శ్రేణులు 18 నుంచి 20 వేల అడుగుల ఎత్తులో కనిపిస్తాయి. ఆ మధ్యలో ఉన్న లోయనే రప్‌షు అంటారు. దాని చుట్టూ తిరుగుతూ హిమాలయాల్లో మాత్రమే కనిపించే సూర్యాస్తమయ అందాలను చూస్తూ గడిపేశాం. ఇక్కడ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. టిబెట్‌కు చెందిన అడవి గాడిదలైన కియాంగ్‌లు ఈ ప్రాంతానికే పరిమితం. ఎరుపురంగు నక్కలూ, బార్‌ హెడ్‌ బాతులూ కూడా ఇక్కడ కనిపిస్తాయి.

సరస్సు వద్ద పెద్ద ఆర్మీ క్యాంపు ఉంది. అక్కడ ఉన్న గ్రామం పేరు కొర్జొక్‌. పర్యటక రిసార్టులకు ఈ సైనిక క్యాంపు నుంచే రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకూ కరెంటు సరఫరా ఇస్తారు. మిగిలిన సమయాల్లో కరెంటు ఉండదు. ఫోను సిగ్నల్స్‌ ఉండవు. ఇవన్నీ లద్దాఖ్‌లో అత్యంత మారుమూల ప్రదేశాలు. రాత్రయ్యేసరికి మెల్లగా తలనొప్పి పెరిగింది. కళ్లు తిరగడం కూడా ప్రారంభమయ్యేసరికి సిలెండర్‌ ద్వారా ఆక్సిజన్‌ను రెండు గంటలపాటు పీల్చాల్సి వచ్చింది.

మర్నాడు ఉదయాన్నే లేచి సరస్సు దగ్గరకు వెళ్లాం. అప్పుడు కనిపించిందో దృశ్యం. దాదాపు మూడు వందలకు పైగా ఉన్న బార్‌హెడెడ్‌ బాతుల గుంపు మేం ఉన్న వైపునకు ఒడ్డుకి రాసాగింది. మేం వాటికి కనిపించకుండా మట్టి దిబ్బల వెనక నిలబడి ఫొటోలు తీసుకున్నాం. ఒక గుంపు తరవాత మరో గుంపు వచ్చింది. అవన్నీ కూడా వలస పక్షులే. వీటికి మనదేశంలోని బ్రీడింగ్‌ సెంటర్లు లద్దాఖ్‌ సరస్సులు మాత్రమే. ఇక్కడే గుడ్లు పెట్టి, పొదిగి వాటికి ఎగరడం నేర్పి తిరిగి తమతోబాటు సైబీరియాకి తీసుకుని పోతాయి. అలా అవి ప్రయాణిస్తున్నంత మేర వెళుతూ తిరిగి అలసిపోయాం. సాయంత్రం నడిచే ఓపిక లేక వాహనంలోనే సరస్సు దగ్గరకు వెళ్లి, సాయం సంధ్యా సమయంలో తళుకులీనే హిమవర్ణ సోయగాలను వీక్షించి ఆనందంగా బసకు చేరుకున్నాం.

ఆ మంచుకొండల్లో మంచు కురవదు!
దాదాపు 130 అడుగుల లోతులో 26 కి.మీ. పొడవూ సుమారు ఐదు కిలోమీటర్ల వెడల్పూ ఉండే త్సొ మొరిరి సరస్సు అందాలను మరోసారి చూసి, మర్నాడు ఉదయాన్నే తిరుగు ప్రయాణమయ్యాం. దారిలో మాహి అనే వంతెన వచ్చింది. అక్కడి నుంచి దారి మళ్లి ప్రయాణిస్తే త్సొ కర్‌ సరస్సు వస్తుంది. అదీగాక సింధునది మేం వచ్చిన దారిని ముంచెత్తడంతో ఆర్మీ వాళ్లు కూడా రూటు మార్చుకుని ఆ దారిలోనే ప్రయాణించారు. మార్గం అంతా గుంతలమయం. రప్‌షు లోయలోని లోతైన సరస్సు ఇది. దీని చుట్టూ 9 చదరపు కిలోమీటర్ల మోరి మైదానం ఉంది. దీని వెనకగా తుగ్‌జి, గర్షన్‌ అనే హిమాలయ పర్వతాలు ఉన్నాయి. అనేక సంవత్సరాల కిందట త్సొ కర్‌ సరస్సు ఈ పర్వతాల వరకూ విస్తరించి ఉండేదట. ఉప్పునీటి సరస్సు కావడంతో చాంగ్‌ పా అనే సంచారజాతి వారు సరస్సు నుంచి ఉప్పును తీసి టిబెట్‌కు తరలించేవారట. చిత్రమైన విషయం ఏంటంటే అక్కడ మంచు కురవదు, వర్షం పడదట. ఉష్ణోగ్రత వేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడూ, చలికాలంలో -40 డిగ్రీలూ ఉంటుంది.

ఇక్కడ ఓ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా ఉంది. అందులో బ్లాక్‌ హెడెడ్‌ కొంగలూ టిబెటన్‌ బాతులూ తోడేళ్లూ నక్కలూ మార్మోట్‌లూ గోధుమరంగు తలతో ఉండే గల్స్‌... వంటి అరుదైన జీవజాతులు ఉన్నాయి. అయితే మేం సరస్సు దగ్గరకు మాత్రం వెళ్లలేకపోయాం. ఎందుకంటే దానిచుట్టూ బురదతో నిండిన నీటి మొక్కలు ఉన్నాయి. అక్కడ కాలేస్తే లోపలకు కూరుకుపోతాయట. పైగా సరస్సు అంతా మంచుతో గడ్డకట్టుకుపోయి ఉంది. అందుకే దూరం నుంచే దాన్ని చూసి వెనుతిరిగాం.



Wednesday, 1 November 2017

ఘృశ్నేశ్వరస్వామి









ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం
భక్తులు తాకే జ్యోతిర్లింగం


అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన శిల్పాలకు నెలవైన ఎల్లోరా గుహలకు సమీపంలో ఘృశ్నేశ్వర స్వామి జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ జ్యోతిర్లింగం అపూర్వ మహిమలకు పేరుగాంచింది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో పన్నెండవదిగా వినుతికెక్కింది. ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి తరించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులది మహాద్భాగ్యమని చెప్పొచ్చు. జ్యోతిర్లింగా ఆఖరిది అయిన ఘృశ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.

ఇళాపురే రమ్య విశాల కేస్మిన్‌ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే

పురాణగాథ
పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్‌’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్‌గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం.

చరిత్ర
ఈ ప్రాంతంలో ఏల్‌ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్‌. అదే వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒకసారిరాజు వేటకు వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు. ఆ శాపం వల్ల రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు. అయిన కూడా ఎక్కడా నీరు దొరకదు. ఒక చోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటికుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది. రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అవుతాయి. రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్టిస్తాడు. దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు. బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మసరోవరం. కాలక్రమేణ అది శివాలయంగా ప్రసిద్ధి గాంచింది.

స్థలపురాణం
పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్మడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది. వివాహం అయిన తరువాతా అక్కాచెల్లెళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేన ఘుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి ఘుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ.. ఘుష్మ కుమారున్ని చంపి కోనేటిలో పడేస్తోంది. శివ భక్తురాలైన ఘుష్మ ‘ ఇదంతా పరమేశ్వరుని లీల’ అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు. పరమ శివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాపపరిహారం కల్పిస్తాడు. అప్పుడు ఘుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువుతీరమని వేడుకుంటుంది. అంతట ఆ స్వామి అక్కడ స్వయంభువు కొలువయ్యాడు. ఘుశమేశుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఆ ఘుశమేశుడే కాలక్రమంలో ఘృశ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం.

ఆలయ విశిష్టత
పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్‌ గ్రామ పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృశ్నేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. అంతేకాక శిఖర సింగనపూర్‌లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి. ఆ తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు ఆ భోలానాథుడే జన్మించి వంశప్రతిష్ఠను పెంచాడని కథనం. తరువాతి కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కార్‌ జీర్ణోద్ధరణ పనులు చేయించిందని ప్రశస్తి.

240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి ధృఢంగా, సుందరంగా నిలిచి ఉంది. మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలూ భక్తి భావం రేకిత్తిస్తాయి.

24 రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు. నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనిమిస్తాడు. ఇక్కడ స్వామి వారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది ఒక్కటే భక్తులు తాకే జ్యోతిర్లింగం. గర్భగుడిలోనికి పురుషులు పై వస్త్రాన్ని విడిచి వెళ్లాలి.

ఎలా చేరుకోవాలి
ఔరంగాబాద్‌ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
* దిల్లీ, ముంబయిల నుంచి ఔరంగాబాద్‌కు విమానాలను నడుపుతున్నారు.
* రైలు మార్గం ద్వారా అయితే ఔరంగాబాద్‌ నుంచి ఇక్కడికి నేరుగా చేరుకోవచ్చు.
* రోడ్డు మార్గం ద్వారా అయితే ప్రైవేట్‌, సొంత వాహనాల్లో ఔరంగాబాద్‌ నుంచి చేరుకోవచ్చు.
* వేరూల్‌ గ్రామం నుంచి ఔరంగాబాద్‌కు బస్సులు నడుస్తుంటాయి.



Tuesday, 31 October 2017

ఉడుపి భూలోక వైకుంఠం

ఉడుపి భూలోక వైకుంఠం


సరిగ్గా బ్రాహ్మీముహూర్తం రాగానే శంఖనాదాలు, దుందుభులు, నగారాలతో ప్రతిధ్వనిస్తుంది ఉడుపి మఠం. ఆలయ పూజారులతో సహా మఠంలో పని చేసేవారందరూ ఆ దివ్యనాదాలతో మేల్కొని, తమ దైనందిన చర్యలు ప్రారంభిస్తారు. కర్ణాటకలోని పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి పొందినది ఉడుపి. ధనిక-పేద; అగ్ర-నిమ్న కులాలనే భేదభావాలు మనుషులకే తప్ప, పరమాత్ముడికి లేవనేందుకు సాక్షాత్తూ ఆ కృష్ణభగవానుడే నిదర్శనం చూపించిన పుణ్యస్థలి ఉడుపి.

కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా, మంగుళూరుకు 60 కి.మీ దూరంలో ఉంది. ఉడుపి పుణ్యక్షేత్రం. నిత్యం ఉత్సవాలతో, లక్షలాది మంది యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ పవిత్ర యాత్రాస్థలం. ‘ఉడుప’(చంద్రుడు)’ అనే పదాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి ఉడుపి అనే పేరు వచ్చింది. పేరుకు తగ్గట్టే ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛంగా, వెన్నెలలో ప్రకాశించే చంద్రుడిలా అద్వితీయమైన, అగోచరమైన దివ్యచైతన్యంతో అక్కడక్కడ పెద్ద పెద్ద మామిడి, పనస తోటలు, సువిశాలమైన పొలాలగుండా ప్రయాణించే యాత్రికులకు కొబ్బరి, పోక చెట్లు తమ తలలూపుతూ స్వాగతం పలుకుతాయి.

విశిష్టాద్వైత మత స్థాపకులు మధ్వాచార్యుల పవిత్ర హస్తాల మీదుగా స్థాపితమైన మఠం ఉడుపి. కనకదాసు అనే పరమభక్తుడిని నిమ్న కులస్థుడనే కారణంతో పూజారులు కృష్ణ దర్శనానికి నిరాకరించగా స్వయంగా తానే తన ప్రియభక్తునికి ప్రత్యక్ష దర్శనమిచ్చిన కరుణామూర్తి ఉడుపి చిన్నికృష్ణుడు. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో ప్రథమస్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీ కృష్ణమందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీ కృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. అవి: పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర.

మధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. అదే మనం చూస్తున్న విగ్రహం. కనకదాసుకు కృష్ణపరమాత్మ పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చిన చోటనే ఒక మంటపం కట్టించారు. ఆ మంటపానికే కనకదాసు మంటపమని పేరు. ఉడుపిలో జరిపే పండుగలు, పర్వదినాలు: మకర. సంక్రాంతి, మధ్వ నవమి, హనుమాన్‌ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, నవరాత్రి మహోత్సవం, మధ్వ జయంతి (విజయ దశమి), నరక చతుర్దశి, దీపావళి, గీతాజయంతి వంటి పండుగలను పర్యాయ మఠంలో అంగరంగవైభవంగా జరుపుతారు.

దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు: 

కొల్లూరు ముకాంబికా దేవాలయం, మరవంతె బీచ్, మల్పే రేవు, కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు), కార్కళలోని గోమటేశ్వరుడు, వేణూరులోని గోమటేశ్వరుడు, అత్తూరులో సెయింట్‌ లారెన్స్‌ ఇగర్జి, సెయింట్‌ మేరీస్‌ ద్వీపం, మూడబిదరెలో సావిరకంబద బసది మణిపాల్, బైందూరు కోసళ్ళి జలపాతం, జామియా మసీదు, 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18,000 మంది ప్రార్థనలు చేసే విధంగా ప్రార్థనాశాలలున్నాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు.

పాజక: ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేశాడు.
కొల్లూరు: ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తుల విశ్వాసం.
కర్కల: ఉడిపి నుండి 37 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జైన బసదీలు (ఆలయాలు), గోమటేశ్వర శిల్పం (బృహద్రూపం ) ప్రత్యేక ఆకర్షణ.
అనెగుడ్డె: ఉడిపి నుండి 30 కి.మీ.లు. ఇక్కడ ప్రముఖ గణేశాలయం ఉంది.
ఆత్తుర్‌ చర్చి: ఉడిపి నుండి 25 కి.మీ.లు. ఇక్కడ ఏటా నిర్వహించే సంతకు కులమతభేద రహితంగా ప్రజలు వస్తారు.
బర్కూర్‌: ఉడిపి నుండి 15కి.మీల దూరం. జైన బసదీలు ఉన్న బర్కూరు తులునాడు రాజులకు రాజధాని.
సాలిగ్రామ: ఉడిపి నుండి 27కి.మీల దూరం. ఇక్కడా గురునరసింహస్వామి ఆలయం ఉంది.
పరంపల్లి: ఇక్కడ ఎనిమిది వందల ఏళ్ల నాటి పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది.
పెర్నకిల: ఇక్కడ ఒక పురాతన గణేశుని ఆలయం ఉంది.
పెర్దోర్‌: ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది.
అగుంబే – షిమోగా రాష్టీయ్ర రహదారి సమీపంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది.
హరియాద్క: ఉడిపి నుండి 16 కి.మీలు. పురాతనమైన వీరభద్రాలయం ఉంది.
శంకరనారాయణ: ఉడిపి నుండి 40 కి.మీలు. శకరనారాయణాలయం ఒక సరోవరం మధ్యన ఉండడం విశేష ఆకర్షణ.
మారనకట్టె: ఉడిపి నుండి 45 కి.మీలు. ఈప్రాంతం ప్రకృతి ఆరాధకులకు స్వర్గభూమివంటిది.
మందర్హి: ఉడిపి నుండి 20 కి.మీలు. ఇక్కడ అమ్మనవారు (దుర్గాపరమేశ్వరి) ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే ‘దోశ‘ సంతానప్రాప్తి కలిగిస్తుందని ప్రజలు విశ్వాసం.
ముదుహోలె కర్కడ: ఇక్కడ పురాతన దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది.
సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 40 కి.మీలు. ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఉన్నాయి.
మూకాంబికా వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 50 కి.మీలు. కుందపూర్‌– కొల్లూర్‌ రోడ్డు పక్కన విస్తరించి ఉంది.
కుర్ధు తీర్ధ జలపాతాలు: ఉడిపి నుండి 42 కి.మీలు. పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య, 300 అడుగులున్న ఒక అందమైన జలపాతం. ఋషుల తపస్సుతో ఈ మడుగు ఎంతో పవిత్రతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంగ తీర్ధ: కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మధ్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్థం అని కూడా అంటారు.
బర్కన జలపాతం: ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు, శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది; బెల్కల్‌ తీర్థ జలపాతం, అరసిన గుండి, కుద్లు తీర్థ, కొసల్లి జలపాతం, సౌపర్ణిక, స్వర్ణ, చక్ర, సీత, వర్హి, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి.

విశేషాల ఉడిపి
శ్రీ కృష్ణుని రథానికి బ్రహ్మరథమని పేరు. ఇది బంగారంతో రూపొందింది.
శ్రీ కృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని రత్నఖచితమైన సింహాసనంపై ఉంచుతారు.
అలనాడు శ్రీ కృష్ణుడు కనకదాసుకు దర్శనమిచ్చిన గవాక్షం(కిటికీ)లో నుంచే ఈ నాటికీ భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి మంగుళూరుకు రైళ్లు, బస్సులు ఉన్నాయి. అక్కడి నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపికి బస్సులు, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి ఉడుపికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్‌ డెక్కన్‌ నుంచి వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ ఉంది.
– డి.వి.ఆర్‌.భాస్కర్‌

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...