Tuesday, 15 September 2015

అరుణాచలం (తిరువణ్ణామలై) ,అరుణాచలేశ్వరాలయము

అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని  భక్తులు విశ్వాసిస్తున్నారు. అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉన్నది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. ఈ అరుణాచలం పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.

పంచభూతలింగ క్షేత్రములు
  1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము (Arunachalam): అగ్ని లింగం
  2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం (Jambukeswaram): జల లింగం
  3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం (Chidambaram): ఆకాశ లింగం
  4. ఏకాంబరేశ్వరుడు - కంచి (Kanchipuram): పృధ్వీ లింగం
  5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి (Sri kalahasti): వాయు లింగం

అరుణాచలేశ్వరాలయము
అరుణాచలేశ్వరాలయము అతిపెద్ద దేవాలయం. ఒక్కొక్క రాజగోపురం ఒకదానితొ ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి. నాలుగుదిక్కులు నాలుగు రాజగొపురములు  ఉంటాయి .
తూర్పు రాజగోపురం - దక్షిణగోపురము-పడమర రాజగోపురం - ఉత్తర రాజగోపురం .

పాతాళలింగము
ఇక్కడే రమణమహర్షి కొంతకాలం తపస్సు చేసారు. రమణ మహర్షి ఫొటొలు కూడ ఇక్కడ ఉన్నవి. మీరు వాటిని కూడ వచ్చు . మెట్లద్వార క్రిందకు దిగితె పాతాళలింగము ఉంటుంది.
ఒకసారి అరుణాలేశ్వర దేవాలయములో ముఖ్యస్థానముల లిష్ట్ చూస్తే . . . .
పెద్ద నంది,  - వెయ్యిస్తంభాల మండపము, -చిలుక (కిలి) గోపురం,,- బ్రహ్మ  ప్రతిష్ఠింఛిన లింగం ,

చిలుక (కిలి) గోపురం .. అరుణగిరినాధర్ కధ తెలుసుకధా మీకు ..ఈ గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించరంటా .. ఈ గోపురంలో అరుణగిరినాధుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు.  గోపురం పైన చిలుక కూడ కనిపిస్తుంది .

బ్రహ్మ  ప్రతిష్ఠింఛిన లింగం
గర్భగుడి లో  పరమ  పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూ లింగము సుందరమై, సురుచిరమై , సర్వసిద్ది ప్రదమై , పానపట్ట్ముపై విరాజిల్లుతూ  ఉంటుంది.    
 ఇది త్రిమూర్త్యాత్మకము గనుక ఇక్కడ ఇతర దేవతారాధన జరుపనవసరము లేదు. ఈ అలయం ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది .ఇక్కడే  మీరు పంచ లింగాలయల దర్శనం  కూడ చెయవచ్చు.
 ఈ ఆలయం లో  శివగంగతీర్ధము , బ్రహ్మాతీర్ధము ఉన్నాయి. వాటిని కొన్ని ముఖ్య రోజుల్లో  మాత్రమే   తెరుస్తారు

* తమిళ దేశం లో ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు  .. సాయంత్రం  3.45 - 4.00 కి తెరుస్తారు . రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు
ఈ ఆలయం చాల పెద్దది కావడం వళ్ళ మీరు లొపలనే ఉండవచ్చు . గర్బగుడి ఒకటే తెరచి ఉండదు .
 కిలి గోపురానికి ఎదురుగా  మరో గోపురం ఉంటుంది దానికి అనుకుని సుబ్రహ్మణ్యుల గుడి   ఉంటుంది, మరోల చెప్పలంటే పెద్ద నందికి ఎదురుగ కుడి  పక్కన ఉంటుంది .  పక్కనే ఒకగది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్య ముద్రలు చిత్రికరించినవి అద్భుతంగ ఉంటాయి .

*  బస్ స్టాండు కు దగ్గరలోనే దేవాలయం ఉంటుంది (సుమారు 2 కి.మి )

గిరి ప్రదక్షణం (గిరివలం _ Girivalam)
ఈ అరుణాచలం(Arunachalam) పమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.

శ్రీరమణులు(Sri Ramanulu) దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు.   గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .

  గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి.  అగ్ని లింగం రమణాశ్రమానికి (Ramana ashramam)వేళ్ళే దారిలో కనిపిస్తుంది..
గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం  కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు . రమణ ఆశ్రామానికి  2కి.మి దూరం వెళ్ళిన  తరువాత  కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది .  అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది .
 దారిలో మనకు తీర్దములు కనిపిస్తాయి కాని వాటిని వారు పెద్దగ పట్టించుకున్నట్టు కనిపించదు ...
మీరు జాగ్రత్తగ చూడగలిగితే .. రాజరాజేశ్వరి దేవాలయం తరువాత మీకు..
* గిరిప్రదక్షణం  చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది.
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం  మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు ..
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం  శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
*నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం  ఉంటుంది.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .


 రమణాశ్రమం (Ramana Maharshi Ashram)

 రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మి దూరం లో ఉంటుంది. అరుణాచలం(Arunachalam) వేళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ అరవవాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు . సాయంత్రం సమయం లో రమణాశ్రమంలో చెసే ప్రార్దన  చాల బాగుంటుంది . రమణాశ్రమంలో  రమణుల  సమాధిని మనం చూడవచ్చు  . రమణాశ్రమం(Ramana ashramam) లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నేమళ్ళు కూడ స్వేచ్చాగ తిరుగుతూంటాయి . రమణాశ్రమం లో ఇంకా లక్ష్మి (ఆవు) సామధి , కాకి సమాధి , కుక్క సమాధి నికూడ ఛుడవచ్చు . ఇవన్ని వరుసగ ఉంటాయి . అక్కడ  గ్రంధాలాయం  లో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి . మీరు ఆశ్రమం   లో ఉండలాంటె ముందుగానె బూక్ చెసుకొవాల్సి ఉంటుంది.

           శేషాద్రి స్వామి ఆశ్రమం (Seshadri Swami Ashram)
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడ అక్కడే ఉంది.  ఇక్కడ కూడ ఉండటానికి రూం లు ఉన్నవి. మీరు ముందుగానే రూం లను బూక్ చేసుకోవాల్సి ఉంటుంది.

జీవితం లో ఒక్కసారైన చూడవాల్సిన ప్రదేశాలలో అరుణాచలం ఒకటి.

No comments:

Post a Comment

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...