Saturday, 18 March 2017

అప్పలయ్యగుంట


తిరుమలకు చేరువలో వున్న పురాతన ఆలయం

అత్యంత ప్రాముఖ్యత చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చుట్టు ఏడు పురాతన దేవాలయాలు వున్నాయి. వాటిల్లో అప్పలయ్యగుంటలో వున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి. తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వున్న ఆలయాన్ని ప్రతిఒక్కరు తప్పకుండా సందర్శిస్తారు. ఈ ఆలయం కారణంగా అప్పలాయగుంట ప్రాంతం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ ఆలయం వెనుక ఓ చరిత్ర కూడా వుంది.

ఆలయ చరిత్ర :
పూర్వం.. శ్రీ వేంకటేశ్వరుడు ‘నారాయణ వనం’లో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడిన తర్వాత ఆయన తిరుమలకు కాలినడకన బయలుదేరాడు. మార్గమధ్యంలో.. అప్పలాయగుంటకు చేరుకున్న ఆయన.. ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించాడు. అనంతరం అక్కడ కొద్దిసేపటివరకు కొలువు దీరాడు. తర్వాత అక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శింకుని, అక్కడినుంచి సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగాపురంలో ఆరునెలలు ఉండి వున్నాడు. అనంతరం అక్కడి నుండి శ్రీవారి మెట్టుద్వారా తిరుమల చేరాడని స్థల పురాణం.

మరికొన్ని విషయాలు :
ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు వుండటంతో అక్కడి వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం, ఎదురుగా గర్భగుడిలో శ్రీవారి దివ్యమంగళ రూపం కనులవిందు చేస్తుంది. శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందు చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా వుంది.

అప్పలయ్యగుంట పేరు వెనుక చరిత్ర :

పూర్వం ఈ ప్రదేశంలో అప్పలయ్య అనే వ్యక్తి వుండేవాడు. అతడు ఓ అవసరార్ధం ఒక గుంట తవ్వించాడు. అప్పటి నుండి ఈ ప్రదేశం అప్పలయ్యగుంటగా పిలువబడుతూ వచ్చింది. కాలక్రమంలో అది అప్పలగుంటగా మారిందని తెలుస్తోంది.

No comments:

Post a Comment

బృహదీశ్వరాలయం B

అణువణువూ అద్భుతం బృహదీశ్వరాలయం ‘‘గుడులూ గోపురాలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రాన్ని సందర్శించాలనుకునే వాళ్లకు ముందుగా గుర్తొచ్చేది తంజావూరు...