అష్టాదశ శక్తిపీఠాల వివరాలు ఆదిశంకరాచార్యులు వ్రాసిన క్రింది పద్యాల నుండి సంగ్రహించబడినవి.
లంకాయాం శాంకరీదేవి , కామాక్షి కాంచికాపురే /
ప్రద్యుమ్నే శృంఖలాదేవి , చాముండా క్రౌంచపట్టణే //
అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా /
కొల్హాపురే మహాలక్ష్మి , మాహుర్యే ఏకవీరికా //
ఉజ్జయిన్యాం మహాకాళి , పీఠికాయాం పురుహూతికా /
ఓఢ్యాణే గిరిజాదేవి , మాణిక్యా దక్షవాటికే //
హరిక్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి /
జ్వాలాయాం వైష్ణవిదేవి , గయా మాంగల్యగౌరికా //
వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరే తు సరస్వతి /
అష్టాదశ శక్తిపీఠాని , యోగినామపి దుర్లభం //
సాయంకాలే పఠేన్నిత్యం , సర్వశతృవినాశనం /
సర్వరోగహరం దివ్యం , సర్వసంపత్కరం శుభం //
అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.
ఈ అష్టాదశ పీఠాలు ఎలా వెలశాయంటే..?
పూర్వం అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి సతీదేవిరూపంలో ఉన్నప్పుడు తండ్రి దక్షుడు మహాయజ్ఞం తలపెట్టాడు. ఈ మహాయజ్ఞానికి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తె పార్వతీదేవిని, అల్లుడు పరమేశ్వరునిని ఆహ్వానించడు. కానీ తండ్రి చేపట్టిన యజ్ఞానికి వెళ్లాలని ఈశ్వరునిని సతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి వెళ్లడానికి పార్వతీ పరమేశ్వరుడు అంగీకరించడు. కానీ పరమేశ్వరుని మాటను కాదని పుట్టింటి మీది ప్రేమతో వెళ్ళిన లోకమాతకు అక్కడ అవమానం ఎదురవగా ఆ తల్లి యోగాగ్నితో తన శరీరాన్ని త్యజిస్తుంది. కోపంతో పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యజ్ఞధ్వంసం చేసి సతీదేవి శరీరాన్ని భుజానవేసుకుని ఉన్మత్తునిలా తిరుగుతూ ఉంటే సృష్టి శ్రేయస్సుకోసం చక్రి ఆ శరీరాన్ని పద్దెనిమిది భాగాలుగా ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి.
అష్టాదశ పీఠాల విషయాల విషయంలో వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభి ప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి
శాంకరి – శ్రీలంక – ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో ‘త్రికోణేశహవర స్వామి’ అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
కామాక్షి – కాంచీపురం, తమిళనాడు – మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శృంఖల – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ – ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
చాముండి – క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక – అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
జోగులాంబ – ఆలంపూర్, తెలంగాణా – కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగ’, ‘భద్ర’ నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
భ్రమరాంబిక – శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ – కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర – ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
ఏకవీరిక – మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర – ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ – ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
పురుహూతిక – పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ – కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
గిరిజ – ఓఢ్య, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా – వైతరిణీ నది తీరాన ఉన్నది.
మాణిక్యాంబ – దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ – కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
కామరూప – హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం – బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో – ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
వైష్ణవి – జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ – ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
మంగళ గౌరి – గయ, బీహారు – పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
విశాలాక్షి – వారాణసి, ఉత్తర ప్రదేశ్.
సరస్వతి – జమ్ము, కాశ్మీరు – అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.
లంకాయాం శాంకరీదేవి , కామాక్షి కాంచికాపురే /
ప్రద్యుమ్నే శృంఖలాదేవి , చాముండా క్రౌంచపట్టణే //
అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా /
కొల్హాపురే మహాలక్ష్మి , మాహుర్యే ఏకవీరికా //
ఉజ్జయిన్యాం మహాకాళి , పీఠికాయాం పురుహూతికా /
ఓఢ్యాణే గిరిజాదేవి , మాణిక్యా దక్షవాటికే //
హరిక్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి /
జ్వాలాయాం వైష్ణవిదేవి , గయా మాంగల్యగౌరికా //
వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరే తు సరస్వతి /
అష్టాదశ శక్తిపీఠాని , యోగినామపి దుర్లభం //
సాయంకాలే పఠేన్నిత్యం , సర్వశతృవినాశనం /
సర్వరోగహరం దివ్యం , సర్వసంపత్కరం శుభం //
అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.
ఈ అష్టాదశ పీఠాలు ఎలా వెలశాయంటే..?
పూర్వం అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి సతీదేవిరూపంలో ఉన్నప్పుడు తండ్రి దక్షుడు మహాయజ్ఞం తలపెట్టాడు. ఈ మహాయజ్ఞానికి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తె పార్వతీదేవిని, అల్లుడు పరమేశ్వరునిని ఆహ్వానించడు. కానీ తండ్రి చేపట్టిన యజ్ఞానికి వెళ్లాలని ఈశ్వరునిని సతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి వెళ్లడానికి పార్వతీ పరమేశ్వరుడు అంగీకరించడు. కానీ పరమేశ్వరుని మాటను కాదని పుట్టింటి మీది ప్రేమతో వెళ్ళిన లోకమాతకు అక్కడ అవమానం ఎదురవగా ఆ తల్లి యోగాగ్నితో తన శరీరాన్ని త్యజిస్తుంది. కోపంతో పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యజ్ఞధ్వంసం చేసి సతీదేవి శరీరాన్ని భుజానవేసుకుని ఉన్మత్తునిలా తిరుగుతూ ఉంటే సృష్టి శ్రేయస్సుకోసం చక్రి ఆ శరీరాన్ని పద్దెనిమిది భాగాలుగా ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి.
అష్టాదశ పీఠాల విషయాల విషయంలో వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభి ప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి
శాంకరి – శ్రీలంక – ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో ‘త్రికోణేశహవర స్వామి’ అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
కామాక్షి – కాంచీపురం, తమిళనాడు – మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శృంఖల – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ – ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
చాముండి – క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక – అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
జోగులాంబ – ఆలంపూర్, తెలంగాణా – కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగ’, ‘భద్ర’ నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.
భ్రమరాంబిక – శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ – కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర – ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
ఏకవీరిక – మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర – ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ – ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
పురుహూతిక – పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ – కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
గిరిజ – ఓఢ్య, జాజ్పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా – వైతరిణీ నది తీరాన ఉన్నది.
మాణిక్యాంబ – దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ – కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
కామరూప – హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం – బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో – ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
వైష్ణవి – జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ – ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
మంగళ గౌరి – గయ, బీహారు – పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
విశాలాక్షి – వారాణసి, ఉత్తర ప్రదేశ్.
సరస్వతి – జమ్ము, కాశ్మీరు – అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.
No comments:
Post a Comment